Delhi Assembly Election 2025
-
Delhi: మంత్రులకు శాఖల కేటాయింపు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు(గురువారం) మధ్యాహ్నం ఆమెతో పాటుగా మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీలో మంత్రులుగా పర్వేష్ వర్మ, రవీందర్ కుమార్, , మంజిందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రుల సైతం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నేటి సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించారు. ఢిల్లీలో మంత్రులకు శాఖల కేటాయింపురేఖా గుప్తా ముఖ్యమంత్రి: హోమ్, ఫైనాన్స్, విజిలెన్స్ ప్లానింగ్పర్వేష్ వర్మ డిప్యూటీ సీఎం : విద్య, రవాణా, ప్రజా పనుల విభాగంమంజీందర్ సింగ్ సిరస : వైద్యం, పట్టణ అభివృద్ధి, పరిశ్రమలురవీంద్ర కుమార్: సోషల్ జస్టిస్, కార్మిక శాఖకపిల్ మిశ్రా :టూరిజం, కల్చర్, వాటర్ఆశిష్ సూద్: పర్యావరణం, రెవెన్యూ, ఆహార పౌరసరఫరలుపంకజ్ కుమార్ సింగ్: న్యాయశాఖ, గృహ నిర్మాణం శాఖ -
‘ముగ్గురు సీఎంలను చూస్తాం’
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా ఇంకా సీఎం ఎవరు అనే దానిపై సస్సెన్స్ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ సీఎం((Delhi Next CM))పై తర్జన భర్జనలు పడుతున్న బీజేపీ.. ఇంకొంత సమయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. దీనిపై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సెటైర్లు వేస్తోంది. ఢిల్లీ సీఎం జాప్యంపై ఆప్ నేత గోపాల్ రాయ్ ఎద్దేవా చేశారు. బీజేపీ సీఎంను ప్రకటించడాన్ని అటుంచితే, ఈ ఐదేళ్లలో ముగ్గురు సీఎంలను ఢిల్లీ చూడాల్సి వస్తోందంటూ జోస్యం చెప్పారు. గతంలో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే జరిగిందంటూ గతాన్ని తోడే యత్నం చేశారు.బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి((Delhi Assembly Elections)) వచ్చి 10 రోజులైనా ఇప్పటివరకూ సీఎంను ప్రకటించ లేదంటి వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. తమకు ప్రజలు ఏదైతే ప్రతిపక్షం ఉండమనే మ్యాండేట్ ఇచ్చారో దాన్ని తప్పకుండా పాటిస్తామన్నారు గోపాల్ రాయ్. ఢిల్లీలో ఇప్పటికే కరెంట్ కష్టాలు మొదలయ్యాయని, సీఎం ఎవరైనా ఆ కష్టాలను ఎదుర్కోక తప్పదన్నారు.కాగా, ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేఎల్పీ భేటీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రంలోపు స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ భేటీని వాయిదా వేస్తూ బీజేపీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.ఇవాళ జరగాల్సిన బీజేఎల్పీ(BJLP) సమావేశాన్ని వాయిదా వేసింది ఆ పార్టీ. ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాట ఘటనకు సంఘీభావంగానే సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించింది. తిరిగి.. ఫిబ్రవరి 19న ఈ భేటీని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే అదే తేదీన సీఎంతో పాటు కేబినెట్ కూర్పుపైనా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు రేపు మరోసారి సీఎం అభ్యర్థిపై అధిష్టానం సమాలోచనలు జరపనున్నట్లు సమాచారం.బీజేపీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. 19వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బీజేఎల్పీ జరగనుంది. ఆ భేటీలో సీఎం అభ్యర్థి పేరు ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సరాసరి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరకు వెళ్తారు. బీజేఎల్పీ నేత, కేబినెట్ పేర్లు ఉన్న వివరాలు అందజేసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని ఎల్జీని కోరనున్నారు.ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగ్గా.. 8వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్ 22 గెలుచుకున్నాయి. సుమారు మూడు దశాబ్ధాల తర్వాత ఢిల్లీ పీఠం కమలం కైవసం చేసుకుంది. అయితే..సీఎం ఎంపికలో ఆచీచూతీ వ్యవహారించాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు జేపీ నడ్డా నాయకత్వంలో అంతర్గత సంప్రదింపులు సైతం జరిపింది. అదే సమయంలో.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఎంపిక ఆలస్యమైంది. ఈలోపు ఢిల్లీ విషాదంతో.. మరోసారి ఆ భేటీ వాయిదా పడింది. ఇక 19వ తేదీన జరగబోయే బీజేఎల్పీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులు సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాదిరే.. ఢిల్లీకి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు(Delhi Deputy CMs) ప్రతిపాదనను అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
వీడియో: కన్నీళ్లను దిగమింగుకున్న ఆప్ నేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంపై ఆప్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి(కాబోయే మాజీ) సౌరభ్ భరద్వాజ్ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ గ్రాండ్ విక్టరీ కైవసం చేసుకోగా, అరవింద్ కేజ్రీవాల్ సహా ఆప్ దిగ్గజాలంతా ఈ ఎన్నికలో ఓడిన సంగతి తెలిసిందే. అయితే.. ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెబుతూనే సౌరభ్ భదర్వాజ్ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భరద్వాజ్ బీజేపీ అభ్యర్థి షికా రాయ్ చేతిలో ఓడారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఆటలో గెలుపోటములు సహజమే. అలాగే రాజకీయాల్లో కూడా. నా.. పార్టీ ఓటమిని నేను అంగీకరిస్తున్నా. కానీ, కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాత్రం భరించలేకపోతున్నా’’ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టబోయారాయన. అయితే వెంటనే పక్కకు వెళ్లి.. ఆ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీలో ఆప్ కోసం ప్రతీ కార్యకర్త కష్టపడ్డారని, వాళ్లను చూస్తే గర్వంగా ఉందని అన్నారాయన. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. Saurabh Bharadwaj of Aam Admi Party gets emotional when his cader visit him to console after losing in Delhi elections He couldn’t control from crying! He contested from Greater Kailash and lost by 3188 votes! Shika Rai won from this place!#saurabhbhardwaj #DelhiElection2025… pic.twitter.com/ktFqzvKUUg— North East West South (@prawasitv) February 10, 2025 గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో సౌరభ్ భరద్వాజ్ నెగ్గారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి.. బీజేపీ షికా రాయ్ చేతిలో మూడు వేల ఓట్ల ఆధిక్యంతో ఓడారు. షికా రాయ్కు 49,594 ఓట్లు పోలవ్వగా, భరద్వాజ్కు 46,406 ఓట్లు పడ్డాయి. అలాగే.. కాంగ్రెస్ అభ్యర్థి గర్విత్ సింఘ్వీకి 6,711 ఓట్లు పోలయ్యాయి. 2015 ఎన్నికల్లో బీజేపీ రాకేష్ కుమార్పై 14 వేల ఓట్లు, 2020 ఎన్నికల్లో 16 వేల ఓట్ల ఆధిక్యంతో భరద్వాజ్ గెలుపొందడం గమనార్హం. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ 48 సీట్లు దక్కించుకుని అద్భుత విషయం సాధించింది. గత రెండు ఎన్నికల్లో 67, 62 సీట్లు సాధించిన ఆప్.. ఈసారి 22 స్థానాలకు పడిపోయింది. ఇక.. కాంగ్రెస్ జీరోకి పరిమితమైంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక.. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
కేజ్రీవాల్ క్రేజ్ తగ్గిందా?
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుకున్న కంచు కోట బీటలు బారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు సాధించి అధికారంలోకి వస్తే, 62 స్థానా లతో అధికారంలో ఉన్న ఆప్ 22 సీట్లకు పడిపోయి పరాజయం పొందింది. అంతకు మించి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. ‘కర్ణుని చావుకు సవా లక్ష కారణాలు’ ఉండొచ్చేమోగానీ, కేజ్రీవాల్ ఓటమికి వేళ్ల మీద లెక్క బెట్టదగ్గ కారణాలే ఉన్నాయి.కేజ్రీవాల్ రెవెన్యూ సర్వీసులో ఉండగానే 1999లో ‘పరివర్తన్’ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి, ఢిల్లీ ప్రజలకు పన్నులతో పాటు ఇతర సామాజిక విషయాల మీద అవగాహన కల్పించే వారు. సమచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని ఢిల్లీలోని ప్రభుత్వ సంస్థల్లో అవినీతిని వెలికి తీశారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2006లో ‘రామన్ మెగసెసే అవార్డు’ లభించడంతో ఆయనకు దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. 2011లో ఢిల్లీలోని ‘జంతర్ మంతర్’ వద్ద అవినీతికి వ్యతిరేకంగా ‘జన్ లోక్ పాల్’ బిల్లును తీసుకురావాలని అన్నా హజా రేతో కలిసి దీక్ష చేసి దేశం దృష్టిని ఆకర్షించారు. ‘జీవితంలో నేను ఎన్నికల్లో పోటీ చేయను. ఏ పదవీ చేపట్టను. యాక్టివిస్టుగానే ఉంటా’ అని ప్రకటించు కున్న కేజ్రీవాల్, అనూహ్యంగా 2013లో రాజకీయా ల్లోకి అడుగుపెట్టారు. మొత్తానికి ఢిల్లీ ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. అయితే గడిచిన ఐదేళ్లలో ఆప్ ప్రజల అంచనాలను అందుకోలేకపోయింది. దాని పర్యవసా నమే 2025 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.సామాన్యుల సీఎంనని, ప్రభుత్వ బంగ్లా తీసు కోనని చెప్పి... ఖరీదైన శీష్ మహల్ నిర్మించుకోవడాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారు. ఈ అంశాన్ని బీజేపీ వ్యూహాత్మకంగా ‘కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ కాదు, కాఫీ ఆద్మీ’ అని ప్రచారం చేసింది. అవినీతికి వ్యతి రేకంగా వ్యవస్థను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కానీ, దీనికి విరుద్ధంగా ఆయనతో పాటు ఆయన మంత్రులు అవినీతి కేసుల్లో ఇరుక్కోవడంతో విశ్వసనీ యత కోల్పోయారు. అవినీతి ఆరోపణలు వస్తే నాయకులు రాజీనామా చేయాలని చెప్పిన కేజ్రీవాల్, తాను జైల్లో ఉన్నా రాజీనామా చేయలేదు. సిసోడి యాని అరెస్టు చేయగానే, రాజీనామా చేయించిన కేజ్రీవాల్, తను జైల్లో ఉండి కూడా చాలాకాలం కుర్చీని వదల్లేదు. దీంతో అవినీతి వ్యతిరేక ఆందోళన నుంచి పుట్టుకొచ్చిన ఆప్ అవినీతి పార్టీగా మారిందని బీజేపీ ప్రచారం చేసి జనాన్ని తనవైపు తిప్పుకుంది. జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాక రాజీనామా చేసి, కీలుబొమ్మ లాంటి ఆతిశీని సీఎం చేయడం ఒక నాటకంలా ప్రజలు భావించారు. కేజ్రీ జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ సీఎం కుర్చీలో కూర్చొని మీడియాతో మాట్లాడేవారు. అదే కుర్చీని ‘కేజ్రీవాల్ పట్ల తనకున్న గౌరవం’ పేరుతో ఖాళీగా వదిలేసి ఆతిశి మరో కుర్చీలో కూర్చోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆప్ నేతలు ఒకవైపు కేసుల్లో ఇరుక్కోవడం, మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఆప్ అంతకుముందు ఐదేళ్లలో చేసినట్టుగా ఈసారి పరిపాలించలేక పోయింది. 2020 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఎన్నికల ముందు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని చేసిన కీలక ప్రకటన... మధ్యతరగతిని బీజేపీ వైపు తిప్పింది. ఇది ఉద్యోగులు అధికంగా ఉండే న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీ వాల్ ఓటమికి కూడా కారణమైంది. 2015, 2020 ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడంతో ఢిల్లీలో తనకు ఎదురేలేదని భావించిన కేజ్రీవాల్ అతి విశ్వాసంతో దేశంలో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించు కోవడానికి ప్రయత్నాలు చేశారు. పంజాబ్ విజయంతో ఈ అతివిశ్వాసం మరింత మితిమీరింది. గోవా, గుజరాత్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓట్లు చీల్చి, కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారు. జీవితంలో కాంగ్రెస్ పార్టీతో కలవ నని చెప్పిన కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల సమయంలో మాటమార్చి ‘ఇండియా’ కూటమితో కలిశారు. ఆరు నెలలు తిరగకుండానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్తో తెగదెంపులు చేసుకోవడంతో రెండు పార్టీలు ఎవ రికి వారే పోటీ చేశారు. ఢిల్లీలో ఈసారి దాదాపు 6 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్, చాలా చోట్ల ఓట్లను చీల్చి ఆప్ విజయవకాశాలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా ముస్లిం, ఎస్సీ ఓట్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు పడటంతో బీజేపీకి కలిసొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓట మితో పాటు కేజ్రీవాల్ స్వయంగా ఓడిపోవడంతో ‘ఆయనకు క్రేజ్ తగ్గిందా’ అనే చర్చలు ప్రారంభ మయ్యాయి. కేజ్రీవాల్కు మళ్లీ క్రేజ్ పెరగడంతోపాటు ఆప్కు ఆదరణ పెరగాలంటే ఆయన గతంలోవలే ఢిల్లీ లోని కాలనీలు, గల్లీలు, మొహల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువయితే, మరో ఐదేళ్లలో ఆయనకు పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయి.జి. మురళీ కృష్ణ వ్యాసకర్త సీనియర్ రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ -
ఇక ‘ఆప్’ప్లాన్ ఏంటి? సిసోడియా ఏమన్నారు?
న్యూఢిల్లీ: ఢ్లిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’కు ఘోర పరాభవం ఎదురయ్యింది. పార్టీలోని పెద్ద నేతలు కూడా ఓటమి పాలయ్యారు. దీంతో వారంతా దక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆప్ జాతీయ కన్వనీర్ అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దీనిలో పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా పాల్గొన్నారు. పార్టీ ఓటమి పాలయిన తర్వాత భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? అనే ప్రశ్నకు సిసోడియా సమాధానమిచ్చారు.మనీష్ సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయమై తమ నేత కేజ్రీవాల్ అందరితో చర్చించారని, తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని, తాము ఏవిధంగానైతే ఢ్లిల్లీలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల పోరాటం సాగించామో, అదేవిధంగా ప్రజలకు సేవ చేస్తూ వారి మధ్యలోనే ఉంటామన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు, చీరలు, చివరికి మద్యం కూడా పంపిణీ చేశారని, ఎన్నికల వ్యవస్థను దురుపయోగం చేశారని సిసోడియా ఆరోపించారు. ఈ తరహాలో జరిగిన ఎన్నికల్లో పోటీ అంత సులభం కాలేదన్నారు. అయినప్పటికీ ఆప్ తన పోరాటాన్ని ఆపలేదన్నారు.ఓటమి పాలయిన నేతలకు అరవింద్ కేజ్రీవాల్ ఒక విషయం చెప్పారని.. వారు పోటీ చేసిన ఆయా ప్రాంతాల్లోని ప్రజల మధ్యలో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ 27 ఏళ్ల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఎన్నికల అనంతరం నాల్గవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలుగన్న ఆప్కు నిరాశ ఎదురయ్యింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాలను గెలుచుకోగా, ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్ ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది.ఇది కూడా చదవండి: Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్ జామ్.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం -
ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ భేటీ
డిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Election 2025) గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎమ్మెల్యేలతో ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. దీనికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషి సహా గెలిచిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆప్ ఓటమికి సంబంధించిన కారణాలపై ుసుదీర్ఘంగా విశ్లేషించారు. ాపార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా పార్టీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ చర్చించారు. అయితే ప్రతిపక్ష నేతగా ఎవరు అనే అంశంపై ఎటువంటి చర్చ జరగలేదని భేటీ తర్వాత మీడియాకు స్పష్టం చేశారు అతిషి.ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు..ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని అతిషి విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా అవినీతే కనిపించిందని ఆమె మండిపడ్డారు. బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా , మద్యాన్ని కూడా ఏరులై పారించారన్నారు. దీనికి ఢిల్లీ పోలీసులే సాక్ష్యమన్నారు అతిషి. పోలీసుల సాక్షిగానే బీజేపీ(BJP) అక్రమాలకు పాల్పడిందన్నారు. ఇందులో పోలీసులదే ప్రధాన పాత్ర అయితే ఇంకెవరికి చెప్పుకుంటామని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తప్పు చేసిన వాళ్లు పోలీసులే అయితే ఇక జైల్లో ఎవరిని పెడతారన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారని ఆమె దుయ్యబట్టారు.కాగా, నిన్న(శనివారం) వెలువరించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లతో అధికారాన్ని కైవసం ేచేసుకుంటే, ఆప్ 22 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. రెండు పర్యాయాలుగా ఢిల్లీ పీఠాన్ని సాధిస్తూ వస్తున్న ఆప్.. ఈసారి ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది.ఆప్ నుంచి పోటీ చేసిన కీలక నేతల్లో అతిషి మినహా మిగతా వారు ఓటమి చెందారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి చెందడం ఆ పార్టీకి గట్టి ఎదురుబెబ్బ తగిలినట్లయ్యింది. -
‘ఇక ఆప్కు ముగింపు ప్రారంభమైంది’
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Delhi Assembly Election 2025) తర్వాత ఆప్ శకం ముగిసిందని అంటున్నారు మాజీ ఆప్ నేత, న్యాయవాది ప్రశాంత్ భూషణ్. ఈసారి ఢిల్లీలో వచ్చిన ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ముగింపు ప్రారంభమైందని విమర్శించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు ప్రశాంత్ భూషణ్.ఢిల్లీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చిన ఆప్.. ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకతతో పరిపాలించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఆ పార్టీ సహజ స్వరూపాన్ని కోల్పోయి స్వలాభం కోసం రాజకీయాలు చేయడంతోనే ఆప్కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. లోక్పాల్ సిద్ధాంతాలతో రాజకీయ ప్రవేశం చేసిన ఆప్.. ఇప్పుడు సొంత లోక్పాల్ను సృష్టించుకుందన్నారు. ఇది ఆప్ ఓటమికి కారణమని ప్రశాంత్ భూషణ్ ేపేర్కొన్నారు.2015లో ఆప్ నుంచి బహిష్కరించబడ్డ ప్రశాంత్ భూషణ్..ఆప్ అనేది అవినీతిలో కూరుకుపోయిందన్నారు. Kejriwal is largely responsible for AAP’s Delhi debacle. A party formed for alternative politics which was supposed to be transparent, accountable & democratic was quickly transformed by Arvind into a supremo dominated, non transparent & corrupt party which didn’t pursue a Lokpal…— Prashant Bhushan (@pbhushan1) February 8, 2025 నిన్న(శనివారం) వెలువడ్డ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాదించగా, ఆప్ అధికారాన్ని కోల్పోయింది. 70 సీట్లలో బీజేపీ 48 సీట్లలో విజయం సాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం కాగా, ఆప్ మాత్రం 22 స్థానాలతో సరిపెట్టుకుని ప్రతిపక్ష పాత్రకు సిద్ధమైంది. -
‘ఆప్’ ఓడినా అతిషి డ్యాన్సులేంటి..? స్వాతి మలివాల్ పోస్టు వైరల్
న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎం అతిషిపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఫైరయ్యారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయినప్పటికీ సీఎం అతిషి మాత్రం కల్కాజి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలిచిన సంతోషంలో అతిషి తన అనుచరులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను స్వాతి మలివాల్ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. పార్టీ ఓడిపోయినా బాధలేదు కానీ తాను మాత్రం గెలిస్తే చాలన్నట్లు సీఎం అతిషి డ్యాన్సులేయడం ఏంటని మలివాల్ ఎద్దేవా చేశారు. పార్టీ ఓడిపోయింది.ఆప్ ముఖ్య నేతలంతా ఓడిపోయారు.అయినా అతిషి ఇలా వేడుక చేసుకుంటున్నారు అని వీడియోను ఉద్దేశించి మలివాల్ విమర్శించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అతిషి 3521 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరిపై గెలుపొందారు. ये कैसा बेशर्मी का प्रदर्शन है ? पार्टी हार गई, सब बड़े नेता हार गये और Atishi Marlena ऐसे जश्न मना रही हैं ?? pic.twitter.com/zbRvooE6FY— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025ఈ ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి పార్టీ సీనియర్ నేతలంతా ఓటమి పాలయ్యారు.27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకుంది. కాగా, అతిషి ఆదివారం(ఫిబ్రవరి 9) తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎల్జీ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే దాకా పదవిలో కొనసాగాలని ఎల్జీ అతిషిని కోరారు. -
ఢిల్లీ ఫలితాలు: ఇవేం మీమ్స్రా బాబూ.. నవ్వలేక చస్తున్నాం!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. రాజధానిలో 27 ఏళ్ల తరువాత అధికారం చేపట్టబోతోంది. అయితే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కంగ్రెస్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ఓటమిపై పలువురు సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి, అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నారు. వీటిని చూసినవారు క్రియేటర్లను మెచ్చుకుంటూ.. ఈ మీమ్స్ను చూసి, నవ్వకుండా ఉండలేకపోతున్నామంటున్నారు. आ बैल मुझे मार #DelhiElectionResults #दिल्ली_विधानसभा #ArvindKejriwal pic.twitter.com/BOFClk02Sk— Amit Singh 𝕏 (@RockstarAmit) February 8, 2025మళ్లీ జైలుకే..వైరల్ అవుతున్న ఒక మీమ్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రజలతో మాట్లాడుతూ.. ‘ఒకవేళ మీరంతా కమలం బటన్ నొక్కితే నేను మరోమారు జైలుకు వెళ్లవలసి వస్తుంది. అప్పుడేమి జరుగుతుందో మీరే చూడండి’ అనడం కనిపిస్తుంది.😂😂😂#DelhiElectionResults pic.twitter.com/lSGXnWGwZP— Lala (@FabulasGuy) February 8, 2025డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్లోఈ మీమ్లో ఒక వ్యక్తి ఎంతో ఉత్సాహంతో డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్లోకి దిగుతాడు. అయితే ఊహకందని విధంగా అత్యంత సులభంగా ఓటమి పాలవుతాడు. ఈ ఓడిన వ్యక్తిపై కేజ్రీవాల్ మాస్క్, గెలిచిన వ్యక్తిపై ప్రధాని మోదీ మాస్క్ ఉంటాయి. 😹😹😹#DelhiElectionResults pic.twitter.com/mT4MnAeAVr— Byomkesh (@byomkesbakshy) February 8, 2025వెనక్కి కాంగ్రెస్ పరుగుఈ మీమ్లో ఒక రేసులో పాల్గొన్నవారంతా ఒక దిశలో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్ మాత్రం వెనక్కి తిరిగి పరిగెత్తేందుకు సిద్ధమవుతున్నట్లు చూడవచ్చు. దీనిని చూసినవారంతా తెగ నవ్వుతున్నారు.Social Media is Brutal 🤣🤣#DelhiElectionResults pic.twitter.com/uOZxhPs7kB— Kashmiri Hindu (@BattaKashmiri) February 8, 2025జీరో చెక్ చేసుకోండి సార్ఈ మీమ్లో పెట్రోల్ పంప్ దగ్గర పనిచేస్తున్న వ్యక్తికి రాహుల్గాంధీ మాస్క్ ఉంటుంది. ఈ ఫొటోపై ‘జీరో చెక్ చేసుకుని తీసుకోండి సార్’ అని ఉంటుంది.రాజు ఎప్పటికీ ఒంటరిగా ఓడిపోడుమరో మీమ్లో ఆప్ అభ్యర్థి ఓఝా ఫొటో ఉంటుంది. క్యాప్షన్లో ‘రాజు ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికల్లో ఓడిపోడు. పార్టీనంతా ముంచుతాడు’ అని ఉంది. राजा कभी अकेले चुनाव नहीं हारता , पूरी पार्टी को ले डूबता है। ❣️#DelhiElectionResults pic.twitter.com/LB3upbpvCt— खुरपेंच (@khurpenchh) February 8, 2025ఇది కూడా చదవండి: ఈ ఏడుగురిలో ఢిల్లీ సీఎం ఎవరు? -
ఈ ఏడుగురిలో ఢిల్లీ సీఎం ఎవరు?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 70 స్థానాలలో బీజేపీ 48 స్థానాలను గెలుచుకుంది. ఫలితంగా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు ఓటమి పాలయ్యారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్ తదితర నేతలు ఉన్నారు.ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తుందనే దానిపై అందరి దృష్టి మళ్లింది. ప్రస్తుతం ఈ రేసులో ఏడుగురి పేర్లు వినిపిస్తున్నాయి. వారు ఎవరో? వారి రాజకీయ స్థితిగతులేమిటో ఇప్పుడు చూద్దాం.1. ప్రవేశ్ సింగ్ వర్మఈ జాబితాలో మొదటి పేరు మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు ప్రవేశ్ వర్మ. ఆయన వరుసగా రెండు పర్యాయాలు పశ్చిమ ఢిల్లీ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన 5.78 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఇది ఢిల్లీ చరిత్రలో అతిపెద్ద విజయం. ఈసారి ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను 4,099 ఓట్ల తేడాతో ఓడించారు.ప్రవేశ్ సింగ్ వర్మకు చిన్నప్పటి నుంచి ‘సంఘ్’తో అనుబంధం ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. బీజేపీ తన వ్యూహంలో భాగంగా ప్రవేశ్ సింగ్ వర్మకు ఢిల్లీ అసెంబ్లీలో అవకాశం కల్పించింది. జాట్ వర్గానికి చెందిన ప్రవేశ్ సింగ్ వర్మను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రైతు ఉద్యమాన్ని అణగార్చేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చనే వాదన వినిపిస్తోంది.2. మనోజ్ తివారీమనోజ్ తివారీ వరుసగా మూడోసారి ఈశాన్య ఢిల్లీ నుంచి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈయన 2016 నుండి 2020 వరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. పూర్వాంచల్ ఓటర్లలో మనోజ్ తివారీకి ప్రజాదరణ ఉంది. బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటువంటి పరిస్థితిలో బీజేపీ మనోజ్ తివారీని ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.3. మంజీందర్ సింగ్ సిర్సామంజీందర్ సింగ్ సిర్సా 2013, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ టికెట్పై విజయం సాధించారు. తరువాత రాజౌరి గార్డెన్ నుండి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2021లో శిరోమణి అకాలీదళ్ను వీడి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని సిక్కు సమాజానికి అండగా నిలిచారు. మంజీందర్ సింగ్ సిర్సాకు సీఎంగా అవకాశం ఇవ్వడం ద్వారా పంజాబ్లో బీజేపీని బలోపేతం చేసేందుకు బీజేపీకి అవకాశం దక్కుతుంది.4. స్మృతి ఇరానీస్మృతి ఇరానీ 2010 నుండి 2013 వరకు బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆమె మంత్రి అయ్యారు. ఆమె 2019లో రాహుల్ గాంధీని ఓడించారు. ప్రస్తుతం బీజేపీలో మహిళా ముఖ్యమంత్రి ఎవరూ లేరు. స్మృతిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా బీజేపీ ఆ లోటును భర్తీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.5. విజేందర్ గుప్తారోహిణి అసెంబ్లీ స్థానం నుండి విజయేంద్ర గుప్తా వరుసగా మూడవసారి ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన రెండుసార్లు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పుడు, వారిలో ఒకరు విజేంద్ర గుప్తా ఒకరు. ఆయన ఢిల్లీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. ఈయన కూడా ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారని చెబుతున్నారు.6. మోహన్ సింగ్ బిష్ట్మోహన్ సింగ్ బిష్ట్ 1998 నుండి 2015 వరకు వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అయితే, 2015లో ఆయన కపిల్ మిశ్రా చేతిలో ఓటమిని ఎదుర్కొన్నారు. 2020లో ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2025లో బీజేపీ ఆయనను ముస్తఫాబాద్ నుండి పోటీ చేయించింది. ఆయన ఇక్కడి నుంచి కూడా విజయం సాధించారు.7. వీరేంద్ర సచ్దేవావీరేంద్ర సచ్దేవా 2007 నుంచి 2009 వరకు చాందినీ చౌక్ జిల్లా అధ్యక్షునిగా, 2014 నుండి 2017 వరకు మయూర్ విహార్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. 2009 నుంచి 2012 వరకు ఢిల్లీ బీజేపీ రాష్ట్ర మంత్రిగా, 2012 నుండి 2014 వరకు ఢిల్లీ బీజేపీ శిక్షణ ఇన్చార్జ్గా, జాతీయ బీజేపీ శిక్షణ బృందం సభ్యునిగా కూడా ఉన్నారు. ఆయన 2020 నుండి 2023 వరకు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. వీరేంద్ర సచ్దేవా 2023లో ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు.ఇది కూడా చదవండి: వీరి వీడియోలు క్షణాల్లో వైరల్.. టాప్-10 భారత యూట్యూబర్లు -
‘ఇక మీవంతు’..మమతకు బీజేపీ హెచ్చరిక
కోల్కతా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఉత్సాహంలో మునిగితేలుతున్న బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఎసీఎం మమతా బెనర్జీని టార్గెట్గా చేసుకుని ‘ఇక మీవంతు’ అని హెచ్చరించారు. కోల్కతాతో విలేకరులతో మాట్లాడిన సువేందు అధికారి ‘ఢిల్లీలొ విజయం మనదే.. ఇక 2026లో బెంగాల్ వంతు వస్తుంది’ అని అన్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం దేశానికి ఎంతో అవసరమని, అవినీతి, అబద్ధాల రాజకీయాల ముగింపునకు ఇది నాంది అని సువేందు అధికారి పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అవినీతికి పాల్పడిందని, దీనికి ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు.ఢిల్లీ దేశ రాజధాని అని, దీనిని అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చాల్సివుందని, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని నాశనం చేసిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి జరిగినట్లే, ఢిల్లీలో కూడా జరిగి ఉండాల్సిందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం యమునా ఎక్స్ప్రెస్వేతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని, అయితే ఢిల్లీ ప్రభుత్వం వాటిని నిర్వహించడంలో విఫలమైందన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఢిల్లీలోని 90 శాతం బెంగాలీ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారులకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డులను ఇవ్వడం ద్వారా ఉచిత విద్యుత్, నీరు వంటి సౌకర్యాలను అందించిందని, ఇది దేశ భద్రతకు ముప్పు అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఇలాంటి కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లే, ఢిల్లీలో జరిగిన అన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలలో కేజ్రీవాల్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. -
‘ఆప్’ ఓటమితో పంజాబ్లో వణుకు.. సీఎంకు ముచ్చెమటలు
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపాలు కావడంతో పంజాబ్లో వణుకు మొదలయ్యింది. పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ సింగ్కు ఢిల్లీ ఫలితాలు అగ్నిపరీక్షలా మారాయి. ఆయన ప్రచారం చేసిన 12 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు ఆప్ సీనియర్ నేతలు ఓటమిపాలయ్యారు. ఈ ఓటమి తర్వాత పార్టీలోనూ, పంజాబ్ రాజకీయాల్లోనూ కొత్త చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి కాగలరని వ్యాఖ్యానించారు. ఆయన పంజాబ్ మంత్రి, ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు అమన్ అరోరా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు. పంజాబ్లో హిందువు కూడా ముఖ్యమంత్రి కావచ్చని అన్నారు.పంజాబ్లోని లూథియానా స్థానం నుంచి ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్ గోగి మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉందని బజ్వా అన్నారు. ఆప్ తలచుకుంటే అరవింద్ కేజ్రీవాల్ను ఈ స్థానం నుంచి పోటీచేయించి, ముఖ్యమంత్రిని చేయవచ్చన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వాదనపై ఆప్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భగవంత్ మాన్(Bhagwant Mann) ముఖ్యమంత్రి అయ్యారు. తదనంతరం కేజ్రీవాల్ పంజాబ్ ప్రభుత్వాన్ని 'రిమోట్ కంట్రోల్'తో నడుపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పంజాబ్ రాజకీయాల్లో కేజ్రీవాల్ పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జోరందుకుంది.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఆప్ ఓటమి బాట.. ఐదు కారణాలు -
నలుగురు ముస్లింల ఎన్నిక
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ముస్లింల ఓట్లు చీలాయి. అయినప్పటికీ, ముస్లింల ప్రాబల్యమున్న ఏడు నియోజకవర్గాలకు గాను ఆరింట్లో ఆప్ విజయం సాధించగలిగింది. ప్రస్తుత అసెంబ్లీలో ముస్లిం వర్గం ఎమ్మెల్యేలు ఐదుగురుండగా ఈసారి నలుగురు అసెంబ్లీలోకి అడుగిడనున్నారు. విజేతలు ఆప్కు చెందిన ఇమ్రాన్ హుస్సేన్(బల్లిమారన్), ఆలె మహ్మద్ ఇక్బాల్(మటియా మహల్), అమానతుల్లా ఖాన్ (ఓఖ్లా), చౌదరి జుబాయిర్ అహ్మద్(సీలంపూర్). 2020 ఎన్నికల్లో ముస్లింలు అధికంగా ఉన్న ఏడు స్థానాల్లో దాదాపు అందరూ ఆప్కే ఓటేయడంతో ఆ పార్టీ విజయకేతనం ఎగరేసింది. ఈదఫా ఆ పార్టీ ముస్తఫాబాద్ మినహా ఆరింట్లో గట్టెక్కింది. ఈ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు చీలాయి. అయినప్పటికీ ఆప్ విజయావకాశాలను దెబ్బతీసే స్థాయిలో చీలిక సంభవించలేదు. ముస్తఫాబాద్లో ముక్కోణ పోటీ నెలకొంది. ఆప్, ఎంఐఎం, కాంగ్రెస్లకు చెందిన ముగ్గురు ముస్లిం అభ్యర్థుల మధ్య ఓట్లు చీలాయి. ఫలితంగా, బీజేపీకి లాభం కలిగింది. ఆ పార్టికి చెందిన మోహన్ సింగ్ బిష్త్ ఇక్కడ 17,578 ఓట్ల తేడాతో విజయం సాధించగలిగారు. ముస్లిం అభ్యర్థులందరికీ కలిపి 1,12,874 ఓట్లు పోలయ్యాయి. ఇందులో, జైలులో నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యరి్థకి 33,474 ఓట్లు పడ్డాయి. ముస్లింల ప్రాబల్యమున్న ఓఖ్లా నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి 39,558 ఓట్లతో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఆ మూడు కారణాలు ఏమంటే.. ముస్లింల ఓట్లలో చీలిక రావడానికి ప్రధానంగా మూడు కారణాలను విశ్లేషకులు చూపుతున్నారు. అందులో ఒకటి..ఏదేమైనా బీజేపీని గెలవకుండా చేయాలి. ఇందుకోసం ఆప్కు ఓటేయడం ముఖ్యం. ఢిల్లీలో కాషాయ పార్టీ దూకుడును ఆప్ గలిగింది ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఒక్కడేనని కొందరు ముస్లింలు నమ్మారు. రెండోది..2020 అల్లర్ల సమయంలో ఆప్ తమను పట్టించుకోలేదని కొందరు ముస్లింలు భావిస్తున్నారు. అంతేకాకుండా, కోవిడ్ వ్యాప్తికి తబ్లిఘి జమాత్ను తప్పుబడుతూ ఆప్ అనుమానాస్పదంగా వ్యవహరించడం కొందరికి నచ్చలేదు. ప్రత్యామ్నాయంగా, లౌకికవాదాన్ని బలంగా వినిపిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీని బలపరచడం మేలని కొందరు ముస్లింలు నిర్ణయించుకోవడం. మూడోది..ఆప్, కాంగ్రెస్ వెంట నడవడం మానేసి, అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎంను అనుసరించడం మేలని, ఆయనైతే ముస్లింలకు సంబంధించిన ప్రత్యేక అంశాలు, సమస్యలను బలంగా వినిపిస్తారని కొందరు విశ్వసించారు. ఈ కోణంలోనే, 2020 అల్లర్లలో నిందితులకు ఎంఐఎం టిక్కెట్లిచ్చి బరిలో నిలిపింది. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కలిసి అంతిమంగా బీజేపీకే లాభం చేకూర్చాయి. ముస్లింల ఓట్లు చీలి ఆప్పై సునాయాస విజయానికి కాషాయ పార్టికి బాటలు పరిచాయి. -
మీమ్స్ వరద...
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గత రెండు పర్యాయాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భాల్లో బీజేపీని విమర్శిస్తూ మీమ్స్ వెల్తువెత్తగా ఈసారి మీమ్స్ సృష్టికర్తల దృష్టంతా ఆప్ మీదనే పడింది. దీనికి తగ్గట్లు ఆప్ను, కేజ్రీవాల్ నేతగణాన్ని విమర్శల జడివానలో ముంచేస్తూ కుప్పలు తెప్పలుగా మీమ్స్.. సామాజిక మాధ్యమ సంద్రంలోకి కొట్టుకొచ్చాయి. ముఖ్యంగా 2023లో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానికి కాస్తంత హాస్యం జోడించి వాట్సాప్, ఇన్స్టా గ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లో జనం షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. ‘‘ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ పలు రకాల కుట్రలు పన్నుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెగ కలలు కంటున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ను ఓడించలేరని బీజేపీ నేతలకు సైతం తెలుసు. ప్రధాని మోదీకి నేను ఒక విషయం చెప్పదల్చుకున్నా. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో ఆయన మా పార్టీని ఈ జన్మలో ఓడించలేరు. దానికోసం ప్రధాని మోదీ మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది’’అని కేజ్రీవాల్ అన్నారు. 2017లోనూ కేజ్రీవాల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ఢిల్లీ రాష్ట్రానికి రాజకీయ పెద్దలం అంటే మేమే. మీమిచ్చే ఆదేశాలనే ఇక్కడి ప్రజలు పాటిస్తారు. ఢిల్లీని మేమే పరిపాలిస్తాం’’అని కేజ్రీవాల్ ఆనాడు అన్నారు. ఇంత బీరాలు పోయిన కేజ్రీవాల్నే బీజేపీ మట్టికరిపించిందంటూ కొత్త మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఆప్ అటు, కాంగ్రెస్ ఇటు పరుగు పోటీలో అభ్యర్థులకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ఎన్నికల గుర్తులు తగిలించి కొందరు నెటిజన్లు కొత్త మీమ్ సృష్టించారు. అందులో బీజేపీ, ఆప్ ముందుకు దూసుకుపోయేందుకు సిద్ధమైతే కాంగ్రెస్ వెనక్కు దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నట్లు సరదా ఫొటోను సిద్ధంచేసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు సున్నాగా నమోదవడం తెల్సిందే. దీనిని గుర్తుతెచ్చేలా పెట్రోల్ బంక్ వద్ద వాహనదారునికి సిబ్బంది ‘‘పెట్రోల్ కొడుతున్నా. ముందు మీటర్ రీడింగ్ సున్నా వద్దే ఉంది. చెక్చేసుకోండి సర్’’అన్నట్లు ఒక ఫొటోను రూపొందించారు. అయితే ఆ పెట్రోల్లో రాహుల్గాంధీ పనిచేస్తున్నట్లు సరదా మీమ్ను సృష్టించారు. ఆప్ వైఫల్యాలకు తగు కారణాలను పేర్కొంటూ ఇంకెన్నో మీమ్స్ వచ్చాయి. ఆప్ మాజీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ను కేజ్రీవాల్ సహాయకుడు చితకబాదగా ఓటర్లు ఆప్ను చావుదెబ్బ తీశారని మరో మీమ్ వచి్చంది. ఐక్యత సున్నా విపక్షాల ‘ఇండియా’కూటమి అంటూ ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్, ఆప్ తదితర పార్టీలు తీరా ఢిల్లీ ఎన్నికల్లో బాహాబాహీగా విమర్శలు చేసుకోవడంపైనా మీమ్స్ వచ్చాయి. రెజ్లింగ్ రింగ్లోకి కేజ్రీవాల్ యమా హుషారుగా దూసుకొచ్చి తొడ కొడుతుంటే ఒక్క దెబ్బతో మోదీ ఆయనను మట్టి కరిపించి బరి ఆవలికి విసిరేసినట్లు చూపే మరో మీమ్ వీడియో ఇప్పుడు తెగ వైరల్గా మారింది. బీజేపీ గెలుపు సంబరాలు చేసుకుంటుంటే అక్కడే ఉన్న తనను ఎవరూ మెచ్చుకోవట్లేదని స్వాతి మలివాల్ బాధపడుతుంటే దూరంగా నిల్చుని చూస్తున్న మోదీ వెంటనే అభినందనలు తెలుపుతున్నట్లు ఒక మీమ్ వీడియోను సృష్టించారు. ఎన్నికల క్రీడలో బీజేపీ, ఆప్సహా అన్ని పారీ్టలు గెలుపు కోసం ఆడుతుంటుంటే కాంగ్రెస్ మాత్రం తనకేం అక్కర్లేదన్నట్లు ఒక బెంచీపై కూర్చుని సరదాగా చూస్తున్నట్లు మరో మీమ్ను సృష్టించారు. మాకే ఎక్కువ ఆనందం ఈసారి గెలిచినందుకు మాకు ఆనందంగా ఉందని మోదీ, అమిత్ షా ఇద్దరూ నవ్వుకుంటుంటే.. మీ కంటే ఎక్కువ ఆనందం మాకే ఉందని అన్నా హజారే, స్వాతి మలివాల్, మరో మాజీ ఆప్ నేత కుమార్ విశ్వాస్ శర్మ చెబుతున్నట్లు ఉన్న మరో మీమ్ సైతం బాగా షేర్ అవుతోంది. ఇప్పటికే వేర్వేరు ఎన్నికల్లో ఓడిన ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఆప్ నేత సంజయ్ సింగ్లు బాధతో బనియన్, టవల్ మీద ఉన్న కేజ్రీవాల్కు పర్లేదులే అంటూ ఆనందంగా తీసుకొస్తున్న మీమ్ తెగ నవి్వంచేలా ఉంది. అనార్కలీలాగా ఆప్ నాయకురాలు అతిశీ సింగ్ నేలపై పడిపోతే సలీమ్లాగా కేజ్రీవాల్ వచ్చి లేపుతూ.. ‘‘లే అనార్కలీ. ఇప్పుడు మనం మన ఓటమికి ఈవీఎంలో అక్రమాలే కారణం అని కొత్త పల్లవి అందుకోవాలి’’అని ఆమెను తట్టిలేపుతున్నట్లు మరో మీమ్ ఇప్పుడు బాగా నవ్వు తెప్పిస్తోంది. గతంలో జనాన్ని కేజ్రీవాల్ తన చీపురుతో తరిమికొడితే, ఇప్పుడు జనం చీపురుకు నిప్పు పెట్టి కేజ్రీవాల్ను కొడుతున్నట్లు రూపొందించిన మరో మీమ్ ఇప్పుడు సోషల్మీడియాలో ఎక్కువగా షేర్ అవుతోంది. పార్టీ ఓటమితోపాటు ఆప్ అగ్రనేతలూ ఓటమిని చవిచూశారంటూ.. ‘‘గుడిలో ప్రసాదంగా ఏమైనా పెడతారని లోపలికి వెళితే అప్పటికే పొంగళి అయిపోయింది. సర్లే అని బయటికొస్తే అప్పటికే చెప్పులూ పోయాయి’’అంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చెబుతున్నట్లు మరో వ్యంగ్య వీడియోను నెటిజన్లు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేశారు. -
మూడోసారీ ‘సున్నా’!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పూర్వ వైభవాన్ని సాధించాలని ఆశపడ్డ కాంగ్రెస్ పార్టీకి వరుసగా మూడోసారి కూడా భంగపాటే ఎదురైంది. అధికార పీఠాన్ని అధిరోహించే శక్తి లేకున్నా కనీసం తమ అస్థిత్వాన్ని నిలుపుకోవాలన్న ఆశలపై ఢిల్లీ ఓటర్లు పూర్తిగా నీళ్లు చల్లారు. హ్యాట్రిక్ విజయాలతో 1998 నుంచి వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. వరుసగా మూడు సార్లు ఓడిపోవడం కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర నిరాశకు గురిచేసింది. గత ఎన్నికల కంటే కొంత మెరుగైన స్థాయిలో ఓట్లు సాధించినప్పటికీ సీట్ల ఖాతా తెరవలేదు. దెబ్బకొట్టిన ఒంటరి పోరు ఢిల్లీలో 2015, 2020 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా నెగ్గని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో కనీసంగా 10 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇందుకు అనుగుణంగా ఎన్నో హామీలు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. అయితే అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు లేకపోవడం దెబ్బకొట్టింది. అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు ఆప్ నిరాకరించడంతో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ల మధ్యే కొనసాగుతుండటంతో కాంగ్రెస్ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 2008లో 48 శాతం ఓట్లతో 43 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ 2013లో 24.70 శాతం సీట్లతో 7 సీట్లకు పరిమితమైంది. 2015లో కాంగ్రెస్కు 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓట్లు వచ్చినా ఒక్క సీటు కూడా గెలువలేదు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ దాదాపు 6.38 శాతం ఓట్లను రాబట్టుకుంది. 70 శాతానికి పైగా అభ్యర్థులు డిపాజిట్లు సైతం కోల్పోయారు. ఆప్తో పొత్తుపెట్టుకొని పోటీ చేస్తే కనీసం ఖాతా తెరిచే పరిస్థితి అయినా ఉండేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పనిచేయని హామీలు ఢిల్లీ అసెంబ్లీలో ఎలాగైనా పాగా వేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఓటర్లపై అనేక హామీలు గుప్పించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఐదు గ్యారంటీలను ప్రకటించింది. ‘ప్యారీ దీదీ యోజన’ కింద మహిళలకు నెలకు రూ.2,500, రూ.500లకే ఎల్పీజీ సిలిండర్, కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, పింఛను రూ.2,500 నుంచి రూ.5,000కు పెంపు, నిరుద్యోగ యువతకు ఏడాదిపాటు నెలకు రూ.8,500 ఆర్థిక సహాయం వంటి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. తన మేనిఫెస్టోలో సైతం కులగణనæ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, వితంతువుల కుమార్తెల పెళ్లికి రూ.1.10 లక్షల ఆర్థిక సాయం, ఢిల్లీవ్యాప్తంగా 100 ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటు వంటి హామీలతో ముందుకెళ్లినా ఆ పార్టీని జనం పట్టించుకోలేదు. వీటికితోడు యమునా నదీ కాలుష్యాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకున్నా ఉపయోగపడలేదు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంక గాం«దీ, మల్లికార్జున ఖర్గే తదితరులు ప్రచారం చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్ కీలక నేతలైన సందీప్ దీక్షిత్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో 25,520 ఓట్ల తేడాతో ఓటమి చెందగా, కల్కాజీ నియోజకవర్గంలో అల్కా లాంబ 47,691 ఓట్ల తేడాతో, నాంగ్లోయి నుంచి రోహిత్ చౌదరి 36,401 ఓట్ల తేడాతో ఓడిపోయారు. -
స్వయంకృతాపరాధమే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మట్టికరిచింది. హ్యాట్రిక్ కొట్టలేక చతికిలపడింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారు. సీనియర్ నేతలకు సైతం ఓటమి తప్పలేదు. గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు రావడం, ముఖ్యమంత్రి ఆతిశీ నెగ్గడం కొంతలో కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఆప్ ఓటమికి దారితీసిన కారణాలు ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది. ఆ పార్టీలోనూ అంతర్మథనం సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేశామని చెప్పుకున్నప్పటికీ ఓటర్లు కనికరించలేదు. ఆప్ ఓటమికి స్వయం కృతాపరాధమే కారణమన్న వాదన వినిపిస్తోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ స్వయంగా అవినీతిలో కూరుకుపోవడం ప్రజల్లో వెగటు కలిగించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు కేజ్రీవాల్ పార్టీ కొంపముంచినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్జైలుకు వెళ్లినప్పటికీ జనంలో ఏమాత్రం సానుభూతి లభించలేదు. ఫలించిన బీజేపీ ప్రచారం మద్యం కుంభకోణం వ్యవహారంలో కేజ్రీవాల్తోపాటు ఆప్ సీనియర్ నేతలపై కేసులు నమోదయ్యాయి. కొందరు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైలుకెళ్లారు. ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయ్యారు. ఆప్ నేతల్లో చాలామందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ నాయకులపై కేసులన్నీ బీజేపీ కుట్రేనని ఆప్ పెద్దలు గగ్గోలు పెట్టినప్పటికీ జనం పట్టించుకోలేదు. ఇక కేజ్రీవాల్ నిర్మించుకున్న అద్దాల మేడ(శీష్ మహల్) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయవంతమైంది. అద్దాల మేడ వ్యవహారం ఎన్నికల్లో కీలక ప్రచారాంశంగా మారిపోయింది. అవినీతి రహిత, స్వచ్ఛమైన పాలన అందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. పైకి నిరాడంబరంగా కనిపించే కేజ్రీవాల్ భారీగా ఆస్తులు పోగేసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు ప్రజలను ఆలోచింపజేశాయి. ‘డబుల్ ఇంజన్’కు ఆమోదం! ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో ఆప్ ప్రభుత్వం తరచుగా ఘర్షణకు దిగింది. పరిపాలనా సంబంధిత అంశాల్లో ఆయనను వ్యతిరేకించడం, కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్లు వ్యవహరించడం జనానికి నచ్చలేదు. పరిపాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నర్పై, కేంద్రంపై నిందలు వేసినప్పటికీ ఓటర్లు విశ్వసించలేదు. ఆప్ అంటే ఆపద అని ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేశారు. పచ్చి అవినీతి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రచారాన్ని ఆప్ నేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోయారు. అద్దాల మేడపై ఏం సమాధానం చెప్పాలో వారికి తోచలేదు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని బీజేపీ నేతలు పదేపదే చెప్పడం ఓటర్లపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుందన్న అభిప్రాయం జనంలో నెలకొంది. బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చిచూద్దామన్న నిర్ణయానికి వారు వచ్చారు. ఢిల్లీ ఓటర్లకు ఆప్ పలు ఉచిత హామీల్చింది. అవి కూడా గట్టెక్కించలేదు. బీజేపీకి లాభించిన విపక్షాల అనైక్యత జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ఆప్ భాగస్వామ్య పక్షాలు. ఢిల్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాల్సిన ఈ రెండు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగాయి. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఈ ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆప్ను చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రెండు పార్టీలు మొత్తం 70 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. బీఎస్పీ, వామపక్షాలు, ఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ, ఎన్సీపీ వంటివి తమకు బలం ఉన్న చోట పోటీ పడ్డాయి. ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చాలాచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి రావాల్సిన ఓట్లను కాంగ్రెస్ కొల్లగొట్టినట్లు తెలు స్తోంది. ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పోటీ చేస్తే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాల అనైక్యత కారణంగా చివరకు బీజేపీ లబ్ధి పొందింది. మార్పు కోరుకున్న జనంఆప్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్లు పాలనలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చలేదు. నగరంలో అస్తవ్యస్తమైన మారిన డ్రైనేజీ వ్యవస్థ, పెరిగిపోయిన కాలుష్యం, మురికికూపంగా మారిన యమునా నది, స్వచ్ఛమైన తాగునీరు, గాలి లభించకపోవడం ఓటర్లు మనసు మార్చేసింది. అంతేకాకుండా పదేళ్లుగా అధికారంలోకి కొనసాగుతున్న ఆప్పై సహజంగానే కొంత ప్రజావ్యతిరేకత ఏర్పడింది. జనం మార్పును కోరుకున్నారు. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం, అభివృద్ధి లేకపోవడం కేజ్రీవాల్ విశ్వసనీయతను దిగజార్చాయి. ఈ పరిణామాలను బీజేపీ ఎంచక్కా సొమ్ము చేసుకుంది.స్తంభించిన పాలన కేజ్రీవాల్ అరెస్టు కావడం, జైలుకెళ్లడం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆప్ ప్రతిష్టను దారుణంగా దిగజార్చింది. ఆయన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కేజ్రీవాల్ తర్వాత బీజేపీని ఢీకొట్టే స్థాయి కలిగిన బలమైన నాయకులు లేకపోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతికూలంగా మారింది. చాలామంది సీనియర్లు ఓడిపోవడంతో ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని చెప్పుకొనే పరిస్థితి లేకుండాపోయింది. కేజ్రీవాల్ అరెస్టు కావడంతో పరిపాలన చాలావరకు స్తంభించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది మార్చి నెలలో ఆయన అరెస్టయ్యారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కేంద్రం ఎదుట తలవంచబోనని తేల్చిచెప్పారు. ఈ కేసులో బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ప్రజలు ఇచ్చే నిజాయితీ సర్టిఫికెట్తో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని కేజ్రీవాల్ చెప్పినప్పటికీ అది నెరవేరలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్టీలు మారి.. పరాజితులయ్యారు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కండువాలు మార్చుకుని బరిలోకి దిగిన వారిని ప్రజలు తిరస్కరించారు. పార్టీలు మారి పోటీ చేసిన మొత్తం 25 మంది నాయకుల్లో కేవలం 8 మందిని మాత్రమే ఓటర్లు గెలిపించారు. మిగతా 15 మందికి పరాజయం తప్పలేదు. ఈ ఎన్నికల్లో దాదాపు ప్రతి పార్టీ బయటి పార్టీల నుంచి వచ్చిన వారిని రంగంలోకి దించాయి. ఇతర పార్టీల తిరుగుబాటుదార్లకు ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధికంగా 11 మందికి, బీజేపీ ఏడుగురికి, కాంగ్రెస్ ఐదుగురికి టిక్కెట్లిచ్చాయి. అయితే, ఆప్ తరఫున పోటీ చేసిన 11 మందిలో నలుగురు మాత్రమే గెలవగా.. ఏడుగురు ఓడిపోయారు. బీజేపీ నుంచి పోటీ చేసిన ఏడుగురిలో నలుగురు విజయం సాధించగా, ముగ్గురు ఓటమి చెందారు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరి పోటీకి దిగిన ఐదుగురిలో ఒక్కరు కూడా గెలవలేకపోయారు. -
రెండు జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల డేటా విశ్లేషణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఢిల్లీ ఓటర్లు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలైన బీఎస్పీ, సీపీఎం కంటే నోటా (నాన్ ఆఫ్ ది ఎబవ్)ఆప్షన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపారని తేలింది. మొత్తం పోలైన ఓట్లలో నోటా ఆప్షన్కు 0.57 శాతం ఓట్లు పడగా బీఎస్పీకి 0.55 శాతం, సీపీఎంకు 0.01శాతం మంది మాత్రమే ఓటేయడం గమనార్హం. ఈ రెండు పార్టీలకు దక్కిన ఓట్ల కంటే నోటా ఓట్ల శాతమే ఎక్కువ. ఈ ఎన్నికల్లో సీపీఐకి 0.01, జేడీయూకు 0.53 శాతం ఓట్లు పడ్డాయి. -
ఢిల్లీ కొత్త సీఎం ఎవరు?.. రేసులో పర్వేశ్ వర్మ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై నెగ్గిన బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ(47) పేరు మార్మోగిపోతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గంంలో కేజ్రీవాల్పై 4,089 ఓట్ల తేడాతో ఆయన జయకేతనం ఎగురవేశారు. జెయింట్ కిల్లర్గా అవతరించారు. వర్మకు 30,088 ఓట్లు, కేజ్రీవాల్కు 25,999 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్కు 4,568 ఓట్లు లభించాయి. పశ్చిమ ఢిల్లీకి చెందిన పర్వేశ్ వర్మ రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాకముందు నుంచే ప్రచారం ప్రారంభించారు. ఓటర్లకు చేరువయ్యారు. ఎన్నికలకు రెండు నెలల ముందే ఇంటికి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గరిష్ట స్థాయిలో ఓటర్లను కలుసుకున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్సింగ్ వర్మ కుమారుడైన పర్వేశ్వర్మ ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఓడించి, బీజేపీ తరపున నూతన ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. బాల్యం నుంచే సంఘ్ భావజాలం పర్వేశ్ వర్మ 1977 నవంబర్ 7న ఢిల్లీలో జన్మించారు. చిన్నప్పుడే రాజకీయాలపై ఆసక్తి కనబర్చారు. తండ్రి బాటలో నడుస్తూ 1991లో ఆర్ఎస్ఎస్లో చేరారు. బాల స్వయంసేవక్గా పనిచేశారు. అనంతరం బీజేపీ యువమోర్చాలో చేరారు. యువమో ర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యుడయ్యారు. తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2013 ఎన్నికల్లో ఢిల్లీలోని మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2015లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో అదే నియోజకవర్గంలో 4.78 లక్షల ఓట్ల మెజార్టీతో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి సాహిబ్సింగ్ వర్మ స్థాపించిన ‘రా్ష్ట్రీయ స్వాభిమాన్’ అనే సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకుంటున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అయిన పర్వేశ్ వర్మ మంచి వక్తగా పేరుగాంచారు. ఇప్పటి ఎన్నిల్లో కేజ్రీవాల్ను తానే ఢీకొట్టబోతున్నానని బహిరంగంగా ప్రకటించారు. రెండుసార్లు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్ను ఓడించి కేజ్రీవాల్ సీఎం అయ్యారు. రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన కేజ్రీవాల్ను ఓడించిన పర్వేశ్ శర్మ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఐటీ ఊరటే.. గేమ్ ఛేంజర్
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంలో మోదీ సర్కారు తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ ఊరట ప్రధాన పాత్ర పోషించింది. ఈ నిర్ణయంతో రాజధాని నగరంలో ఏకంగా మూడింట రెండొంతుల దాకా ఉండే ప్రభుత్వోద్యోగులు, వేతన జీవుల్లో అత్యధికులు ఆ పార్టీవైపు మొగ్గారు. మధ్య తరగతి, పూర్వాంచల్ ఓటర్ల మద్దతు దానికి తోడైంది. వీటికి తోడు 2015, 2020ల్లో ఆప్కు అండగా నిలిచిన పలు వర్గాల ఓటర్లు కూడా ఈసారి కమలం పార్టీ వైపు మొగ్గారు. సాధారణంగా కేజ్రీవాల్ పార్టీకి మద్దతుదార్లయిన మహిళలు సైతం ఈసారి బీజేపీకి జైకొట్టారు. వారికి నెలకు రూ.2,500 అందిస్తామన్న హామీ బాగా పేలింది. పంజాబ్లో మహిళలకు నెలకు రూ.1,000 ఇస్తామన్న హామీని గెలిచాక నిలబెట్టుకోకపోవడం ఆప్కు ప్రతికూలంగా మారింది. ఢిల్లీలో మధ్య తరగతి ప్రజలు అధికం. ఉద్యోగాలు, చిన్నపాటి వ్యాపారాలతో వారు ఉపాధి పొందుతుంటారు. రూ.12 లక్షల వార్షిక ఆదాయానికి ఆదాయ పన్ను పూర్తిగా మినహాయిస్తూ ఢిల్లీ పోలింగ్ కేవలం నాలుగు రోజుల ముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మోదీ సర్కారు ప్రకటించడం తెలిసిందే. పన్ను భారం తొలగిపోవడం ఆ ఎంతగానో ఊరటనివ్వడంతో వేతన జీవులు ఓటు రూపంలో బీజేపీ పట్ల కృతజ్ఞత చూపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన పూర్వాంచల్ ఓటర్లు మొత్తం ఓటర్లలో ఏకంగా 30 శాతం దాకా ఉంటారు. వారి ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్న బీజేపీ హామీ ఆకట్టుకుంది. దీనికి తోడు యూపీ, బిహార్ల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తెచ్చి ఢిల్లీలో ఓటర్లుగా చేరి్పస్తున్నారన్న కేజ్రీవాల్ ఆరోపణలు, వారంతా ఫేక్ ఓటర్లన్న విమర్శలు పూర్వాంచల్ ప్రజలకు ఆగ్రహానికి కారణమయ్యాయి. దాంతో వారంతా బీజేపీకే ఓటేశారు. పదేళ్ల ఆప్ పాలనలో తమకు ఒరిగిందేమీ లేదంటూ ప్రజల్లో నెలకొన్న భావన కూడా కేజ్రీవాల్కు ప్రతికూలంగా మారింది. ఆరెస్సెస్ నిశ్శబ్ద ప్రచారం ఢిల్లీ ఎన్నికల్లో రా్ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) బీజేపీ విజయం కోసం నిశ్శబ్దంగా పని చేసుకుంటూ వెళ్లింది. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన కావాలంటే బీజేపీని గెలపించాలని సంఘ్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేశారు. వారు ఇంటింటా తిరిగారు. బీజేపీ గెలుపులో సంఘ్ పాత్ర తక్కువేమీ కాదు. చిన్నచిన్న సభలు వందల సంఖ్యలో నిర్వహించారు. ఆప్ ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టారు. ఢిల్లీ మోడల్ అంటూ ఆప్ నేతలు చేస్తున్న ప్రచారంలోని డొల్లతనాన్ని బయటపెట్టారు. ఇక ఆప్ ప్రభుత్వ పెద్దల అవినీతి గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగారు. రాజకీయ పార్టీల కంటే ముందే సంఘ్ కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారు. మురికివాడలు, అనధికారిక కాలనీల్లోకి వేగంగా చొచ్చుకెళ్లారు. అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రచారం చేసి పేరు ప్రతిష్టలు కోరుకోవడం, నిత్యం ప్రసార మాధ్యమాల్లో కనిపించడం సంఘ్ కార్యకర్తలకు ఇష్టం ఉండదు. తెరవెనుక నిశ్శబ్దంగా పని చేయడానికే వారు ఆసక్తి చూపుతారు. 8వ వేతన సంఘంతో లబ్ధి సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎనిమిదో వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం బీజేపీకి లబ్ధి చేకూర్చింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎనిమిదో వేతన సంఘంతో వారి వేతనాలు పెరుగనున్నాయి. నిజానికి ఉచిత పథకాలకు బీజేపీ బద్ధ వ్యతిరేకి. అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో ఉచిత పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ యథాతథంగా అమలు చేస్తామని ప్రకటించింది. దాంతో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు బీజేపీని ఆదరించారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు వంటి పథకాలు ఎప్పటిలాగే అమలవుతాయి కాబట్టి బీజేపీకి ఓట్లు వేశారు. యమునా నదిని ఎగువన ఉన్న హరియాణా ప్రభుత్వం కలుషితం చేస్తోందంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. హరియాణా ప్రజలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని హరియాణా ఓటర్లు కేజ్రీవాల్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ కోట చిక్కింది!
న్యూఢిల్లీ: 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగిరింది. దేశ రాజధానిలో పదేళ్లుగా కంట్లో నలుసుగా, కొరకరాని కొయ్యగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఎట్టకేలకు చిత్తు చేసింది. ఆ పార్టీ చేతిలో రెండు వరుస పరాభవాల అనంతరం ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఘనవిజయం సాధించింది. సరిగ్గా పోలింగ్కు ముందు మోదీ సర్కారు గురిచూసి సంధించిన ఆదాయపన్ను మినహాయింపు పరిమితి పెంపు అస్త్రం బీజేపీ పాలిట రామబాణంలా పని చేసింది. కేజ్రీవాల్పై అవినీతి మరకలు, పదేళ్ల పాలన నేపథ్యంలో ఆప్పై ప్రభుత్వ వ్యతిరేకత అందుకు తోడయ్యాయి. దాంతో శనివారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ ఏకంగా మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా ఆప్ 22 సీట్లకు పరిమితమైంది. మెజారిటీ మార్కుకు 14 స్థానాల దూరంలో నిలిచి తన పురిటిగడ్డ అయిన ఢిల్లీలో తొలిసారి ఓటమిని రుచిచూసింది. కాంగ్రెస్తో పొత్తు వద్దనుకోవడం ఆప్ భాగ్యరేఖలనే పూర్తిగా తలకిందులు చేసింది. ఎందుకంటే 14 అసెంబ్లీ స్థానాల్లో ఆప్పై బీజేపీ అభ్యర్థులు సాధించిన మెజారిటీ కంటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు రావడం విశేషం. స్వయానా ఆప్ సారథి కేజ్రీవాల్ కూడా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పరాజయం పాలయ్యారు. ఆయన పరాభవానికీ కాంగ్రెసే కారణంగా నిలిచింది. అక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ మెజారిటీ కంటే కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్కు ఎక్కువ ఓట్లొచ్చాయి. అలా కాంగ్రెస్తో కటీఫ్ నిర్ణయం కేజ్రీవాల్తో పాటు మొత్తంగా ఆప్ పుట్టినే ముంచేసింది. బీజేపీ హవాలో ఆప్ నేత, సీఎం ఆతిషి కనాకష్టంగా గట్టెక్కగా ముగ్గురు మినహా ఆప్ మంత్రులంతా ఓటమి బాట పట్టారు. ఆప్ దిగ్గజ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఓటమి చవిచూశారు. అయితే ఆప్కు కోలుకోలేని షాకివ్వడం మినహా కాంగ్రెస్ కూడా బావుకున్నదేమీ లేదు. ఢిల్లీలో వరుసగా మూడోసారి కూడా ఖాతాయే తెరవలేక చెత్త హ్యాట్రిక్ను మూటగట్టుకుంది. ఆ పార్టీ అభ్యర్థులు చాలాచోట్ల ఏకంగా డిపాజిట్లే కోల్పోయారు! బీజేపీకి 45.56 శాతం ఓట్లు రాగా ఆప్కు 43.57 శాతం వచ్చాయి. కాంగ్రెస్ 6.34 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. 2020 ఎన్నికల్లో ఆప్ 53.57 శాతం ఓట్లతో 62 సీట్లు కైవసం చేసుకోగా బీజేపీ 38.51 శాతం ఓట్లతో కేవలం 8 సీట్లతో సరిపెట్టుకుంది. 2015లో ఆప్ ఏకంగా 67, బీజేపీకి కేవలం 3 సీట్లొచ్చాయి. 2013లో ఆప్ తన తొలి ఎన్నికల్లోనే ఢిల్లీ అసెంబ్లీలో 28 సీట్లు నెగ్గి సత్తా చాటింది. బీజేపీ ఢిల్లీలో చివరగా 1993 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ఐదేళ్లలోనే ముగ్గురు సీఎంలను మార్చి అప్రతిష్ట మూటగట్టుకుంది. దాంతో 1998లో కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలైంది. అప్పట్నుంచి 2013 దాకా 15 ఏళ్లపాటు షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తినలో సాగిన కాంగ్రెస్ హవాకు ఆప్ ఆవిర్భావంతో తెర పడింది. ఆద్యంతం బీజేపీదే పైచేయి అటు బీజేపీ, ఇటు ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు ఈసారి ఆద్యంతం హోరాహోరీగా సాగింది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగింది. శనివారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. కాసేపటికే ట్రెండ్స్ వెలువడ్డాయి. వాటిలో మొదటినుంచీ బీజేపీ హవాయే కొనసాగుతూ వచ్చింది. అడపాదడపా ఒకట్రెండు రౌండ్లలో మినహాయించి కేజ్రీవాల్ మొదటినుంచీ వెనుకంజలోనే కొనసాగుతూ వచ్చారు. మధ్యలో రెండు పార్టీల మధ్య అంతరం తగ్గినట్టు కన్పించినా చూస్తుండగానే బీజేపీ దూసుకెళ్లింది. దాంతో ఆ పార్టీ కార్యాలయంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. నేతలు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేలుళ్లు, వాయిద్యాల హోరుతో హోరెత్తించారు. ఆప్, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాలు బోసిపోయి కన్పించాయి. ఇటీవలే హరియాణాతో పాటు కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయంతో దూకుడు మీదున్న బీజేపీ అదే ఊపులో ఇప్పుడు ఢిల్లీనీ చేజిక్కించుకుంది. దాంతో దేశవ్యాప్తంగా కాషాయశ్రేణులు సంబరాల్లో మునిగిపోగా ఆప్, కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ డీలాపడ్డాయి. తాజా ఫలితాలతో విపక్ష ఇండియా కూటమి ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ విజయాన్ని చరిత్రాత్మకంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివరి్ణంచగా ప్రజాతీర్పును అంగీకరిస్తున్నామని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని ఆతిషి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ఆప్కే అగి్నపరీక్షగా నిలిచాయని తప్ప తమకు కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్గాం«దీ, ప్రియాంకగాంధీ వద్రా చెప్పుకొచ్చారు. పర్వేశే సీఎం! బీజేపీ ఘనవిజయం నేపథ్యంలో ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కేజ్రీవాల్ను మట్టికరిపించిన జెయింట్ కిల్లర్గా మారిన పర్వేశ్సింగ్ పేరే ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తండ్రి సాహెబ్సింగ్ వర్మ కూడా 1993–98 మధ్య ఢిల్లీ సీఎంగా చేయడం విశేషం. సీఎం ఎవరన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని పర్వేశ్తో పాటు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ కూడా చెప్పుకొచ్చారు. -
ఆపద నుంచి ప్రజలకు విముక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో(Delhi Elections) బీజేపీ విజయం(BJP victory) సాధారణ విజయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) చెప్పారు. దశాబ్ద కాలం తర్వాత ఆప్ద(ఆపద) నుంచి ఢిల్లీ ప్రజలకు ఎట్టకేలకు విముక్తి లభించిందని అన్నారు. బీజేపీని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ రాజధానిలో డబుల్ ఇంజన్ సర్కారు పాలనలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నామని వెల్లడించారు. శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆనందం పంచుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ప్రభుత్వ అవినీతి, ఆర్థిక అవకతవకలపై ‘కాగ్’ ఇచ్చిన నివేదికను బీజేపీ ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడుతుందని చెప్పారు. అన్నిరకాల అవినీతి వ్యవహారాలపై కచ్చితంగా దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. జనం సొమ్మును లూటీ చేసినవారి నుంచి తిరిగి కక్కిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని తేల్చిచెప్పారు. ఢిల్లీలో ఇప్పటిదాకా పాలన వెలగబెట్టినవారు పచ్చి అవినీతిపరులు అని మండిపడ్డారు. షార్ట్–కట్ రాజకీయాలు చేసేవారికి ప్రజలు షార్ట్–సర్క్యూట్తో బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రజల రుణం తీర్చుకుంటాం ధూర్త, మూర్ఖ రాజకీయాలు మన దేశానికి అవసరం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆప్, కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ఎజెండాను చోరీ చేసిందన్నారు. హిందుత్వ వేషంతో ఓట్లు రావడం లేదు కాబట్టి మిత్రపక్షాల ఓట్లను కొల్లగొట్టాలని చూస్తోందని చెప్పారు. కాంగ్రెస్ లేవనెత్తుతున్న కులగణన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘మోదీ కీ గ్యారంటీ’ పట్ల ఢిల్లీ ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారని, నగరాన్ని అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటామని వివరించారు. యమునా నదిలో శుభ్రం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. మన ప్రయత్నాలను యమున మాత తప్పకుండా ఆశీర్వదిస్తుందని అన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. ఢిల్లీని సరికొత్త ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి ధూర్త, మూర్ఖ రాజకీయాలు చేసే దుష్టులు దేశ రాజకీయాలను కబ్జా చేయకుండా ఉండాలంటే లక్ష మంది యువత రాజకీయ రంగంలోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో రాకపోతే దేశానికి చాలా నష్టం జరుగుతుందన్నారు. దేశానికి ఇప్పుడు రాజకీయ పరివర్తన అవసరమని తెలిపారు. 21వ శతాబ్దంలో వికసిత్ భారత్కు నూతన జీవన శక్తి, నూతన ఆలోచనలు, నూతన ఉత్సాహం అవసరమని పేర్కొన్నారు. రాజ్యంపై యుద్ధం చేస్తున్నామంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష పార్టీ దేశ ప్రయోజనాల కోసం కాకుండా అర్బన్ నక్సలైట్ల కోసం రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాలను బలిపెట్టడంలో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ముందంజలో ఉందన్నారు. రాజకీయాల్లో మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చి నీచ రాజకీయాలు చేసేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అభివృద్ధి, సుపరిపాలనతోప్రత్యేక గుర్తింపు వచ్చిందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో రెండు రెట్ల వేగంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇదొక చరిత్రాత్మక విజయమని అభివర్ణించారు.ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తంచేశారు. ప్రజాశక్తికి తిరుగులేదని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎన్నికల ఫలితాల అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. చరిత్రాత్మక విజయం అందించినందుకు ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ అని పేర్కొన్నారు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఇది తమ గ్యారంటీ అని స్పష్టంచేశారు. ఎన్నికల్లో విజయం కోసం శ్రమించిన బీజేపీ నేతలు, కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. -
‘తెలంగాణలో ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదు’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎప్పటికీ అధికారంలో రాదన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మహేష్ గౌడ్ స్పందించారు. ఢిల్లీ ఫలితాలను చూసి తెలంగాణ బీజేపీ నాయకులు అమితానంద పడుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది జరగదన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి మా పార్టీకి రక్ష. ఇచ్చిన 6 గ్యారంటీలని అమ్మడు పరుస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిది కాంగ్రెస్. ఈ సంక్షేమ పథకాలే మళ్లీ కాంగ్రెస్ను ెగెలిపిస్తాయి. కేటీఆర్ పరిస్థితి విచిత్రంగా ఉంది.బిజెపిని అభినందించలేక లోలోపల మునిసిపోతున్నాడు. కేసీఆర్, కేటీఆర్ శకం.. ఈ రాష్ట్రంలో ముగస్తుంది. దేశవ్యాప్తంగా త్వరలోనే కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది, తిరిగి అధికారంలోకి వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. -
అతనికి కాస్త నీళ్లు ఇవ్వండి: మోదీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Delhi Assembly Elections 2025) బీజేపీ భారీ విజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi).. ఢిల్లీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ బీజేపీ హెడ్క్వార్టర్స్లోని ఏర్పాటు చేసిన పార్టీ సంబరాల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా, ఒక బీజేపీ కార్యకర్త అనారోగ్యంగా ఉండటాన్ని గమనించారు. మోదీ ప్రసంగిస్తున్న వేదికకు అతి దగ్గరగా ఉన్న ఆ కార్యకర్త.. కదలికల్ని మోదీ పసిగట్టారు. అతనికి ఆరోగ్యం బాలేదన్న విషయం మోదీకి అర్థమైంది. దాంతో ప్రసంగాన్ని మధ్యలో ఆపేసిన మోదీ.. ఆ కార్యకర్తకు కాస్త నీళ్లు ఇమ్మని బీజేపీ శ్రేణులకు సూచించారు. అంతేకాకుండా అక్కడున్న డాక్టర్లు.. అతన్నిఒకసారి పరీక్షించాలని కూడా మోదీ కోరారు.‘ఆ బీజేపీ కార్యకర్తకు కళ్లు మూతలు పడుతున్నాయి. చాలా అన్ఈజీగా ఉన్నాడు. ముందు అతనికి కాస్త మంచి నీళ్లు ఇవ్వండి. ఇక్కడ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఒకసారి అతని పరీక్షించండి’ అని మోదీ సూచించారు.Such is his aura ♾During his victory speech, PM Modi noticed a person feeling unwell and immediately paused to ensure they received medical help!#दिल्ली_के_दिल_में_मोदी#AmitShah #DelhiElections2025 pic.twitter.com/VG16Yv1qw1— PoliticsSolitics (@IamPolSol) February 8, 2025 అటు తర్వాత మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఢిల్లీ ప్రజలకు ఈరోజు పండుగ లాంటిదని,ఆప్ నుంచి వారికి విముక్తి లభించిందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మాట్లాడుతూ బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.‘ ఈ విజయంతో ఢిల్లీలో చరిత్ర సృష్టించాం. హర్యానా,మహారాష్ట్రలో గెలిచి రికార్డు సృష్టించాం. ఢిల్లీని ఇక అభివృద్ధి బాటలో నడిపిస్తాం.మీ ప్రేమను అభివృద్ధిలో చూపిస్తాం.ఢిల్లీ ప్రజల అభివృద్ధికి మోదీ గ్యారెంటీ. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు వారికి తిరిగి ఇస్తాం. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలే విజేతలుగా నిలిచారు.మీ విశ్వాసాన్ని అభివృద్ధిలో తీసుకొస్తాం.ఢిల్లీ అనేది మినీ ఇండియా. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.డబుల్ ఇంజిన్ సర్కార్తో ఢిల్లీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. షాట్కట్ రాజకీయాలకు ప్రజలు షాకిచ్చారు. నేను పూర్వాంచల్ నుంచి ఎంపీగా ఉన్నందుకు గర్వపడుతున్నా. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం చూపిస్తున్నారు. చాలా స్టేట్లలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందిఅవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఆమ్ఆద్మీపార్టీ నేతలు అవినీతిలో మునిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ అయితే వరుసగా మూడోసారి సున్నా సాధించింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను మిత్రులు కూడా గమనించింది. యమునా నదిని కాలుష్య కోరల నుంచి రక్షిస్తాం. ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాగ్ రిపోర్టు బయటపెడతాం. కాంగ్రెస్కు ఓటములలో మెడల్ ఇవ్వొచ్చు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇండియా కూటమి పార్టీలకు అర్థమైంది’అని మోదీ పేర్కొన్నారు. -
‘ఆప్’ ఓటమి వేళ..స్వాతి మలివాల్కు ‘మీమ్స్’ మద్దతు
న్యూఢిల్లీ:ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ, స్వయంగా ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు.ఈ ఓటమి అంశం బీజేపీ నేతలకు అంతులేని ఆనందాన్నిచ్చింది. వారి సంబరాలకు కారణమైంది.ఎందుకంటే ఆప్పై గెలిచింది వారే.అయితే ఆప్తో ఎన్నికల్లో తలపడకుండా ఆప్ ఓటమి పట్ల బీజేపీ తర్వాత అంత సంతోషించింది ఒక్కరే. ఆమే..ఆప్ నుంచి సస్పెండైన రాజ్యసభ ఎంపీ స్వాతిమలివాల్. ఢిలీ ఎన్నికల్లో ఆప్ ఓటమి నిర్ధారణ అయిన వెంటనే స్వాతి మలివాల్ తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేస్తూ మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం పోస్టు పెట్టారు. pic.twitter.com/kig39RQYmD— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, గతేడాది మేలో లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై బయటికి వచ్చారు.ఈ సమయంలో కేజ్రీవాల్ను కలవడానికి స్వాతి ఆయన నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కొద్ది సేపట్టికి స్వాతి అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ చేసిన తనపై కేజజ్రీవాల్ ఇంట్లో దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్కుమార్ తనను కొట్టాడని కేసు పెట్టారు. దీంతో పోలీసులు బిభవ్కుమార్ను అరెస్టు చేశారు.స్వాతి మలివాల్ జరిగిన దాడిని తొలుత ఖండించిన ఆప్ ఆ తర్వాత స్వాతి మలివాల్ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆరోపించింది. దీంతో స్వాతి మలివాల్ ఆప్, కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు చేశారు.తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆప్ వ్యతిరేకంగా పలు చోట్ల ప్రచారం కూడా చేశారు. స్వాతిమలివాల్కు మద్దతుగా ఆప్ ఓటమిపై శనివారం మీమ్స్, పోస్టులు సోషల్మీడియాను ముంచెత్తాయి. -
‘ఆప్’కు ఢిల్లీ ప్రజల షాక్: ప్రధాని మోదీ
సాక్షి,న్యూఢిల్లీ:ఢిల్లీ ప్రజలకు ఈరోజు పండుగ లాంటిదని,ఆప్ నుంచి వారికి విముక్తి లభించిందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా శనివారం(ఫిబ్రవరి 8) సాయంత్రం బీజేపీ హెడ్క్వార్టర్స్లో జరిగిన సంబరాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.‘ఈ విజయంతో ఢిల్లీలో చరిత్ర సృష్టించాం. హర్యానా,మహారాష్ట్రలో గెలిచి రికార్డు సృష్టించాం. ఢిల్లీని ఇక అభివృద్ధి బాటలో నడిపిస్తాం.మీ ప్రేమను అభివృద్ధిలో చూపిస్తాం.ఢిల్లీ ప్రజల అభివృద్ధికి మోదీ గ్యారెంటీ. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు వారికి తిరిగి ఇస్తాం. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలే విజేతలుగా నిలిచారు. మీ విశ్వాసాన్ని అభివృద్ధిలో తీసుకొస్తాం.ఢిల్లీ అనేది మినీ ఇండియా. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.డబుల్ ఇంజిన్ సర్కార్తో ఢిల్లీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. షాట్కట్ రాజకీయాలకు ప్రజలు షాకిచ్చారు. నేను పూర్వాంచల్ నుంచి ఎంపీగా ఉన్నందుకు గర్వపడుతున్నా. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం చూపిస్తున్నారు. చాలా స్టేట్లలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిందిఅవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఆమ్ఆద్మీపార్టీ నేతలు అవినీతిలో మునిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ అయితే వరుసగా మూడోసారి సున్నా సాధించింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను మిత్రులు కూడా గమనించింది. యమునా నదిని కాలుష్య కోరల నుంచి రక్షిస్తాం. ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాగ్ రిపోర్టు బయటపెడతాం. కాంగ్రెస్కు ఓటములలో మెడల్ ఇవ్వొచ్చు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇండియా కూటమి పార్టీలకు అర్థమైంది. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఎంతో పోరాడారు. ఆప్ ఓటమితో అన్నా హజారే కూడా ఎంతో సంతోషిస్తున్నారు’అని మోదీ పేర్కొన్నారు. -
కాంగ్రెస్ దీన స్థితి చూస్తే జాలేస్తోంది: కిషన్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:పన్నెండేళ్లుగా ఢిల్లీకి పట్టిన గ్రహణం వీడిందని,రాజకీయాల్లో అవినీతికి కేరాఫ్ అడ్రస్గా కేజ్రివాల్ మారారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కిషన్రెడ్డి శనివారం(ఫిబ్రవరి8) మీడియాతో మాట్లాడారు.‘ప్రజల తీర్పుతో కేజ్రీవాల్ నెత్తికి ఎక్కిన అహంకారం దిగింది. ప్రజలు ఒక్కసారి డిసైడ్ అయితే రాహుల్,కేసిఆర్,కేజ్రివాల్ ఎవరైనా ఓటమి చెందక తప్పదు. ఢిల్లీలో కాంగ్రెస్ దీన స్థితి చూసి జాలేస్తోంది. రాహుల్ నాయకత్వం చేపట్టాక వారికి వచ్చిన ఓటములను కంప్యూటర్ ద్వారా లెక్కించడమే సాధ్యమవుతుంది. రాహుల్ డైమండ్ డకౌట్ అయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ డబుల్ హ్యాట్రిక్,డబుల్ డక్ కొట్టింది. ఢిల్లీ తీర్పుతో కేజ్రీవాల్ లిక్కర్ స్కాం నిందితుడని అక్కడి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్కు గుండు సున్నా వచ్చింది.కాంగ్రెస్ అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే అధికారం.ఆప్ ఓటమిలో ప్రధాన పాత్ర లిక్కర్ స్కామ్దే.తెలంగాణలో రేవంత్రెడ్డి ఎలా అధికారంలోకి వచ్చారో కేటీఆర్ చెప్పాలి.అన్న హజారే ఉద్యమంలో అరవింద్ కేజ్రివాల్ కలుపు మొక్క’అని కిషన్రెడ్డి విమర్శించారు. -
బీఆర్ఎస్ వల్లే ‘ఆప్’ ఓటమి: కొండా సురేఖ
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ పార్టీ భస్మాసుర హస్తమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) పరాజయానికి కారణమని మంతత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం(ఫిబ్రవరి8) వెలువడ్డ ఢిల్లీ ఫలితాలపై కొండా సురేఖ స్పందించారు. ‘ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,కేజ్రివాల్ల లిక్కర్ స్కాం ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలకు దూరం చేసింది.ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలనుద్దేశించి రాహుల్గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి. ఈ అహంకారాన్ని అణచివేసేందుకే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు. అధికార పక్షమైన,ప్రతిపక్షమైనా కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ పోరాట పంథానే.కాంగ్రెస్ పార్టీ పరమోన్నత లక్ష్యం ప్రజా సంక్షేమమే’అని కొండా సురేఖ అన్నారు. ‘ఎక్స్’లో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్..తెలంగాణలో ఎలా పుంజుకున్నామో అలాగే దేశవ్యాప్తంగా గెలుస్తాం.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం మీరు సున్నా సీట్లు తెచ్చుకున్నారు.తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్సే కారణం -
కాంగ్రెస్కు ‘గాడిద గుడ్డు’ మిగిలింది: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్:దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. శనివారం(ఫిబ్రవరి8) ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.రాహుల్గాంధీ, రేవంత్లు కలిసి ఢిల్లీలో బీజేపీకి విజయం కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. రేవంత్రెడ్డి ఇక నుంచి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేసిన తర్వాతే ఇక నుంచి ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేసుకోవాలని సూచించారు. -
మోదీ రెండాకులు ఎక్కువే చదివారు.. అందుకే కేజ్రీవాల్కు మాస్టర్ స్ట్రోక్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు నిశ్చయించుకున్న బీజేపీ వ్యూహాలు పని చేశాయి. దేశరాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తన ‘బాణాన్ని’ ప్రచారం చివరి దశలో గురి చేసి వదిలారు. ఆ దెబ్బకే కేజ్రీవాల్ సర్కారు ఓటమి దాదాపు ఖరారై పోయింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. ఇది మోదీ వదిలిన తురుపు ముక్కగా గత వారమే విశ్లేషకులు అభివర్ణించారు.గత వారం.. సరిగ్గా శనివారం నాడే కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టించింది. . ఇది నిజంగా మోదీ మాస్టర్స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇది కచ్చితంగా ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనా నేడు(శనివారం) అక్షరాలా నిజమైంది.మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ(AAP), బీజేపీ(BJP) మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారిన సంగతి తెలిసిందే. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది.దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పార్టీలు శాయశక్తులా ప్రయత్నించాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమైంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్క్లాస్పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది.ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది.ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసింది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్కు బదులు కాంగ్రెస్కు పడ్డాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇది బీజేపీకి బాగా అనుకూలంగా మారిందని, అందుచేతే ఆప్కు గట్టి దెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు.ఆప్తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా ఓటమి పాలవ్వడం ఆ పార్టీ తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి కేజ్రీవాల్ ఓటమి చెందారు.ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. ఇది కేజ్రీవాల్కు మైనస్గా మారింది.అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్కు తల బొప్పి కట్టించాయి. . వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరిచారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్నే మట్టికరిపించారు కేజ్రీవాల్.నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసిరారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొట్టగా, ఇది బీజేపీ అభ్యర్థి పర్వేష్కు వరంలా మారింది. -
‘ఢిల్లీ’లో ఓటమి.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నానన్నారు. హామీలు నెరవేర్చాలని కోరుతున్నానన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపారు. తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఢిల్లీ ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాగా, స్వయంగా కేజ్రీవాల్ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మపై ఓటమి పాలవడం గమనార్హం. పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సిసోడియా,సత్యేందర్జైన్ వంటి ఆప్ నేతలంతా ఓటమి పాలవడం హాట్టాపిక్గా మారింది. మరోవైపు ఆప్ సీనియర్ నేత, ప్రస్తుత సీఎం అతిషి మాత్రం కల్కాజి నియోజకవర్గంలో బీజేపీ నేత రమేష్ బిదూరిపై విజయం సాధించడం విశేషం. -
Delhi Election 2025: ఆప్ ఓటమి బాట.. ఐదు కారణాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (శనివారం) కొనసాగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ట్రెండ్స్.. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి బాటలో ఉందని చూపిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సీట్ల కంటే వెనుకంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.2015లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు గెలుచుకుంది. కానీ 2020లో ఈ సంఖ్య 62కి తగ్గింది. మరోవైపు బీజేపీ 2015లో 3 సీట్లు, 2020లో 8 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఆ పార్టీ సీట్లు గణనీయంగా పెరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి బాట వెనుక అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి:1. అవినీతి ఆరోపణలు-చట్టపరమైన సమస్యలు: పార్టీ అగ్ర నేతలు.. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లపై అవినీతి ఆరోపణలు, అరెస్టులు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ చట్టపరమైన వివాదాలు ఆప్ ప్రతిష్టను బలహీనపరిచాయి. యమునా నదిని శుభ్రపరచడం, ఢిల్లీ రోడ్లను అందంగా తీర్చిదిద్దడం, పరిశుభ్రమైన నీటిని అందించడం లాంటి కేజ్రీవాల్ హామీలు నెరవేరలేదు.2. నాయకత్వ అస్థిరత: కేజ్రీవాల్ అరెస్టు.. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం పార్టీ నాయకత్వంలో అస్థిరతకు దారితీసింది. కొత్త ముఖ్యమంత్రిగా అతిషి నియమితులైనప్పటికీ, నాయకత్వ మార్పు పార్టీకి సవాలుగా మారింది. అరవింద్ కేజ్రీవాల్పై జనాల్లో విశ్వసనీయత విపరీతంగా తగ్గింది.3. ఓట్లను చీల్చిన కాంగ్రెస్: వాస్తవానికి సీట్ల పరంగా ఢిల్లీలో కాంగ్రెస్ ఒక సీటు మాత్రమే గెలుచుకోవచ్చనే అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చింది. 2013 తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్లింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆప్ ఢిల్లీలోని ఏడు సీట్లనూ కోల్పోవడం, పంజాబ్లో కేవలం మూడు సీట్లలో మాత్రమే విజయం సాధించడం కారణంగా పార్టీ బలహీనపడింది.4. అంతర్గత కలహాలు- రాజీనామాలు: పార్టీ లో అంతర్గత కలహాలు, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ తదితర ప్రముఖ నేతల రాజీనామాలు పార్టీని దెబ్బతీశాయి. అలాగే పార్టీ సంస్థాగత బలహీనతను బహిర్గతం చేశాయి.5. ప్రతిపక్ష పార్టీల ఆరోపణల ప్రభావం: ఆప్పై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకున్నాయి. ఇది పార్టీ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. మహిళలు, కొత్త ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమయ్యారు. -
Delhi Election Result: సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్లలో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ ఎన్నికలపై సోషల్ మీడియాలో మీమ్స్ , రీల్స్ వెల్లువెత్తుతున్నాయి. #DelhiElectionResults pic.twitter.com/TuHLOUHVWW— Desi Bhayo (@desi_bhayo88) February 8, 2025సోషల్ మీడియాలో పలువురు యూజర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్లపై వ్యంగ్యబాణాలు విసురుతున్నారు.Ban gaye Raaja. #DelhiElectionResults #avadhojha pic.twitter.com/pPlicGf47R— Prayag (@theprayagtiwari) February 8, 2025ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగగా, నేడు (ఫిబ్రవరి 8) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో ముందుగా బీజేపీ ఆధిక్యం కనబరిచింది.#DelhiElectionResults #DelhiElections2025 Celebrations started in Congress camp after consistently leading in ONE seat out of 70in #Delhi 🔥WHAT A PARTY and WHAT A LEADER🔥💥 pic.twitter.com/tgIUMYDbb0— Mastikhor 🤪 (@ventingout247) February 8, 2025పలువురు ఆప్ నేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు. దీనిని చూసిన యూజర్స్ పలు రకాల మీమ్స్ రూపొందించి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.Congress in every election #DelhiElectionResults pic.twitter.com/pyt64Lt0DL— Ex Bhakt (@exbhakt_) February 8, 2025 -
‘ఆప్’ను చీపురుతో ఊడ్చేశారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారన్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం. మేధావి వర్గం అంతా మా పార్టీకే ఓటు వేశారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలను ప్రజలు దూరంగా పెట్టారు. మేధావి వర్గం అంతా మా పార్టీకే ఓటు వేశారు. భారీ విజయం అందుకునే దిశగా వెళ్తున్నాం.తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి ఫలితమే రిపీట్ అవుతుంది. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. రాష్ట్రంలోని మేధావి, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించి ఓటు వేయాలి. శాసనసభలో మీ సమస్యలపై ప్రశ్నించేది బీజేపీ ఒక్కటే’ అని చెప్పుకొచ్చారు. -
Delhi Election 2025: కేజ్రీవాల్ ఇంటికి ‘బేబీ మఫ్లర్ మ్యాన్’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢ్లిలీలోని మొత్తం 70 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు((శనివారం) జరుగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం చూసుకుంటే బీజేపీ ముందంజలో ఉంది. #WATCH | Delhi: A young supporter of AAP National Convenor Arvind Kejriwal, Avyan Tomar reached the residence of Arvind Kejriwal dressed up as him to show support. pic.twitter.com/dF7Vevy6En— ANI (@ANI) February 8, 2025 ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి 'బేబీ మఫ్లర్ మ్యాన్' వచ్చాడు. ఇతని పేరు అవ్యాన్ తోమర్. కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన ధరించిన లాంటి దుస్తులు ధరించి వచ్చాడు. కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న అవ్యాన్ తోమర్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్నికల ఫలితాల రోజున ఇక్కడికి వస్తుంటామని, ఆమ్ ఆద్మీ పార్టీనే మా కుమారునిని ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ అనే పేరు పెట్టిందని తెలిపారు. #WATCH | Delhi: Avyan Tomar's father, Rahul Tomar says, "... We always come here on result days... The party has also given him the name of 'Baby Muffler Man'..." pic.twitter.com/cMdDc3sGWf— ANI (@ANI) February 8, 2025 -
Delhi Election 2025: 12 ఏళ్ల ‘ఆప్’ ప్రస్థానం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో గత మూడు ఎన్నికల్లో అమోఘ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2012లో ఏర్పడిన ఈ పార్టీ ఇంత త్వరగా జాతీయ పార్టీగా ఎలా అవతరించింది? అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతుంటుంది. ఆప్ ఎదుగుదల వెనుక ఆసక్తికర కథనాలు ఉన్నాయి.దేశంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాటి సర్కారు అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి అన్నా హజారే నాయకత్వం వహించారు. ఈ ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ కీలకపాత్ర పోషించారు. లోక్పాల్ బిల్లుకు సంబంధించి ఢిల్లీ నుండి ప్రారంభమైన ఉద్యమం దేశంలోని ప్రతి మూలకు వ్యాపించింది. ఉద్యమం ముగిసిన తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు.2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీకి కన్వీనర్ అయ్యారు. రాజకీయ నేతలు కుమార్ విశ్వాస్, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ తదితరులు పార్టీని ఏర్పాటు చేయడంలో భాగస్వాములయ్యారు. తరువాత వారందరూ వేర్వేరు కారణాలతో పార్టీని వీడారు.2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి అందించిన మద్దతుతో ఢిల్లీలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పడిన ఆప్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ తొలి ఎన్నికల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఆ తర్వాత 2015లో తిరిగి ఎన్నికలు జరిగాయి. నాడు ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 సీట్లలో 67 స్థానాలను గెలుచుకుంది.కాంగ్రెస్ ఖాతాను కూడా తెరవలేకపోయింది. బీజేపీ కేవలం మూడు సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే కనిపించింది. ఢిల్లీ ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేశారు. దీని తరువాత పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. అనంతరం పంజాబ్ ఎన్నికల్లో అతిపెద్ద విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
బీజేపీ దూకుడు.. ఆప్ అగ్ర నేతలు వెనుకంజ
ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల్లో అధికార ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్ కీలక నేతలు వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్ అగ్ర నేతలు కేజ్రీవాల్, సిసోడియా, సీఎం అతిషి, పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థులు పర్వేష్ వర్మ, రమేష్ బిదూరి, కపిల్ మివ్రా ముందంజలో ఉన్నారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.మరోవైపు.. ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. As per early official trends, BJP leading in Vishwas Nagar and Shahdara assembly seats out of the total 70 seats in Delhi#DelhiElections2025 https://t.co/GMgILZrcTR pic.twitter.com/hlOgMsbull— ANI (@ANI) February 8, 2025ఫలితాల్లో ఇలా..న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ వెనుకంజ.కేజ్రీవాల్పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఆధిక్యంకాల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజజంగ్పురలో మనీశ్ సిసోదియా వెనుకంజషాకుర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ ముందంజగాంధీనగర్లో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ ముందంజబద్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ముందంజబిజ్వాసన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గహ్లోత్ ముందంజపత్పర్గంజ్లో ఆప్ అభ్యర్థి అవధ్ ఓజా వెనుకంజఇదిలా ఉండగా.. ఢిల్లీ (Delhi)లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజార్టీ 36 కావాల్సి ఉంది. ఢిల్లీలో 2013 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (APP) ప్రభుత్వం అధికారంలో ఉంది. వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కేజ్రీవాల్ పార్టీ పట్టుదలతో ఉంది. అటు ఆ పార్టీని గద్దె దించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పాలనా పగ్గాలు అందుకోవాలని బీజేపీ భావిస్తోంది. అంతకుముందు 2013 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్.. ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు. -
Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన మూడు రోజుల తర్వాత, ఈరోజు(ఫిబ్రవరి 8)న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్కు చెందిన పలువురు నేతల కుటుంబాలకు అగ్నిపరీక్షగా మారాయి. ఈ మూడు పార్టీల నేతలు తమ కుటుంబ సభ్యులను, బంధువులను ఎన్నికల బరిలోకి దింపడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ మూడు పార్టీల నేతలు తాము బంధుప్రీతికి వ్యతిరేకమని చెబుతూనే తమ కుటుంబ సభ్యులను ఎన్నికల రణరంగంలోకి దించారు. ఈ కేటగిరీలో మొత్తం 22 మంది అభ్యర్థులున్నారు. ఏ పార్టీ ఎంతమంది అభ్యర్థులను నిలబెట్టింది? ఏ పార్టీ ఎందరు నేతల బంధువులకు టిక్కెట్లు ఇచ్చిందనే వివరాల్లోకి వెళితే..మీడియాకు అందిన డేటా ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) రాజకీయ వారసుల జాబితాలో 11 మంది అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ ఎనిమిది మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ కేటగిరిలో ముగ్గురు అభ్యర్థులకు బీజేపీ అవకాశం ఇచ్చింది.కాంగ్రెస్న్యూఢిల్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి సందీప్ దీక్షిత్(Sandeep Dixit) పేరు ఈ జాబితాలో ముందుగా వస్తుంది. ఆయన ఢిల్లీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ కుమారుడు.మరో పేరు మాజీ ఎంపీ జై ప్రకాష్ అగర్వాల్ కుమారుడు ముదిత్ అగర్వాల్, అతను చాందిని చౌక్ స్థానం అభ్యర్థి.మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) మనవడు ఆదర్శ్ శాస్త్రిని కూడా కాంగ్రెస్ తమ అభ్యర్థిగా నిలబెట్టింది. అతనికి ద్వారక అసెంబ్లీ స్థానం టికెట్ ఇచ్చింది.కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మంగత్ రామ్ సింఘాల్ కుమారుడు శివంక్ సింఘాల్ ఆదర్శ్ నగర్ నుండి పోటీకి దిగారు.ఫరీదాబాద్ మాజీ ఎంపీ(కాంగ్రెస్) అవతార్ సింగ్ భదానా కుమారుడు అర్జున్ భదానాకు హర్యానా సరిహద్దులోని బదర్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై జంగ్పురా స్థానం నుంచి ఫర్హాద్ సూరికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఆయన ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ తాజ్దర్ బబ్బర్ కుమారుడు.కాంగ్రెస్ పార్టీ అరిబా ఖాన్ కు ఓఖ్లా స్థానం టికెట్ ఇచ్చింది. ఆమె కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్ కుమార్తె.ఇదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అలీ మొహమ్మద్ను ముస్తఫాబాద్ అభ్యర్థిగా నిలిపింది. ఆయన మాజీ ఎమ్మెల్యే హసన్ మెహందీ కుమారుడు.ఆమ్ ఆద్మీ పార్టీఆమ్ ఆద్మీ పార్టీ కూడా బంధుప్రీతిని కనబరిచింది. ఈ జాబితా కింద పార్టీ మొత్తం ఏడుగురు అభ్యర్థులను నిలబెట్టింది. ఇంతే కాకుండా ఆప్ తమ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్ల భర్తలకు కూడా టిక్కెట్లు ఇచ్చింది. మొత్తం 11 మందికి ఆప్ ఈ కేటగిరీ కింద టిక్కెట్లు ఇచ్చింది.ఆప్ పార్టీ మతియా మహల్ స్థానం నుంచి ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ కుమారుడు అలే ఇక్బాల్ను బరిలోకి దింపింది.సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.కె. బగ్గా కుమారుడు వికాస్ బగ్గాకు కృష్ణ నగర్ సీటు టికెట్ ఇచ్చారు.ఆమ్ ఆద్మీ పార్టీ చాందినీ చౌక్ స్థానం నుండి ఎమ్మెల్యే ప్రహ్లాద్ సింగ్ సాహ్ని కుమారుడు పురందీప్ సింగ్ సాహ్నిని పోటీకి దింపింది.సీలంపూర్ స్థానం నుండి, మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్ కుమారుడు చౌదరి జుబైర్ అహ్మద్ను అభ్యర్థిగా నిలబెట్టింది.ఆప్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మహాబల్ మిశ్రా కుమారుడు వినయ్ కుమార్ మిశ్రాకు ద్వారక స్థానం నుంచి టికెట్ ఇచ్చింది.ప్రస్తుత ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్కు బదులుగా ఈసారి ఆప్ ఆయన భార్య పోష్ బల్యాన్కు టికెట్ కేటాయించింది.బీజేపీబీజీపీ ఈ ఎన్నికల్లో మిగిలిన పార్టీలతో పోల్చి చూస్తే, బంధుప్రీతి కాస్త తక్కువే చూపినట్లు కనిపిస్తోంది.ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీకి దిగారు.మోతీ నగర్ స్థానం నుండి హరీష్ ఖురానాను పార్టీ నిలబెట్టింది. ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్లాల్ ఖురానా కుమారుడు.ఈ జాబితాలో మూడవ పేరు ఢిల్లీ కాంట్ బీజేపీ అభ్యర్థి భువన్ తన్వర్. ఆయన మాజీ ఎమ్మెల్యే కరణ్ సింగ్ తన్వర్ కుమారుడు.ఇది కూడా చదవండి: Delhi Election: ఆ సీట్లలో ఆప్కు చుక్కలే.. -
Delhi Results Live: ఢిల్లీ ప్రజలకు పండుగ రోజు: ప్రధాని మోదీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్స్.. -
నేడే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు
న్యూఢిల్లీ: హస్తిన అధికార పీఠం ఎవరికి దక్కుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో 60.54 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తాము వరుసగా మూడోసారి విజయం సాధించడం తథ్యమని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ 2015లో 67 సీట్లు, 2020లో 62 స్థానాలు గెలుచుకుంది. అయితే, ఈసారి బీజేపీకి విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టంచేశాయి. ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని అంచనా వేశాయి. వరుసగా రెండుసార్లు ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ ఈసారి ఆప్, బీజేపీలతో గట్టిగానే తలపడింది. అధికారం దక్కకపోయినా కొన్ని సీట్లయినా వస్తాయని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు ముందు ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ ప్రారంభించిందని, తమ అభ్యర్థులను ప్రలోభపెట్టడానికి ప్రయతి్నస్తోందని, ఒక్కొక్కరికి రూ.15 కోట్ల చొప్పున నగదు, మంత్రి పదవులు ఇవ్వజూపిందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించడం సంచలనం సృష్టించింది. అధికారం సొంతం చేసుకోవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని ఆయన మండిపడ్డారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనాకు సైతం ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై వి.కె.సక్సేనా స్పందించారు. నిజాలు నిగ్గుతేల్చడానికి ఏసీబీ దర్యాప్తు జరపాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఫిరోజ్షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో అధికారులు లీగల్ నోటీసు జారీ చేశారు. ఆరోపణలకు ఆధారాలు సమరి్పంచాలని పేర్కొన్నారు. -
‘కేజ్రీవాల్.. ఇది చాలా సీరియస్ ఆరోపణ.. విచారణకు సిద్ధంకండి’
న్యూఢిల్లీ: ‘కేజ్రీవాల్.. మీరు విచారణకు సిద్ధంగా ఉండండి. మీరు చేసిన ఆరోపణ చాలా పెద్దది. ఇందులో నిజా నిజాలు నిగ్గు తేల్చాలి. మీరు విచారణకు అందుబాటులో ఉండాలి’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు ఏసీబీ నోటీసులిచ్చింది.తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ(BJP) రూ. 15 కోట్ల ఆఫర్ ఇవ్వడమే కాకుండా వారికి మంత్రి పదవులు ఆశ చూపిందని కేజ్రీవాల్ ఈరోజు(శుక్రవారం) ఆరోపించారు. దీనిపై తన సోషల్ మీడియా ‘ఎక్స్’లో కేజ్రీవాల్ సుదీర్ఘమైన పోస్టుపెట్టారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న బీజేపీ..ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసింది. దీనిపై విచారణకు ఆదేశించాలని బీజేపీ లేఖ ద్వారా కోరింది.దాంతో వీకే సక్సేనా.. ఢిల్లీ ఏసీబీని విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్కు ముందుగా నోటీసులిచ్చింది ఏసీబీ. ఐదు ప్రశ్నలతో కూడిన నోటీసులు ఇచ్చింది. ‘ మీరు చేసిన ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్న ఏసీబీ.. ఐదు ప్రశ్నలను కేజ్రీవాల్ ముందు ఉంచింది.ఏసీబీ నోటీసులో పేర్కొన్న ఐదు ప్రశ్నలు ఇవే..1. మీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ట్వీట్ ీమీరు చేసిందేనా?.. లేక ఇంకెవరి ప్రమేయమైనా ఉందా?2. మీ 16 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం జరిగిందని చేసిన ట్వీట్తో మీరు ఏకీభవిస్తారా?3. ఎవరైతే ఫోన్ కాల్ ద్వారా రూ. 15 కోట్ల ఆఫర్ పొందారో.. వారి వివరాలు మాకివ్వండి4, మీ ఎమ్మెల్యేలకు ఎవరైతే ఆఫర్ చేశారో వారి వివరాలు ఇవ్వండి. వారి వ్యక్తిగత వివరాలు కానీ, వారి ఫోన్ నంబర్లు కానీ మాకు ఇవ్వండి.5. మీరు ేచేసిన ఆరోపణలపై మీ వద్ద ఇంకా ఏమైనా ఆధారాలుంటే మాకు సమర్పించండి.రేపు(శనివారం) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి. కేజ్రీవాల్ కావాలనే బీజేపీపై ఆరోపణ చేశారా.. లేక నిజంగా బీజేపీ కొనుగోలు చేయడానికి యత్నించిందా అనేది విచారణలో తేలనుంది. -
ఎల్జీ ఆదేశం.. ఆప్ నేతల ఇళ్లకు ఏసీబీ
న్యూఢిల్లీ: తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో ఒక్కోక్కరికీ రూ. 15 కోట్లు చొప్పున బీజేపీ ఆఫర్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ఎన్నికల(Delhi Assembly Election 2025) ఫలితాలకు ఒక రోజు ముందు కేజ్రీవాల్.. ీబీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ సిద్ధమైందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీనిపై చట్టపరమైన చర్యలకు తీసుకుంటామని హెచ్చరించిన బీజేపీ.. ఇందులో భాగంగా ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాసింది. ఆప్ ఆరోపణలపై నిగ్గు తేల్చాలని బీజేపీ(BJP) కోరింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని లేఖ ద్వారా ఎల్జీని కోరింది. దీనిపై స్పందించిన ఎల్జీ.. ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించారు.ఆప్ నేతల ఇళ్లకు ఏసీబీఎల్జీ ఆదేశాలతో దర్యాప్తుకు సిద్ధమైన ఏసీబీ(ACB).. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇంటితో ాపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లల్లో సోదాలు ప్రారంభించింది. దీనిలో ఏసీబీకి చెందిన బృందాలు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే దీనిపై ఆప్ ేనేత సంజయ్ సింగ్ మండిపడుతున్నారు. ఏసీబీ డ్రామా ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకోవడానికి బదులు సరికొత్త డ్రామాకు తెరలేపారన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని ఆయన అన్నారు.కాగా, ఆప్ నేతలు బీజేపీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారన్న కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్..‘గత రెండు గంటల్లోనే మా పార్టీకి చెందిన 16 మంది అభ్యర్థులకు ఫోన్లు వచ్చాయి. ఆప్ను వీడి బీజేపీ చేరితే మంత్రి పదవి ఇస్తామని, రూ.15 కోట్ల చొప్పున ఇస్తామని ఆఫర్ చేశారు. ఆ పార్టీకే 55కుపైగా సీట్లు వస్తుంటే.. మా అభ్యర్థులకు ఫోన్లు చేయాల్సిన అవసరం ఏముంది? దీన్నిబట్టి చూస్తే.. నకిలీ సర్వేలు నిర్వహించారని స్పష్టమవుతోంది. కొంతమంది అభ్యర్థులను లాక్కునే ఉద్దేశంతోనే ఇటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏదేమైనా మావాళ్లు ఒక్కరూ అమ్ముడుపోరు’ అని చెప్పుకొచ్చారు.అయితే కేజ్రీవాల్ తన వ్యాఖ్యలను రుజువు చేయలేకపోతే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
Exit Polls: ఢిల్లీలో అంచనాలు తప్పేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చాలావరకు బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. సుమారు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం వికసించబోతోందని, నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణం చేయాలనుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్కు నిరాశ తప్పదని అంచనా వేశాయి. అయితే.. ఆప్ మాత్రం ‘హ్యాట్రిక్’ విజయంపై ధీమాతోనే ఉంది. ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్(Delhi Exit Polls)ను ఆప్ తిరస్కరిస్తోంది. ప్రజాభిప్రాయాన్ని ఎగ్జిట్పోల్స్ ప్రతిబింబించవని చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఆప్ విషయంలో ఎప్పుడూ తప్పాయని, కాబట్టి ఈసారి కూడా అదే జరగబోతోందని చెబుతోంది. అంతేకాదు.. గతంలో ఆ అంచనాలు తప్పిన సందర్భాలనూ సైతం ప్రస్తావిస్తోంది.‘‘ఈ ఎగ్జిట్ పోల్స్(Exit Polls)ను మా పార్టీ ఖండిస్తోంది. గత నాలుగు ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఆప్ అధికారానికి దూరంగా ఉంటుందంటూ పేర్కొన్నాయి. ఎన్నడూ కేజ్రీవాల్ పార్టీ అధికారం చేపడుతుందని చెప్పలేదు. కానీ, వాస్తవానికి జరిగింది ఏంటి?. రెండుసార్లు ఆప్ అధికారాన్ని చేపట్టింది’’ అని ఆప్ నేత సుశీల్ గుప్తా వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ మాత్రం ఎగ్జిట్పోల్స్ నివేదికలతో ఫుల్ జోష్లో ఉంది. బుధవారం(ఫిబ్రవరి 5వ తేదీన) ఢిల్లీ అసెంబ్లీ 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు సర్వే సంస్థలన్నీ బీజేపీదే విజయమని చెబుతున్నాయి. అయితే.వీప్రిసైడ్(Weepresie), మైండ్ బ్రింక్లు మాత్రం ఆప్ గెలవొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇక.. కాంగ్రెస్ సున్నా నుంచి 3 సీట్లలోపే పరిమితం కానుందని చెప్పాయవి. అయితే ఎగ్జిట్పోల్స్పై కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది.అధికారంపై బీజేపీ ఆశలు1993లో బీజేపీ తొలిసారి మదన్ లాల్ ఖురానా నేతృత్వంలో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలోఆయన్ని తప్పించి.. సాహిబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రిని చేసింది కమల అధిష్టానం. రెండున్నరేళ్ల తర్వాత.. చివర్లో సుష్మా స్వరాజ్ను సీఎం చేశారు. ఆ తర్వాత ఆమె నేతృత్వంలో 1998లో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. అప్పటి నుంచి మూడు పర్యాయాలు షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత 2013 ఎన్నికల్లో ఆప్(AAP) విజయం కైవసం చేసుకోగా.. 48 రోజుల కేజ్రీవాల్ పాలన తర్వాత రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. ఏడాది తర్వాత.. 2015 ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తిరిగి ఆప్ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి అధికారంలో ఆప్ కొనసాగుతూ వచ్చింది. అయితే.. ఎన్నికల్లో కేజ్రీవాల్ మద్యం కుంభకోనం ఆరోపణలు రావడం, కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపుతో వేధిస్తుందని ఆప్ పదే పదే విమర్శించడం, రాష్ట్రంలో పరివర్తన్ వచ్చి ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రావాలని బీజేపీ పిలుపు ఇవ్వడం.. ఈసారి ఎన్నికలపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్.. అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
ఢిల్లీలో కమల వికాసం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీపై 27 ఏళ్ల అనంతరం కాషాయ జెండా ఎగరనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కల నెరవేరబోదని పేర్కొన్నాయి. బుధవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ ఈసారి కూడా సున్నా చుడుతుందని స్పష్టం చేశాయి. బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ నెలకొందని రెండు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే మొగ్గు మాత్రం బీజేపీవైపేనని తెలిపాయి. ఆప్ గెలుస్తుందని మరో రెండు చెప్పుకొచ్చాయి. బీజేపీకి 51 నుంచి 60 దాకా రావచ్చని, ఆప్ 10 నుంచి 19కి పరిమితమవుతుందని పీపుల్స్ పల్స్ పేర్కొంది. కాంగ్రెస్ సున్నా చుడుతుందని చెప్పింది. బీజేపీకి 40–44, ఆప్కు 25–29, కాంగ్రెస్కు 2 సీట్లొస్తాయని పీపుల్స్ ఇన్సైట్ చెప్పింది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బోల్తా కొట్టిన నేపథ్యంలో ఈసారి ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. అందరి కళ్లూ 8వ తేదీన వెలువడబోయే ఫలితాలపైనే ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలున్నాయి. విజయానికి 36 సీట్లు కావాలి. ప్రస్తుత అసెంబ్లీలో ఆప్కు ఏకంగా 62 సీట్లున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆప్ తోసిపుచ్చగా బీజేపీ నేతలు విజయంపై ధీమా వెలిబుచ్చారు. ఢిల్లీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ ఘనవిజయం సాధించింది. -
Delhi election 2025 :ప్రశాంతంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ప్ర శాంతంగా ముగిశాయి. బుధవారం ఉద యం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల ఎదుట ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మొత్తం 70 నియోజకవర్గాలకు గాను 13,766 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. రాష్ట్రపతి ద్రౌప దీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, హ ర్దీప్సింగ్ పురి, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాం«దీ, రాహుల్, ప్రియాంక గాం«దీ, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తదితరులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేజ్రీవాల్ తన తల్లిదండ్రులను చక్రాల కురీ్చల్లోపోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. మెరుగైన పరిపాలన కావాలంటే ఓటర్లంతా తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. 60.44 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధికంగా నార్త్ఈస్టు జిల్లాలో 63.83 శాతం నమోదైనట్లు తెలియజేసింది. ముస్తఫాబాద్ నియోజకవర్గంలో 66.68 శాతం నమోదైనట్లు పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై తుది గణాంకాలు గురువారం బహిర్గతం కానున్నాయి. ఢిల్లీలో 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 62.59 శాతం, 2024 నాటి లోక్సభ ఎన్నికల్లో 56 శాతం పోలింగ్ రికార్డయ్యింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 8న వెల్లడి కానున్నాయి. -
కాంగ్రెస్కు మళ్లీ సున్నా..!
న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఈసారి బీజేపీదే అధికారమని ఎగ్జిట్పోల్స్ తెలిపాయి. అయితే తమకు ఎగ్జిట్పోల్స్ ఎప్పుడూ అనుకూలంగా రాలేదని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల విషయం కాసేపు పక్కనపెడితే గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఎగ్జిట్పోల్స్ చెబుతున్నాయి. 2015,2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్కసీటు కూడా రాలేదు. ఈసారి కూడా ఆ పార్టీది ఇంచుమించు అదే పరిస్థితి ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.దీంతో ఢిల్లీలోని ఆ పార్టీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయారు. ఢిల్లీలో వరుసగా అధికారం చేపట్టిన తమకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు ఆత్మపరిశీలిన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న రానున్నాయి. -
ఢిల్లీలో ఆ పార్టీదే హవా..! ఎగ్జిట్ పోల్స్ విడుదల
సాక్షి,న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పూర్తయింది. పోలింగ్ పూర్తయిన వెంటనే సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్పోల్స్ వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉంది..వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపారన్న దానిపై పలు సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) కూడా గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఒక్క పీపుల్ పల్స్-కొడిమో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రం బీజేపీకి ఏకంగా 51-60 సీట్లు వస్తాయని చెప్పగా మిగిలిన సర్వేలన్నీ బీజేపీ,ఆప్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనాలు వెల్లడించాయి.ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం అధికార ఆప్,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్యే జరిగింది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడవనున్నాయి.పీపుల్స్పల్స్-కొడిమోబీజేపీ-51-60ఆప్- 10-19కాంగ్రెస్-0ఇతరులు-0ఏబీపీ-మ్యాట్రిజ్బీజేపీ- 35-40ఆప్ - 32-37కాంగ్రెస్- 0-1టైమ్స్ నౌబీజేపీ-39-45ఆప్-29-31కాంగ్రెస్-0-2చాణక్య స్ట్రాటజీస్బీజేపీ-39-44ఆప్-25-28రిపబ్లికన్ పీ మార్క్ బీజేపీ 39-41ఆప్ 21-31ఆత్మసాక్షిబీజేపీ 38-47ఆప్ 27-30కాంగ్రెస్ 0-3పీపుల్ ఇన్సైట్ బీజేపీ-40-44ఆప్- 25-29కాంగ్రెస్- 0-1జేవీసీబీజేపీ 39-45ఆప్ 22-31కాంగ్రెస్ 0-2తుది ఫలితాల్లో మాదే విజయం: ఆప్ ధీమా ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఆమ్ఆద్మీపార్టీ స్పందించింది. తమకు ఎగ్జిట్ పోల్స్లో ఎప్పుడూ వ్యతిరేక ఫలితాలే వస్తాయని, చివరకు విజయం సాధించేది తామేనని ఆప్ నేత రీనా గుప్తా అన్నారు.2013,2015,2020 ఎన్నికల్లో ఇదే జరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. VIDEO | Delhi Elections 2025: On exit poll predictions, AAP leader Reena Gupta (@Reena_Guptaa) says: "You look at any exit poll historically, AAP is always given a smaller number of seats, whether its 2013, 2015 or 2020. But whatever is shown, AAP gets a lot a greater number of… pic.twitter.com/KZmGNzg6XK— Press Trust of India (@PTI_News) February 5, 2025 -
ఢిల్లీలో ఓటేసిన ప్రముఖులు.. ఫొటోలు
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ
-
మహిళకు ఫ్లయింగ్ కిస్.. ఆప్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ నేతలు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియా ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. అనుచిత హావభావాలు, ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆప్ నేతపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభ్యుడు దినేష్ మోహానియా ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆప్కు ఓటు వేయాలని ఓటర్లు కోరారు. ఈ క్రమంలో ర్యాలీలో ఓ మహిళతో ఆయన అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను చూస్తూ సైగలు చేశారు. అనంతరం, ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. దీంతో, ఆయన ప్రవర్తన వివాదాస్పందంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ.. తాజగా పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టి తెలిపారు.दिल्ली के संगम विहार में शर्मनाक घटना!आम आदमी पार्टी के विधायक प्रत्याशी दिनेश मोहनिया ने अपने रोड शो के दौरान भाजपा चुनाव कार्यालय के बाहर रोड शो रोककर हूटिंग की और महिलाओं को गंदे-गंदे इशारे किए। pic.twitter.com/1lVYsV9gSy— Panchjanya (@epanchjanya) February 3, 2025 ఇక, ఎన్నికల్లో ర్యాలీలో దినేష్ మోహానియాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. దినేష్ మోహానియా సంగం విహార్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మరోసారి తన నియోజకవర్గం నుండి పోటీలో నిలిచారు.Dinesh Mohaniya’s lack of respect for women is evident in his actions during the road show. This kind of behavior reflects poorly on his leadership and party. #आप_के_चरित्र_हीन_प्रत्याशीpic.twitter.com/tL9EmmZGbK— kinal (@kinal3418) February 3, 2025మరోవైపు.. మోహానియా వివాదాలకు కొత్తేమీ కాదు. గత సంవత్సరం, తన నియోజకవర్గంలోని రోడ్డు పక్కన పండ్ల వ్యాపారిపై దుర్భాషలాడినందుకు అతనిపై కేసు నమోదు అయ్యింది. ఈ సందర్భంగా తన వాదనను సమర్థించుకుంటూ, పండ్ల వ్యాపారిని అక్కడి నుండి వెళ్లిపోవాలని మాత్రమే చెప్పినట్టు తెలిపారు. ఎందుకంటే అతను మురుగు కాలువ ముందు తన దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, దీనివల్ల పౌర కార్మికుల పనికి ఆటంకం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. -
ఢిల్లీ పోలింగ్.. కేజ్రీవాల్కు షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు షాక్ తగిలింది. యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలకుగానూ ఆయనపై మంగళవారం హర్యానాలో ఓ కేసు నమోదైంది.ఢిల్లీకి వచ్చే యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విషం కలిపిందని అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపించిన సంగతి తెలిసిందే. దమ్ముంటే తన ఆరోపణలు తప్పని నిరూపించాలంటూ రాజకీయ ప్రత్యర్థులకు ఆయన సవాల్ కూడా విసిరారు. దీంతో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ.. యమునా నీటిని తాగి మరీ కేజ్రీవాల్ విమర్శలను తిప్పికొట్టారు. అదే సమయంలో.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని మోదీ(PM Modi), కేజ్రీవాల్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం దాకా కూడా చేరింది. అయితే.. అయితే.. ఈ అంశంపై తాజాగా షాబాద్(Shahbad)కు చెందిన జగ్మోహన్ మంచందా అనే లాయర్, కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రకటనలతో కేజ్రీవాల్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో జగ్మోహన్ పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ 192, 196(1),197(1),248(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కురుక్షేత్ర పోలీసులు విచారణ చేపట్టారు. -
ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
Delhi Assembly Elections Live Updates..ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల పోలింగ్ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఆరుగంటల లోపు క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశంఢిల్లీలో 78 అసెంబ్లీ స్థానాల బరిలో 699 మంది అభ్యర్థులు సాయంత్రం 6:30 తర్వాత వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 5 గంటల వరకు 57.70 శాతం పోలింగ్కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్సాయంత్రం 5 గంటల వరకు 57.70 శాతం పోలింగ్ నమోదుమధ్యాహ్నం 3 గంటల వరకు 46.55శాతం ఓటింగ్ నమోదుకొనసాగుతున్న దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ భారత ఎన్నికల సంఘం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఢిల్లీలో 46.55శాతం ఓటింగ్ నమోదుఓటేసిన సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ఓటేసిన సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఢిల్లీలోని కుషాక్ లేన్లోని పోలింగ్ బూత్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఓటు వేశారు.'ఓటు వేయడం అనేది ఒకరి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడం మాత్రమే కాదు, దేశ పౌరుల నైతిక బాధ్యత కూడా. పౌరులు ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు ఇప్పటి వరకు 32.5 శాతం నమోదుఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.31 శాతం పోలింగ్ నమోదు.పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 33.31% voter turnout recorded till 1 pm in #DelhiElection2025 pic.twitter.com/e4LOz4Yalf— ANI (@ANI) February 5, 2025 ఓటేసిన కేజ్రీవాల్ కుటుంబం..AAP national convener Arvind Kejriwal, along with his wife Sunita Kejriwal and parents Gobind Ram Kejriwal & Gita Devi cast their votes for #DelhiElection2025.(Pics: AAP) pic.twitter.com/VrWbk4nGCq— ANI (@ANI) February 5, 2025 ఓటు వేసిన ప్రముఖులు.. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | #DelhiElection2025 | Former President Ram Nath Kovind and his family cast their vote at a polling booth in NDMC School of Science & Humanities at Palika Kendra, Sansad Marg. pic.twitter.com/nhBdrW90Ua— ANI (@ANI) February 5, 2025 బీజేపీ ఎంపీ సంజయ్ తివారీ ఓటు వేశారు. #WATCH | After casting his vote for #DelhiAssemblyElection2025, BJP MP Manoj Tiwari says, "...They (AAP) made Delhi sick. They looted Delhi. Now we will do work. Now Delhi is going to give us the opportunity. We are not distributing money. We are not distributing liquor...People… https://t.co/LCb2QDWBdr pic.twitter.com/U2pHfVRMwR— ANI (@ANI) February 5, 2025కపిల్ సిబాల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | #DelhiElection2025 | After casting his vote, senior advocate and Rajya Sabha MP Kapil Sibal says, "...The message is quite simple, that every citizen of this country should come and vote. Because if you live in a community, you must participate to ensure that the person… pic.twitter.com/IJGOHbHgmf— ANI (@ANI) February 5, 2025 ఎన్నికల్లో ఓటు వేసిన కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు..అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | #DelhiElection2025 | AAP national convener Arvind Kejriwal, along with his wife Sunita Kejriwal and parents Gobind Ram Kejriwal & Gita Devi, arrives at Lady Irwin Senior Secondary School to cast a vote. The sitting MLA from New Delhi constituency faces a contest from… pic.twitter.com/0OdYmp5rdt— ANI (@ANI) February 5, 2025 ఢిల్లీలో పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 11 గంటల వరకు 20 పోలింగ్ నమోదుఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 19.95% voter turnout recorded till 11 am in #DelhiElection2025 pic.twitter.com/4fNGZvHoBO— ANI (@ANI) February 5, 2025 ఢిల్లీలో ఓటు వేసిన ప్రముఖులు..రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పీసీడబ్ల్యూడీ పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిలుచుని ఓటు వేశారు. #WATCH | Vice president Jagdeep Dhankhar along with his wife Sudesh Dhankhar, arrives at a polling booth in CPWD Service Centre in North Avenue to cast vote for #DelhiAssemblyElection2025 pic.twitter.com/PYumJvOWMd— ANI (@ANI) February 5, 2025 ఓటు వేసిన ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోథి ఎస్టేట్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. #WATCH | Congress MP Priyanka Gandhi Vadra along with her husband Robert Vadra and son Raihan Vadra arrives at a polling station in Lodhi Estate to cast her vote for #DelhiAssemblyElection2025 pic.twitter.com/EmwsmFIuFE— ANI (@ANI) February 5, 2025 ప్రజలు ఎలా ఓటు వేస్తారు?: ఆప్ఎన్నికల సరళిపై ఆప్ ఆరోపణలుపలు చోట్ల ప్రజలను ఓటువేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపణతమ పార్టీ బలంగా ఉన్న స్థానాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.ఇలా అయితే ప్రజలు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించిన మంత్రి ఎన్నికల్లో ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మురాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ పోలింగ్ బూత్లో ఆమె ఓటు వేశారు. #WATCH | Delhi: President Droupadi Murmu casts her vote for #DelhiElection2025 at Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, President’s Estate. pic.twitter.com/FQHq4Yqq0C— ANI (@ANI) February 5, 2025ఓటు వేసిన సుప్రీంకోర్టు సీజే సంజీవ్ ఖన్నాఢిల్లీ ఎన్నికల్లో సుప్రీంకోర్టు సీజే సంజీవ్ ఖన్నా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్మాణ్ భవన్లో ఆయన ఓటు వేశారు. #WATCH | Chief Justice of India, Sanjiv Khanna arrives at a polling booth in Nirman Bhawan to cast his vote for #DelhiAssemblyElections2025 pic.twitter.com/hhpjcRqmJb— ANI (@ANI) February 5, 2025ఓటు వేసిన సీఎం అతిశి..ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి ఓటు వేశారు. ఈ సందర్బంగా అతిశి మాట్లాడుతూ..‘ఢిల్లీలో ఈ ఎన్నికలు కేవలం ఎన్నికలు మాత్రమే కాదు.. ఇది ధర్మయుద్ధం. ఇది మంచికి, చెడుకి మధ్య పోరాటం. ఒక వైపు అభివృద్ధి కోసం పనిచేస్తున్న విద్యావంతులు, మరోవైపు గూండాయిజం చేసే వ్యక్తులు ఉన్నారు. గూండాలకు కాకుండా పనిచేసే వారికే ప్రజలు ఓటు వేస్తారని నాకు నమ్మకం ఉంది. ఢిల్లీ పోలీసులు బహిరంగంగా బీజేపీ కోసం పనిచేస్తున్నారు అని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. #WATCH | Delhi CM Atishi says "This election in Delhi is not just an election, this is a Dharmyuddh'. This is a fight between the good and bad...On one side, there are educated people who are working for development and on the other side, there are people who are doing… pic.twitter.com/LqBs0hZMdl— ANI (@ANI) February 5, 2025ఓటు వేసిన ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనాఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటింగ్లో ఢిల్లీ సరికొత్త చరిత్ర తిరగరాయాలని కోరకుంటున్నా. #WATCH | Lieutenant Governor of Delhi, Vinai Kumar Saxena, his wife Sangita Saxena show their inked fingers after casting their vote for #DelhiElection2025 pic.twitter.com/PQKmYadQFK— ANI (@ANI) February 5, 2025 ఢిల్లీ ఎన్నికలు.. 9 గంటల వరకు 8 శాతం పోలింగ్ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం తొమ్మిది గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదుపలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. 8.10% voter turnout recorded till 9 am in #DelhiElection2025 pic.twitter.com/zsILmvCmnO— ANI (@ANI) February 5, 2025ఓటు వేసిన ఆప్ నేత మనీస్ సిసోడియాఆప్ నాయకుడు మనీష్ సిసోడియా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.#WATCH | #DelhiElection2025 | AAP leader and MLA candidate from Jangpura constituency, Manish Sisodia casts his vote at a polling booth at Lady Irwin Senior Secondary School in New Delhi Assembly constituency. His wife Seema Sisodia is also voting here. pic.twitter.com/5OsPMZJb8c— ANI (@ANI) February 5, 2025ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా11 గంటలకు ఓటు హక్కు వినియోగించుకోనున్న అరవింద కేజ్రీవాల్కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్70 సీట్లకు గాను పోటీలో దిగిన 699 మంది అభ్యర్థులున్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నుంచి పర్వేష్ వర్మకల్కాజీ నుంచి సీఎం అతిశీ పోటీ13,766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుఓటు హక్కు వినియోగించుకోనున్న 1.56 కోట్ల మంది ఓటర్లు83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళా ఓటర్లుఎన్నికల విధులలో లక్షమందికి పైగా సిబ్బందిఈనెల 8న కౌంటింగ్ఈసారి ఆప్-బీజేపీ మధ్య హోరాహోరీ పోరుఢిల్లీలో ఈసారి బీజేపీకి సానుకూల పవనాలుఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఎదురీదుతున్న ఆప్కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ కాంగ్రెస్ యాక్టివ్ కావడంతో చేజారనున్న ఆప్ ఓట్లు12 లక్షల ఆదాయ పన్ను పరిమితి పెంపుతో మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించిన బీజేపీ సాయంత్రం 6:30 గంటల తర్వాత వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ వివరాలు 👉ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖులు.. #WATCH | EAM Dr S Jaishankar says, "I have been an early voter...I think the public is in a mood for change." https://t.co/mkPc911IXS pic.twitter.com/k6eAYaJjsN— ANI (@ANI) February 5, 2025 #WATCH | Union Minister Hardeep Singh Puri along with his wife Lakshmi Puri, joins party workers at the party's help desk outside the polling station in Anand Niketan#DelhiAssemblyElection2025 pic.twitter.com/aLKM25N05R— ANI (@ANI) February 5, 2025 #WATCH | #DelhiElection2025 | Delhi Police Commissioner Sanjay Arora and his wife cast their vote at a polling booth in Moti Bagh. pic.twitter.com/TSidowMnC3— ANI (@ANI) February 5, 2025 #WATCH | BJP MP Bansuri Swaraj arrives at the polling station at Janpath to cast her vote for #DelhiElections2025 pic.twitter.com/a7llzwSlpH— ANI (@ANI) February 5, 2025 #WATCH | #DelhiElections2025 | Former Union Health Secretary Apurva Chandra cast his vote at a polling booth in Moti Bagh. pic.twitter.com/0ef0LnGazq— ANI (@ANI) February 5, 2025 #WATCH | Delhi: BJP candidate from Rohini assembly seat Vijender Gupta and his wife cast their votes for the #DelhiElection2025 pic.twitter.com/zHP4AS9gKc— ANI (@ANI) February 5, 2025 ఓటు వేసిన రాహుల్ గాంధీలోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మాణ్ భవన్లో ఆయన ఓటు వేశారు. #WATCH | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi leaves from Nirman Bhawan after casting his vote for #DelhiElections2025 https://t.co/NySApvSKSf pic.twitter.com/F6xRDJiPRF— ANI (@ANI) February 5, 2025 టెక్నికల్ ఇష్యూతో ఆగిపోయిన పోలింగ్ఢిల్లీ మాదీపూర్ ప్రాంతంలో ఆగిపోయిన ఓటింగ్ వీవీ ప్యాట్లో సాంకేతిక లోపంతో నిలిచిన పోలింగ్ ఆప్ నేతపై కేసు నమోదు..ఆప్ నేత అమానుల్లాహ్ ఖాన్పై పోలీసులు కేసు నమోదుఎమ్మెల్యే ఖాన్పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది.భారత న్యాయ సంహితలోని సెక్షన్ 223 కింద కేసు నమోదు ఎన్నికలకు ప్రచార సమయం ముగిసిన తర్వాత ఆయన దాదాపు 100 మంది మద్దతుదారులతో ర్యాలీఆప్ కార్యాకర్తతో ప్రచారం.. దీనికి ఈసీ సీరియస్ Even after the election campaign has ended, AAP supporters are roaming in Okhla, violating Section 144 and the Model Code of Conduct! AAP candidate Amanatullah Khan's team is openly breaking election rules. @ECISVEEP @CeodelhiOffice @DelhiPolicePlease take a action must 😡 pic.twitter.com/xrMUGRJunq— Arfat Khan (@Arfatkhan011) February 5, 2025 👉ఓటు వేసిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడుకొనసాగుతున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవామయూర్ విహార్లోని పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలిసి ఓటు వేసిన సచ్దేవా#WATCH | #DelhiElection2025 | After casting his vote, Delhi BJP President Virendraa Sachdeva says "Double engine govt will be formed in Delhi. The people of Delhi are going to vote for a developed Delhi. Accepting his defeat in Delhi, Arvind Kejriwal is doing hooliganism.… pic.twitter.com/wjvXX0N3gF— ANI (@ANI) February 5, 2025 👉ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖులు.. #WATCH | Congress candidate from New Delhi constituency, Sandeep Dikshit casts his vote for #DelhiAssemblyElection2025 AAP national convenor Arvind Kejriwal is once again contesting from the New Delhi seat, BJP has fielded Parvesh Verma from this seat pic.twitter.com/Fou3h8PTSv— ANI (@ANI) February 5, 2025 #WATCH | #DelhiElections2025 | Indian Army Chief General Upendra Dwivedi casts his vote at a polling booth in K. Kamraj Lane in the New Delhi Assembly constituency. pic.twitter.com/2svSq1AFbF— ANI (@ANI) February 5, 2025 #WATCH | #DelhiElections2025 | Delhi Chief Electoral Officer R Alice Vaz casts her vote at a polling booth in Tilak Marg pic.twitter.com/8RdSRCZo0P— ANI (@ANI) February 5, 2025 #WATCH | BJP candidate from the New Delhi Assembly constituency, Parvesh Verma says, "...Our priority will be to clean the Yamuna. I appeal to the people of Delhi to form a good government. He (Arvind Kejriwal) got a chance for 11 years, but today people have understood that they… pic.twitter.com/3vozEbLTfq— ANI (@ANI) February 5, 2025 #WATCH | #DelhiElection2025 | Delhi BJP President Virendraa Sachdeva and his wife show their inked fingers after casting their votes at a polling station in Mayur Vihar Phase 1 under Patparganj Assembly constituency. pic.twitter.com/NdIkdNeX8T— ANI (@ANI) February 5, 2025 👉 ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా..కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న అల్కా లంబా. ఎన్నికల్లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. Congress candidate from Kalkaji assembly seat, Alka Lamba, shows her inked finger after casting her vote for #DelhiAssemblyElection2025 Delhi CM Atishi is AAP's candidate from Kalkaji seat, BJP has fielded its former MP Ramesh Bidhuri from this seat. pic.twitter.com/PQR862rlca— ANI (@ANI) February 5, 2025👉ఉదయాన్నే ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు.. #WATCH | Delhi: Voters queue up at a polling booth in Lodhi Road to cast their votes for #DelhiAssemblyElections2025Polling on all 70 Assembly constituencies of Delhi is underway. pic.twitter.com/kur7trBFwG— ANI (@ANI) February 5, 2025👉విజయం మాదే: సిసోడియా ఎన్నికల వేళ ఆప్ నేత మనీష్ సిసోడియా ప్రత్యేక పూజలు.. ఈ సందర్బంగా సిసోడియా మాట్లాడుతూ..‘లక్షల మంది ప్రజలు ఢిల్లీ సంక్షేమం కోసం, వారి సంక్షేమం, పురోగతి కోసం ఓటు వేస్తారు. కాబట్టి, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆప్ మరోసారి అధికారంలోకి వస్తుందని, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతున్నారని, ప్రజలకు సేవ చేయడానికి నేను జంగ్పురా నుంచి గెలవబోతున్నాను. ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన ఆరోపణలతో నిన్న రాత్రి స్వాధీనం చేసుకున్న నగదుపై ఆయన స్పందిస్తూ.. బీజేపీ ప్రజలకు అబద్ధాలు చెప్పడం, యంత్రాలను దుర్వినియోగం చేయడం తప్ప మరేమీ చేయరు. ఢిల్లీలో గత 4-5 రోజులుగా వారు ఉగ్రవాదం, గూండాయిజాన్ని వ్యాప్తి చేశారు. వారు డబ్బు, చీరలు, బూట్లు పంపిణీ చేశారు. ప్రతిచోటా వీడియోలు వెల్లువెత్తుతున్నాయి అని అన్నారు. #WATCH | #DelhiElection2025 | AAP leader and MLA candidate from Jangpura constituency, Manish Sisodia says, "Lakhs of people will vote for their welfare and progress as well as the welfare of Delhi. So, I prayed to Kalka Maai that AAP form the government once again under the… pic.twitter.com/nCXf5iH8A2— ANI (@ANI) February 5, 2025 👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.Voting for #DelhiAssemblyElections begins. Eligible voters in all 70 Assembly constituencies are voting in a single-phase today; 699 candidates are in the fray.AAP chief Arvind Kejriwal will be contesting against BJP's Parvesh Verma and Congress's Sandeep Dikshit from New Delhi… pic.twitter.com/AmC96UUhTk— ANI (@ANI) February 5, 2025👉అందరూ ఓటు వేయండి: మోదీ పిలుపుఢిల్లీ ఎన్నికల వేళ మోదీ ట్వీట్..‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఈరోజు ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడి ఓటర్లు ఈ ప్రజాస్వామ్య పండుగలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓట్లను వేయాలని నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా.. మొదటిసారి ఓటు వేయబోతున్న యువ మిత్రులందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు అని కామెంట్స్ చేశారు. Prime Minister Narendra Modi tweets "Voting for all the seats in the Delhi Assembly elections will be held today. I urge the voters here to participate in this festival of democracy with full enthusiasm and cast their valuable votes. On this occasion, my special wishes to all… pic.twitter.com/r03wQ3rtd9— ANI (@ANI) February 5, 2025 👉ఢిల్లీలో కొనసాగుతున్న మాక్ పోలింగ్..#WATCH | Delhi: Mock polling underway at MCD Pratibha Vidyalaya, Tagore Garden polling booth under the Rajouri Garden Assembly constituency. Polling on all 70 Assembly constituencies of Delhi will begin at 7 am.#DelhiAssemblyElections2025 pic.twitter.com/2XmRkbv1u0— ANI (@ANI) February 5, 2025 👉కాసేపట్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం.. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి.. #WATCH | #DelhiElection2025 | Election Commissioner Gyanesh Kumar visits Moti Bagh Polling Station. Voting for the Assembly elections will begin at 7 am. pic.twitter.com/GMvxNBDjHS— ANI (@ANI) February 5, 2025👉అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. 1.56 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల సంఘం అధికారులు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13,766 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 3,000 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈసారి 699 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.#WATCH | #DelhiElection2025 | Polling agents of AAP protest at polling station number 73, at College of Art at Tilak Marg, alleging that the mock poll took place in their absence. pic.twitter.com/OqmRW60z9V— ANI (@ANI) February 5, 2025👉220 కంపెనీల పారామిలటరీ బలగాలను, 35,626 మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది, 19,000 మంది హోంగార్డులను మోహరించారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నం చేస్తోంది. క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్(క్యూఎంఎస్) యాప్ను తీసుకొచ్చింది. ఏయే పోలింగ్ కేంద్రాల్లో ఎంతమంది ఓటర్లు బారులు తీరి ఉన్నారో దీనిద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. జనం తక్కువగా ఉన్న సమయంలో వెళ్లి ఓటు వేయొచ్చు. అలాగే వృద్ధులు, దివ్యాంగుల కోసం 733 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే 6,980 మంది ఇంటి నుంచి ఓటు వేశారు. ఈ నెల 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. 👉ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోరు దేశ రాజధానిలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరాట పడుతుండగా, పూర్వవైభవం సాధించాలని బీజేపీ తహతహలాడుతోంది. కాంగ్రెస్ సైతం అధికారం కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రధానమైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే కేంద్రీకృతమైంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటీపడి మరీ హామీలు గుప్పించాయి. ప్రజలు ఎవరిని విశ్వసించారో మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. ఓటింగ్ శాతం సైతం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం భారీగా నమోదైతే ఆమ్ ఆద్మీ పార్టీ లాభపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు పలువరు కేంద్ర మంత్రులు.👉ఆ పార్టీ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆప్ తరపున పార్టీ జాతీయ కన్వినర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం హోరెత్తించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రంగంలోకి దిగారు. కేజ్రీవాల్ నిర్మించుకున్న అద్దాల మేడ, యమునా నది కాలుష్యం, ఓట్ల తొలగింపు వంటి అంశాలను పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావించాయి. పదేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆప్ అవినీతి పాలన పట్ల ఢిల్లీ ఓటర్లు విసుగెత్తిపోయారని, డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ పెద్దలు తేల్చిచెబుతున్నారు. -
ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుపై కేజ్రీవాల్ ధీమా..!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి రేపు(బుధవారం) జరుగనున్న ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి 70 సీట్లకు గాను 55 సీట్లను తాము గెలుచుకుంటామన్నారు. ఒకవేళ బీజేపీ గనుక ఢిల్లీ ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు ముగింపు పలకడం ఖాయమన్నారు కేజ్రీవాల్(Arvind Kejriwal).ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ‘ నా అంచనా ప్రకారం మేము 55 సీట్లను గెలవడం ఖాయం. ఒకవేళ మహిళల ఇంకాస్త ముందుకొచ్చి పురుషుల చేత ఓట్లను మాకు పడేలా చేస్తే మాత్రం తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తాం. ఇలా జరిగితే 60 సీట్లకు పైగానే గెలుచుకుంటాం.మీరు(ప్రజలు) కనుక కమలం గుర్తుకు ఓటేస్తే మాత్రం మీరు ఇంటికి వెళ్లేసరికే కరెంట్ పోవడం ఖాయం. దేశంలో అత్యంత చౌకగా కరెంట్ను అందిస్తున్నది జాతీయ రాజధాని ఢిల్లీలోనే. ఇక్కడ 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంటును ఇవ్వడంతో పాటు 400 యూనిట్లకు రూ. 800 మాత్రమే వసూలు చేస్తున్నాం. అదే సమయంలో 24 గంటల విద్యుత్ను కూడా అందిస్తున్నాం. అందుచేత మీరు చీపురు గుర్తు ఉన్న బటన్ను ప్రెస్ చేయండి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.2015లో ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly Election 2025)కి జరిగిన ఎన్నికల్లో 67 సీట్లను ఆప్ గెలిస్తే. 2020లో 62 సీట్లలో విజయం సాధించింది. మీరు ఎందుకు ఆప్కు ఓటేయాలంటే.. ేమేము గత 10 ఏళ్లలో ఎంతో బాధ్యతగా పరిపాలన అందించాం. ిఢిల్లీలో చాలా పనులు ేచేశాం. ఇక ీబీజేపీ అధికారంలో ఉన్న 20 ారాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ అనేదే లేదు’ అని ేకేజ్రీవాల్ పేర్కొన్నారు. -
Delhi Assembly Election: అణువణువునా గస్తీ.. 35 వేల పోలీసులు మోహరింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో రేపు (ఫిబ్రవరి 5) మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. పొలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఒక కోటీ 55 లక్షల మంది ఓటర్లు ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయి. పోలీసులు, భద్రతా దళాలను ఢిల్లీ అంతటా మోహరించారు. ఢిల్లీ పోలీసులు ఆదివారం రాత్రంతా సున్నితమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించారు. 35 వేలకు పైగా పోలీసులను ఎన్నికల విధుల్లో నియమించారు. 220 కంపెనీల కేంద్ర రిజర్వ్ దళాలను కూడా భద్రత కోసం రంగంలోకి దింపారు. 19 వేల మంది హోమ్ గార్డ్ సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు ఢిల్లీ విడిచి వెళ్లాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా తిరుగుతున్న పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళలు, 1,267 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు వేయనున్నారు. దివ్యాంగ ఓటర్ల కోసం 733 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఢిల్లీలో గరిష్ట ఓటింగ్ జరిగేలా చూసేందుకు, ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ను ప్రారంభించింది. దీని ద్వారా ఓటర్లు తమ పోలింగ్ బూత్ వద్ద ఎంత జనసమూహం ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.ఈసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. దీనికి తోడు కాంగ్రెస్కు ఇక్కడున్న బలమైన ఉనికి ఈ ఎన్నికలను త్రిముఖ పోరుగా మార్చింది. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్యమంత్రులు బీజేపీ తరపున ప్రచారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం అతిషి నియోజకవర్గంలో మూడు ర్యాలీలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కల్కాజీ, కస్తూర్బా నగర్లలో రోడ్ షో చేశారు.ఇది కూడా చదవండి: 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్తో భేటీ? -
బీజేపీపై నిఘాకు కెమెరాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5న జరిగే ఎన్నికల సమయంలో బీజేపీ అక్రమాలకు పాల్పడితే రికార్డు చేసేందుకు వీలుగా స్పై, బాడీ కెమెరాలను మురికివాడల్లోని ప్రజలకు అందజేసినట్లు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఆప్ చారిత్రక విజయం సాధించబోతోందన్నారు. బీజేపీ ఘోర పరాజయం తప్పదన్నారు. ఇది తెలిసే ఆ పార్టీ అనుచిత చర్యలకు దిగుతోందని విమర్శించారు. బీజేపీ గూండాల అక్రమాలను రికార్డు చేసేందుకు మురికివాడల్లోని ప్రజలకు నిఘా కెమెరాలను అందించినట్లు చెప్పారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని పోలీసులకు పట్టించేందుకు వీలుగా సమాచారం అందిన 15 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకునేలా క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. స్లమ్ ఏరియాల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసే ఉద్దేశంతో వారి వేలికి నల్ల సిరా పూసి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని తెలిపారు. బీజేపీ వాళ్ల నుంచి డబ్బులైతే తీసుకోండి, కానీ, వేలికి సిరా పూయనివ్వకండని ఓటర్లను కేజ్రీవాల్ కోరారు. -
ఢిల్లీ గద్దె ఎవరిది?
ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమరంలో ఓటరు మనసు గెలిచేందుకు విస్తృత ప్రచారంచేసిన ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోందనే ఆలోచనలో తలము నకలయ్యాయి. మూడోసారి అధికార పీఠంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేసింది. 23 ఏళ్లుగా అధికారానికి దూరమైన బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ ఉట్టికొట్టాలని నిశ్చయించుకుంది. అందుకే కమలనాథులంతా ఏకమై మునుపెన్నడూ లేనంతగా ఎన్నికల ప్రచారం చేశారు. ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ సైతం ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాసహా ముఖ్యనేతలతో బాగా ప్రచారం చేయించింది. ఈసారి ఓటరు మహాశయుడు ఆప్ చీపురును పైకెత్తుతాడా? బీజేపీ కమలంను అందుకుంటాడా? కాంగ్రెస్ ‘చేయి’ పట్టుకుని నడుస్తాడా? అనేది రేపు జరగబోయే పోలింగ్తో తేలనుంది. ఉచిత విద్యుత్, మహిళా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా నగదు జమ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఉపకార వేతనం, పెన్షన్లు, వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఇస్తామని ప్రధాన పార్టీలన్నీ ఊదరగొట్టాయి. అయితే రూ.12 లక్షల వార్షిక ఆదాయానికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించనక్కర్లేదని సాధారణ బడ్జెట్లో ప్రకటించి బీజేపీ పార్టీ ఢిల్లీ మధ్య తరగతి ఓటర్లను దాదాపు తనవైపునకు తిప్పుకున్నంత పనిచేసింది. ఈ ప్రకటన ఫలితాలు పోలింగ్ సరళిలో ఏమేరకు ప్రతిఫ లిస్తాయో చూడాలి మరి. రూ.10 లక్షల వార్షికా దాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండకూడదని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇన్నాళ్లూ డిమాండ్ చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతకుమించి లబ్ధి చేకూ రేలా చేసి ఓటర్లు కమలం వైపు తల తిప్పేలా చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఏఏ అంశాలు ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పాత్ర పోషించే వీలుందనే చర్చ మొదలైంది.మధ్య తరగతి కుటుంబాలుఢిల్లీలోని కుటుంబాల్లో 67 శాతం కుటుంబాలు మధ్య తరగతికి చెందినవే. ఇంతటి పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతిని పార్టీలు ప్రధానంగా ఆకట్టుకునే ప్రయత్నంచేశాయి. సాధారణ బడ్జెట్లో ప్రకటించినట్లు రూ.12 లక్షల వార్షికాదాయంపై ట్యాక్స్ను తొలగిస్తే మిగతా వర్గాల కంటే ముందుగా లబ్ధి చేకూరేది ఈ మధ్య తరగతి వాళ్లకే. ఈ లెక్కన బడ్జెట్ ప్రకటన తర్వాత ఈసారి మధ్య తరగతి వర్గాలు బీజేపీకే జై కొట్టే అవకాశాలు ఒక్కసారిగా పెరిగాయి. రెండుసార్లు అధికారంలో ఉన్న ఆప్ ప్రస్తుతం కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దీనికి ఆప్ నేతలపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు ప్రధాన కారణం. ఢిల్లీ పరిధిలో మద్యం విధానంలో అక్రమాలు చేసి వందల కోట్లు కూడబెట్టారని ఆప్ నేతలపై ఈడీ అభియోగాలు మోపడం తెల్సిందే. ఈ అవినీతి మరకలను వెంటనే తొలగించుకోవడంలో ఆప్ నేతలు విఫలమయ్యారు. దిగజారిన ప్రతిష్ట ఇప్పుడు పోలింగ్లో పార్టీకి వచ్చే ఓట్ల సంఖ్యను దిగజారుస్తుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.ముస్లింలు, దళితులుఢిల్లీ రాష్ట్రంలో ముస్లింల జనాభా 12.68 కాగా దళితుల జనాభా 16.92 శాతం. దళితులు ఎక్కువగా ఢిల్లీలోని జుగ్గీలుగా పిలిచి మురికివాడల్లో నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మురికివాడలను తొలగిస్తుందన్న భయాలతో వీళ్లంతా తమకు ఆదుకుంటుందని అధికార ఆప్ పార్టీకే జై కొట్టారు. అయితే మురికివాడల జోలికి మేం రాబోమని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించడంతో వీళ్లంతా ఈసారి బీజేపీ వైపు నడవొచ్చనే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో దశాబ్దకాలంగా అధికారంలో లేని కాంగ్రెస్తో పోలిస్తే ముస్లింలు ఈసారి కూడా ఆప్ వెంటే ఉండే అవకాశాలున్నాయి. ప్రధానంగా ఆరు నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా ఎక్కువ. సీలాంపూర్ నియోజకవర్గంలో అయితే ఏకంగా సగం మంది ఓటర్లు ముస్లింలే. మాటియా మహల్ నియోజకవర్గంలో 48 శాతం మంది, ఓఖ్లాలో 43 శాతం మంది, ముస్తఫాబాద్లో 36 శాతం మంది, బలీమరాన్లో 38 శాతం మంది, బబర్పూర్లో 35 శాతం మంది ముస్లిం ఓటర్లే ఉన్నారు. 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ ఆరు స్థానాలను ఆప్ గెల్చుకుంది.ఉచితాలుఉచితంగా ఇస్తామంటూ బీజేపీ, ఆప్లు ఎన్నికల ప్రచారం చేపట్టాయి. ఉచితంగా విద్యుత్, ఉచితంగా నీటి సరఫరా, మహిళల ఖాతాకు నగదు బదిలీ చేస్తామని ఆప్ ఉచిత హామీలు గుప్పించింది. ఆప్తో పోలిస్తే బీజేపీ కాస్త తక్కువ హామీలనే ఇచ్చింది. అయితే రూ.12 లక్షల వార్షికాదాయంపై ట్యాక్స్ మిన హాయింపుతో ఆమేరకు జనానికి లబ్ది చేకూరు తుందని, అది కూడా ఓ రకంగా ఉచిత హామీయేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.మహిళలుఢిల్లీ ఓటర్లలో 48% మంది మహిళలు ఉన్నా రు. దీంతో గెలుపు అవకాశాలను మహిళ లనూ నిర్ణయించనున్నారు. మొత్తంగా 71.7 లక్షల మంది మహిళా ఓటర్లు న్నారు. ముఖ్య మంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఇస్తున్న నగదును రెట్టింపు చేస్తామని, నేరుగా బ్యాంక్ ఖాతాలో వేస్తామని మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. నెలకు రూ.2,100 ఇస్తామని ప్రకటించింది. మేం అధికారంలోకి వస్తే నెలకు రూ.2,500 బదిలీచేస్తామని బీజేపీ ప్రకటించింది.ముఖ్యమంత్రి అభ్యర్థిఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఢిల్లీ అంతటికీ తెలుసు. కేజ్రీవాల్ తప్ప ఇంకెవరు ఆ పదవికి పోటీపడట్లేరు. గతంలో బెయిల్ లభించక జైలులో ఉన్న కారణంగా ఆతిశీని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఈసారి గెలిస్తే కేజ్రీవాల్ మళ్లీ సీఎం కుర్చీపై ఆసీనులవుతారు. బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఓటరుకు తెలీదు. ప్రధాని మోదీ పేరు, ఛరిష్మా మీదనే బీజేపీ ఓట్లు అడుగుతోంది. సీఎం అభ్యర్థిని ప్రకటించే దమ్ము కూడా బీజేపీకి లేదని తరచూ కేజ్రీవాల్ వెక్కిరించడం తెల్సిందే.ఫలోదీ సత్తా బజార్ ఏం చెబుతోంది?ఈసారి ఎన్నికల్లో ఆప్ పార్టీయే ఫేవరెట్గా నిలుస్తోందని ‘ది ఫలోదీ సత్తా బజార్’ తన అంచనాల్లో పేర్కొంది. 2015, 2020 ఎన్నికల కంటే ఈసారి ఆప్ మరింత బలంగా ఎన్నికల బరిలో దూకిందని వ్యాఖ్యానించింది. 70 సీట్లున్న అసెంబ్లీలో దాదాపు 38 నుంచి 40 చోట్ల ఆప్ గెలుస్తుందని ఈ సంస్థ అంచనావేసింది. ఆప్ తర్వాత బీజేపీ దాదాపు 30 నుంచి 32 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగరేయొచ్చని సంస్థ చెబుతోంది. కాంగ్రెస్ ఏమేరకు రాణిస్తుందనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఉనికి కోసం పోరాడుతున్న పార్టీపై సర్వే చేపట్టలేదని తెలుస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ముగిసిన ఢిల్లీ ఎన్నికల ప్రచారం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం(ఫిబ్రవరి5) పోలింగ్ ఉండడంతో 48 గంగల ముందు ప్రచారాన్ని ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం సోమవారం సాయంత్రం నుంచి అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఆపేశాయి.చివరిరోజు ఆమ్ఆద్మీపార్టీ,బీజేపీ,కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ అయితే ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘంపైనే సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్కు రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ పోస్టా లేక ఇతర ఏదైనా పెద్ద పోస్టు ఆఫర్ చేసిందా అని ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీపార్టీ, కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ మధ్యే ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు ఉండనుంది. కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పటికీ అంతగా ప్రభావం చూపదని తెలుస్తోంది. కాంగ్రెస్ పోటీ వల్ల ఆప్కే నష్టమన్న వాదన వినిపిస్తోంది. గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇటీవల ప్రకటించిన మినహాయింపు ఢిల్లీ ఎన్నికల్లో పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని, ఇది తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని బీజేపీ ఆశిస్తోంది. -
సీఈసీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
ఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) రాజీవ్ కుమార్పై సంచలన ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్,. సీఈసీగా ఉన్న రాజీవ్ కుమార్.. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి అమ్ముడుపోయారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election 2025) ప్రచారానికి నేటితో(సోమవారం)తెరపడనుంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్.. సీఈసీని రాజీవ్ కుమార్ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ఎన్నికల కమిషన్ అనేది ఈరోజు బీజేపీకి దాసోహమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ను చూస్తే మనకు అదే కనబడుతుంది. అసలు ఎన్నికల కమిషన్ అనేది ఉనికిలో ఉన్నట్లు కనబడుటం లేదు. ఇది ప్రజల మనస్సుల్లో తలెత్తున్న ప్రశ్న. రాజీవ్ కుమార్ జీ.. మీరు సీఈసీగా ఉన్నారా? లేదా? మీరు సీఈసీ బాధ్యతల్ని తప్పుకోవడానికి ఈనెలే చివరిది అనుకుంటా.మీకు బీజేపీ ఏ పోస్టును ఆఫర్ చేసిందేంటి? మీ రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ పోస్టును ఆఫర్ చేశారా.. లేక రాష్ట్రపతి పోస్టును ఎరగా వేశారా? అంటూ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.‘రాజీవ్ కుమార్ జీ.. మీకు నాదొక విన్నపం.. నా రెండు ేచేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. మీ డ్యూటీ మీరు చేయండి. సీఈసీ బాధ్యతల నుంచి ఉన్నతంగా తప్పుకోండి. అది మీకు చాలా మంచిది. మీ కెరీర్ చివరి దశలో ఉంది. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అంతే కానీ దేశాన్ని నాశనం చేయకండి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.న్యూఢిల్లీలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నా ఎన్నికల కమిషన్ మాత్రం చూస్తూ ఉండిపోవడం తప్పితే చర్యలు ఏమీ తీసుకోవడం లేదన్నారు కేజ్రీవాల్.కాగా, ఫిబ్రవరి 5 వ తేదీ(బుధవారం) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఆప్-బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన ఆప్.. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. అదే సమయంలో బీజేపీ మాత్రం ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగా ఆప్ ధీటుగా ప్రచారం చేసింది బీజేపీ. -
Delhi Election: ఆ సీట్లలో ఆప్కు చుక్కలే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది. ఢిల్లీలోని 70 స్థానాలకు బుధవారం (ఫిబ్రవరి 5) పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హ్యాట్రిక్ విజయాలు సాధించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తుండగా, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఢిల్లీలోని ఐదు స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు స్థానాలను ఆప్ అతికష్టం మీద గెలుచుకుంది. ఆప్ అభ్యర్థులు బీజేపీని చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. ఆ సీట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.1. బిజ్వాసన్గత ఎన్నికల్లో నైరుతి ఢిల్లీలోని బిజ్వాసన్ స్థానంలో ఆప్ అభ్యర్థి భూపిందర్ సింగ్ జూన్ బీజేపీకి చెందిన సత్ ప్రకాష్ రాణాను కేవలం753 ఓట్ల తేడాతో ఓడించారు. భూపిందర్ సింగ్ జూన్కు 57,271 ఓట్లు, సత్ ప్రకాష్ రాణాకు 56,518 ఓట్లు వచ్చాయి. ఈ సీటును రెండుసార్లు గెలుచుకున్న సత్ ప్రకాష్ రాణా, 2015లో మొదటిసారి, 2020లో రెండవసారి ఈ సీటును కోల్పోయారు. ఈసారి ఆప్ సురేంద్ర భరద్వాజ్కు, బీజేపీ కైలాష్ గెహ్లాట్కు, కాంగ్రెస్ దేవేంద్ర సెహ్రావత్కు బిజ్వాసన్ టికెట్ ఇచ్చింది.2. కస్తూర్బా నగర్ఆగ్నేయ ఢిల్లీలోని కస్తూర్బా నగర్ సీటులో ఈసారి కూడా గట్టి పోటీ నెలకొంది. బీజేపీకి చెందిన రవీంద్ర చౌదరికి 33,935 ఓట్లు, ఆప్ నేత మదన్ లాల్కు 37100 ఓట్లు వచ్చాయి. మదన్ లాల్ కేవలం 3,165 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఆప్ రమేష్ పెహ్ల్వాన్ను బరిలోకి దింపింది. బీజేపీ నీరజ్ బసోయాకు టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ అభిషేక్ దత్ను నిలబెట్టింది.3. ఛతర్పూర్2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి కర్తార్ సింగ్ తన్వర్ కూడా దక్షిణ ఢిల్లీలోని ఛతర్పూర్ అసెంబ్లీ స్థానాన్ని 3,720 ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో కర్తార్ సింగ్ కు 6,9411 ఓట్లు, బీజేపీకి చెందిన బ్రహ్మ సింగ్ తన్వర్ కు 6,5691 ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ స్థానంలో అభ్యర్థుల్లో మార్పు జరిగింది. ఆప్ బ్రహ్మ సింగ్ తన్వర్ను, బీజేపీ కర్తార్ సింగ్ను బరిలోకి దింపాయి. కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర తన్వర్కు టికెట్ ఇచ్చింది.4. ఆదర్శ్ నగర్ఉత్తర ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ స్థానంలో గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి పవన్ శర్మకు 46,892 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ భాటియాకు 45,303 ఓట్లు వచ్చాయి. వారిద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం 1,589 మాత్రమే. ఈసారి ఆప్ ముఖేష్ గోయల్ కు టికెట్ ఇవ్వగా, బీజేపీ రాజ్ కుమార్ భాటియాకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ శివంక్ సింఘాల్ను ఎన్నికల్లో పోటీకి దింపింది.5. పట్పర్గంజ్మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తూర్పు ఢిల్లీలోని పట్పర్గంజ్ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సీటును సిసోడియా అతికష్టం మీద దక్కించుకున్నారు. 2020 ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియాకు 70,163 ఓట్లు వచ్చాయి. బీజేపీ నేత రవీంద్ర నేగికి 66,956 ఓట్లు వచ్చాయి. మనీష్ సిసోడియా 3,207 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఆప్ అవధ్ ఓజాకు టికెట్ ఇచ్చింది. బీజేపీ రవీంద్ర నేగిని, కాంగ్రెస్ అనిల్ కుమార్ను బరిలోకి దింపాయి.ఇది కూడా చదవండి: వికటించిన విందు భోజనం.. ఆస్పత్రికి 200 మంది -
ప్రధాని మోదీ మిత్రుడంటూ.. ‘ఆప్’కు టీఎంసీ ఎంపీ ప్రచారం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు(సోమవారం) సాయంత్రం ఐదు గంటలతో వివిధ పార్టీల ప్రచారపర్వం ముగియనుంది. గత నెల 20 నుంచి సాగుతున్న ఈ ప్రచారంలో పలు వింతలు విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటి ఆసక్తికర ఉదంతం వెలుగు చూసింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు, నటులు ప్రచారాలు సాగిస్తున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆదివారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ తరపున ప్రచారం సాగించారు. ప్రధాని మోదీని తన స్నేహితుడని అంటూనే ఆయనను ‘ప్రచార మంత్రి’అని అభివర్ణించారు. ఆయన(ప్రధాని) రోజూ 10 నుండి 12 గంటలు ప్రచారం చేస్తారని వ్యాఖ్యానించారు. నటుడి నుండి రాజకీయ నేతగా మారిన సిన్హా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి ఆతిశీకి మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఆమ్ ఆద్మీ పార్టీలు ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్’ (ఐఎన్ఐ)లో భాగస్వాములు. శత్రుఘ్న సిన్హా తన ప్రసంగంలో ప్రధాని మోదీని విమర్శిస్తూ ‘మా గౌరవనీయ ప్రచార మంత్రి అంటే..ప్రధానమంత్రి అంటూ.. ఆయన నాకు స్నేహితుడు.. మనకి ప్రధానమంత్రి కూడా.. అని వ్యంగ్యోక్తి విసిరారు. ఆయన 18 గంటలు పనిచేస్తానని చెబుతారని, అయితే ఆయన ఆ 18 గంటల్లో 10 నుండి 12 గంటలు ప్రచారానికే కేటాయిస్తారని, కౌన్సిలర్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, పార్లమెంటరీ ఎన్నికలైనా.. ఎక్కడికైనా మన గౌరవనీయ ప్రధానమంత్రి ఖచ్చితంగా అక్కడికి వెళతారు’అని సిన్హా విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ. కోటి మొదలైన హామీలను ఇచ్చిన మోదీ వాటిని నెరవేర్చలేదని సిన్హా అన్నారు.ఇది కూడా చదవండి: మంచు దుప్పటిలో ఉత్తరాది.. 12 రాష్ట్రాలపై పొగమంచు దెబ్బ -
కేజ్రీ యమునా జలం తాగాలి: రాహుల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలకు సరఫరా చేసే దుర్గంధపూరిత నీరు తాగాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్కు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ప్రధాని మోదీ మాదిరిగానే కేజ్రీవాల్ కూడా తప్పుడు హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. హౌజ్ కాజీ చౌక్లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. 2020 అల్లర్ల బాధితులను తరఫున తనతోపాటు తన పార్టీ మాత్రమే మద్దతుగా నిలిచిందని, అణచివేతకు గురయ్యే వారికి ఇకపైనా దన్నుగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రేమ, సోదరభావాన్ని పంచే కాంగ్రెస్ కావాలో విద్వేషాన్ని, హింసను ప్రేరేపించే బీజేపీ కావాలో తేల్చుకోవాలని ప్రజలను ఆయన కోరారు. -
కాంగ్రెస్ ఆఖరి పోరాటం..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా తలపడుతున్న కాంగ్రెస్..తన అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు ఆఖరి పోరాటం చేస్తోంది. పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా, కనీస 10 స్థానాలనైనా గెలుచుకునేలా చివరి దశ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాం«దీ, మల్లికార్జున ఖర్గేలు ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. సోమవారం సైతం వీరు తమ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. నిజానికి 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, ప్రస్తుత ఎన్నికల్లో కనీస ఖాతా తెరవాలని గట్టి పట్టుదలతో ఉంది. 2008లో 48శాతం ఓట్లతో 43 సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ 2013లో 24.70 శాతం సీట్లతో 7 సీట్లకు పరిమితమయింది. తర్వాత 2015 ఎన్నికల్లో కాంగ్రెస్కు 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓట్లు రాగా ఒక్క సీటును గెలువలేదు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 18శాతం ఓట్ల మేర సాధించింది. ఈసారి దాన్ని కాస్త పెంచుకున్నా 5 నుంచి 10 స్థానాలు గెలువచ్చనే అంచనాల్లో ఉంది. అయితే ఆప్తో పొత్తు లేకపోవడం, ప్రధాన పోటీ మొత్తంగా బీజేపీ, ఆప్ల మధ్యే కొనసాగుతుండటంతో కాంగ్రెస్ను పట్టించుకునే వారే కరువయ్యారు. ఢిల్లీని పట్టి పీడిస్తున్న యమునా నది కాలుష్య అంశాన్ని రాజకీయ అస్త్రంగా మాలుచుకునేందుకు రాహుల్గాంధీ స్వయంగా కాలుష్య నురగలు కక్కుతున్న యమునాలో బోటులో పర్యటించగా, అది ఏమేరకు ప్రభావితం చేస్తుందన్నది ప్రశ్నగానే ఉంది. ఇక ఢిల్లీని ప్రధాని మోదీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మొత్తంగా నాశనం చేశారని, లిక్కర్ మాఫియాలో ప్రభుత్వ పెద్దలంతా కూరుకుపోయిరని, శీష్ మహల్లో విలాసవంతమైన జీవితాన్ని కేజ్రీవాల్ గడిపారంటూ ఎక్కుపెట్టిన అ్రస్తాలు ఎంతవరకు ఓటర్లను తాకాయన్నది తేలాలి. మేనిఫెస్టో హామీలనే ప్రధానాస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకెళుతూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా పింఛను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంపు, సోమవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో తెలంగాణ, పంజాబ్, హరియాణా నేతలనూ ప్రచారంలోకి దించింది. -
ఢిల్లీ ప్రచారానికి... నేటితో తెర
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. సోమవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. దాంతో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. అగ్రనేతలంతా ఢిల్లీ ప్రచారంలోనే ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా అన్నట్లు బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ సాగుతోంది. ప్రధాని మోదీ బహిరంగ సభల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆప్పై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ అభివృద్ధికి ఆప్ అడ్డుపడుతోందంటూ దుయ్యబడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా మొదలు బీజేపీ రాష్ట్రాల సీఎంలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామీ, హరియాణా సీఎం నయాబ్సింగ్ సైనీలు భారీ బహిరంగ సభలతో పాటు, మూడేసి నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుందంటూ ప్రచార సభల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. పేదల ప్రభుత్వంగా పేరొందింన ఆప్ మరోసారి ఢిల్లీ పీఠం మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎవరెన్ని హామీలు ఇచ్చినా, గెలిచేది మాత్రం తామేనంటూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిషి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఆప్కు మద్దతుగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ ప్రచారం నిర్వహించారు. ఓటర్లతో మమేకం అవుతూ.. పదేళ్లలో ఆప్ ఇచ్చిన ప్రతి వాగ్థానాన్ని అమలు చేసిందని గుర్తు చేస్తూ, మరోసారి ఆప్కు అవకాశం ఇవ్వాలని భగవంత్మాన్ అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నడుంబిగించారు. పదేళ్లలో ఢిల్లీ అభివృద్ధి చెందలేదని, బీజేపీ వచ్చినా అభివృద్ధి సూన్యమేనంటూ ప్రచారసభల్లో వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలోనే మాత్రమే ఢిల్లీ అభివృద్ధిలో పరుగులు తీసిందని గుర్తు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.సోషల్ మీడియాలో హోరాహోరీబీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దాలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఢిల్లీ అభివృద్ధిని ఆప్ అడ్డుకుంటుందని ప్రధాని మోదీ చేసిన కామెంట్లకు ఆప్ నేతలు ధీటైన సమాధానాలు ఇస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చే వరకూ బలహీన వర్గాల వారిని పట్టించుకున్న వారు లేరని, ఢిల్లీ లాంటి మహానగరంలో పాఠశాలల రూపురేఖలు మార్చి ప్రైవేటుగా ధీటుగా విద్యను అందిస్తున్నామంటూ ఆప్ బదిలిస్తుంది. మెట్రో, తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ తమ కాంగ్రెస్ హయాంలోనే ఢిల్లీలో జరిగిందని కాంగ్రెస్ చెప్పుకుంటుడగా.. బీజేపీ, ఆప్లు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. దేశాన్ని కాంగ్రెస్ దోచుకున్నది చాలంటూ బీజేపీ ఆరోపిస్తుండగా.. అంతుపట్టని అవినీతి, ఈవీఎంల ట్యాంపరింగ్, మతకల్లోహాలకు బీజేపీ కేరాఫ్ అంటూ ఆప్, కాంగ్రెస్లు సోషల్ మీడియా ద్వారా ప్రతిఘటిస్తున్నాయి. నేటితో ఆఖరు5వ తేదీన ఢిల్లీ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సొమవారంతో ప్రచారం పర్వం ముగియనుంది. దీంతో దేశంలోని జాతీయ కీలకనేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్రావు, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో.. బీజేపీ, కాంగ్రెస్, ఆప్లకు చెందిన పార్టీల నేతలంతా వారి వారి బాధ్యతలలో నిమగ్నమైయ్యారు. సుమారు 50కి పైగా జాతీయ నేతలు ఢిల్లీలో మకాం వేసి మరీ ఎన్నికల హీట్ను పెంచుతున్నారు. ఎన్నికల ఫలితాలు 8న వెల్లడవుతాయి. -
ఆప్,కాంగ్రెస్లపై ప్రధాని ఫైర్
న్యూఢిల్లీ:బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క మురికివాడను కూడా తొలగించబోమని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. మురికివాడల్లో కూల్చివేతల విషయంలో ఆమ్ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ తమపై చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమన్నారు. ఆదివారం(ఫిబ్రవరి2) ఢిల్లీ ఆర్కేపురం ప్రాంతంలో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని ఆప్,కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ‘ఢిల్లీలో ఒక్క మురికివాడను కూడా తొలగించం. మేం మాటలు చెప్పే వాళ్లం కాదు మాటకు కట్టుబడే వాళ్లం. బడ్జెట్లో రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయించి ఇది రుజువు చేశాం. మేం ప్రవేశపెట్టిన బడ్జెట్ మోస్ట్ ఫ్రెండ్లీ బడ్జెట్. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలకు అందుతున్న ఏ సంక్షేమ పథకాన్ని కూడా మేం వచ్చాక ఆపబోము. బిహార్,పూర్వాంచల్ నుంచి ఢిల్లీకి వచ్చి జీవనం సాగిస్తున్న వారికి అండగా ఉంటాం.కాంగ్రెస్, ఆప్ పార్టీలు రెండూ అవినీతి పార్టీలే.కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో కాంగ్రెస్ పార్టీపై పడ్డ అవినీతి మచ్చ ఎప్పటికీ పోదు.స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరుతో ఆప్ ఢిల్లీ యువతను మోసం చేసింది’అని ప్రధాని విమర్శించారు. కాగా, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా 8వ తేదీ ఫలితాలు వెల్లడవనున్నాయి. -
బీజేపీలో చేరిన ఆ 8 మంది ఎమ్మెల్యేలు
-
ఆప్ ఆశలపై ఐటీ దెబ్బ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్న మోదీ సర్కారు ప్రచారం చివరి దశకు చేరిన వేళ తురుపుముక్కను గురి చూసి మరీ వదిలింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది! వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. శనివారం నాటి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది నిజంగా మోదీ మాస్టర్స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో మూడు రోజుల్లో (బుధవారం) జరగనున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్లో ఐటీ మినహాయింపు ప్రభావం గట్టిగానే ఉండగలదని వారంటున్నారు. మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారాయి. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది. దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పారీ్టలూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమవుతోంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్క్లాస్పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది. ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్కు బదులు కాంగ్రెస్కు పడొచ్చన్న విశ్లేషణలు కేజ్రీవాల్ పార్టీని మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీజేపీతో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఇది తీవ్రంగా దెబ్బ తీయవచ్చని ఆప్ భావిస్తోంది. గత ఎన్నికల్లో 15కు పైగా స్థానాల్లో 10 వేల లోపు మెజారిటీ నమోదవడం గమనార్హం. కేజ్రీవాల్కూ ఎదురీతే! ఆప్తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా కష్టకాలంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి ఎదురీత తప్పేలా లేదు. ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్కు తల బొప్పి కట్టిస్తున్నాయి. వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరుస్తున్నారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్నే మట్టికరిపించారు. నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసురుతున్నారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొడతారని, ఇది అంతిమంగా పర్వేశ్కు లాభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ గెలిస్తే అవన్నీ ఆగిపోతాయి: కేజ్రీవాల్ కొత్త ట్విస్ట్
ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖ్యంగా బీజేపీ, ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే యమునా నది నీటి విషయమై రెండు పార్టీల నేతలు వాదనలకు దిగారు. ఇక, తాజాగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీలో ఆప్ ఓడిపోతే.. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు మూతపడతాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారి తీశాయి.ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..‘ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల నేను ఒక బీజేపీ కార్యకర్తను కలిశాను. ఈ క్రమంలో అతడు నాతో మాట్లాడుతూ ఎన్నికల్లో మీరు ఓడిపోతే ఏం చేస్తారని అడిగారు. దీనికి మీకు సమాధానం తెలుసుకోవాలి. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతే.. ఉచిత కరెంటు, నీరు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అన్నీ ఆగిపోతాయి. #WATCH | #DelhiElection2025 | In a video message, AAP National Convenor Arvind Kejriwal addresses BJP supporters, he says, "A few days back I met a 'kattar' BJP supporter, he asked Arvind ji, what if you lose? I also smiled and asked, what will happen to you if I'll lose? I asked… pic.twitter.com/3NFDpL7UZq— ANI (@ANI) February 1, 2025బీజేపీ వీటన్నింటిని ఆపేస్తుంది. అంతేకాక.. మీకు నెలకు రూ.25 వేల ఖర్చు పెరిగిపోతుంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో, 24 గంటల కరెంటు ఉందో, లేదో మీకు తెలుసు. బీజేపీ ప్రయోజనాల గురించి కాకుండా.. మీ కుటుంబాల గురించి ఆలోచించండి. బీజేపీ వీడతారా, లేదా అనేది మీ ఇష్టం. కానీ, ఈ ఎన్నికల్లో మాకు ఓటు వేయండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, కేజ్రీవాల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.ఇదిలా ఉండగా.. కొద్దిరోజులు యమునా నది నీటి విషయంలో హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. యమునలో విషం కలిపారని ఆప్ నేతలు కామెంట్స్ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. దీనికి బీజేపీ నేతలు ఆప్కు కౌంటరిచ్చారు. దీంతో, ఎన్నికల్లో యమునా నది విషయం కొత్త చర్చకు దారి తీసింది. ఇక, మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
Delhi Elections: ఆప్కు భారీ షాక్..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపధ్యంలో రాజధానిలో వివిధ రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇటువంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది.కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ పార్టీలో అసంతృప్తి నెలకొంది. టికెట్లు దక్కకపోవడంతో ఆగ్రహించిన ఎనిమిదిమంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో జనక్పురి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి, కస్తూర్బా నగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్, త్రిలోక్పురి ఎమ్మెల్యే, దళిత నేత రోహిత్ కుమార్, పాలం ఎమ్మెల్యే భావన గౌర్, బిజ్వాసన్ ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ జూన్ ఉన్నారు.వీరంతా తమ రాజీనామా పత్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)తో పాటు అరవింద్ కేజ్రీవాల్పై పలు ఆరోపణలు చేశారు. ఈ ఎమ్మెల్యేలకు పార్టీ తిరిగి టిక్కెట్లు ఇవ్వలేదు. ఇంతవరకూ మౌనం వహించినవారంతా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన వారిలో ఒకరైన రోహిత్ కుమార్ మెహ్రోలియా తన రాజీనామా పత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ‘వారికి బాబా సాహెబ్ ఫొటో మాత్రమే కావాలి. ఆయన ఆలోచనలు కాదు. అలాంటి అవకాశవాద, కృత్రిమ వ్యక్తులతో నా సంబంధాన్ని ముగించుకుంటున్నాను’ అని రాశారు.ఇదేవిధంగా ‘పార్టీ ప్రాథమిక సభ్యత్వం(Membership)తో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను.ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో చిక్కుకుంది’ అని పేర్కొంటూ మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్ రాజీనామా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా సాగిన అన్నా ఉద్యమం కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్భవించిందని, కానీ నేడు ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోవడం బాధాకరంగా ఉందని నరేష్ యాదవ్ పేర్కొన్నారు.పాలం ఎమ్మెల్యే భావన గౌర్ తన రాజీనామాలో అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీపై తనకు ఇకపై నమ్మకం లేదని స్పష్టంగా రాశారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తూ ‘ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ సిద్ధాంతం నుండి వైదొలిగిందని’పేర్కొన్నారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామా పత్రాలలో ఇటువంటి ఆరోపణలు చేశారు.ఇది కూడా చదవండి: మరొకరిని బలిగొన్న పూణె వైరస్ -
ఆప్ ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకుంది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధిని ఆప్ అడ్డుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ పురోగతి కోసం ఢిల్లీని రాజకీయ ఏటీఎంలా వాడుకుంటోందన్నారు. మోదీ శుక్రవారం నాడిక్కడ ద్వారకలో ప్రచారసభలో మాట్లాడారు. ఢిల్లీ పురోభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కారును ఎన్నుకోవాల్సిందిగా ప్రజలను కోరారు. అధునాతన ఢిల్లీకి బీజేపీ కట్టుబడి ఉందనడానికి ఇటీవల ప్రారంభించిన యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ఉదాహరణ అన్నారు. వేరే రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఆప్ ఢిల్లీ వనరులను ఖాళీ చేసిందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీని ఏటీఎం కార్డు లాగా వాడుకుంటోందన్నారు. కాంగ్రెస్ రాజకుటుంబం గిరిజన రాష్ట్రపతిని అవమానించిందన్నారు. ఆప్ ప్రభుత్వం తమ సమయమంతా ఇతర రాష్ట్రాలతో పేచీలకే వెచి్చస్తోందని మండిపడ్డారు. కేంద్రంతోనూ, ఉత్తరప్రదేశ్, హరియాణాలతో నిత్యం కలహిస్తోందన్నారు. దాంతో ఢిల్లీ అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉంటే అభివృద్ధిలో ఢిల్లీ వెనుకబడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కలహాలలో మునిగితేలే ప్రభుత్వం కంటే సమన్వయంతో ముందుకు సాగే ప్రభుత్వం ఢిల్లీకి అవసరమన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూసే ప్రభుత్వం కావాలన్నారు. బీజేపీని గెలిపిస్తే అవినీతిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అన్నా హజారే ఉద్యమాన్ని అపహస్యం చేస్తూ ఆప్ సర్కార్ అవినీతిలో మునిగిపోయిందని, ప్రజలకు ద్రోహం చేసిందని మోదీ అన్నారు. ఢిల్లీ బడ్జెట్లో ఆప్ 20 శాతమే అభివృద్ధిపై ఖర్చు పెడుతోందని, మౌలికసదుపాయాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజల కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా సొంత ప్రచారానికి నిధులు వెచి్చస్తోందని పేర్కొన్నారు. అద్దాల మేడలో నివసించే వాళ్లు పేదల ఇళ్ల గురించి పట్టించుకోరని, ఆప్ మధ్యతరగతికి వ్యతిరేకమని మోదీ అన్నారు. ఆప్ అక్రమాలను తవ్వితీస్తాం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఆప్ ప్రభుత్వం అక్రమాలను తవ్వితీస్తామని మోదీ హామీ ఇచ్చారు. కాగ్ నివేదికను ఢిల్లీ సర్కారు తొక్కిపెట్టాలని చూసిందని ఆరోపించారు. మద్యం పాలసీతో సహా ఆప్ విధానాలను కాగ్ తప్పుపట్టిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే కాగ్ నివేదికను ప్రవేశపెడతామని మోదీ అన్నారు.ఢిల్లీ అభివృద్ధికి శాయశక్తులా బీజేపీ సర్కారు కృషి చేస్తుందన్నారు. దోపిడి, అబద్ధాల నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. ఢిల్లీ ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే తన కల అని, ఆప్ దీనిని అడ్డుకుంటోందని మోదీ ఆరోపించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను పేదలకు కేటాయించకుండా ఆప్ అడ్డుకుంటోందని, తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందేలా చూస్తామని, ఇది తన గ్యారంటీ అని మోదీ పేర్కొన్నారు. -
తెలుగు నేతలంతా హస్తినలోనే
సాక్షి, న్యూఢిల్లీ: మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పీఠం దక్కించుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రచారం కోసం తెలుగు నేతలంతా హస్తినలోనే మకాం వేశారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం కమలం నేతలు తమవంతు కృషిచేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధానంగా తెలుగు ప్రజల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం నుంచి బీజేపీ ప్రచారం జోరు మరింత పెరగనున్నది. ఒక్కొక్కరికి ఒక నియోజకవర్గం ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా బీజేపీకి ప్రణాళిక రచించింది. ఒక్కో నేతకు ఒక్కో మండలం బాధ్యతలు అప్పగించింది. తెలంగాణకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు తెలుగు ఓటర్లు ఎక్కువగావున్న నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కరోల్బాగ్లో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరి్వంద్కు ఆర్కేపురం, జంగ్పురా నియోజకవర్గాలను కేటాయించగా అక్కడ ఆయన గత 15 రోజులుగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటులో శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. కేంద్ర మంత్రి, తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఆదివారం నుంచి పూరి్థస్థాయిలో బీజేపీ నేతలు రంగంలోకి దిగనున్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం ఘోండా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అజయ్ తరపున ప్రచారం చేశారు.ఏపీ నేతలకు వ్యూహాత్మకంగా బాధ్యతలు ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ నేతలు కూడా ఢిల్లీలో గత వారం రోజులుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి రంగ్పురి నియోజకవర్గంలో శుక్రవారం ప్రచారం చేశారు. ఈ ప్రాంతంలో తెలుగు ప్రజలను కలిసి బీజేపీ అభ్యర్థి కోసం ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థ సార«థికి మటియా మహల్ నియోజకర్గం బాధ్యతలు అప్పగించారు. అదోనిలో ముస్లిం ఓటర్లు ఎక్కువ. వారి ప్రభావంతో పార్థసారథి విజయం సాధించారని భావించిన అధిష్టానం ఆయనకు మటియా మహల్ ప్రాంతం బాధ్యతలు అప్పగించిందని తెలుస్తోంది. ఆయన ఆదోనికి చెందిన ముస్లిం నేతలతో కలిసి బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు. అలాగే బీజేపీ నేతలు విష్ణువర్థన్రెడ్డి, మాధవ్ తదితరులు కూడా బీజేపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ, మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న, చేయనున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. -
బుల్లి కారులో వచ్చి శీష్మహల్ స్థాయికి ఎదిగారు
న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ అబద్ధాలు మాట్లాడుతూ, తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారన్నారు. రాజకీయాలను మారుస్తానంటూ చిన్న కారులో వచ్చిన ఈ వ్యక్తి నేడు వాగన్ ఆర్ కారులో శీష్ మహల్కు వెళ్లే స్థాయికి ఎదిగారంటూ మండిపడ్డారు. ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో అధికార నివాసం శీష్ మహల్లో విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసిన ఈయన ఇప్పుడు ఇతర పార్టీలు అవినీతికి పాల్పడ్డాయంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. గత పదేళ్లలో అవినీతిలో మునిగి తేలడం, కాలుష్యాన్ని పెంచడం మినహా ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ చేసిందేమీ లేదన్నారు. సమాజంలో హింసను, విద్వేషాలను బీజేపీ వ్యాపింపజేస్తోందని, తమ కాంగ్రెస్పార్టీ మాత్రమే ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని చెప్పారు. తన మంత్రివర్గాన్ని నవ రత్నాలంటూ కేజ్రీవాల్ చెప్పుకుంటున్న వారిలో ఒక్కరూ ఓబీసీ, మైనారిటీ, దళిత, గిరిజన వర్గాలకు చెందిన వారు లేరన్నారు. అందరూ అగ్ర కులాలకు చెందిన వారేనని రాహుల్ చెప్పారు. ‘ఢిల్లీ రాజకీయాల్లో మార్పు తెస్తానమంటూ ప్రకటించుకున్న కేజ్రీవాల్.. అతిపెద్ద మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. యమునా నదిలో మునిగి, యమునా జలాలను తాగుతానని ఐదేళ్ల క్రితం చెప్పిన కేజ్రీవాల్ ఆ విషయం మర్చేపోయారు’అని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి ఢిల్లీ ఎన్నికలు అవకాశవాద పోటీ కాదని చెప్పారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆశయాలను పరిరక్షించే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. మదీపూర్లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ బీజేపీపైనా విమర్శలు సంధించారు. సమాజంలో కులాలు, భాషల ప్రాతిపదికన విభేదాలు పెంచి, హింసను బీజేపీ ఎగదోస్తోందన్నారు. ప్రజలను సమస్యల నుంచి మళ్లించేందుకు, సంపదను బడా పారిశ్రామిక వేత్తల ధారాదత్తం చేసేందుకు కుట్రలు పన్నుతోందని చెప్పారు. టాప్ 25 పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.16 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన మోదీజీ..ఢిల్లీలోని విద్యార్థులు, చిరు వ్యాపారులు, గృహిణుల రుణాలెన్నిటిని రద్దు చేశారు? అంటూ ప్రశ్నించారు. మోదీ, కేజ్రీవాల్ ఒక్కటే అవినీతి విషయంలో ప్రధాని మోదీ, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇద్దరూ ఒక్కటేనని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ముస్తాఫాబాద్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఆమె.. విభేదాలు సృష్టించడమే బీజేపీ నైజమని చెప్పారు. మోదీ రాజ్మహల్ గురించి ఆప్ నేతలు మాట్లాడుతుంటే, కేజ్రీవాల్ శీష్ మహల్ గురించి బీజేపీ నేతలు విమర్శిస్తున్నారని, ఈ రెండు పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు తెచ్చేందుకే తప్ప ప్రజలకు రహదారులు, మంచి నీరు, విద్య వంటి వాటి గురించి బీజేపీ మాట్లాడటం లేదని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్కు మోదీకి మధ్య తేడాయేలేదన్నారు. -
యమునలో స్నానమెప్పుడు చేస్తారు
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు యమునా నది కాలుష్యం చుట్టూ తిరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గురువారం యమునా నదిలో విహరిస్తున్న వీడియోను విడుదల చేసి.. ఈ మురికి కాసారంలో ఎప్పుడు స్నానం చేస్తారని అరవింద్ కేజ్రీవాల్కు సవాల్ విసిరారు. యమునా కాలుష్యం ప్రధాని నరేంద్ర మోదీ, కేజ్రీవాల్ల నిర్లక్ష్యం, అవినీతి ఫలితమేనని రాహుల్ ఆరోపించారు. రాహుల్ బుధవారం యమునా నదిలో విహరించి.. నది దుస్థితిని వీడియో తీశారు. ‘నాలాగా మీరు ఢిల్లీ వాసులైనట్లయితే యమునా నది పరిస్థితిని చూసి తీవ్రంగా విచారిస్తూ ఉంటారు. బుధవారం ఉదయం నేను యమునా నదికి వెళ్లాను. స్థానికులు, పడవలు నడిపేవాళ్లు, ఉద్యమకారులతో మాట్లాడాను. యమునా నదిలో ఎటు చూసినా చెత్తే. మురికినీళ్లే. దుర్వాసన వెదజల్లుతోంది. నీటి శుద్ధి తర్వాత వ్యర్థాలను తిరిగి యమునలోనే వదిలేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. యమునా నదిలో స్నానమాచరించడానికి గతంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేవాళ్లు. ఇప్పుడు అతికొద్ది మంది మాత్రమే వస్తున్నారు. అదీ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి’అని రాహుల్ అన్నారు. ‘ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యమునను శుద్ధి చేస్తామని కేజ్రీవాల్ శుష్క వాగ్దానాలు చేస్తున్నారు. నేను యమునా నదిలో మునక వేస్తాను లేదంటే మాకు ఓటు వేయకండి అంటూ సుదీర్ఘ ఉపన్యాసాలిస్తున్నారు. ఇప్పుడు యమునా నీటిని ఒక సీసాలో తీసుకొని ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. ఇది యమునా నదిని అవమానించడమే కాదు.. ఢిల్లీ ప్రజలను అపహస్యం చేయడమే’అని రాహుల్ విమర్శించారు. ‘కేజ్రీవాల్ జీ 2025 వచ్చింది. మీరెప్పుడు యమునా నదిలో మునక వేస్తారు. ఢిల్లీ ఎదురుచూస్తోంది’అని రాహుల్ ప్రశ్నించారు. యమున శుద్ధి పేరిట డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపించారు. -
సీఈసీ రాజకీయాలు చేస్తున్నారు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. యమునా నదిని హరియాణాప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. కేజ్రీవాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను రాజీవ్ కుమార్ దెబ్బతీస్తున్నారని, పదవీ విరమణ తర్వాత పెద్ద హోదాను కోరుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ కలిగిస్తున్న నష్టం గతంలో ఎవరూ కలిగించలేదని ఆక్షేపించారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించారు. తాను బతికి ఉన్నంత వరకూ ఢిల్లీ ప్రజలను విషపూరిత జలాలు తాగనివ్వనని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని తెలుసని, అయినప్పటికీ భయపడబోనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని, ఢిల్లీ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని మండిపడ్డారు. హరియాణా ముఖ్యమంత్రి నాయబ్సింగ్ సైనీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. యుమునా నది నీరు తాగకపోయినా తాగినట్లు ఆయన డ్రామాలాడుతున్నారని విమర్శించారు. యమునా నది నీటిలో విష రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని తమ ముఖ్యమంత్రి అతిశీ కోరితే సైనీ పట్టించుకోలేదని ఆక్షేపించారు. యమునా నీటిని సీసాల్లో నింపి బీజేపీ, కాంగ్రెస్ పెద్దలకు ఇస్తామని, వారు ఆ నీటిని తాగితే... తాము చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఒప్పుకుంటామని చెప్పారు. తన సవాలును అమిత్ షా, నాయబ్సింగ్ సైనీ, రాహుల్ గాంధీ స్వీకరించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ స్పష్టమైన వివరణ ఇవ్వాలి: ఈసీ యమునా నదిలో అమ్మోనియం స్థాయి పెరగడాన్ని విషంతో ముడిపెట్టొద్దని అరవింద్ కేజ్రీవాల్కు ఎన్నికల సంఘం సూచించింది. యమునా నది నీటి విషయంలో కేజ్రీవాల్ ఇచి్చన వివరణపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. హరియాణా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటో చెప్పాలని, అందుకు మరో అవకాశం ఇస్తున్నామని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం కేజ్రీవాల్కు లేఖ రాసింది. బుధవారం ఇచ్చిన వివరణలో స్పష్టత లేదని పేర్కొంది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అందులో అన్ని అంశాలు ఉండాలని పేర్కొంది. తమ ఎదుట హాజరు కాకపోతే తగిన చర్యలు తీసుకోక తప్పదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీఈసీ రాజీవ్ కుమార్పై ఆరోపణలు గుప్పించారు. -
యమునా నది వివాదం.. ఎప్పుడేం జరిగింది?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యమునా నదిపై రాజకీయ వివాదం చెలరేగింది. ఢిల్లీ జీవనాడిగా భావించే యమునా నదిపై రాజకీయ పార్టీలు వాదోపవాదాలకు దిగాయి. యమునా నది (Yamuna River) కాలుష్యానికి మీరు కారణమంటే.. మీరు కారణమని అధికార, విపక్షాలు వాదులాడుకుంటున్నాయి. యమునా నది కాలుష్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం (Political Heat) రేగింది. న్యాయపరంగానూ ఆయనకు చిక్కులు ఎదురయ్యాయి.యమునా నదిని హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం విషతుల్యం చేస్తోందని బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో రచ్చ మొదలైంది. కేజ్రీవాల్ ఆరోపణలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తిప్పికొట్టారు. మరోవైపు కేజ్రీవాల్కు హరియాణా కోర్టు, ఎన్నికల సంఘం తాఖీదులు పంపాయి. యమునా నది కాలుష్యంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని ఆదేశించాయి. కేజ్రీవాల్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా దీటుగా స్పందించడంతో వివాదం మరింత ముదిరింది.హస్తిన జీవనాడిదేశరాజధాని ఢిల్లీకి యమునా నది జీవనాడి వంటిది. హస్తిన జనాభాలో 70 శాతం మందికి నీటిని అందించే ఈ నది ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగివుంది. అయితే దేశంలోని ఇతర ప్రధాన నదుల మాదిరిగానే యమున కూడా కాలుష్యకాసారంగా మారిపోయింది. పట్టణీకరణ బాగా పెరగడం.. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను నిరంతరం నదిలోకి వదులుతుండడంతో యమున కాలుష్యం బారిన పడింది. యమున నదిపై ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల మధ్య ఎన్నో ఎళ్లుగా తగాదాలు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.యమునా నది జలాల పంపిణీ వివాదం ఇలా...1993లో ఢిల్లీ శాసనసభ ఏర్పడింది. యమునా నదీ జలాల పంపిణీపై 1994, మే నెలలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనిపై ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేశారు. అయితే ఈ వ్యవహారం 1995, మార్చి 31న సుప్రీంకోర్టుకు చేరింది. ఢిల్లీలో తాగునీటి కొరతను తగ్గించేందుకు యమునా నదిలో నీటి ప్రవాహాన్ని సక్రమంగా నిర్వహించేలా హరియాణాకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పు వెలువరించింది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఢిల్లీకి వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించింది. 5 రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించింది. 1996, ఫిబ్రవరిలోనూ మరోసారి ఇలాంటి ఆదేశాలిచ్చింది. వజీరాబాద్, హైదర్పూర్లోని రెండు నీటి రిజర్వాయర్లు, ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి ఢిల్లీకి నీరు ఇవ్వాలని పేర్కొంది.2018, ఏప్రిల్ నెలలో వజీరాబాద్ రిజర్వాయర్లో నీటిమట్టం పడిపోవడంతో అప్పటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపుతట్టింది. సమస్యను పరిష్కరించాలని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ వివాదానికి సంబంధించి కోర్టులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకుంటేనే నీటిని విడుదల హరియాణాలోని అప్పటి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తామని హామీ ఇచ్చింది.2021, మార్చిలో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. హరియాణాకు వ్యతిరేకంగా ఢిల్లీ జల్ బోర్డు(DJB) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. యమునా నీటి పంపిణీపై 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హరియాణా ప్రభుత్వం ధిక్కరించిందని కోర్టుకు తెలిపింది. దీనిపై హరియాణా ప్రభుత్వం సర్కారు స్పందిస్తూ.. తమ తప్పు ఏమీలేదని, హస్తిన సర్కారు అసమర్థత కారణంగానే నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నమైందని వాదించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్ను 2021, జూలైలో సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.చదవండి: హరియాణాలో ఉన్నది మనుషులు కాదా?2023, జూలైలో దేశ రాజధానికి వరదలు పోలెత్తాయి. ఈ సమయంలో యమునానగర్ జిల్లాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి ఉద్దేశపూర్వకంగా హరియాణా నీటిని విడుదల చేసిందని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. కాగా, యమునా జలాల్లో తన వాటాను విడుదల చేయకుండా ఢిల్లీకి వ్యతిరేకంగా హరియాణా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ 2024, జూన్ నెలలో అప్పటి ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి, ప్రస్తుత సీఎం అతిషి నిరాహార దీక్ష చేశారు. తాజాగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో యమున నదీ వివాదం ఢిల్లీ ఎన్నికల్లో తెరమీదకు వచ్చింది. -
మోదీ నమస్కారం వైరల్.. ఎవరీ రవీందర్?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్క్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఢిల్లీలో బహిరంగ సభలో బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి.. మోదీ పాదాలకు నమస్కరించడంతో ప్రతిగా మర్యాదతో ప్రధాని కూడా మూడుసార్లు నమస్కరించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో రవీందర్ సింగ్ నేగి ఎవరూ అనే చర్చ మొదలైంది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున రవీందర్ సింగ్ నేగి.. పట్పర్గంజ్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ ఆప్ అభ్యర్థిగా యూపీఎస్సీ కోచ్ అవధ్ ఓజా పోటీలో నిలిచారు. ఇదే స్థానం నుంచి ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా 2013 నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం సిసోడియా జంగ్పురా నుండి పోటీ చేస్తున్నారు. ఇక, రవీందర్ సింగ్ నేగి ప్రస్తుతం పట్పర్గంజ్ నియోజకవర్గంలో భాగమైన వినోద్ నగర్ నుంచి కౌన్సిలర్గా కొనసాగుతున్నారు.यह बड़प्पन है हमारे पीएम नरेंद्र मोदी का नहीं चाहते कि कोई भी उनके पास छुए*BJP candidate Ravindra Negi touches PM Modi's feet.* फिर PM Modi did it thrice. pic.twitter.com/KFtyHBqPHm— Srivatsan (@kj_srivatsan) January 29, 2025ఇదిలా ఉండగా.. రవీందర్ సింగ్ నేగి అప్పట్లో సోషల్ మీడియాలో హైలైట్ అయ్యారు. అయితే, ఢిల్లీలో దుకాణాలకు తమ సొంత పేర్లను ఏర్పాటు చేయాలని నేగి సూచించారు. హిందువులు అయితే కాషాయ జెండాను దుకాణాలపై ఎగురువేయాలని కోరారు. అంతేకాకుండా.. నవరాత్రి రోజుల్లో, పండుగలకు ముందు రోజు హిందూ భావాలను గౌరవిస్తూ మటన్, చికెన్ షాపులను మూసివేయాలని దూకాణాదారులను ఆయన కోరారు. దీనికి సంబంధించిన వీడియోలు అక్టోబర్ 2024, జనవరి 2025లో సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో, హిందువుల గురించి ఆయన పలు కార్యకక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే, ఢిల్లీలో వరద నీరు నిలిచిన సమయంలో నీటిలో బోట్లు వేసుకుని తిరిగారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన కార్యక్రమాలు వైరల్గా మారాయి.This is BJP Councillor Ravinder Singh Negi.When you mistake an inflatable boat for the rowing machine in the gym. 😭pic.twitter.com/lJ00VoiyEK— @UrbanShrink 🌻 (@UrbanShrink) June 28, 2024మరోవైపు.. రవీందర్ సింగ్ నేగి బీజేపీ నుంచి పోటీ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2020లో ఆయన మనీష్ సిసోడియా చేతిలో కేవలం 2 శాతం తేడాతో ఓడిపోయారు. 2022 ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో, వినోద్ నగర్ స్థానం నుండి ఆప్ అభ్యర్థిని 2,311 ఓట్ల తేడాతో ఓడించారు. This is Ravindra Singh Negi, a BJP councilor in Delhi. He is pressuring Muslim vendors into writing their names on their stalls to identify themselves. He is also placing Bhagwa flags on the outlets of Hindu business owners. Life has become an absolute hell for Indian… pic.twitter.com/puV6LVOJsW— Darab Farooqui (@darab_farooqui) December 8, 2024 -
కులగణన.. మహిళలకు 33% రిజర్వేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జైరాం రమేష్, జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరాలు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ప్రజలకు సామాజిక, ఆర్థిక అంశాల్లో తోడ్పాటును అందించేలా వివిధ సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ హామీలు గుప్పించింది. పూర్వాంచల్ వాసుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం సహా చదువుకున్న నిరుద్యోగ యువతకు ఏడాదిపాటు నెలకు రూ.8,500 ఆర్థిక సహాయం వంటి వాగ్ధానాలను ప్రకటించింది. యమునా కాలుష్య పాపం రెండు పార్టీలదే: జైరాం రమేశ్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడిన జైరాం రమేశ్, యమునా నదీ కాలుష్య పాపం పూర్తిగా, ఆప్, బీజేపీలదేనని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత వల్లే కాలుష్యం ఢిల్లీ ప్రజలకు పెనుశాపంగా మారిందని ధ్వజమెత్తారు. షీలాదీక్షిత్ హాయంలో యమునా కాలుష్యాన్ని నియంత్రించేందుకు జపాన్ ప్రభుత్వంతో కలిసి పనిచేశామని, కాలుష్యాన్ని అరికట్టేలా 7 వేలకు పైగా సీఎన్జీ, మెట్రో సరీ్వసులను ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేసిన మాదిరే ఢిల్లీలోనే పథకాల అమలు జరుగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు→ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు. → పింఛను రూ.2,500 నుంచి రూ.5,000కు పెంపు. → వితంతువుల కూతుళ్ల పెళ్లికి రూ.1.1 లక్షల సాయం → ఢిల్లీ వ్యాప్తంగా 100 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు. ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం → పూర్వాంచల్కు కొత్త మంత్రిత్వ శాఖ. → ప్రతి వార్డులో 24 గంటల డిస్పెన్సరీ, 10 మలీ్టస్పెషాలిటీ ఆసుపత్రులు → రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య కవరేజీ → విద్యార్థుల కోసం 700 పబ్లిక్ లైబ్రరీల ఏర్పాటు. → మురుగునీటి మౌలిక సదుపాయాల పునరుద్ధరణ ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే యమునా నదిలో విడుదల చేసేలా ప్రణాళిక → పునరావాస కాలనీలు, అనధికార కాలనీలలో నివసించే ప్రజలకు యాజమాన్య హక్కులు → 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు → సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ.5,000 పెన్షన్ → 15,000 మంది సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల పునరి్నయామకం. → జైన్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు → ‘ప్యారీ దీదీ యోజన’కింద మహిళలకు నెలకు రూ.2,500 → నిరుద్యోగ యువతకు నెలవారీ రూ.8,500 సాయం → రూ.500లకే ఎల్పీజీ సిలిండర్ → కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ → ట్రాన్స్జెండర్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు -
‘ఆప్’ను ప్రజలు క్షమించరు
న్యూఢిల్లీ: యమున నదిలో విషం కలుపుతున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)చేసిన ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) ఓటమి తప్పదని తేలడంతో ఆప్ నాయకులు మతితప్పి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలోని కర్తార్ నగర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆప్ నాయకులకు, చార్లెస్ శోభారాజ్కు మధ్య పెద్ద తేడా లేదని అన్నారు. పైకి అమాయకంగా కనిపిస్తూ ప్రజల సొమ్మును దోచుకోవడంలో వారు ఆరితేరిపోయారని దుయ్యబట్టారు. ‘‘వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినవారు, అద్దాల మేడల్లో నివసిస్తున్నవారు పేదల సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. ఓటమి భయంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలో యుమున నదిని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు దగాకోరు మాటలు చెబుతోంది. యమునా నదిని శుభ్రం చేస్తామని హామీ ఇస్తే ఓట్లు రావని అంటోంది. ఇది నిజంగా సిగ్గుచేటు. ప్రజలకు పరిశుభ్రమైన నీరు దొరకడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇష్టంలేదు. ఢిల్లీలోని పూర్వాంచల్ ప్రజలు మురికికూపంలోనే ఛాత్ పూజలు చేసుకోవాలని కోరుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ దేశ చరిత్రలో అతిపెద్ద పాపం చేసింది. ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మాజీ ముఖ్యమంత్రి(అరవింద్ కేజ్రీవాల్) హరియాణా ప్రజలపై నిందలు వేశారు.యమునా నదిలో విషం కలిపారని అన్నారు. హరియాణాలో ఉన్నది మనుషులు కాదా? వారికి ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధువులు లేరా? సొంత మనుషులు చావాలని నదిలో విషం కలుపుతారా? యమున నదిలో హరియాణా నుంచి వస్తున్న నీటినే నాతోపాటు ఢిల్లీ ప్రజలు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు కూడా తాగుతున్నారు. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నదిలో విషం కలిపి నాకు హాని కలిగిస్తుందని ఎవరైనా అనుకుంటారా? ఆప్ నాయకులు అసలేం మాట్లాడుతున్నారు? తప్పులను క్షమించే గుణం మన భారతీయుల్లో ఉంది. కానీ, ఉద్దేశపూర్వకంగా పాపాలు చేస్తే ఎవరూ క్షమించరు. ఆప్ పాపాత్ములను మన్నించే ప్రసక్తే లేదు’’అని మోదీ అన్నారు. -
అరవింద్ కేజ్రీవాల్కు బిగ్ షాక్!
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, ఆప్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో యమనా నది నీటి విషయంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. యమునా నీటిలో విషం కలిపారని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ.. యమునా నీటిని తాగారు. అనంతరం, నీటిని నెత్తిన జల్లుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యుమునా నది నీటిలో విషం కలిపారని హర్యానా బీజేపీ ప్రభుత్వం మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. యుమునా నదిలోకి కావాలనే పారిశ్రామిక వ్యర్థాలను వదులుతోందన్నారు. ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ (Atishi) విలేకరులతో మాట్లాడుతూ.. యమునను కలుషితం చేయడం ‘జల ఉగ్రవాదం’ అని అభివర్ణించారు. హర్యానా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమ్మోనియం స్థాయిలు ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీ సమీపంలోని పల్లా గ్రామం వద్ధ యమునా నీటిని హర్యానా సీఎం సేవించారు. దీంతో, కేజ్రీవాల్ ఆరోపణలకు ఆయన చెక్ పెట్టారు.बेहिचक और बेझिझक पवित्र यमुना के जल का आचमन किया हरियाणा की सीमा पर।आतिशी जी तो आईं नहीं।कोई नया झूठ रच रही होंगी।झूठ के पांव नहीं होते।इसलिए आप-दा का झूठ चल नहीं पा रहा।दिल्ली की देवतुल्य जनता इन फ़रेबियों को पहचान चुकी है।5 फ़रवरी को आप-दा के फरेब काल का अंत निश्चित है।… pic.twitter.com/EAG4pXjCFr— Nayab Saini (@NayabSainiBJP) January 29, 2025ఇదిలా ఉండగా.. యమునా నదిపై ఆరోపణలను హర్యానా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కేజ్రీవాల్పై హర్యానా ప్రభుత్వం కేసు నమోదు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘కేజ్రీవాల్ మా ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల హర్యానా, ఢిల్లీలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేజ్రీవాల్ నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం. కేజ్రీవాల్ మాటలు అవాస్తవమని నిరూపిస్తాం’ అని అన్నారు.మరోవైపు.. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేడు ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రధాని తాగే నీళ్లలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతుందా అటూ ప్రజలను సూటిగా ప్రశ్నించారు. హర్యానా ప్రజల బంధువులు ఢిల్లీలో కూడా ఉన్నారని.. తమ సొంత ప్రజలు తాగే నీటిలో ఎవరైనా విషం కలుపుతారా?. ఆ నీటిని తాగే వారిలో ప్రధాని కూడా ఉన్నారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోతారనే కారణంగానే ఆప్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
యమునా నీళ్లు.. ఢిల్లీ-హర్యానా మధ్య మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ యమునా నదిపై ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఢిల్లీ ప్రజలు తాగునీటికి ఉపయోగించే యమునా నదీ జలాల్లో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలకు దిగారు. అయితే ఈ అంశం పెను దుమారానికి దారి తీసింది. యమునా నదీ జలాల్లో విషం కలుపుతున్నారని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హర్యానా ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యాఖ్యలకుగాను కేజ్రీవాల్పై పరువునష్టం కేసు పెడతామని హెచ్చరించింది. అయితే.. హర్యానా ప్రభుత్వం కేసు పెడతామని వార్నింగ్ ఇవ్వడంపై కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ‘నన్ను కేసులతో భయపెట్టలేరు. నా మీద కేసు పెట్టండి. నన్ను చంపండి. ఉరి తీయండి.ఢిల్లీ ప్రజలు తాగే నీళ్లను మాత్రం విషపూరితం చేయకండి. ఢిల్లీ ప్రజలను చంపకండి’అని కేజ్రీవాల్ బీజేపీని కోరారు. ఢిల్లీ ప్రజలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని శపిస్తారు’’ అని కేజ్రీవాల్ అన్నారు.కాగా,ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘యమునా నదిలో ఏదో కలుస్తోందని వాటర్బోర్డు అనుమానం వ్యక్తం చేసింది. పక్కనున్న హర్యానా ప్రభుత్వం ఢిల్లీ ప్రజలు తాగే నీటిలో విషం కలిపింది. దీంతో కొందరు ఢిల్లీ వాసులు మరణిస్తే అది నాపై నెట్టవచ్చనుకుంటున్నారు’అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదే విషయంపై ఢిల్లీ సీఎం అతిషి కూడా స్పందించారు. యమునా నది జలాల్లో అమ్మోనియా స్థాయి అధికంగా ఉందని, వాటిని శుద్ధి చేసి తాగునీటిగా మార్చడం అసాధ్యమన్నారు. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారామె. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 8వ తేదీ ఫలితాలు వెల్లడవనున్నాయి. -
ధనవంతులకు బీజేపీ.. నేరస్తులకు ఆప్.. టిక్కెట్ల లెక్కలివే
న్యూఢిల్లీ: ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం అన్ని పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి.ఆమ్ ఆద్మీ పార్టీ నాల్గవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్లు కూడా తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), ఢిల్లీ ఎలక్షన్ వాచ్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 699 మంది అభ్యర్థులకు సంబంధించిన ఒక నివేదికను విడుదల చేశాయి.పార్టీల పరంగా చూస్తే నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు ఆమ్ ఆద్మీ పార్టీ అధికంగా టిక్కెట్లు కేటాయించింది. దీని తరువాత ఇటువంటి జాబితాలో కాంగ్రెస్, బీజేపీలున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 46 శాతం మంది 5 నుండి 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 29 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. మొత్తం 132 మంది అభ్యర్థులు (19శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించుకున్నారు. 81 మంది అభ్యర్థులు (12శాతం) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులలో ఐదు శాతం మంది అత్యంత ధనవంతులు. వీరిలో బీజేపీకి చెందినవారు ముగ్గురున్నారు. కాంగ్రెస్ ఒక కోటీశ్వరునికి టికెట్ ఇచ్చింది. ఆప్ కూడా ఎన్నికల బరిలో ఒక బిలియనీర్ను నిలబెట్టింది. బీజేపీ నుంచి పోటీచేస్తున్న అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ అత్యంత ధనవంతుడు. అతని ఆస్తుల విలువ 2019లో రూ. 3.2 కోట్లు ఉండగా, అది నుండి 2025 నాటికి 96.5 కోట్లకు పెరిగిందని అతను సమర్పించిన అఫిడవిట్ ద్వారా వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే -
ఢిల్లీ ప్రజలకు ఆప్ మరో 15 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్కు ఇంకా ఎనిమిది రోజులే మిగిలిఉన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు మరో 15 గ్యారంటీలను ప్రకటించింది. మధ్యతరగతి ప్రజల కోసం ఇప్పటికే ఒక మేనిఫెస్టోను విడుదలచేసిన ఆప్ సోమవారం మరో అదనపు మేనిఫెస్టోను విడుదలచేసింది. యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం, మెట్రో ఛార్జీలో 50 శాతం రాయితీ వంటి పలు హామీలను ఇందులో చేర్చింది. ఆప్ సీనియర్ మహిళా నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశి, మనీశ్ సిసోడియా తదితరుల సమక్షంలో పార్టీ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ రెండో మేనిఫెస్టోను సోమవారం ‘కేజ్రీవాల్ గ్యారంటీ’పేరిట విడుదల చేశారు. ‘‘బీజేపీ నేతలు హామీలు ఇస్తారు కానీ అమలు చేయరు. మేం మాత్రం ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలోపు కచ్చి-తంగా అమలు చేస్తాం. ఢిల్లీలో ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి వస్తే ఢిల్లీ వాసులపై ఆర్థిక భారం తప్పదు’’అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ 15 గ్యారంటీలు ఇవే.. → వచ్చే ఐదేళ్లలో ప్రతి యువకుడికి ఉపాధి → మహిళా సమ్మాన్ యోజన క్రింద ప్రతి మహిళకు నేరుగా బ్యాంకు ఖాతాకే రూ.2,100 నగదు జమ → సంజీవని యోజన కింద 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స → తప్పుడు నీటి బిల్లుల మాఫీ → 24 గంటలు తాగు నీటి సరఫరా → యూరప్తరహాలో ప్రపంచ స్థాయి రోడ్లు → యమునా నదిని శుభ్రం చేయడం → డాక్టర్ అంబేడ్కర్ స్కాలర్షిప్ పథకం → విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, ఢిల్లీ మెట్రోలో 50 శాతం రాయితీ → పూజారి–గ్రంథి సమ్మాన్ యోజన కింద హిందూ ఆలయాల్లో అర్చకులు, గురుద్వారాల్లో గ్రంథీలకు జీతభత్యాల కింద ఒక్కొక్కరికి రూ.18 వేలు → సొంతిళ్లవారితోపాటే అద్దెకు ఉంటున్న వారికీ ఉచిత విద్యుత్, నీరు → మురుగు నీటిపైపులైన్ల మరమ్మతు, ముగునీటి వ్యవస్థలను మెరుగుపరచటం → అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డుల జారీ → ఆటో, టాక్సీ, ఇ–రిక్షా డ్రైవర్లకు జీవిత బీమా, వారి కుమార్తెల వివాహానికి రూ.లక్ష సాయం, పిల్లలకు ఉచిత కోచింగ్ → రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు -
Delhi Elections: 7 రోజులు.. 100 సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అధికారపీఠంపై ఇరవై ఆరేళ్ల తర్వాత పార్టీ జెండా ఎగురవేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. చివరి నిమిషంలో తన ప్రచారాన్ని హోరెత్తించేలా ప్రణాళికలు రచించింది. వచ్చే వారం రోజుల పాటు బూత్ స్థాయి వరకు పార్టీ హామీలపై ప్రచారం జరిగేలా పార్టీ జాతీయ స్థాయి నేతల నుంచి పార్టీ విస్తారక్ల వరకు అందరినీ కదనరంగంలోకి దించనుంది. 29 నుంచి ప్రధాని మోదీ తన ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేంతా నియోజకవర్గాల వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ నియోజకవర్గాల్లో 100కు పైగా సమావేశాలు, ర్యాలీల్లో భాగస్వాములు కానున్నారు. అసెంబ్లీకి 20వేల ఓట్లు అదనం గడిచిన 2015 అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో బీజేపీ 32 శాతం ఓట్లను సాధించింది. మొత్తం 70 స్థానాలకు గానూ కేవలం మూడు చోట్ల నెగ్గింది. 2020 ఎన్నికల్లో 38.51 శాతం ఓట్లతో 8 సీట్లు సాధించింది. ఈ సారి కనీసంగా 50 శాతం ఓట్లు సాధించాలనే లక్ష్యంగా ముందుకెళుతోంది. గతంలో గెలిచిన స్థానాలతో పాటు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గతంలో వచ్చిన ఓట్ల కన్నా కనీసంగా 20 వేల ఓట్లు అధికంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ప్రతి బూత్ స్థాయిలో పోలయ్యే ఓట్లలో 50శాతం ఓట్లు సాధించేలా మైక్రో మేనేజ్మెంట్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. కొన్ని నెలలుగా బీజేపీ ఓటర్ల జాబితాలను బూత్ల వారీగా తెప్పించి బీజేపీ అనుకూల, ప్రతికూల, స్ధిరమైన ఓటర్లను గుర్తించింది. ఢిల్లీలో అందుబాటులో లేని ఓటర్లను వివిధ మార్గాల ద్వారా సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది. ప్రతి బూత్లోని ఓటర్ల సామాజిక ప్రొఫైల్లను గుర్తించి స్థానిక పార్టీ నేతలు, సామాజికవర్గ నేతలను రంగంలోకి దించి వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు బీజేపీ క్లస్టర్లను ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒక్కో ముఖ్య నేతను ఇంచార్జ్గా నియమించింది. మురికివాడలు, అనధికార కాలనీలతోపాటు వీధి వ్యాపారులనూ ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇందుకు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలవాసులు ఎక్కువ మంది ఉండే ప్రాంతాల్లో ఆ రాష్ట్రాలకు చెందిన నేతలనే ఇంఛార్జిలుగా నియమించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు సుమా రు 3లక్షల మంది ఉన్నారు. వీళ్లు అత్యధికంగా ఉండే ఆర్కేపురం, పాండవ నగర్, కరోల్భాగ్ ప్రాంతాలకు రాష్ట్రానికి చెందిన ఎంపీలు ధర్మపురి అరవింద్, డీకే అరుణ వంటి నేతలకు ప్రచార బాధ్యతలు కట్టబెట్టారు. ఉత్తర ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, పంజాబ్ ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు పనిచేస్తున్నా రు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో విస్తృతంగా ప ర్యటిస్తూ స్థానిక మోర్చాలను కలుసుకోవడం, స మావేశాలను నిర్వహించడం, పథకాలపై అవగాహ న కల్పించడం వంటివి చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన బేటీ బచావో– బేటీ పఢావో ప్రచారంతో పాటు, జన్ధన్ ఖాతా, ఉజ్వల గ్యాస్ పథకం, ఉచిత గృహాలు, మరుగుదొడ్లు, ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుండి స్వేచ్ఛ, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, మహిళా రిజర్వేషన్లు, హిందూ ఆలయాల పునరి్నర్మాణం వంటి అనేక పథకాలపై అవగాహన కల్పించే పనిని అప్పగించారు. ముఖ్యంగా యువ ఓటర్లు లక్ష్యంగా దేశ సమగ్రత, సనాతన ధర్మ పరిరక్షణ, 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా అడుగులు, మేక్ ఇన్ ఇండియాతో యువతకు పెరిగిన ఉపాధి వంటి అవకాశాలపై ప్రేరణ కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. రేపటి నుంచి మోదీ, షా, యోగి.. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ కీలక నేతలంతా బుధవారం నుంచి ప్రచార పర్వంలో క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. ప్రధాని మోదీ 29వ తేదీన కర్కర్దామా, 31వ తేదీన యమునా ఖాదర్, ఫిబ్రవరి రెండో తేదీన ద్వారాకా ప్రాంతాల్లో బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ ప్రధాన ప్రాంతాల్లో భారీ ర్యాలీలు జరిపేలా ప్రణాళికలున్నాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సైతం ఆరు బహిరంగ సభలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ యోగి దాదాపు 10 బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధంచేశారు. డజన్ల కొద్దీ కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీల నేతలు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, పొరుగు రాష్ట్రాల మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి మొత్తంగా 100కు పైగా సభలకు ప్లాన్ చేశారు. ప్రచార అంశాలను పర్యవేక్షించడానికి ప్రతి కేంద్ర మంత్రికి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించారు. -
ప్రతి ఇంటికి నెలకు రూ.25వేలు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi AssemblyElections)ను దేశం మొత్తంలో జరుగుతున్న రాజకీయ పోరుగా భావించాలని ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. ఈ ఎన్నికల్లో రెండు పరస్పర విరుద్ధ సిద్ధాంతాల మధ్య పోటీ నెలకొందన్నారు. పేదలకు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తున్న బీజేపీ (BJP) నేతృత్వంలోని కేంద్ర సర్కారు గత ఐదేళ్లలో వందలమంది కార్పరేట్ వ్యక్తుల రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు.తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉచితాలుగా బీజేపీ పేర్కొనడాన్ని కేజ్రీవాల్ ఖండించారు. ‘‘ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్ వంటి పథకాలను నిలిపేస్తామని బీజేపీ ఇప్పటికే చెప్పింది. ఒకవేళ ఆ పార్టీ ఎన్నికైతే మీరు ఈ ఖర్చులను భరించగలరా?’ అని ప్రజలను కేజ్రీవాల్ ప్రశ్నించారు. తమ పార్టీ పథకాల వల్ల ఢిల్లీలో ప్రతి ఇంటికి రూ.25వేల విలువైన లబ్ధి అందుతోందని చెప్పారు. ఇదిలా ఉండగా.. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు ఆప్, బీజేపీ మధ్యే ఉండబోతోందని ఇప్పటికే స్పష్టమైంది. ఇదీ చదవండి: తేనెకళ్ల మోనాలిసా ఇళ్లు ఇదే.. -
వారికే ఓటేయండి.. అన్నా హజారే పిలుపు
ముంబై: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు. మచ్చ లేని వ్యక్తిత్వం కలిగిన వారు, దేశం కోసం త్యాగం చేయగలిగే వారికే ఓటేయాలని ఢిల్లీ పౌరులకు అన్నా హజారే విజ్ఞప్తి చేశారు. అలాగే, అప్రయోజకులకు ఓటు వేయవద్దని, అలాచేస్తే దేశం నాశనమవుతుందని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అన్నా హజారే శనివారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్నా హజారే..‘త్వరలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. స్వచ్ఛమైన వ్యక్తిత్వం, ఆలోచనలు కలిగిన వారు, సన్మార్గంలో నడిచేవారు, అవమానాలను దిగమింగి అవసరమైతే దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేవారికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’అని పేర్కొన్నారు.ఇదే సమయంలో ‘నేను తాగుతాను కాబట్టి, ఇది ఇతరులు కూడా తాగేందుకు అనుకూలంగా ఉంటుంది’ అనే వైఖరి ఎన్నికల ప్రక్రియలో పనికి రాదన్నారు. ఢిల్లీ కేంద్రంగా గతంలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ప్రచారం చేపట్టారు. ఆయనతో పోరాటంలో పాలుపంచుకున్న అరవింద్ కేజ్రీవాల్ అనంతర కాలంలో ఆప్ను స్థాపించి, ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు. అయితే, కేజ్రీవాల్ రాజకీయాల్లోకి ప్రవేశించడం హజారేకు ఇష్టంలేదు. ఆ తర్వాత పరిణామాల్లో ఇద్దరూ దూరమయ్యారు. -
అద్దెదార్ల ఓట్లపై పార్టీల వల
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం అద్దె ఇంట్లోనే నివసిస్తోంది. మొత్తం ఓటర్లలో అద్దెదార్ల వాటా తక్కువేమీ కాదు. అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించిగల స్థాయిలో ఉన్న ఈ ఓటర్లపై ప్రధాన రాజకీయ పార్టీలు వల విసురుతున్నాయి. వారి ఓట్లపై గురిపెడుతూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. అద్దెదార్ల ఓట్లు గంపగుత్తగా పడితే ఎన్నికల్లో గెలుపునకు ఢోకా ఉండదని భావిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పలు హామీలు ఇచ్చారు. అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి ఉచితంగా నీరు, విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. తమ పార్టీని మళ్లీ గెలిపిస్తే వారి సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. → ఢిల్లీ నివాసితుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నగరంలో 66.6 శాతం మంది సొంత ఇళ్లల్లో నివసిస్తుండగా, 32.4 శాతం మంది కిరాయి ఇళ్లల్లోనే బతుకులీడుస్తున్నారు. → అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారిలో 51.9 శాతం మంది న్యూఢిల్లీ జిల్లాలోనే ఉండగా, 41.9 శాతం మంది సౌత్ఈస్ట్ జిల్లాలో ఉన్నారు. → న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో 62.7 శాతం మంది, ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో 46.9 శాతం మంది అద్దెదార్లు ఉన్నారు. → ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ప్రజలు వలస వస్తున్నారు. ప్రధానంగా పూర్వాంచల్గా పిలిచే ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ వాసులు దేశ రాజధాని గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. చిన్నచిన్న ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకొనే పూర్వాంచల్ ప్రజల్లో ఎక్కువ మంది అద్దె ఇళ్లల్లోనే నివసిస్తున్నారు. → ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ సైతం అద్దెదార్ల ఓటర్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. → తాము అధికారంలోకి వస్తే పూర్వాంచల్ ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. → ఆమ్ ఆద్మీ సర్కారు పాలనలో అద్దెదార్లు నిర్లక్ష్యానికి గురయ్యారని, తమ పార్టీ అధికారంలోకి వస్తే వారి సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు తీసుకొస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ బీజేపీ తుది మేనిఫెస్టోలో కీలక హామీలివే..
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. శనివారం(జనవరి25) కేంద్రమంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ ‘బీజేపీ మేనిఫెస్టోలో బూటకపు వాగ్దానాలు లేవు. ఢిల్లీలో చేపట్టాల్సిన పనుల జాబితా మాత్రమే ఉంది. ఢిల్లీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైంది.కలుషితమైన యుమునా నదిని శుభ్రం చేయించలేదు. ప్రజలకు సరైన తాగునీటి సౌకర్యం కల్పించలేదు. దేశ రాజధానిని కాలుష్య రహితంగా మార్చలేదు. గత ప్రభుత్వంలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో అవినీతి మరింతగా పెరిగిపోయింది. ఢిల్లీలో రోడ్ల నిర్మాణానికి రూ. 41 వేల కోట్లు, రైల్వే లైన్ల కోసం రూ. 15 వేల కోట్లు, ఎయిర్పోర్టుకు రూ. 21 వేల కోట్లను కేంద్రం అందించింది. పేదల సంక్షేమ పథకాలను నిలిపివేయం. చేసిన వాగ్దానాలను కచ్చితంగా మా పార్టీ అమలు చేస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో యుమునా నదిని పూర్తిగా శుభ్రం చేయిస్తాం. గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తుంది. 1,700 అనధికార కాలనీలలో కొనుగోలు, అమ్మకంతో పాటు నిర్మాణం, యజమానులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తాం’ అని అమిత్షా హామీ ఇచ్చారు. కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 8వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకు రూ.2500 నగదు, సబ్సిడీపై రూ.500కే గ్యాస్ సిలిండర్లు లాంటి కీలక హామీలిచ్చింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ మధ్యే ఉండనుంది. -
చంద్రబాబు, రేవంత్ల స్ఫూర్తితో అలా ముందుకు..!
కాంగ్రెస్ పార్టీని నిత్యం విమర్శించే భారతీయ జనతా పార్టీ హామీల విషయంలో ఇప్పుడు ఆ పార్టీ బాటనే పట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ ఇచ్చిన కొన్ని హామీలు కాంగ్రెస్ పలు రాష్ట్రాలలో చేసినవి కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాలను ఎలా అమలు చేయాలో తెలియక అవస్థలు పడుతుంటే.. బీజేపీ కూడా అదే తరహా ఎన్నికల ప్రణాళికను ప్రకటించి ప్రజలను ఆకరర్షించడానికి నానా పాట్లు పడుతోంది. కాంగ్రెస్ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేస్తూ చెప్పిన సంగతులు కూడా చిత్రంగానే ఉన్నాయి!. వరుస విజయాలతో ఢిల్లీలో బలంగా నాటుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ రెండు జాతీయ పార్టీలకు సవాల్గా మారింది. ఆశ్చర్యకరంగా.. పొరుగున ఉన్న పంజాబ్లోనూ అధికారంలోకి వచ్చింది. ఢిల్లీలో ఈసారి గెలిస్తే అది తమ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చని బీజేపీ భావిస్తోంది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పటికీ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా బెయిల్పై విడుదలై పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళుతున్నారు. విద్య, వైద్యం వంటివాటిలో, సంక్షేమ స్కీముల అమలులో కేజ్రీవాల్ బలమైన ముద్ర వేసుకున్నారు. దానిని నిలబెట్టుకోవడానికి ఆప్ కృషి చేస్తుంటే, ఆ పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ పలు ఆకర్షణీయమైన స్కీములతో మానిఫెస్టోని విడుదల చేసింది. వాటిలో ముఖ్యమైనది.. మహిళా సమృద్ధి యోజన. దీని ప్రకారం ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తారట. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఒక్క ఢిల్లీకే ఈ హామీని పరిమితం చేయడమేమిటి?. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి దేశమంతటా అలాగే చేస్తామని చెబుతారేమో తెలియదు. ఈ హామీ కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టిందే అనిపిస్తుంది. బీజేపీ గతంలో ఇలాంటి హామీలకు విరుద్దమని చెబుతుండేది. మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఉచితాలు, రుణమాఫీల వంటి హామీలను బీజేపీ ఒప్పుకోదని పలు సభలలో బహిరంగంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల బృందం దేశ రాజకీయాలను శాసించడం ఆరంభమయ్యాక, ప్రతి రాష్ట్రంలో అధికారం సాధించాలన్న లక్ష్యంతో పని చేయడం ఆరంభించారు. అందులోనూ దేశ రాజధాని కావడంతో ఢిల్లీకి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ స్కీమును అమలు చేస్తామని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఏడాది గడిచినా అమలు చేయలేకపోయింది. అలాగే ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ చేసిన వాగ్దానం ప్రకారం ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ప్రతి నెల ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కాని ఆ ఊసే ఎత్తడం లేదు. బీజేపీ నేరుగా టీడీపీ, జనసేనల మానిఫెస్టోలో భాగస్వామి కాకపోయినా, ఆ ప్రణాళిక విడుదలలో భాగస్వామి అయింది. ఏపీలో ఈ హామీ అమలు చేయడానికి ఏడాదికి సుమారు రూ.36 వేల కోట్లు అవసరమవుతాయి. అవి ఎక్కడ నుంచి వస్తాయో ఇంతవరకు చెప్పలేకపోయారు. ఇక.. ఢిల్లీలో గర్భిణులకు రూ.21 వేలు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, హోళీ, దీపావళి పండగలకు ఉచితంగా ఒక్క గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ స్కీములను కొనసాగిస్తామని కూడా ఆయన అన్నారు. వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని హామీలు ఇచ్చారు. రెండో విడత మరికొన్ని హామీలు ఇచ్చారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని అందులో తెలిపారు. ఎన్నికలు జరిగే లోపు మరికొన్ని ప్రజాకర్షక వాగ్దానాలు చేస్తారట. సిద్దాంతంతో సంబంధం లేకుండా బీజేపీ ఇలా దిగజారి పోయిందా? అనే ప్రశ్నకు జవాబు దొరకదు. ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు పరస్పరం దారుణమైన విమర్శలు చేసుకున్న తర్వాత, తిరిగి ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. అప్పుడే బీజేపీ విలువలు ఏమిటో అర్ధమైపోయింది. ఇక కాంగ్రెస్ విషయానికి వద్దాం. ఆ పార్టీ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాగ్దానాల పోస్టర్ ను విడుదల చేశారు. ఆయనకు జాతీయ స్థాయి ఎలివేషన్ రావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడి ఉండవచ్చు. కానీ ఆయన పేర్కొన్న హామీలు ఎంతవరకు అమలు అవుతాయో గ్యారంటీ లేదు. తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసేస్తున్నామని చెప్పడం చిత్రంగానే ఉంటుంది. మహిళలకు రూ.1500 రూపాయల చొప్పున ఇచ్చే హామీని ఎందుకు అమలు చేయలేకపోయారు?. రైతు భరోసా స్కీమ్ పరిస్థితి ఏమిటి? పూర్తిగా అయినట్లు చెప్పలేకపోతున్నారు. ఇంతవరకు రూ.22 వేల కోట్ల మేర మాఫీ చేశామని చెప్పారు. కాగా ఢిల్లీలో 300 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ అని ప్రకటించారు. అలాగే రూ.500లకే గ్యాస్ సరఫరా చేస్తామని డిల్లీ కాంగ్రెస్ పక్షాన ప్రకటించారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించి ఆ స్కాం అసలు పార్టనర్ ను ఓడిస్తే ఢిల్లీలో మంచిరోజులు వస్తాయని అన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ నేత కవిత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మరికొందరు ఆప్ నేతలు ఈ కేసులో జైలుకు వెళ్లారు. కవిత అరెస్టును స్వాగతించిన కాంగ్రెస్, కేజ్రీవాల్ అరెస్టు అయినప్పుడు మాత్రం బీజేపీని విమర్శిస్తూ ధర్నాలు చేసింది. ఈ ద్వంద్వ వైఖరిపై ఇంతవరకు వివరణ ఇచ్చినట్లు కనిపించదు. పొత్తు కుదరలేదు కనుక లిక్కర్ స్కామ్ పార్టనర్ అని రేవంత్ చెబుతున్నారు. కేసీఆర్ టైమ్ లో ఉన్న అవినీతి నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నామని రేవంత్ ప్రచారం చేసి వచ్చారు. దీనిలో ఎంత నిజం ఉందన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. కొన్ని హామీలు అమలు చేశామని చెబితే ఫర్వాలేదు కాని, అన్నింటిని చేసేసినట్లు ప్రచారం చేస్తే విమర్శలు వస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ తన హామీలలో కొత్తగా విద్యార్ధులందరికి ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. ఇప్పటికే విద్యార్దినులకు ఉచిత బస్ అమలు చేస్తుండగా.. ఇకపై బాలురకు కూడా ఫ్రీ బస్ సదుపాయం అని హామీ ఇచ్చారు. విద్యార్ధులకు మెట్రో చార్జీలలో ఏభై శాతం భరిస్తామని మరో హామీ ఇచ్చారు. యువతను ఆకర్షించడానికి ఆప్ వేసిన గాలం ఇది. ఢిల్లీలో ఉచిత విద్యుత్, ఉచిత నీరు తదితర హామీలను ఆప్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో గవర్నర్ ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేజ్రీవాల్ను, ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అనేక వ్యూహాలను అమలు చేసింది. అందులో భాగంగా ఈడీని కూడా ప్రయోగించిందన్న రాజకీయ విమర్శలు వచ్చాయి. మొత్తంగా.. బీజేపీ ఇన్ని వ్యూహాలు పన్నుతూ డిల్లీలో ఎంత మేర ఫలితాన్ని ఇస్తుందన్నది ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలు తేల్చుతాయి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఢిల్లీ పోస్టర్ వార్లో ఆసక్తికర మలుపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఓపక్క ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభల మైకుల గోలతో రాజధాని మారుమోగిపోతోంది. మరోపక్క సోషల్ మీడియాలో పార్టీల పోస్టర్ వార్లు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.నిజాయితీలేని వ్యక్తులందరినీ నిజాయితీపరుడైన కేజ్రీవాల్ మించిపోయారు అంటూ ట్యాగ్లైన్ ఉంచింది. ఆ పోస్టర్లో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి, ఢిల్లీ బీజేపీ లీడర్లు ఉన్నారు. అయితే.. రాహుల్ గాంధీ ఫొటోను సైతం ఉంచడంతో అది చర్చనీయాంశమైంది. ఆప్ సర్కార్పై, ఆ పార్టీ కన్వీనర్పై అరవింద్ కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ గురువారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. షీలా దీక్షిత్ హయాంలోనే ఢిల్లీ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. అయితే.. కేజ్రీవాల్ పాలనలో జరిగిన అభివృద్ధికి ఆమె హయాంలో జరిగిన పనులకు అసలు పొంతనే లేదని అన్నారు. అంతకు ముందు సైతం ఆయన కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.కేజ్రీవాల్ కూడా మోదీ తరహాలోనే తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారని విమర్శించారు. కాలుష్య నివారణ, రాజధాని ద్రవ్యోల్బణం లాంటి విషయాల్లో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. అలాగే.. దళితులను, గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ కీలక నేతలు సైతం ఆప్ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్.. కేజ్రీవాల్ను దేశ వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. దీంతో.. ఆయన ఫొటోను కూడా తాజా పోస్టర్లో ఉంచారు. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్పై పోటీకి దిగిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కొడుకు) ఫొటోను కూడా ఉంచారు.]మరోవైపు.. బీజేపీ కూడా సోషల్ మీడియాలో ఆప్దా(డిజాస్టర్) సిరీస్ భాగంగా వరుస పోస్టర్లను వదులుతోంది. గూండాలు, నేరస్తులైన ‘‘ఆప్-దా గ్యాంగ్’’కు ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం నేర్పబోతున్నారంటూ తాజాగా మరో పోస్టర్ వదిలింది. ఇండియా కూటమిలో భాగమైన ఆప్ కాంగ్రెస్ల మధ్య పోటీ రాజకీయ చర్చకు దారి తీసింది. హర్యానా, ఢిల్లీ.. ఇలా వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య పోటీ తప్పడం లేదు. ఇండియా కూటమి జాతీయ రాజకీయాల వరకు.. అదీ లోక్సభ ఎన్నికలకే పరిమితమని కూటమి పార్టీలు స్పష్టత ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిజాయితీ కూడిన పాలనకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఫొటోతో ఆప్ ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీ విషయంలో జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని చెబుతోంది. ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్కు చోటు అక్కర్లేదని ఆప్ వాదిస్తోంది. అయితే దానికి కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. మొత్తం 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే తేదీన ఫలితాలను ప్రకటించనుంది. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నారు. -
ఆప్ నేత మనీష్ సిసోడియాకు చుక్కలు? గట్టిపోటీలో బీజేపీ, కాంగ్రెస్
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. అదే నెల 8న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. జంగ్పురా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి బీజేపీ తర్విందర్ సింగ్ మార్వాను, కాంగ్రెస్ ఫర్హాద్ సూరిని పోటీకి నిలిపింది. దీంతో మనీష్ సిసోడియాకు గట్టిపోటీ ఎదురుకానుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.సిసోడియా ఇంతకుముందు 2013, 2015, 2020లలో పట్పర్గంజ్ నుండి పోటీ చేశారు. కానీ ఈసారి పార్టీ ఆయన స్థానాన్ని మార్చింది. కాగా ఢిల్లీ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు బీజేపీ.. జంగ్పురా అసెంబ్లీ సీటుపై తన జెండాను ఎగురవేయలేకపోయింది. 1993, 1998, 2003, 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకోగా, 2013, 2015, 2020లలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అయితే బీజేపీ అభ్యర్థి నాటి విజేతలకు గట్టి పోటీ ఇచ్చింది. ఈసారి బీజేపీ అభ్యర్థిగా తర్విందర్ సింగ్ మార్వా ప్రవేశంతో ఈ స్థానానికి సంబంధించిన సమీకరణలన్నీ మారిపోయాయి.తర్విందర్ సింగ్ మార్వా గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఈ స్థానం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 1998, 2003,2008లలో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఫర్హాద్ సూరి ఈ స్థానం నుంచి బీజేపీకి గట్టిపోటీ ఇస్తారని, ఇటువంటి పరిస్థితిలో సిసోడియా మూడవ స్థానంలో ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ స్థానంలో ఆప్ ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించిందని, ఈ సారి కూడా జంగ్పురా సీటు ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలోకే వస్తుందని సిసోడియా ఆశలు పెట్టుకున్నారు.గత మూడు ఎన్నికల్లో జంగ్పురా అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన హవా చాటింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన ఇంతియాజ్ సింగ్ బక్షిని 16 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థి తర్విందర్ సింగ్ మార్వా నాడు మూడవ స్థానంలో నిలిచారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రవీణ్ కుమార్ బీజేపీకి చెందిన మణీందర్ సింగ్ ధీర్ను 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మార్వా మూడవ స్థానంలో నిలిచారు.ఇది కూడా చదవండి: మళ్లీ గూగుల్ మ్యాప్ బురిడీ.. ఈ సారి ఫ్రెంచ్ పర్యాటకుల వంతు -
హస్తినలో ఆప్, బీజేపీ హోరాహోరీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల సమరం రసకందాయంలో పడింది. కమలం పార్టీ అక్కడ 26 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు సీట్లనూ గెలుస్తూ వస్తున్నా అసెంబ్లీ బరిలో మాత్రం పట్టు చిక్కడమే లేదు. ఈసారి ఎలాగైనా హస్తిన గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు పరివర్తన్ (మార్పు) నినాదాన్ని నమ్ముకుంటోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెడుతూ ఓటర్లకు చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. అవినీతిరహిత పాలన కోసం తమనే గెలిపించాలని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆప్ అంటే ఆపద అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అధికార పార్టీపై ఇప్పటికే యుద్ధ భేరీ మోగించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 53.6 శాతం ఓట్లతో 62 సీట్లు కొల్లగొట్టగా బీజేపీ 39 శాతం ఓట్లతో 8 సీట్లకు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ సోదిలో కూడా లేకుండాపోయింది. కేవలం 4.3 శాతం ఓట్లకు పరిమితమైంది. సీట్ల ఖాతాయే తెరవలేక కుదేలైంది.ద్విముఖమే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్యే ద్విముఖ పోరు సాగుతోంది. రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. వాటితో పాటు కాంగ్రెస్ కూడా మొత్తం 70 సీట్లలోనూ బరిలో ఉన్నా దాని పోటీ నామమాత్రమే. ఆ పార్టీ 2013లో ఢిల్లీలో అధికారం కోల్పోయింది. ఈసారి బీజేపీ, ఆప్లతోపాటు పోటీపడి మరీ హామీలిచ్చినా కాంగ్రెస్కు అవి కలిసొచ్చేది అనుమానమే. న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం కేజ్రీవాల్పై ఇద్దరు మాజీ సీఎంల కుమారులు బరిలో ఉండటం విశేషం. బీజేపీ నుంచి మాజీ సీఎం సాహిబ్సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ బరిలోకి దిగారు. ఈసారి తమకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని బీజేపీ నేతలంటున్నారు. కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు, జనం సొమ్ముతో అద్దాల మేడ కట్టుకోవడం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో ఆప్ నేతల భాగస్వామ్యం, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తమకు లాభిస్తాయని అంటున్నారు. ఆప్ నేతలు సైతం ఈ ఎన్నికల్లో తమకు విజయం సులభం కాదని అంగీకరిస్తున్నారు. అయితే కేజ్రీవా ల్కు జనాదరణ, విశ్వసనీ యత, సంక్షేమ పథకాల సక్రమ అమలు, కొత్త హామీలు గట్టెక్కిస్తాయని ఆశిస్తున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.– సాక్షి నేషనల్ డెస్క్ -
యోగీ జీ.. అమిత్ షాకు కాస్త చెప్పండి: కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బాలేదన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) వ్యాఖ్యలతో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఏకీభవించారు. ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్ అనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతిలో ఉందని, ఆ విషయాన్ని ఆయనకే మీరు కాస్త కూర్చొని చెప్పండని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ నగరంలో లా అండ్ ఆర్డర్ను ఎలా మరుగుపరుచాలో అమిత్ షాకు కాస్త దిశా నిర్దేశం చేయండి యోగీ జీ అంటూ కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi assembly election 2025) ఫిబ్రవరి 5వ తేదీన జరుగనున్న నేపథ్యంలో ఇటు ఆప్, అటు బీజేపీలు తమ ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. కౌంటర్కు రీ కౌంటర్ అన్నట్లు సాగుతోంది ఇర పార్టీల ప్రచారం. దీనిలోభాగంగా యోగీ ఆదిత్యానాథ్ మాట్లాడిన మాటలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు చెప్పింది నిజమే యోగీ జీ..‘ నిన్న( గురువారం) యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఒక మంచి విషయం చెప్పారు. దీనికి ఢిల్లీ ప్రజల కూడా మద్దతుగా నిలుస్తారు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బాలేదని యోగి అన్నారు. దాంతో ఢిల్లీ ప్రజలు వంద శాతం ఏకీభవిస్తారు. ఢిల్లీలో గ్యాంగ్స్టర్లు చాలా ఫ్రీగా తిరుగుతున్నారు. ఢిల్లీలో చాలా గ్యాంగ్స్టర్ గ్రూపులున్నాయి. వీరంతా ఢిల్లీ నగరాన్ని విభజించి వారి వారి కార్యకలాపాల్ని ఎంతో స్వేచ్ఛగా చేసుకుంటున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లని బెదిరించి వారి అరాచకాల్ని సాగిస్తున్నాయి గ్యాంగ్స్టర్ గ్రూపులు. ప్రధానంగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న బడా వ్యాపారస్తులకు ఏ రోజు సుఖం లేదు. రోజూ ఏదొక గ్యాంగ్స్టర్గ్రూప్ నుంచి వారు బెబెదిరింపు కాల్స్ రిసీవ్ చేసుకుంటూనే ఉన్నారు. వారి కుటుంబాల్ని చంపేస్తామంటూ మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల్ని గ్యాంగ్స్టర్ గ్రూపులు వసూలు చేస్తూ ఉంటాయి. ఢిల్లీలో జరిగే గ్యాంగ్ వార్స్కి అక్కడి రోడ్లే సాక్ష్యం. ఢిల్లీలో మహిళలు ఇళ్లు ాదాటి బయటకు రావాలంటే చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీ నగరంలో చిన్న పిల్లలు, మహిళలు తరచు కిడ్నాప్లకు గురౌవుతుంటారు. ఇక్కడ గ్యాంగ్స్టర్లకు కత్తుల్ని వారి వద్దనున్న మారణాయుధాల్ని చాలా బహిరంగంగా వాడుతుంటారు. హత్యలు, చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు నిత్యం ఏదో మూలన జరుగుతూనే ఉంటాయి. ఢిల్లీ ప్రజలు చాలా భయాందోళన మధ్య బ్రతుకుతున్నారనేది నిజం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.ఢిల్లీలో శాంతి భద్రతల బాధ్యత అమిత్ షాదే..‘యూపీలో లా అండ్ ఆర్డర్ అనేది ఎంతో అమోగంగా ఉందన్నారు. ఒక ఫిక్స్డ్ లా అండ్ ఆర్డర్ యూపీలో ఉందన్నారు. యూపీలో గ్యాంగ్స్టర్ గ్రూపులను కట్టడి చేశామని చెప్పారు యోగీ జీ. అక్కడ లా అండ్ ఆర్డర్ బాగుందా.. బాలేదా అనేది నాకైతే తెలీదు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేతుల్లో ఉంది. మరి మీరు(యోగీ ఆదిత్యానాథ్) యూపీలో లా అండ్ ఆర్డర్ ఏదైతే మెరుగైందని చెప్పారో అదే విషయాన్ని అమిత్ షాకు కూడా చెప్పి ఢిల్లీ నగరంలో శాంతి భద్రతల్ని మెరుగుపర్చండి. ఢిల్లీలో గ్యాంగ్స్టర్లకు ఎలా అడ్డుకట్ట వేయాలో కాస్త అమిత్ షా జీకి చెప్పండి యోగీ జీ’ అని కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
బీజేపీ నుంచి సీఎం ఆఫర్ వచ్చింది.. సిసోడియా సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తాను తీహార్ జైలులో ఉన్న సమయంలో బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని చెప్పుకొచ్చారు. అయితే, తాను బీజేపీ ఆఫర్ను నిరాకరించినందుకే ఎక్కువ సమయంలో జైలు ఉన్నట్టు తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు రేపాయి.తాజాగా ఆప్ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. ఆప్పై బీజేపీ చేసిన కుట్రలు ఎవరికీ తెలియవు. ఇతర పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేయడమే బీజేపీ వారి విధానం. బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకుంటారు.. వాళ్ల మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. ప్రజా సంక్షేమం, స్కూల్స్, ఆసుపత్రులు, ప్రజల అవసరాలతో కాషాయ పార్టీ నేతలకు అవసరం లేదు. కేవలం అధికారం కోసమే బీజేపీ ఆరాటపడుతుంది. లిక్కర్ స్కామ్ కేసులో నన్ను అన్యాయంగా జైలులో పెట్టారు.నేను జైలులో ఉన్న సమయంలో బీజేపీ నాకు సీఎం పదవిని ఆఫర్ చేసింది. బీజేపీలో చేరాలని.. అలా అంగీకరిస్తే , ఆప్ ఎమ్మెల్యేలను విడగొట్టి, తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ నిరాకరిస్తే ఎక్కువ కాలం కటకటాల వెనుక ఉంచుతామని బీజేపీ చెందిన ఒంక నేత బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. బీజేపీ ఆఫర్ నిరాకరించిన కారణంగానే ఎక్కువ రోజులు జైలులో ఉన్నట్టు తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయంలో హాట్ టాపిక్గా మారాయి.ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశరాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు జైలుకు వెళ్లారు. ఇక, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా 2023లో అరెస్ట్ అయ్యారు. దాదాపు 17 నెలల పాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించారు. గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంలో జైలు నుంచి విడుదలయ్యారు. ఇక, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాంగ్పురా నుంచి సిసోడియా పోటీ చేస్తున్నారు.మరోవైపు.. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో కొద్దిరోజులే సమయంలో ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క అభ్యర్థి కూడా గెలవలేకపోయారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. ఎనిమిదో తేదీన తుది ఫలితాలు వెలువడనున్నాయి. -
రసవత్తరంగా ఢిల్లీ రణం
శీతలగాలులు కమ్మేసిన సమయంలోనూ దేశ రాజధాని ఎన్నికల హంగామాతో వేడెక్కుతోంది. ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ పక్షాల ‘ఉచిత హామీల’ వ్యూహం ఊపందుకుంది. మహిళా ఓటర్లను కేంద్రంగా చేసుకొని ఎన్నికల మేనిఫెస్టోలలో పార్టీలు పోటా పోటీగా వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. 2012 నుంచి ఢిల్లీలో ఆధిపత్యం చూపుతున్న అధికార ఆప్, దాని ప్రధాన ప్రత్యర్థి బీజేపీలు రెండూ ఏక తీరున ఎడాపెడా హామీలిస్తుంటే, పోగొట్టుకున్న పట్టును వెతుక్కుంటూ కాంగ్రెస్ కొత్త ఉచితాల ప్రకటనలతో ఊపిరి పీల్చుకోవాలని చూస్తోంది. ఆప్ తన మేనిఫెస్టోలో సీనియర్ సిటిజన్లందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యచికిత్స, ఆటోడ్రైవర్లకు 5 గ్యారెంటీలు, అద్దెకున్నవారికి సైతం ఉచిత విద్యుత్, నీటి పథకం వర్తింపు లాంటివి ప్రకటించింది. బీజేపీ తన మేనిఫెస్టోలో హోలీ, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు, గర్భిణు లకు రూ. 21 వేలు, ప్రతి నెలా మహిళలకు రూ. 2.5 వేలు సహా పలు హామీలిచ్చింది. ఇప్పటికే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని బీజేపీ తోసిపుచ్చకపోవడం ఢిల్లీ నమూనాను సమర్థించ డమేనని ఆప్ ఎద్దేవా చేస్తుంటే... బీజేపీ మాత్రం ఆప్ మాటలు ధయాధర్మం చేస్తున్నామన్నట్లున్నా యనీ, తమది మాత్రం సమాజ సమగ్రాభివృద్ధికై సాగిస్తున్న సంక్షేమ వాగ్దానమనీ వాదిస్తోంది. వెరసి, మాటల యుద్ధంతో 70 స్థానాల ఢిల్లీ పీఠానికి పోటీ రసవత్తరంగా మారింది. 1993 నవంబర్లో తొలి ఢిల్లీ శాసనసభ ఏర్పాటైంది. అప్పటి నుంచి గమనిస్తే, ప్రజా ఉద్య మాలు పెల్లుబికిన ప్రతిసారీ జాతీయ రాజధానిలో అధికారం చేతులు మారిందని విశ్లేషణ. 1998లో షీలా దీక్షిత్ అధికారంలోకి వచ్చినా, 2013లో ఆమెను గద్దె దింపి అరవింద్ కేజ్రీవాల్ పీఠమెక్కినా... ప్రతి అసెంబ్లీ ఎన్నిక ముందు ఏదో ఒక ప్రజాందోళన జరిగిందని విశ్లేషకులు గుర్తు చేస్తుంటారు. 1998 నవంబర్లో ఎన్నికలైనప్పుడు అంతకంతకూ పెరుగుతున్న ధరలు సహా ప్రజల కోపకారణాలే ఊతంగా షీలా అధికారంలోకొచ్చారు. అంతకు కొద్దినెలల ముందు లోక్సభ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన బీజేపీ తీరా ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, 2013లో నిర్భయ కేసులో ప్రజ్వరిల్లిన ప్రజాగ్రహం, అవినీతి అంశాల ఆసరాతో, ఉచిత విద్యుత్, నీటి సరఫరా హామీలు అండగా కేజ్రీవాల్ జయకేతనం ఎగరేశారు. సంక్షేమ పథకాలతో 2015, 2020లోనూ గట్టెక్కారు. పదేళ్ళ పైగా ‘ఆప్’ అధికారంలో ఉన్నందున ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజమే. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలూ వాడుతోంది. కాంగ్రెస్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తోంది. చిత్రమేమిటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంతున్నా అదేమీ పట్టనట్టు ఆప్, దాని అధినాయకత్వం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ ఓటర్ల మనసెరిగి ప్రవర్తించడంలో ఆరితేరిన అధికార పక్షం గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంక్షేమ పథకాలు, తాయిలాలతో వారిని ఆకట్టుకోగలిగింది. ఈసారి కూడా పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్య బీమా అందిస్తామంటూ ఆప్ భారీ వాగ్దానమే చేసింది. నిజం చెప్పాలంటే, ఇతర పార్టీలు సైతం తన దోవ తొక్కక తప్పని పరిస్థితిని కల్పించడంలో కేజ్రీవాల్ విజయం సాధించారు. ఒకప్పుడు ‘ఎన్నికల ఉచిత మిఠాయిలు’ అంటూ ఈసడించిన ప్రధాని మోదీ సైతం చివరకు ఢిల్లీలో వాటికే జై కొట్టడం గమనార్హం. ఆప్ మళ్ళీ పగ్గాలు పడుతుందా, లేక పొరుగున హర్యానాలో అనూహ్య విజయంతో ఆశ్చర్యపరిచిన బీజేపీ ఢిల్లీలోనూ ఆ మ్యాజిక్ చేస్తుందా అన్నది ఆసక్తికరం. చిరకాలంగా లోక్సభలో బీజీపీకీ, అసెంబ్లీలో ఆప్కూ అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఓటర్లు ఈసారీ అలాగే చేస్తారా అన్నది ప్రశ్న. ఆప్కు ఒకప్పుడున్న అవినీతి రహిత ఇమేజ్, సామా న్యులకు సానుకూలమనే పేరు ఇప్పుడు దెబ్బతిన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల వలలో పార్టీ నేతలు చిక్కగా, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్తో ఘర్షణతోనే పుణ్యకాలం హరించుకు పోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే. ప్రతి ఎన్నికనూ జీవన్మరణ సమస్యగానే భావించే బీజేపీ ఎప్పటిలానే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకొచ్చింది. నిరుటి లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి భాగస్వాములుగా సీట్ల పంపిణీతో చెట్టపట్టాలేసుకున్న ఆప్, కాంగ్రెస్లు ఈసారి పరస్పరం కత్తులు దూసుకోవడమూ విడ్డూరమే. మరోపక్క భుజాలపై పార్టీ కండువాలు మార్చిన నేతలు పలువురు కొత్త జెండాతో బరిలో అభ్యర్థులుగా నిలవడం కార్యకర్తలకూ, పార్టీ నేతలకే కాదు... ఓటర్లకూ చీకాకు వ్యవహారమే. ఇలాంటి 20 మంది నేతల భవితవ్యం ఢిల్లీ కొత్త పీఠాధిపతిని నిర్ణయిస్తుందని అంచనా. అవన్నీ ఎలా ఉన్నా ప్రధాన చర్చనీయాంశం మాత్రం ఉచిత హామీలే.సమాజంలో అంతరాలు అంతకంతకూ అధికమవుతున్న పరిస్థితుల్లో అణగారిన వర్గాల సముద్ధరణకు చేయూత నివ్వడం సమంజసం. అయితే, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెంచి, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం దూరదృష్టి గల పాలకులు చేయాల్సిన పని. అవసరం లేని ఉచితాలపై మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల జాతరలో తాత్కాలికంగా పైచేయి అనుచితమైన ఉచితాలను పార్టీలు ప్రకటిస్తే, ఆ మాటలు నీటి మీది రాతలుగా మిగిలిపోతాయి. అథవా అమలు చేసినా, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై, పాలనారథం తలకిందులయ్యే ప్రమాదమూ ఉంటుంది. అభివృద్ధి మంత్రానికీ, అధికారం కోసం పప్పుబెల్లాలు పంచాలనుకొనే ఉచితాల తంత్రానికీ నడుమ పోటీలో ఢిల్లీ జనం ఎటు మొగ్గుతారన్నది ఓట్ల లెక్కింపు జరిగే ఫిబ్రవరి 8న చూడాలి. -
Delhi Assembly Election: కేంద్రం ముందు 7 డిమాండ్లు పెట్టిన కేజ్రివాల్
-
Delhi Election: కేజ్రీవాల్ ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ తరపున ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’ ప్రకటించారు. ఈ మ్యానిఫెస్టోలో ఆయన ఢిల్లీలోని మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ఏడు ప్రధాన డిమాండ్లు చేశారు.ఇప్పటివరకు వివిధ ప్రభుత్వాలు మధ్యతరగతిని విస్మరించాయని, వారిని ప్రభుత్వానికి ఉపయోగపడే ఒక ఏటీఎంగానే పరిగణించాయని కేజ్రీవాల్ విమర్శించారు. పలు రాజకీయ పార్టీలు మధ్యతరగతిని పన్ను చెల్లింపుదారులుగా మాత్రమే చూస్తున్నాయని, వారి సమస్యలను విస్మరించాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవితంతో పాటు సౌకర్యాలు పొందగలిగేలా వారి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆప్ తరపున ఆయన ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు. VIDEO | AAP National Convenor Arvind Kejriwal (@ArvindKejriwal) criticises the Centre's tax policies, calling it 'tax terrorism.'"People have to pay taxes while they are alive, but now the government has created a situation where they have to pay even after death. Amid this tax… pic.twitter.com/6LreZj30co— Press Trust of India (@PTI_News) January 22, 2025ఆప్ ఏడు ప్రధాన డిమాండ్లు1. పన్ను రహిత ఆరోగ్య బీమా: ఢిల్లీ పౌరులకు ఉచితంగా సమగ్ర ఆరోగ్య బీమాను అందించాలని, తద్వారా వైద్య చికిత్స కోసం ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని ఆప్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.2. సీనియర్ సిటిజన్లకు ఉచిత చికిత్స: సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలని పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది.3. విద్యా హక్కులో మెరుగుదల: ఢిల్లీలో విద్యా స్థాయిని మరింత మెరుగుపరచడానికి సహాయం అందించాలని ఆప్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.4. ఉపాధి -ఉద్యోగ భద్రత: ఢిల్లీలో యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రతను పెంచాలని పార్టీ డిమాండ్ చేసింది.5. శరళమైన పన్ను విధానం: మధ్యతరగతి వారికి అదనపు పన్ను భారం నుండి ఉపశమనం కలిగించేలా పన్ను విధానాన్ని మరింత శరళంగా మార్చాలని పార్టీ డిమాండ్ చేసింది.6. ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల: ఢిల్లీలో నీరు, విద్యుత్, రోడ్లు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్రం నుండి సహాయం కోరింది.7. గృహనిర్మాణ పథకాలలో సహాయం: ఢిల్లీలోని పేదలు, మధ్యతరగతి వారికి అందుబాటు ధరలలో గృహనిర్మాణ పథకాలను అందించాలని ఆప్ విజ్ఞప్తి చేసింది.అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ‘మా పార్టీ ఢిల్లీ ప్రజలకు అండగా నిలిచింది. అయితే మధ్యతరగతి వారికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఉపశమనం లభించలేదు. దీనిని మార్చడానికి, ఢిల్లీలోని అన్ని తరగతుల గొంతును ప్రభుత్వానికి వినిపించడానికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: వీళ్లంతా ఐఐటీ బాబాలు.. మంచి ఉద్యోగాలు వదిలి.. -
సీఎం అతిషిపై మళ్లీ నోరుజారిన బీజేపీ నేత
న్యూఢిల్లీ:ఢిల్లీ బీజేపీ నేత రమేష్ బిదూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ఆయన సీఎం అతిషిని టార్గెట్ చేశారు. అతిషి తల్లిదండ్రులు పార్లమెంట్పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్గురును సమర్థించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అతిషి తల్లిదండ్రులది భారత్ వ్యతిరేక మనస్తత్వమని అన్నారు.అందుకే పార్లమెంట్పై దాడి చేసిన వ్యక్తిని కాపాడేందుకు వారు ప్రయత్నించారన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజి నియోజకవర్గం నుంచి బిదూరి సీఎం అతిషిపై బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎనిమిదిన ఫలితాలు రానున్నాయి.కాగా, బిదూరి సీఎం అతిషి లక్ష్యంగా వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అతిషి తన తండ్రిని మార్చి మర్లెనా అనే పేరు నుంచి అతిషిసింగ్గా మారిందన్నారు. ఎన్నికలు రాగానే ఢిల్లీ వీధుల్లో అతిషి జింకలా పరుగులు పెడుతోందని మరో సందర్భంలో బిదూరి వ్యాఖ్యానించారు. మరోవైపు ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి రమేష్ బిదూరియేనన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: ఆప్,బీజేపీల మధ్య చైనీస్ సీసీ కెమెరాల వివాదం -
Delhi Elections: ఆప్-బీజేపీ మధ్య చైనీస్ సీసీటీవీల జంగ్
న్యూఢిల్లీ: వచ్చే ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా న్యూఢిల్లీ స్థానం నుండి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ప్రవేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి భయంతో అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర నిరాశకు గురయ్యారని ఆరోపించారు. కేజ్రీవాల్ పంజాబ్ ప్రభుత్వ వనరులను ఉపయోగించుకుంటున్నారని, మురికివాడల దగ్గర చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. అలాగే పంజాబ్లోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీకి పిలిపించారని, వారు ఆప్ కార్యకర్తలుగా మారి, వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రవేశ్ వర్మ ఆరోపించారు. తాజాగా అమృత్సర్ నుండి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారన్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీలో చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా భద్రతా దృక్కోణం నుండి చూస్తే కూడా ముప్పు వాటిల్లుతుందన్నారు. పంజాబ్ నుండి పెద్ద సంఖ్యలో వస్తున్న వాహనాలు ఢిల్లీలో తిరుగుతున్నాయని, వాటిలోని వస్తువులను తనిఖీ చేయడం లేదని ప్రవేశ్ వర్మ ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వ ట్రక్కులలో కుర్చీలతోపాటు ఇతర వస్తువులు ఢిల్లీకి వస్తున్నాయన్నారు.అరవింద్ కేజ్రీవాల్ తన ఎమ్మెల్యేల నిధిగా ఉన్న రూ.30 కోట్లలో కేవలం రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. న్యూఢిల్లీలో ఎలాంటి కాంక్రీట్ పనులు చేయలేదని, పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ఢిల్లీలో అభివృద్ధి పనులు చేయడానికి బదులు.. పంజాబ్ మాఫియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో ఎన్నికల్లో గెలవాలని కేజ్రీవాల్ కలలు కంటున్నారని ప్రవేశ్వర్మ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో పంజాబ్ ప్రభుత్వ సాయాన్ని వెంటనే నియంత్రించాలని తాను ఎన్నికల సంఘాన్ని కోరుతున్నానని అన్నారు. ఢిల్లీ ప్రజలకు నిజానిజాలన్నీ తెలుసని, రాబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓటమి ఖాయమని ప్రవేశ్వర్మ జోస్యం చెప్పారు. -
Delhi Election: 150 సరిహద్దుల మూసివేత.. పారా మిలటరీ దళాల మోహరింపు
న్యూఢిల్లీ: రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ రాజధానిలోని 150 సరిహద్దులను మూసివేశారు. ఈ 150 సరిహద్దుల్లోని 162 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు దిగ్బంధించారు. ఈ ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలతో పాటు, స్థానిక పోలీసులు 24 గంటలు పహారా కాస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయానికి చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ ఢిల్లీ సరిహద్దుల్లో 162 చోట్ల దిగ్బంధనాలు ఏర్పాటు చేసి, 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నామని తెలిపారు. భద్రతా ఏర్పాట్ల కోసం పోలీసులు 175 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు. హోం మంత్రిత్వ శాఖ నుండి 250 కంపెనీల పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగనున్నాయి. నగదు, మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో పికెట్లను ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఢిల్లీ పోలీస్ ఎలక్షన్ సెల్ తెలిపిన వివరాల ప్రకారం రాజకీయ పార్టీల ర్యాలీలు, బహిరంగ సమావేశాల విషయంలో ముందుగా వచ్చిన వారికి తొలుత అనుమతినిస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీ అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం -
Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం
ఫిబ్రవరి(2025)లో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. వ్యూహప్రతివ్యూహాలతో ముందుకుసాగుతున్నాయి. అయితే అటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్.. ఈ పార్టీల కళ్లన్నీ దళిత ఓటర్లపైనే ఉన్నాయి. ఢిల్లీ రాజకీయాల్లో దళితుల ఓట్లు అధికారాన్ని నిర్ణయిస్తాయి. వీరి మద్దతు ఎవరికి ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి.రాష్ట్రంలో 12 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేశారు. అయితే దళితుల ఆధిపత్యం 20 సీట్లలో కొనసాగుతోంది. ఢిల్లీలో దళిత ఓటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ మూడు పార్టీలు దళితులను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీలోని 70 సీట్లలో 12 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వ్ చేశారు. ఢిల్లీ జనాభాలో దాదాపు 17 శాతం మంది దళితులున్నారు. వీరిలో 38 శాతం మంది జాట్లు, 21 శాతం మంది వాల్మీకి సమాజానికి చెందినవారు.ఈసారి ఢిల్లీలో బీజేపీ 14, కాంగ్రెస్ 13, ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) 12 మంది దళిత అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రిజర్వ్డ్ సీట్ల కంటే ఎక్కువమంది దళిత అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టాయి. బీజేపీ జనరల్ స్థానాల నుండి ఇద్దరు దళిత అభ్యర్థులను నిలబెట్టింది. వారు మాటియా మహల్ నుండి దీప్తి ఇండోరా, బల్లిమారన్ నుండి కమల్ బాగ్డి. కాంగ్రెస్ కూడా నరేలా జనరల్ స్థానం నుండి దళిత అభ్యర్థి అరుణ కుమారిని నిలబెట్టింది.ఎస్సీ సీట్లపై ఆధిపత్యం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలు2020: ఆప్ 12 సీట్లు గెలుచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది2015: ఆప్ 12 సీట్లు గెలుచుకుంది.2013: ఆప్ 9 సీట్లు గెలుచుకుంది.2008: కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుంది.2003: కాంగ్రెస్ 10 సీట్లు గెలుచుకుంది.1998: కాంగ్రెస్ 12 సీట్లు గెలుచుకుంది.1993: బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది.ఈ లెక్కలను అనుసరించి చూస్తే ఈసారి కూడా అధికారానికి షెడ్యూల్డ్ కులాల ఓట్లు కీలకంగా మారనున్నాయనే అంచనాలున్నాయి. అందుకే వివిధ పార్టీలు షెడ్యూలు కులాల సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ, వారిని తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. 20 దళిత ప్రాబల్య స్థానాల విషయానికి వస్తే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 56 శాతం ఓట్లతో 19 సీట్లను సొంతం చేసుకుంది. నాడు బీజేపీ ఖాతాలోకి ఒకే ఒక సీటు వచ్చింది. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు.2015, 2020లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలకు(Scheduled Castes) రిజర్వ్ చేసిన 12 నియోజకవర్గాలలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గత ఎన్నికల్లో కూడా బీజేపీ ఈ స్థానాల్లో రెండు లేదా మూడు కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోలేదు. ఢిల్లీలోని 12 సీట్లలో దళిత సమాజ ఓటర్లు 17 నుండి 45 శాతం వరకు ఉన్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలు వెల్లడికానున్నాయి.ఇది కూడా చదవండి: Delhi Election 2025: 14 బహిరంగ సభలకు సీఎం యోగి -
‘మా వాళ్లని భయపెడుతున్నారు.. దాడులు చేస్తున్నారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ((Delhi Assembly Election 2025) ాభాగంగా తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ నేతల భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ((AAP) నాయకురాలు, ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు. ఆప్ కార్యకర్తలను భయపెట్టడమే కాకుండా దాడులు సైతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికి ఆమె లేఖ రాశారు. ప్రధానంగా బీజేపీ(BJP) ఎంపీ రమేష్ బిధురి మేనల్లుడు తమ కార్యకర్తలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాడని ఆమె లేఖ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేశారు.ఇంట్లో కూర్చోకపోతే.. కాళ్లు చేతులు విరిచేస్తారట..!ఢిల్లీ సీఎం అతిషి.. ఈసీకి ఫిర్యాదు చేసిన ాదాని ప్రకారం.. ‘ఇవి తమ ఎన్నికలని, ఇంట్లో కూర్చోకుండా బయటకుస్తే కాళ్లు, చేతులువిరిచేస్తామని ఆప్ కార్యకర్తలకు బీజేపీ నేతలు వార్నింగ్ ఇచ్చినట్లు అతిషి ేపేర్కొన్నారు. ఫిబ్రవరి 5న ఎన్నికలు.. 8వ తేదీన ఫలితాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 5వ ేతేదీన జరుగనున్నాయి. ఇంకా సుమారు ెరెండు వారాల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మళ్లీ ెగెలిచేందుకు ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠంపై తామే కూర్చోవాలని బీజేపీ సైతం గట్టిగా పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. దీనిలో భాగంగా ఇరు పార్టీల మధ్య తీవ్ర ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎక్కడా కూడా ఇరు పార్టీలు తగ్గేదేలే అన్నట్లు తమ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.అది కేజ్రీవాల్ పనే .. ఎఫ్ఐఆర్ నమోదు చేయండిఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార ఆమ్ ఆద్మీపార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో తమదైన రీతిలో దూసుకుపోతున్నారు. తాజాగా ఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.డిల్లీలో ఓడిపోతామన్న భయంతో ఆప్ ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు దిగుతుందని ఆరోపించారు. దీనిలో భాగంగానే ఆప్ నేతలు.. ఢిల్లీ ఓటర్లకు కుర్చీలు పంచి పెడుతున్నారని పర్వేష్ వర్మ మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ని ఆప్ ఉల్లంఘిస్తుందని పోలీసులకు, ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆప్ నేతలు స్థానికంగా ఉన్న ఓటర్లకు కుర్చీలు పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పర్వేష్వర్మ ఎన్నికల ఏజెంట్ సందీప్ సింగ్ చేత ఫిర్యాదు చేయించారు పర్వేష్ వర్మ. -
‘అది కేజ్రీవాల్ పనే .. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి’
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Election 2025) సమీపిస్తున్న వేళ.. అధికార ఆమ్ ఆద్మీపార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో తమదైన రీతిలో దూసుకుపోతున్నారు. తాజాగా ఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డిల్లీలో ఓడిపోతామన్న భయంతో ఆప్(AAP) ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలకు దిగుతుందని ఆరోపించారు. దీనిలో భాగంగానే ఆప్ నేతలు.. ఢిల్లీ ఓటర్లకు కుర్చీలు పంచి పెడుతున్నారని పర్వేష్ వర్మ మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)ని ఆప్ ఉల్లంఘిస్తుందని పోలీసులకు, ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆప్ నేతలు స్థానికంగా ఉన్న ఓటర్లకు కుర్చీలు పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పర్వేష్వర్మ ఎన్నికల ఏజెంట్ సందీప్ సింగ్ చేత ఫిర్యాదు చేయించారు పర్వేష్ వర్మ.‘ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్.. తమ కార్యకర్తల చేత కుర్చీలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని ఈస్ట్ కిద్వాల్ నగర్ లో నిన్న(ఆదివారం) కుర్చీలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది ఆప్ నేతలే పని. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే పనిలో పడ్డారు ఆప్ నేతలు. ఇది కేజ్రీవాల్.. ఆప్ కార్యకర్తల చేత చాలా తెలివిగా చేయిస్తున్నారు. ఒక ట్రాలీలో కుర్చీలను తీసుకెళ్తున్న వ్యక్తి వాటిని పంపిణీ చేస్తున్నాడు. ఆ కార్యకర్త కేజ్రీవాల్ పంపిన కార్యకర్తే’ అని పర్వేష్ వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను సైతం జత చేశారు. వెంటనే కేజ్రీవాల్పైఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.వారికి భూములివ్వండి.. నగరానికి వారే బ్యాక్బోన్కాగా, వరుసగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు కేజ్రీవాల్. ఇప్పటికే పలు అంశాలపై లేఖలు రాసిన కేజ్రీవాల్.. మరొకసారి మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నివాసాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఇందుకోసం ఒక స్కీమ్ను తీసుకొచ్చి, దాని ద్వారా వారికి ఈఎంఐల రూపంలో నగదు చెల్లించే అవకాశం ఇవ్వాలన్నారు.ఈరోజు(ఆదివారం) ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ ఢిల్లీ ప్రభుత్వానికి భూములు ఇవ్వండి. ఎందకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఈ భూమిని పంపిణీ చేద్దాం. రాజ్యాంగం ప్రకారం దేశ జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో భూ పంపిణీ చేసే అధికారం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ అంశం కేంద్రం చేతుల్లో ఉంది. అందుకే ప్రధాని మోదీకి లేఖ రాశాను’ అని పేర్కొన్నారు.ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు గురించి కూడా లేఖలో మోదీకి వివరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ‘ ఎన్డీఎంసీ, ఎంసీడీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నివాసం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. వారికి రాయితీలు కల్పించి తక్కువ రేట్లకు భూమిని ఇస్తే వారు గృహాలను ఏర్పాటు చేసుకుంటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వీరిది కీలక పాత్ర. వారు నగరానికి బ్యాక్బోన్వీరు భూమి కోసం తీసుకున్న రుణాన్ని నెలవారీ పద్దతుల్లో తిరిగి చెల్లించే విధంగా స్కీమ్ తీసుకురండి. వారు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో నివాసం ఉంటున్నారు. అవి తాత్కాలికమే. రిటైర్మెంట్ అయిన తర్వాత వారు ఆ గృహాలను వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. శానిటేషన్ కార్మికులు వేరే ఇళ్లు కొనుక్కోవాలన్నా, ఢిల్లీ వంటి మహా నగరంలో అద్దెకు ఉండాలన్నాఅది భరించలేనంతగా ఉంది. అలా కాకుండా వారికి భూమిని ప్రభుత్వమే ఇచ్చి ప్రోత్సహం ఇస్తే వారికి ఎంతో మేలు చేసిన వారిగా మిగిలిపోతాం’ అని లేఖలో పేర్కొన్నట్లు కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపారు. -
Delhi Election 2025: 14 బహిరంగ సభలకు సీఎం యోగి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఒకే దశలో ఫిబ్రవరి 5న ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ముమ్మర ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నేతలు ప్రచారపర్వంలో మునిగితేలుతున్నారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తన హవా చాటనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సీఎం యోగి షెడ్యూల్ను కూడా బీజేపీ వర్గాలు కూడా వెల్లడించాయి. సీఎం యోగి పాల్గొనబోయే సమావేశాలకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి.సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలో 14 బహిరంగ సభలలో ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 23న మూడు సమావేశాలు, జనవరి 28న నాలుగు సమావేశాలు, జనవరి 30న నాలుగు సమావేశాలు, ఫిబ్రవరి ఒకటిన మూడు సమావేశాల్లో సీఎం యోగి పాల్గొననున్నారు.యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలోని తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాలలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థులు అజయ్ మహాబల్, పవన్ శర్మ, ఆశిష్ సూద్, రవీంద్ర సింగ్, ఉమాంగ్ బజాజ్, ప్రద్యుమాన్ రాజ్పుత్ (ద్వారక), కర్తార్ సింగ్ తన్వర్, గజేంద్ర యాదవ్ (మెహ్రౌలి), బజరంగ్ శుక్లా, సంజయ్ గోయెల్, మోహన్ సింగ్ బిష్ట్, కైలాష్ గెహ్లాట్ మొదలైనవారు పోటీచేస్తున్న ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో యోగి పాల్గొననున్నారు.ఇది కూడా చదవండి: బీహార్ బాలికకు ప్రధాని మోదీని ప్రశ్నించే ఛాన్స్! -
Delhi Election 2025: ప్రచారంలో మూమూస్ రుచిచూసిన కేజ్రీవాల్
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.తాజాగా కేజ్రీవాల్ ప్రచారంలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఉన్న ఒక దుకాణంలో కేజ్రీవాల్ మూమూస్ రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ నేతలతో పాటు ఒక దుకాణం దగ్గర మోమోస్ తింటూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ‘ఢిల్లీ వాసులకు, మోమోలకు మధ్య అనుబంధం విడదీయరానిది. ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న కేజ్రీవాల్ను స్వాగతిస్తూ ఒక మోమోస్ విక్రేత అతనికి మోమోస్ అందించారు’ అని రాసింది. दिल्लीवालों और मोमो का रिश्ता थोड़ा गहरा है 🥟♥️नई दिल्ली विधानसभा में चुनाव प्रचार के दौरान एक मोमो वाले भाई ने दिल्ली के बेटे @ArvindKejriwal जी को रोककर खिलाये मोमो‼️ pic.twitter.com/ydnOddSK5y— AAP (@AamAadmiParty) January 19, 2025ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన.. బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ లపై పోటీకి దిగారు. 2013 నుండి న్యూఢిల్లీ స్థానం నుండి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముక్కోణపు పోరుగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ కూడా తన సత్తాను చాటేందుకు ఎన్నికల రంగంలోకి దిగింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5 ఓటింగ్ జరగనుండగా, ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడికానున్నాయి.ఇది కూడా చదవండి: Delhi Election 2025: కేజ్రీవాల్, ఆతిశీ సహా ‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్లు వీరే -
Delhi Election 2025: కేజ్రీవాల్, ఆతిశీ సహా ‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్లు వీరే
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం సాగించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సీఎం ఆతిశీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా 40 మంది ఆప్ నేతల పేర్లు ఉన్నాయి.ఈసారి ఢిల్లీలో ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్ సీఎం భగవంత్ మాన్లతో పాటు మంత్రులు సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ఢిల్లీ, పంజాబ్ మంత్రులను స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ ప్రచారకర్తల జాబితాలో మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, హర్భజన్ సింగ్, మీట్ హయర్, దిలీప్ పాండే, రాంనివాస్ గోయల్, గులాబ్ సింగ్, రితురాజ్ గోవింద్ ఉన్నారు.మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా విడుదల చేసింది, ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ఖాజీ నిజాముద్దీన్, దేవేంద్ర యాదవ్, అశోక్ గెహ్లాట్, హరీష్ రావత్, ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా, రణదీప్ సింగ్ సుర్జేవాలా, సచిన్ పైలట్, సుఖ్వీందర్ సింగ్ సుఖుతో సహా మొత్తం నలభై మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. Aam Aadmi Party announces the list of 40-star campaigners for the #DelhiAssemblyElection2025 AAP National Convenor Arvind Kejriwal, his wife Sunita Kejriwal, Delhi CM Atishi, Manish Sisodia, Sanjay Singh, Punjab CM Bhagwant Mann's names are included in the list of star… pic.twitter.com/glRzUwuT6N— ANI (@ANI) January 19, 2025ఇదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన స్టార్ ప్రచారకుల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్, ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి, గిరిరాజ్ సింగ్ సహా 40 మంది నేతల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. బీజేపీ జాబితాలో నలుగురు సినీ ప్రముఖులు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా కనిపించనున్నారు. ఢిల్లీలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.ఇది కూడా చదవండి: Success Story: నాడు అమ్మతోపాటు గాజులమ్మి.. నేడు ఐఏఎస్ అధికారిగా.. -
మోదీ జీ.. వారికి భూమిలిచ్చి ఆదుకోండి: కేజ్రీవాల్ మరో లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Election 2025) మరింత సమీపిస్తున్న వేళ.. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).. వరుసగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు అంశాలపై లేఖలు రాసిన కేజ్రీవాల్.. మరొకసారి మోదీకి లేఖ రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నివాసాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఇందుకోసం ఒక స్కీమ్ను తీసుకొచ్చి, దాని ద్వారా వారికి ఈఎంఐల రూపంలో నగదు చెల్లించే అవకాశం ఇవ్వాలన్నారు.ఈరోజు(ఆదివారం) ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ ఢిల్లీ ప్రభుత్వానికి భూములు ఇవ్వండి. ఎందకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఇళ్లు నిర్మించుకోవడానికి ఈ భూమిని పంపిణీ చేద్దాం. రాజ్యాంగం ప్రకారం దేశ జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో భూ పంపిణీ చేసే అధికారం అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ అంశం కేంద్రం చేతుల్లో ఉంది. అందుకే ప్రధాని మోదీకి లేఖ రాశాను’ అని పేర్కొన్నారు.ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు గురించి కూడా లేఖలో మోదీకి(Narendra Modi)కి వివరించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ‘ ఎన్డీఎంసీ, ఎంసీడీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నివాసం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. వారికి రాయితీలు కల్పించి తక్కువ రేట్లకు భూమిని ఇస్తే వారు గృహాలను ఏర్పాటు చేసుకుంటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వీరిది కీలక పాత్ర. వారు నగరానికి బ్యాక్బోన్వీరు భూమి కోసం తీసుకున్న రుణాన్ని నెలవారీ పద్దతుల్లో తిరిగి చెల్లించే విధంగా స్కీమ్ తీసుకురండి. వారు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన వాటిల్లో నివాసం ఉంటున్నారు. అవి తాత్కాలికమే. రిటైర్మెంట్ అయిన తర్వాత వారు ఆ గృహాలను వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. శానిటేషన్ కార్మికులు వేరే ఇళ్లు కొనుక్కోవాలన్నా, ఢిల్లీ వంటి మహా నగరంలో అద్దెకు ఉండాలన్నాఅది భరించలేనంతగా ఉంది. అలా కాకుండా వారికి భూమిని ప్రభుత్వమే ఇచ్చి ప్రోత్సహం ఇస్తే వారికి ఎంతో మేలు చేసిన వారిగా మిగిలిపోతాం’ అని లేఖలో పేర్కొన్నట్లు కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపారు. ఇటీవల జాట్స్ కమ్యూనిటీని ఓబీసీల్లో చేర్చాలనే డిమాండ్ను ప్రధాని మోదీ దృష్టి తీసుకొచ్చారు కేజ్రీవాల్. జాట్స్ కమ్యూనిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం జాబితాలో వారిని ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఒకవేళ ఇలా చేస్తే రాజస్తాన్ నుంచే వచ్చే జాట్స్ ఢిల్లీ యూనివర్శటీల్లో అడ్మిషన్లు పొందడంతో పాటు, ఎయిమ్స్లో జాబ్స్కూ పొందవచ్చు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్మి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంచితే, గత రెండు పర్యాయాలుగా ఢిల్లీలోఆప్ అధికారాన్ని చేపట్టింది. 2013 నుంచి ఇప్పటివరకూ ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే ఈసారి ఎలాగైనా ఢిల్లీ పగ్గాల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆప్కు ధీటుగా ప్రచారాన్నిసాగిస్తూ బీజేపీ సైతం దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా వీరిద్దరి ప్రచారం నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కేజ్రీవాల్ కారుపై రాయితో దాడి: బీజేపీ పనే అంటోన్న ఆప్! -
బీజేపీ గూండాలతో కేజ్రీవాల్ను చంపించే ప్రయత్నం: సీఎం ఆతిశీ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగిన దరిమిలా ముఖ్యమంత్రి ఆతిశీ ఈ ఘటనకు కారణం బీజేపీ అంటూ, ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ను చంపడానికి భారతీయ జనతా పార్టీ శిక్షణ పొందిన గూండాలను పంపిందని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ ఇలా చేస్తున్నదని స్పష్టమవుతోందన్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మీడియాతో మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను చంపడానికి నేరస్తులు, గూండాలను పంపినట్లు స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. ఈ దాడిలో పాల్గొన్న రోహిత్ త్యాగి అని, అతను ఎప్పుడూ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ పక్కనే ఉంటాడన్నారు. ఆయన పర్వేష్ వర్మ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడన్నారు.अरविंद केजरीवाल पर हमला करने वाले BJP के गुंडे Hardcore Criminal‼️♦️ केजरीवाल जी पर हमला करने वाला एक शख़्स राहुल उर्फ शैंकी था। यह व्यक्ति प्रवेश वर्मा के साथ रहता है ♦️ इस शख़्स के ऊपर Arms Act समेत डकैती, मारपीट और जान से मारने की कोशिश जैसे कई केस दर्ज हैं@AtishiAAP pic.twitter.com/CozzJ4k0Lf— AAP (@AamAadmiParty) January 19, 2025ఈ కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిపై 2011లో దొంగతనం కేసు, హత్యాయత్నం కేసు నమోదయ్యాయని, ఈ నేరానికి అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే నిబంధన ఉందని ఆతిశీ(atisi) పేర్కొన్నారు. దాడిలో పాల్గొన్న మూడవ వ్యక్తి సుమిత్ అని, అతనిపై దొంగతనం, దోపిడీ, హత్యాయత్నం కేసులు నడుస్తున్నాయన్నారు. శనివారం అరవింద్ కేజ్రీవాల్ పై దాడి చేసిన ముగ్గురు గూండాలు సాధారణ బీజేపీ కార్యకర్తలు(BJP workers) కాదని, శిక్షణ పొందిన గూండాలు, నేరస్తులని.. వారిపై నమోదైన కేసులను చూస్తే తెలుస్తుందని ఆతిశీ పేర్కొన్నారు. దీనిని చూస్తుంటే ఎన్నికల భయంతో బీజేపీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ను చంపడానికి ప్రయత్నిస్తోందని స్పష్టంగా తెలుస్తున్నదని ఆమె ఆరోపించారు.ఈ ప్రమాదం తర్వాత కూడా ఎన్నికల సంఘం ఏమీ స్పందించలేదని ఆతిశీ పేర్కొన్నారు. ఈ సమయంలో ఎన్నికల కమిషన్ కు గరిష్ట అధికారం ఉన్నప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ ఘటనపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ కిల్లర్ తరహా వ్యక్తులు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ కోసం ప్రచారం చేయడానికి వచ్చారా లేదా అరవింద్ కేజ్రీవాల్ను చంపడానికి వచ్చారా? అని ప్రశ్నించారు. వారు ఢిల్లీకి ఎందుకు వచ్చారు? అరవింద్ కేజ్రీవాల్పై ప్రతిరోజూ దాడి జరుగుతోందని, తాజాగా జరిగిన ఘటన అరవింద్ కేజ్రీవాల్ హత్యకు జరిగిన కుట్ర అని సంజయ్సింగ్ ఆరోపించారు.ఇది కూడా చదవండి: పారా గ్లైడింగ్లో ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం -
‘ఆప్’తో పొత్తు..కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Elections) ఆమ్ఆద్మీపార్టీ(ఆప్), కాంగ్రెస్(Congress) పార్టీల మధ్య శాశ్వతంగా దూరం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత అవసరమైతే ఆప్(AAP)నకు మద్దతు ఇస్తారా? అనే ప్రశ్నకు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ పార్టీతో కాంగ్రెస్కు భవిష్యత్తులో ఎటువంటి పొత్తు అక్కర్లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని మాకెన్ చెప్పారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,ఆప్ విడివిడిగానే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్,బీజేపీ(BJP) మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఇండియా కూటమిలో భాగంగా లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన పార్టీలో ఆప్ సహా ఒక్కొక్కటిగా ఇటీవల కాంగ్రెస్కు దూరమవుతుండడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ(ఎస్సీపీ) పార్టీ అధినేత శరద్పవార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పొత్తు లోక్సభ ఎన్నికలవరకేనని అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పొత్తు ఉండాలని ఏమీ లేదన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీ(ఎస్పీ) కూడా ఇటీవల కాంగగ్రెస్ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఎస్పీ కాంగ్రెస్కు కాకుండా ఆమ్ఆద్మీపార్టీకి మద్దతిస్తుండడం గమనార్హం. ఎస్పీ బాటలోనే తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆప్కు ఇప్పటికే మద్దతు ప్రకటించింది.కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అదే నెల 8వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆప్ భావిస్తుండగా ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి ఆప్కు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందు కోసం రెండు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఈ ఎన్నికల కోసం తన తొలి విడత మేనిఫెస్టోను ప్రకటించింది. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ ఆ మేనిఫెస్టో తమదేనని, బీజేపీ కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు. -
కేజ్రీవాల్ కారుపై రాయితో దాడి: బీజేపీ పనే అంటోన్న ఆప్!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election 2025) ప్రచారంలో భాగంగా ఈరోజు(శనివారం) ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అధ్యక్షుడు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడి జరిగింది. అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) కారులో వెళుతున్న సమయంలో రాయి వేశాడో దుండగుడు. అయితే ఇది బీజేపీ పనే అని ఆప్ ఆరోపిస్తోంది.‘బీజేపీ(BJP)కి భయం పట్టుకుంది. బీజేపీ బాగా భయాందోళనకు గురౌతోంది. దాంతోనే దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే అరవింద్ ేజ్రీవాల్ కారుపై దాడి చేశారు’ అని మాటల యుద్ధానికి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆప్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.ఈ మేరకు వీడియోతో పాటు బీజేపీపై పలు ఆరోపణలు చేసింది ఆప్. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. అరవింద్ కేజ్రీవాల్ ను రాళ్లతో టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆయన ప్రచారం చేయలేకపోతున్నారు కాబట్టి రాళ్లతో దాడులకు దిగుతోంది. ఏం జరిగినా కేజ్రీవాల్వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. దీనికి ఢిల్లీ ప్రజలు మీకు గట్టిగానే బుద్ధి చెబుతారు’ అని ఆప్ ట్వీట్లో పేర్కొంది.నల్లరంగు ఎస్యూవీలోకేజ్రీవాల్ వెళుతున్న సమయంలో, చుట్టూ సెక్యూరిటీ ఉండగా కొంతమంది నిరసనకారులు ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా కేజ్రీవాల్ కారును అడ్డగించారు. ఆ సమయలో ఒక పెద్దరాయి కేజ్రీవాల్ కారుపై వచ్చి పడింది. దాంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. కేజ్రీవాల్ ను అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఆప్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.Arvind Kejriwal attacked with a stone in New Delhi VS by BJP Gundas😳pic.twitter.com/VxHpJlz0L7— Gss🇮🇳 (@Gss_Views) January 18, 2025 కాగా గత రెండు పర్యాయాలుగా ఢిల్లీలోఆప్ అధికారాన్ని చేపట్టింది. 2013 నుంచి ఇప్పటివరకూ ఆప్ ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే ఈసారి ఎలాగైనా ఢిల్లీ పగ్గాల్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆప్కు ధీటుగా ప్రచారాన్నిసాగిస్తూ బీజేపీ సైతం దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా వీరిద్దరి ప్రచారం నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. -
బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ:బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ మేనిఫెస్టోలోని హామీలన్నీ తమ నుంచి కాపీ కొట్టినవేనని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి బీజేపీకి విజన్ లేదని అర్థమవుతోందన్నారు. ఇక ప్రజలు ఇలాంటి విజన్ లేని పార్టీని ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు.‘గతంలో పీఎం మోదీ ఉచితాలు మంచివి కావన్నారు. ఇప్పుడేమో బీజేపీ మా ఉచిత పథకాలన్నీ కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెడుతోంది. ప్రధాని ఇప్పటికైనా ఉచితాలు మంచివేనని,కేజ్రీవాల్ పథకాలు సరైనవేనని ఒప్పుకోవాలి. ఉచితాలు దేవుడు పెట్టే ప్రసాదాలు.కేజ్రీవాల్ అమలు చేసిన పథకాలన్నీ కొనసాగుతాయని నడ్డా చెబుతున్నారు. మరి అలాంటప్పుడు మీకెందుకు ఓట్లేయాలి’అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.కాగా, బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం(జనవరి17) ఢిల్లీలో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో బీజేపీ ఢిల్లీ ప్రజలకు కీలక హామీలిచ్చింది. మహిళా సమ్మాన్ యోజన పేరిట మహిళలకు నెలనెలా రూ.2500 నగదు, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు, గర్భిణీ మహిళలకు రూ.21వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే ఇవన్నీ తమ పథకాలేనని కేజ్రీవాల్ అంటుండడం గమనార్హం.ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 8వ తేదీ ఫలితాలు వెల్లడవుతాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ, ఆమ్ఆద్మీపార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ అంతగా ప్రభావం చూపబోదనే అంచనాలున్నాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆప్ భావిస్తుండగా ఈసారి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని కృత నిశ్చయంతో బీజేపీ ఉంది. ఇదీ చదవండి: బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టోలో కీలక హామీలివే.. -
బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టోలో కీలక హామీలివే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. శుక్రవారం(జనవరి17) ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు. మహిళా సమృద్ధి యోజన పేరుతో ఢిల్లీలో అర్హులైన మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు ఇచ్చే స్కీమ్ను అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే ఆమోదిస్తామని తెలిపారు.పేద మహిళలకు గ్యాస్ సిలిండర్పై 500 రూపాయల సబ్సిడీ ఇస్తామన్నారు. వీటితో పాటు మరిన్ని కీలక హామీలిచ్చారు. ఈ సందర్భంగా జేపీనడ్డా మాట్లాడుతూ ‘దేశ రాజకీయాల్లో సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చారు. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించేవారు ఆ తర్వాత వాటిని ప్రకటించిన వాళ్లు కూడా మర్చిపోయారు.బీజేపీ ‘సంకల్ప పాత్ర’ పేరుతో మేనిఫెస్టోలను ప్రకటించడమే కాకుండా వాటిని నిజం చేసి చూపిస్తుంది. బీజేపీ చెప్పింది చేస్తుంది. చెప్పనిది కూడా చేసి చూపిస్తుంది. మోదీ గ్యారెంటీ..అమలయ్యే గ్యారంటీ.2014లో బీజేపీ ఐదు వందల హామిలిస్తే 499 హామీలు అమలు చేశాం.2019లో 235 హామీలిస్తే 225 అమలు చేశాం. మిగతా హామీలు అమలుచేసే ప్రయత్నంలో ఉన్నాయి. బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే.. హోలీ, దీపావళి పండుగల సమయంలో అర్హులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్గర్భిణీ స్త్రీల కోసం 21000 రూపాయల సాయంఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్ల ఏర్పాటుఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ..!కాగా, ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ఆద్మీపార్టీ(ఆప్), బీజేపీ మధ్యే ప్రధాన పోరు జరగనున్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ ముక్కోణపు పోరు ఉండబోదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆప్ ప్రధాన స్కీమ్లను ప్రకటించింది. నెలనెలా మహిళలకు నగదు ఇచ్చే స్కీమ్తో పాటు 60 ఏళ్లు దాటిన వృద్ధులకు పూర్తి ఉచితంగా వైద్యం లాంటి జనాకర్షక పథకాలను ప్రకటించింది. ఎన్నికల నేపథ్యంలో ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న రమేష్బిదూరి సీఎం అతిషితో పాటు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. రమేష్ బిదూరి కల్కాజి నియోజకవర్గంలో సీఎం అతిషిపై పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘సుప్రీంలో ‘ఆప్’ సర్కారుకు ఊరట -
చెప్పులు ఇవ్వడం కాదు! ఇచ్చిన హమీలు అమలు కూడా చేయాలని బెదిరిస్తున్నాడ్సార్!
చెప్పులు ఇవ్వడం కాదు! ఇచ్చిన హమీలు అమలు కూడా చేయాలని బెదిరిస్తున్నాడ్సార్! -
ఏఐ కంటెంట్కు లేబులింగ్ తప్పనిసరి: ఈసీ
న్యూఢిల్లీ: ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఏఐ జనరేటెడ్ కంటెంట్ వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏఐ సాంకేతికతతో రూపొందించిన చిత్రాలు, వీడియోలు, ఆడియోలపై ‘ఏఐ జనరేటెడ్/డిజిటల్లీ ఎన్హాన్స్డ్/ సింథటిక్ కంటెంట్ వంటి లేబుల్స్ జతచేయాలంటూ నిబంధనను విధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ఫేక్(Deepfake) కారణంగా తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్కుమార్ ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. తప్పుడు సమాచారం ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గతేడాది లోక్సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా(Social Media) వేదికల వినియోగంపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly Elections) ఎన్నికలకు అన్ని పార్టీలు డిజిటల్ ప్రచారకులను నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల డిస్కైమర్లను ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది.ఇదీ చదవండి: శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ -
Delhi Elections-2025: బడా పార్టీలకు ఛోటా దళాల షాక్?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు తమ పూర్తి సత్తాను సమకూర్చుకుంటున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ, ఏఐఎంఐఎం లాంటి చిన్న రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్లతో పూర్తిస్థాయిలో పోటీపడేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను చూస్తుంటే బడా పార్టీలకు ఛోటా దళాలు షాకివ్వనున్నాయనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో బీఎస్పీ మొత్తం 70 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించగా, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 10కిపైగా ముస్లిం ప్రాబల్య స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతోంది.మరిన్ని ర్యాలీలకు మాయావతి సిద్ధంమీడియాకు అందిన వివరాల ప్రకారం బీఎస్పీ, ఏఐఎంఐఎంలు ఎన్నికల ప్రచారంలో బడా నేతలను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాయి. ఒకవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి ర్యాలీలు నిర్వహిస్తుండగా, మరోవైపు ఎఐఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ ర్యాలీలు మొదలుపెట్టారు. ఢిల్లీలోని చిన్న రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో బడా పార్టీలకు గట్టి సవాలు విసరడానికి సిద్ధమవుతున్నాయి. ముస్లిం ప్రాబల్యం కలిగిన ప్రాంతాల్లో వివిధ సమస్యలను పరిష్కరించడం, అవినీతిని అరికట్టడం, సుపరిపాలన అందించడం లాంటి పలు వాగ్దానాలను ఆ పార్టీలు చేస్తున్నాయి.‘ఆప్’కు పోటీ ఇస్తామంటున్న బీఎల్పీబడా పార్టీలతో పోటీపడుతున్న చిన్న పార్టీలలో భారతీయ లిబరల్ పార్టీ (బీఎల్పీ) కూడా ఉంది. దీనిని ఇటీవల అమెరికాకు చెందిన డాక్టర్ మునీష్ కుమార్ రైజాదాతో పాటు అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న పలువురు కలిసి స్థాపించారు. ఈ సందర్భంగా డాక్టర్ మునీష్ కుమార్ రైజాదా మీడియాతో మాట్లాడుతూ తాను ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగమయ్యామని, కానీ ఇప్పుడు ‘ఆప్’కు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అన్నారు. దాదాపు 15 నెలల క్రితం భారతదేశానికి తిరిగి వచ్చిన రైజాదా, న్యూఢిల్లీ స్థానం నుండి ఆప్ అధినేత కేజ్రీవాల్పై పోటీ చేయనున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ మాజీ ఎంపీ ప్రవేశ్ వర్మ కూడా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ సందీప్ దీక్షిత్ కు టికెట్ ఇచ్చింది.ఢిల్లీలో బీఎల్పీ అధికారంలోకి వస్తే, తాము చేసే మొదటి పని అవినీతి నిరోధక కమిషన్ (ఏసీసీ) ఏర్పాటు చేయడమేనని రైజాదా అన్నారు. కాగా దళితులు, వెనుకబడిన వర్గాల్లో తన స్థానాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన బీఎస్పీ ఢిల్లీలోని మొత్తం 70 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. రాబోయే రోజుల్లో మాయావతి మరిన్ని ర్యాలీలు నిర్వహించే ప్రణాళికపై కూడా పార్టీ కసరత్తు చేస్తోంది.బీజేపీతో ప్రత్యక్ష పోరాటంపై ఏఐఎంఐఎం దృష్టిహైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం ఢిల్లీలోని 10 నుంచి 12 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇప్పటివరకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ముస్తఫాబాద్ నుండి తాహిర్ హుస్సేన్, ఓఖ్లా నుండి షఫా ఉర్ రెహ్మాన్ పోటీ చేస్తారని తెలిపింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసుల్లో వీరిద్దరూ నిందితులు. ఢిల్లీ ఏఐఎంఐఎం అధ్యక్షుడు షోయబ్ జమాయ్ మీడియాతో మాట్లాడుతూ, సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఇద్దరు బలమైన అభ్యర్థులను పార్టీ ఇప్పటికే నిలబెట్టిందని తెలిపారు. ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీతో ప్రత్యక్ష పోరాటంపై పార్టీ దృష్టి సారించిందన్నారు. కాగా ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: విదేశీ మహిళ ఒడిలో గణేశుడు.. ‘బ్యూటీ ఆఫ్ సనాతన్’ -
సీఎం అతిషిపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఢిల్లీ(Delhi)లో నేతల విమర్శలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం అతిషి(Atishi)పై బీజేపీ సీనియర్ నేత రమేష్బిదూరి (Ramesh Bidhuri) తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నాలుగేళ్లుగా ఢిల్లీ సమస్యలను పట్టించుకోని అతిషి ఎన్నికలు సమీపించిన వేళ ఓట్ల కోసం ఢిల్లీ వీధుల్లో జింకలా పరుగెడుతున్నారని బిదూరి అన్నారు.ఢిల్లీ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. నగరంలో వీధుల పరిస్థితి చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. గడిచిన నాలుగేళ్లలో అతిషి ఎప్పుడూ ఈ సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అడవిలో జింకలా ఢిల్లీ వీధుల్లో ఆమె తిరుగుతున్నారని బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతిషి మర్లెనా తన తండ్రిని మార్చి అతిషి సింగ్గా మారిందని గత వారం కూడా బిదూరి అతిషిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కాగా, రాజకీయ ప్రత్యర్థులపై వివాదాస్పద కామెంట్లు చేయడం బిదూరికి సర్వసాధారణమైపోయింది. బీఎస్పీ నేత డానిష్ అలీని దూషించడం మొదలు.. ఎంపీ ప్రియాంకా గాంధీపైనా వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణమయ్యారు. దీనిపై బీజేపీ అధిష్టానం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో కల్కాజి నియోజకవర్గంలో సీఎం అతిషిపై బీజేపీ తరపున బిదూరి పోటీ చేస్తుండడం గమనార్హం. ఇదీ చదవండి: అతిషి, అల్కాలాంబా ఎవరు ధనవంతులు -
ఆతిశీ.. అల్కా లాంబా.. ఎవరు ధనవంతులు? ఎంత బంగారం ఉంది?
దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుంది. ఈ నేపధ్యంలో రాజకీయపార్టీలు మంచి ఉత్సాహంలో ఉన్నాయి. తాజాగా ఎన్నికల బరిలోకి దిగిన సీఎం అతిశీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఆమె కల్కాజీ స్థానం నుండి పోటీకి దిగారు. ఆతిశీ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబాపై పోటీకి దిగారు. అల్కా లాంబా కూడా తాజాగా తన నామినేషన్ దాఖలు చేశారు. తమతమ నామినేషన్లలో వారిద్దరూ తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. అయితే వీరిద్దరిలో ధనవంతులెవరు? ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందనేని ఆసక్తికరంగా మారింది.ముందుగా కల్కా జీ సీటు విషయానికొస్తే ఇది ఢిల్లీలోని ఒక హై ప్రొఫైల్ సీటుగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆతిశీ, అల్కా లాంబా మధ్య పోటీ కారణంగా ఈ సీటుకు మరింత ప్రాధాన్యత వచ్చింది. బీజేపీ కూడా ఇక్కడి నుంచి ప్రముఖ నేత రమేష్ సింగ్ బిధురిని బరిలోకి దింపింది. బిధురి 2003, 2008, 2013లలో తుగ్లకాబాద్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. అల్కా లాంబా దాదాపు ఐదేళ్ల పాటు ఆప్లో ఉండి 2019లో కాంగ్రెస్లో చేరారు. కల్కాజీ నియోజకవర్గంలో మొత్తం 1,94,515 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,06,893 మంది పురుష ఓటర్లు, 87,617 మంది మహిళా ఓటర్లు, ఐదుగురు ట్రాన్స్జెండర్ ఓటర్లున్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ మార్లేనా(Atishi Marlena) ఆస్తుల విలువ రూ.76,93,347.98. గత ఐదేళ్లలో తన సంపద 28.66 శాతం పెరిగిందని ఆతిశీ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆమెకు ఎటువంటి స్థిరాస్తి లేదు. ఆభరణాల పేరుతో కేవలం 10 గ్రాముల బంగారం మాత్రమే ఉంది. సొంత కారు లేదా మరే ఇతర వాహనం కూడా లేదు. కల్కాజీ అసెంబ్లీ స్థానం(Kalkaji Assembly Constituency) నుండి నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో, తనపై రెండు క్రిమినల్ పరువు నష్టం కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆమె తెలియజేశారు. తన దగ్గర 30 వేల రూపాయల నగదు ఉందని, తనకు మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.ఆతిశీపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా(Alka Lamba) కూడా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో తెలియజేశారు. అల్కా లాంబా మొత్తం ఆస్తులు రూ.3.41 కోట్లు. అల్కా లాంబాకు రూ.61.12 లక్షల విలువైన చరాస్తులు ఉండగా, ఆమెపై ఆధారపడిన వారిలో ఒకరికి రూ.14.36 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. గత ఐదేళ్లలో ఆమె సంపద రూ.20.12 లక్షలు పెరిగింది. అల్కా లాంబా గురుగ్రామ్లో రూ.80 లక్షల విలువైన 500 చదరపు అడుగుల వాణిజ్య ఫ్లాట్ను, ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్-1లో రూ.2 కోట్ల విలువైన నివాస ఆస్తిని కలిగివున్నారు. అఫిడవిట్ ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆమె ఆదాయం రూ. 8.28 లక్షలు కాగా, 2023-24లో రూ. 8.91 లక్షలు, 2022-23లో రూ. 5.35 లక్షలుగా ఉంది. అల్కాలాంబా తన దగ్గరున్న ఆభరణాల గురించి అఫిడవిట్లో ప్రస్తావించలేదు.ఇది కూడా చదవండి: కేజ్రీవాల్కు మరింత టెన్షన్.. ఈడీ విచారణకు కేంద్రం అనుమతి -
కేజ్రీవాల్కు మరింత టెన్షన్.. ఈడీ విచారణకు కేంద్రం అనుమతి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాబోయే ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇంతలోనే కేజ్రీవాల్ను మరో కష్టం చుట్టుముట్టింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అనుమతి ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఈ అనుమతిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీకి అనుమతినిచ్చింది. ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు అరవింద్ కేజ్రీవాల్పై అభియోగాల నమోదుపై స్టే విధించింది. ఇందుకోసం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పీఎంఎల్ఏ కింద ప్రాసిక్యూట్ చేయడానికి అవసరమైన అనుమతి లేకుండానే ట్రయల్ కోర్టు ఛార్జ్ షీట్ను పరిగణనలోకి తీసుకుందని కేజ్రీవాల్ వాదించారు. సీబీఐ తర్వాత ఇప్పుడు ఈడీకి ఇందుకు అనుమతి లభించింది. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి నిరోధక చట్టం కింద అరవింద్ కేజ్రీవాల్పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సీబీఐ గత ఏడాది ఆగస్టులో అవసరమైన ఆమోదం పొందింది. అయితే ఈడీ ఇందుకు ఇంకా ఆమోదం పొందలేదు. అయితే ఇప్పుడు హోం మంత్రిత్వ శాఖ స్వయంగా కేజ్రీవాల్పై చర్యలు తీసుకునేందుకు అనుమతినిచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్లో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ 'సౌత్ గ్రూప్' నుండి లంచం తీసుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బృందం దేశ రాజధానిలో మద్యం అమ్మకాలు, పంపిణీని పర్యవేక్షించింది. 2021-22 సంవత్సరానికి ఢిల్లీ ఆప్ ప్రభుత్వం రూపొందించిన ఎక్సైజ్ విధానం నుంచి ఈ బృందం లబ్ది పొందిందనే ఆరోపణలున్నాయి.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్పై కాంగ్రెస్ ప్రచార దాడి -
Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్పై కాంగ్రెస్ ప్రచార దాడి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలన్నీ గెలుపు గుర్రం ఎక్కేందుకు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తాను కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది. రాబోయే ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)పై మరింత బలమైన ప్రచార దాడి చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ కొత్తగా ఐదు ప్రత్యేక మొబైల్ వ్యాన్లను ప్రారంభించింది. ఇవి ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరుగుతాయి. రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాల గురించి ప్రజలకు తెలియజేస్తాయి. ‘10 ఏళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ అవసరం’ అనే నినాదాన్ని ప్రదర్శిస్తూ రూపొందించిన ఎల్ఈడీ వ్యాన్ను ఢిల్లీ మాజీ మంత్రి నరేంద్ర నాథ్ ప్రారంభించారు. आज दिल्ली प्रदेश कांग्रेस कमेटी कार्यालय पर पूर्व मंत्री श्री @DrNath007जी वार रूम वाइस चेयरमैन श्री @sidharthraoinc , श्री @TasveerSolanki और वरिष्ठ कांग्रेस नेताओं द्वारा विधानसभा चुनाव हेतु कांग्रेस के चुनाव प्रचार रथ को हरी झंडी दिखाकर रवाना किया गया।यह रथ सभी 70… pic.twitter.com/nFt94VtBsK— Delhi Congress (@INCDelhi) January 14, 2025కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలలో ‘ప్యారీ దీదీ యోజన’ కింద మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సహాయం, ఢిల్లీ నివాసితులందరికీ రూ. 25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకం, విద్యావంతులైన, నిరుద్యోగ యువత(Unemployed youth)కు నెలకు రూ. 8,500 ఆర్థిక సహాయం మొదలైనవి ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నెరవేర్చిన వాగ్దానాల గురించి కూడా ఈ వ్యాన్లు ప్రజలకు తెలియజేస్తాయని పార్టీ నేతలు తెలిపారు. 2013లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ నుంచి ఢిల్లీ అధికారాన్ని సొంతం చేసుకుంది.తాజాగా ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో జరిగిన పార్టీ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ప్రభుత్వాన్ని నడిపిన విధానాన్ని దేనితోనూ పోల్చలేమని అన్నారు. ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను కూడా టార్గెట్ చేసుకున్నారు. ఢిల్లీలో ఎన్నికలకు ముందు రాహుల్ నిర్వహించిన తొలి ర్యాలీ 2020లో మత హింసకు ప్రభావితమైన ప్రాంతంలో జరిగింది. ఈ అల్లర్లలో 50 మందికి పైగా జనం మృతిచెందారు.ఇది కూడా చదవండి: New Delhi: కాంగ్రెస్కు కొత్త కార్యాలయం.. నేడు ప్రారంభించనున్న సోనియా -
ఓట్ల కోసం బంగారం పంచుతున్నారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ:ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఎన్నికల ప్రధానంగా పోటీ పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు విమర్శల దాడి పెంచారు. తాజాగా ఆప్ (AAP)అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బంగారు గొలుసులు పంచుతున్నారని ఆరోపించారు.‘ఈ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోంది.ఓటర్లను ఆకట్టుకునేందుకు జాకెట్లు,షూస్,చీరలు, డబ్బులు పంచుతున్నారు. కొన్ని కాలనీల్లో అయితే బంగారు గొలుసులు కూడా ఇస్తున్నట్లు సమాచారం.నేను ఓటర్లను కోరేది ఒకటే..ఓట్లను అమ్ముకోకండి. బంగారం,డబ్బులు ఎవరిచ్చినా సరే,అది ఆప్ అభ్యర్థులైనా సరే వారికి ఓటు వేయకండి’ అని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కేజజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలకు బీజేపీ(Bjp) ఎంపీ మనోజ్ తివారీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘కేజ్రీవాల్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. కేజ్రీవాల్ ఎప్పుడో మద్యం ట్రేడర్లకు సోల్డ్ఔట్ అయ్యారు’ అని మండిపడ్డారు. -
మోదీ జీ.. వారిని ఎప్పుడు ఓబీసీల్లో చేరుస్తారో చెప్పండి?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అటు ఆప్ ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలు ఎక్కడా కూడా తగ్గడం లేదు. కౌంటర్కు రీ కౌంటర్ అన్నట్లు వారి ప్రచారం సాగుతోంది. రోజూ ఏదో కొత్త అంశంపై వీరి ప్రచారం జోరు సాగుతోంది. అయితే దీనిలో భాగంగా ప్రధాని మోదీకి లేఖాస్త్రం సంధించారు ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇందులో ఢిల్లీలోని జాట్ కమ్యూనిటీని కేంద్రం ఎప్పుడుఓబీసీ జాబితాలో చేరుస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు కేజ్రీవాల్,ఈ మేరకు ఒక సుదీర్ఘనమైన లేఖను ప్రధాని మోదీకి రాసినట్లు కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ ‘ జాట్స్ కమ్యూనిటీని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చాం. కానీ కేంద్ర ప్రభుత్వం జాబితాలో వారిని ఇంకా ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఒకవేళ ఇలా చేస్తే రాజస్తాన్ నుంచే వచ్చే జాట్స్ ఢిల్లీ యూనివర్శటీల్లో అడ్మిషన్లు పొందడంతో పాటు, ఎయిమ్స్లో జాబ్స్కూ పొందవచ్చు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్మి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. కేవలం ఇది ఢిల్లీలోని జాట్స్కు మాత్రమే ఇలా ఉండకూడదు కదా? అని డిమాండ్ చేశారుమీరు ప్రామిస్ చేశారు.. మరిచిపోయారా?దేశంలోని జాట్స్ కమ్యూనిటీని ఓబీసీల్లో చేర్చుతామని మీరే ప్రామిస్ చేశారు. బీజేపీలో ఇద్దరు అగ్రనేతలు హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), జాట్స్కు ప్రామిస్ చేశారు. వారిని కేంద్ర స్థాయిలో ఓబీసీల్లో చేర్చుతామని హామీలు అయితే ఇచ్చారు కానీ దాన్ని ఇంకా అమలు చేయలేదు. ఆ హామీ ఇంకా అసంపూర్ణంగానే ఉండిపోయింది’ అని ఆరోపించారు కేజ్రీవాల్మోదీ జీ, అమిత్ షాలను అడుగుతున్నా..ఈ హామీ ఇచ్చిన ప్రధాని మోదీని, అమిత్ షాలను అడుగుతున్నాను. జాట్స్ కమ్యూనిటీని ఎప్పుడు కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చుతారో చెప్పండి. ఈ విషయంలో జాట్ నాయకులు నన్ను కలిశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకూ నోరు మెదపకపోవడం వారు ఆగ్రహంతో ఉన్నారు. గత పదేళ్ల నుంచి తమకు అన్యాయం జరుగుతూనే ఉందని వారు ఆరోపిస్తున్నారు’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.మీరు మురికివాడలను బాగు చేయండి..ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే.. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో నివసించిన శీష్ మహల్ టాయిలెట్ల ఖరీదే ఎక్కవంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ తిప్పికొట్టారు. మీరు మురికివాడ(Delhi Slums)లను బాగు చేస్తే, తాను ఎన్నికల్ల్లో పోటీచేయనంటూ సవాల్ విసిరారు. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకుంటానన్నారు.‘మీరు మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోండి. దీనిపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి. ఇళ్లు కోల్పోయిన మురికివాడ ప్రజలందరికీ అదే స్థలంలో ఇళ్లు నిర్మించండి. అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ నా చాలెంజ్ మీరు స్వీకరిస్తారా? అని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే. -
Delhi Election-2025: అందరి దృష్టి షకూర్ బస్తీపైనే.. ఆ పార్టీల మధ్య హోరాహోరీ?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటికి 2025, ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8న జరగనుంది. కాగా అందరి దృష్టి షకుర్ బస్తీ సీటుపైనే నిలిచింది. ఈ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యేంద్ర జైన్ను అభ్యర్థిగా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ కర్నైల్ సింగ్ కు టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ సతీష్ లూత్రా కు టికెట్ ఇచ్చింది.షకుర్ బస్తీ(Shakur Basti) అసెంబ్లీ స్థానం రాజధాని ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో ఒకటి. ఈ స్థానం 2013 నుండి ఆమ్ ఆద్మీ పార్టీ ఆధీనంలో ఉంది. సత్యేంద్ర జైన్ ఇక్కడి నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో గెలిచారు. ఈసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ షకుర్ బస్తీ స్థానం నుండి సత్యేంద్ర జైన్ను ఎన్నికల బరిలో దింపింది. ఈయన బీజేపీ అభ్యర్థి కర్నైల్ సింగ్ పై పోటీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సీటుపై గట్టి పోటీ కనిపిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సతీష్ లూత్రా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పోటీనివ్వనున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.2013 నుండి షకుర్ బస్తీ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) గెలుచుకుంటూవస్తోంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సత్యేంద్ర జైన్ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎస్సీ వాట్స్ను 7,592 ఓట్ల తేడాతో ఓడించారు. నాటి ఎన్నికల్లో సత్యేంద్ర జైన్కు 51,165 ఓట్లు రాగా, ఎస్సీ వాట్స్కు 43,573 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి దేవ్ రాజ్ అరోరా 3,382 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్.. బీజేపీ అభ్యర్థి ఎస్సీ వాట్స్ను 3133 ఓట్ల తేడాతో ఓడించారు. నాటి ఎన్నికల్లో సత్యేంద్ర జైన్కు 51,530 ఓట్లు రాగా, బీజేపీ చెందిన ఎస్సీ వాట్స్కు 48,397 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. నాటి కాంగ్రెస్ అభ్యర్థి చమన్ లాల్ శర్మకు 4,812 ఓట్లు వచ్చాయి.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: ఇప్పటికే 85 లక్షలమంది పుణ్యస్నానాలు -
బీజేపీకి అధికారమిస్తే మురికి వాడలు నాశనమే
న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీకి అధికారమిస్తే మురికివాడలన్నిటినీ ధ్వంసం చేస్తుందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మురికివాడల నివాసితుల సంక్షేమం కంటే కూడా అక్కడి భూములపైనే బీజేపీ దృష్టి ఉందన్నారు. ఆదివారం కేజ్రీవాల్ షకూర్ బస్తీలో మీడియాతో మాట్లాడారు. ‘వాళ్లు మొదటగా మిమ్మల్ని ఓట్లడుగుతారు. ఎన్నికలయ్యాక మీ భూములివ్వమంటారు’అని బీజేపీనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. బస్తీల్లోని వారి సమస్యలను పక్కనబెట్టి, వారి భూమిని ఆక్రమించుకునేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు. చేతనైతే వలస జీవులపైనా, మురికివాడల్లో ఉండే వారిపైనా నమోదైన కేసులన్నిటినీ ఎత్తేసి, వారికి మరో చోట పునరావాసం కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. 24 గంటల్లో వీటిని తూచా తప్పకుండా అమలు చేస్తే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటామని పేర్కొన్నారు. ఇందులో బీజేపీ విఫలమైతే, ఈ ఎన్నికల్లో పోటీ చేసి మురికివాడల ప్రజలకు రక్షణగా నిలుస్తానని, వారి బస్తీలను ఎవరు నాశనం చేస్తారో చూస్తానని హెచ్చరించారు. మురికివాడల్లో వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్న బీజేపీ నినాదం కేవలం కంటితుడుపు చర్యమాత్రమేనన్నారు. ‘ఢిల్లీలో 4 లక్షల మురికివాడలుండగా గడిచిన పదేళ్లలో కేంద్రం కేవలం 4,700 ఫ్లాట్లు మాత్రమే నిర్మించింది. ఈ రకంగా చూస్తే ఢిల్లీలోని మురికివాడల ప్రజలందరికీ గృహ వసతి కల్పించేందుకు మరో వెయ్యేళ్లు పడుతుంది’అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. -
మీరు అలా చేస్తే.. నేను పోటీనే చేయను: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో అన్ని మురికివాడల కంటే.. కేజ్రీవాల్(Arvind Kejriwal) సీఎంగా ఉన్న సమయంలో నివసించిన శీష్ మహల్ టాయిలెట్ల ఖరీదే ఎక్కవంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలను ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. మీరు మురికివాడ(Delhi Slums)లను బాగు చేస్తే, తాను ఎన్నికల్ల్లో పోటీచేయనంటూ సవాల్ విసిరారు. ఢిల్లీలోని మురికివాడల కూల్చివేతలపై కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి పునరావాసం కల్పిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని విరమించుకుంటానన్నారు.‘మీరు మురికివాడల ప్రజలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోండి. దీనిపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి. ఇళ్లు కోల్పోయిన మురికివాడ ప్రజలందరికీ అదే స్థలంలో ఇళ్లు నిర్మించండి. అప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఈ నా చాలెంజ్ మీరు స్వీకరిస్తారా? అని ధ్వజమెత్తారు.‘ఒకవేళ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మురికివాడలను కూల్చివేయాలని భావిస్తోంది. వారి స్థలాలను ఆక్రమించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. ముందు మీ ఓట్లు కావాలి.. తర్వాత మీ స్థలం కావాలి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో ఢిల్లీలోని మురికివాడ ప్రజలకు కేవలం 4,700 ఫ్లాట్లు మాత్రమే నిర్మించి ఇచ్చింది. ఢిల్లీ మహానగరంలో నాలుగు లక్షలకు మందికి పైగా మురికివాడల్లో ఉన్నారు. మీరు అది చేయాలంటే మీకు వెయ్యేళ్లు పడుతుంది’ అంటూ సెటైర్లు వేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో హోదా అనుభవించడం కోసం కాదని, ప్రజల హోదా పెంచడం కోసమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. మురికివాడల కంటే.. శీష్ మహల్లో టాయిలెట్ల ఖరీదే ఎక్కువఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ‘శీష్ మహల్’ను అత్యంత విలాసవంతంగా నిర్మించారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించిన సంగతి తెలిసిందే. నిన్న( శనివారం). ఢిల్లీలోని అన్ని మురికివాడల కంటే శీష్ మహల్లోని టాయిలెట్లే అత్యంత ఖరీదైనవని ఆయన వ్యాఖ్యానించారు.దేశంలోని పేదల కోసం ప్రధాని మోదీ 3.58 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తే..కేజ్రీవాల్ మాత్రం ప్రజల సొమ్ముతో ఆర్భాటంగా ఖరీదైన నివాసాన్ని నిర్మించారని విమర్శించారు. మంత్రి అమిత్ షా శనివారం జేఎల్ఎన్ స్టేడియంలో మురికివాడల నివాసితులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడల్లోని ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మౌలిక వనరుల కల్పనకు మోదీ ప్రభుత్వం రూ.68వేల కోట్లను వెచ్చించిందన్నారు.మురికివాడల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై ఇప్పటికే ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు వివరాలను అందజేశామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే వీటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
బీజేపీ సీఎం అభ్యర్థి బిధూరీకి అభినందనలు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి మాజీ ఎంపీ రమేశ్ బిధూరీకి ఆప్ జాతీయ కన్వినర్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. బిధూరీని ఒకట్రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించవచ్చంటూ తనకు సమాచారముందని చెప్పారు. బిధూరీ అయినా మరెవరైనా సరే తనతో బహిరంగ చర్చకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. శనివారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. సీఎం అతిశీ పోటీ చేసే కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ రమేశ్ బిధూరీని పోటీకి నిలిపింది. శుక్రవారం సీఎం అతిశీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ‘దుర్భాషలాడటంలో ఆరితేరి’న రమేశ్ బిధూరీని ఎంపిక చేసిందని చెప్పారు. సీఎం అతిశీ తన ఇంటి పేరును మర్లెనా నుంచి సింగ్కు మార్చుకోవడం ద్వారా తండ్రిని కూడా మార్చేశారని బిధూరీ అన్నారు. అదేవిధంగా, ఢిల్లీలో రోడ్లను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తామంటూ బిధూరీ వ్యాఖ్యానించడం తెలిసిందే. కాగా, తను పోటీ చేసే న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ ఎంపీలు ఓట్లను దేశవ్యాప్తంగా ఉన్న తమ సొంత నియోజకవర్గాలకు మార్చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఈసీకి లేఖ రాశారు. బీజేపీ న్యూఢిల్లీ అభ్యర్థి పర్వేశ్ వర్మ అధికార నివాసం పేరుతో 33 ఓట్లను బదిలీ చేశారని ఆరోపించారు. విచారణ చేపట్టి, వర్మను అనర్హుడిగా ప్రకటించాలన్నారు. పోలింగ్ బూత్లను కబ్జా చేసుకోవడం కంటే ఇది అధ్వానమైన చర్యగా అభివర్ణించారు. ఇదీ చదవండి: కేజ్రీవాల్పై పర్వేశ్ వర్మ.. సీఎం అతిశీ వర్సెస్ రమేష్ బిదూరి -
Delhi Election: 29 సవాల్
దేశరాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో రాజకీయ సందడి కొనసాగుతోంది. పలు సీట్ల జయాపజయాలపై విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. రాజధానిలో మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు, ఒకసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఆ 29 స్థానాలు సవాలుగా నిలిచాయి. విజయంలో పార్టీల వైఫల్యంకాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ(Congress, BJP, Aam Aadmi) పార్టీలు ఈ 29 స్థానాల్లో తమ ఉనికిని చాటుకోవడంలో విఫలమయ్యాయి. అందుకే ఈ సీట్లను గెలవలేకపోయాయి. అయితే ఈసారి ఆ మూడు పార్టీలు ఈ సీట్లను గెలుచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ స్థానాల్లోని కొన్ని సీట్ల టిక్కెట్లను ఆయా పార్టీలు కీలక నేతలకు కేటాయించాయి. ఇందుకోసం పార్టీలు పెద్ద ఎత్తున కసరత్తు చేశాయి. మూడు ప్రధాన పార్టీలకు సవాలుగా నిలిచిన ఈ 29 సీట్లలో కాంగ్రెస్ 17 సీట్లలో తన ఖాతాను తెరవలేకపోయింది. బీజేపీ 12 సీట్లు గెలవలేకపోయింది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ 29 స్థానాల్లో ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. ఈ సీట్లలోని మతియా మహల్(Matiya Mahal) సీటును ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రెండూ ఇప్పటివరకు గెలవలేకపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థానాన్ని రెండుసార్లు సొంతం చేసుకుంది.కాంగ్రెస్ విజయానికి అడ్డంకిఈ ప్రాంతం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన షోయబ్ ఇక్బాల్ ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుండి, ఐదుసార్లు ఇతర పార్టీల నుండి గెలిచారు. ఒకసారి ఆయన కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. అదేవిధంగా బాదర్పూర్ సీటును పలుమార్లు గెలుచుకున్న రాంవీర్ సింగ్ బిధురి అలియాస్ రామ్సింగ్ నేతాజీకి కాంగ్రెస్ టిక్కెట్పై గెలిచే అదృష్టం దక్కలేదు. అయితే ఆయన ఇతర పార్టీల టికెట్పై లేదా స్వతంత్ర అభ్యర్థి(Independent candidate)గా గెలవగలిగారు. ఢిల్లీలో మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. బురారి, రిథాల, ముండ్కా, కిరాడి, రోహిణి, షాలిమార్ బాగ్, మాటియా మహల్, మోతీ నగర్, హరి నగర్, జనక్పురి, బిజ్వాసన్, సంగం విహార్, గ్రేటర్ కైలాష్, బదర్పూర్, కృష్ణ నగర్, గోకల్పూర్, కరవాల్ నగర్ సీట్లను గెలవలేకపోయింది. కాంగ్రెస్ విజయానికి ఈ సీట్లు పెద్ద అడ్డంకిగా నిలిచాయి.విశ్వాస్ నగర్ సీటులో ఆప్కు అవిశ్వాసం ఢిల్లీలో బీజేపీ సంస్థాగత నిర్మాణం బలంగా ఉంది. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉంది. అయినప్పటికీ, సుల్తాన్పూర్ మజ్రా, మంగోల్పురి, మాటియా మహల్, బల్లిమారన్, వికాస్పురి, న్యూఢిల్లీ, జంగ్పురా, డియోలి, అంబేద్కర్ నగర్, ఓఖ్లా, కొండ్లి, సీలంపూర్ తదితర 12 సీట్లను బీజేపీ ఇప్పటికీ గెలుచుకోలేకపోయింది. అలాగే న్యూఢిల్లీ, జంగ్పురా తదితర స్థానాలు బీజేపీకి ఆందోళన కలిగించే సిట్లుగా ఉన్నాయి. కాగా బీజేపీకి బలమైన కంచుకోటగా నిలిచిన విశ్వాస్ నగర్ ఆమ్ ఆద్మీ పార్టీకి సవాలుగా నిలిచింది. గత రెండు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో భారీ మెజారిటీతో విజయం సాధించింది. అయితే విశ్వాస్ నగర్ సీటును దక్కించుకోలేకపోయింది. ఈ సీటుపై బీజేపీకి బలమైన పట్టు ఉంది. ఇది ఆప్కు పెను సవాల్గా నిలిచింది. ఇది కూడా చదవండి: Lal Bhadur Shastri: నాటి ప్రధాని అభ్యర్థనతో దేశమంతా ఉపవాసం -
జాట్లకు మీరు ద్రోహం చేశారు..
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వేడి పెరుగుతోంది. తాజాగా మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ ‘జాట్’అ్రస్తాన్ని ప్రయోగించారు. ఆ సామాజికవర్గాన్ని కేంద్రం ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గురువారం కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీలోని జాట్లకు ద్రోహం చేశారంటూ ఆ లేఖలో ఆరోపించారు. బీజేపీ ఓటరు జాబితాను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అలాగే, ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోవాంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కేజ్రీవాల్ ఫిర్యాదు చేశారు. మరోవైపు.. ఎన్నికల ముందు కేజ్రీవాల్కు జాట్లు గుర్తుకొచ్చారా? అంటూ పర్వేశ్ వర్మ విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని జాట్ సామాజిక వర్గం వారిని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. రెండు పేజీల లేఖలో జాట్లకు సంబం«ధించి పలు అంశాలను ఆయన పేర్కొన్నారు. ‘ఢిల్లీలోని జాట్లకు మీరు ద్రోహం చేశారు. ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో జాట్ వర్గాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా మోసం చేస్తోంది. 2015 మార్చి 26న జాట్ నాయకులను ఇంటికి పిలిచి ఢిల్లీలోని జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చుతామని మీరు హామీ ఇచ్చారు. 2019 ఫిబ్రవరి 8న హోం మంత్రి అమిత్ షా కూడా జాట్లను కేంద్ర ఓబీసీ జాబితాలోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రాజస్థాన్లోని జాట్ కమ్యూనిటీ విద్యార్థులు ఢిల్లీ వర్సిటీలో రిజర్వేషన్ పొందుతున్నారు. కానీ, ఢిల్లీలోని జాట్లకు రిజర్వేషన్లు ఎందుకు లభించడంలేదు? ఢిల్లీలోని జాట్ సామాజిక వర్గానికి చెందిన వేలాది మంది పిల్లలు కేంద్ర ఓబీసీ జాబితాలో లేకపోవడంవల్ల ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశం పొందలేకపోతున్నారు. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర ఓబీసీ జాబితాలో వారు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాట్లు ప్రయోజనాలు పొందేందుకు మీ ప్రభుత్వం అనుమతించడం లేదు. మీ ప్రభుత్వ పక్షపాత వైఖరితో ఢిల్లీలోని జాట్లతోపాటు. మరో ఐదు సామాజికివర్గాలకు చెందిన వారు విద్యా, ఉపాధి, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఓబీసీ జాబితాలో మార్పులు చేసి ఓబీసీ హోదా ఉన్న ఆయా వర్గాలకు న్యాయం చేయండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉంటా’అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఆప్ ఫిర్యాదు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గురువారం ఢిల్లీ సీఎం ఆతిశీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ సింగ్, ఎంపీ సంజయ్ సింగ్లతో కలిసి కేజ్రీవాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ను కలిసి రెండు పేజీల ఫిర్యాదును అందజేశారు. హర్ ఘర్ నౌకరీ (ఇంటికో ఉద్యోగం) పేరుతో ఓట్లు అడుగుతూ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న పర్వేశ్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా వర్మ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఎన్నికల జాబితాలో బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని సీఎం ఆతిశీ మరో ఫిర్యాదు చేశారు. ‘నేను పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో గత 15 రోజుల్లోనే కొత్తగా 13 వేల మంది ఓటర్లు చేరారు. అదేవిధంగా, ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని 5,500 దరఖాస్తులు ఈసీకి అందాయి. ఇదో భారీ కుట్ర’అని అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు. పరేŠవ్శ్ వర్మ ఇంటిపై తక్షణమే ఎన్నికల నిఘా అధికారులు దాడి చేయాలని డిమాండ్ చేశారు. పర్వేశ్ వర్మ మహిళలకు రూ.1,100 బహిరంగంగానే పంచుతున్నారని ఆరోపించారు. ఓటరు జాబితాలో అవకతవలకు పాల్పడుతున్న స్థానిక ఎలక్టోరల్ అధికారులను సస్పెండ్ చేయాలి లేదా బదిలీ చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.ఆప్ సర్కారు పడిపోవాలని వారు కోరుకుంటున్నారు: పర్వేశ్ వర్మ ఎన్నికల ముందు కేజ్రీవాల్కు జాట్లు గుర్తుకువచ్చారా? అంటూ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ మండిపడ్డారు. జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న కేజ్రీవాల్ డిమాండ్పై ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ‘ఈసారి ఢిల్లీలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. జాట్ల కోసం కేజ్రీవాల్ ఏమైనా చేసి ఉంటే.. ఎన్నికలకు 25 రోజుల ముందు జాట్లు గుర్తుకువచ్చేవారు కాదు. ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాల్లో జాట్లు మాత్రమే కాదు.. గుజ్జర్లు, యాదవులు, త్యాగులు, రాజ్పుత్లు కూడా ఉన్నారు. వీరంతా కేజ్రీవాల్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నారు’అని పర్వేశ్ వర్మ అన్నారు. -
న్యూఢిల్లీ నుంచి మాత్రమే పోటీ చేస్తా
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం నుంచి పోటీ చేస్తానని ఆప్ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఓటమి భయంతో తాను న్యూఢిల్లీతోపాటు మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై గురువారం మీడియా సమావేశంలో స్పందించారు. గత ఎన్నికల్లో పోటీ చేసినట్లే వచ్చే ఎన్నికల్లో కూడా న్యూఢిల్లీ సీటు నుంచి మాత్రమే మళ్లీ ఉంటానన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రతిపక్ష ఇండియా కూటమితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈసారి పోటీ ఆప్, బీజేపీల మధ్యే ప్రధానంగా ఉండనుందన్నారు. కేజ్రీవాల్కు ఈ దఫా ఓటమి తప్పదు, అందుకే మరో చోటు నుంచి పోటీ చేస్తారంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలకు పైవిధంగా బదులిచ్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్తోపాటు ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ బీజేపీ నుంచి, మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ టిక్కెట్పై పోటీ చేస్తుండటం తెలిసిందే. -
‘‘అలాగైతే ఇండియా కూటమిని రద్దు చేయండి’’
ఒకవైపు విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు నడుస్తుండగా.. భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం మాత్రమే కూటమి మనుగడ కొనసాగాలనుకుంటే.. వెంటనే దానిని రద్దు చేయాలని సూచించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్లు తలపడుతుండడమే అందుకు కారణం. ఎన్సీ అధినేత, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో నేను మాట్లాడదల్చుకోలేదు. ఎందుకంటే ఆ ఎన్నికలతో మాకు సంబంధం లేదు కాబట్టి. కానీ, మా ఇండియా కూటమికి ఓ కాలపరిమితి అంటూ లేకుండా పోయింది.దురదృష్టవశాత్తూ.. ఇండియా కూటమి సమావేశాలు జరిగినా నాయకత్వం, ఎజెండా, దాని మనుగడ గురించి స్పష్టత లేకుండా పోయింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే కూటమి అనుకుంటే గనుక దానిని రద్దు చేస్తేనే మంచిది అని అభిప్రాయపడ్డారాయన.#WATCH | Jammu: J&K CM Omar Abdullah says, "... I cannot say anything about what's going on in Delhi because we have nothing to do with Delhi Elections... As far as I remember, there was no time limit to the INDIA alliance. Unfortunately, no INDIA alliance meeting is being… pic.twitter.com/u9w9FazeJG— ANI (@ANI) January 9, 2025ఇదిలా ఉంటే.. కిందటి ఏడాదిలో జరిగిన జమ్ము కశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, ఎన్సీ కలిసే పోటీ చేసి విజయం సాధించాయి. అయితే.. మొన్నీమధ్య ఈవీఎంల వ్యవహారంలో ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీతో విబేధించారు. ఈవీఎంలను నిందించడం ఆపేసి గెలుపోటములను అంగీకరించాలని సలహా కూడా ఇచ్చారు. అయితే సీఎం అయ్యాక ఆయన ధోరణి మారిందంటూ కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఈ మధ్యలో..బీజేపీపైనా ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు గుప్పించడంతో ఆయన విపక్ష కూటమికి దూరం అవుతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ వెంటనే ఆయన అమిత్ షాను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. అయితే.. జమ్మూకశ్మీర్కు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రహోదా పునరుద్దరణ కోసమే కేంద్ర మంత్రి అమిత్షాను కలిసినట్లు స్పష్టత ఇచ్చారు.తేజస్వి కామెంట్లతో.. ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమి రద్దు వ్యాఖ్యలు ఊరికనే చేయలేదు. ఇండియా కూటమిలో గత కొంతకాలంగా నాయకత్వం విషయంలో బేధాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియా కూటమిని కాంగ్రెస్ ముందుండి నడిపించాలని భావిస్తుండగా.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎస్పీ, ఆర్జేడీ లాంటి కొన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మొన్నటి పార్లమెంట్ సమావేశాల సమయంలోనూ కాంగ్రెస్ వెంట ‘బీజేపీ వ్యతిరేక నిరసనల్లో’’ ఈ రెండు పార్టీలు కలిసి రాలేదు. దీంతో ఇండియా కూటమి మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయనన్న చర్చ నడిచింది. ఈ తరుణంలో.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ ఫైట్ ఈ గ్యాప్ను మరింతగా పెంచాయి. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, దానిని ఇండియా కూటమి నుంచి దూరం పెట్టాలని ఆప్ డిమాండ్ సైతం చేసింది. ఈ పోటీని ఉద్దేశించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన కామెంట్లపైనే ఆయన అలా స్పందించాల్సి వచ్చింది. ఇంతకీ తేజస్వి ఏమన్నారంటే.. ‘‘2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ఇండియా కూటమి లక్ష్యం. కాబట్టి కూటమి ఆ లక్ష్యం వరకే కట్టుబడి ఉంటుంది. అలాంటప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఆప్లు తలబడడం అసాధారణమైనదేం కాదు’’ అని తేజస్వి యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ పరిణామంపై బీజేపీ సైతం స్పందించింది. ‘‘దేశీయంగా, అంతర్జాతీయంగా కుంభకోణాలు చేసినవాళ్లు, కేసులు ఉన్నవాళ్లు.. నిజాయితీపరుడైన మోదీకి వ్యతిరేకంగా ఒక్కతాటి మీదకు వచ్చాయి’’ అని ఎద్దేవా చేసింది. -
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కు ‘దీదీ’ మద్దతు
న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతు ప్రకటించింది. తమకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ప్రకటించినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘థాంక్యూ దీదీ’ అంటూ బుధవారం(జనవరి 8) ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.‘ఢిల్లీ ఎన్నికల్లో ఆప్నకు టీఎంసీ మద్దతు ప్రకటించింది. ఇందుకు మమతా దీదీకి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. థాంక్యూ దీదీ. మీరు మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు’అని కేజ్రీవాల్ ట్వీట్లో పేర్కొన్నారు. తృణమూల్ ప్రకటనతో ఢిల్లీ ఎన్నికల్లో ఆప్నకు మద్దతుగా నిలిచిన ‘ఇండియా’ కూటమి పార్టీలో జాబితాలో తాజాగా ఆప్ చేరడం గమనార్హం. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) కేజ్రీవాల్కు మద్దతు ప్రకటించాయి.గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఆప్ ఆ తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసింది. ఢిల్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్తో పొత్తు లేదని ప్రకటించింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. 8న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదీ చదవండి: రమేష్ బిదూరిపై బీజేపీ చర్యలు -
Delhi Elections: రమేష్ బిదురిపై బీజేపీ చర్యలు!
న్యూఢిల్లీ: మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన బీజేపీ నేత రమేష్ బిదురి(Ramesh Bidhuri)పై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ఆయన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ సీఎం అతిషితో పాటు ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై రమేష్ బిదురి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇటు ఆప్, అటు కాంగ్రెస్లు దేశవ్యాప్త ఆందోళనకు దిగాయి. ఈ పరిణామాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.ఈ పరిస్థితుల్లో ఆయన్ని ఎన్నికల నుంచి తప్పించడమో లేదంటే నియోజకవర్గాన్ని మార్చడమో చేయాలని ఆలోచిస్తున్నారట.ఈ అంశంపై రెండుసార్లు భేటీ జరిగినట్లు సమాచారం. ఇక బీజేపీ ఈ మధ్యే తొలి జాబితా విడుదల చేయగా.. కల్కాజీ నుంచి సీఎం అతిషిపైనే రమేష్ బిదురిని బీజేపీకి పోటీకి దింపింది. ఈ క్రమంలోనే ఓ సభలో పాల్గొన్న ఆయన అతిషిపైనా అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని అభ్యర్థిగా కొనసాగించడం పార్టీకి మంచిది కాదని బీజేపీ భావిస్తోందట!.కల్కాజీ నియోజకవర్గంలో రమేష్ బిదురిని తప్పించి.. ఆ స్థానంలో మహిళా అభ్యర్థిని అతిషిపై నిలపాలని బీజేపీ(BJP) అనుకుంటోంది. ఈ మేరకు రమేష్తోనూ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుజ్జర్ సామాజికవర్గపు బలమైన నేతగా పేరున్న రమేష్ బిదురి గతంలో.. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పని చేశారు.ఇంతకీ ఆయన ఏమన్నారంటే..రమేష్ బిదురి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే.. నియోజకవర్గంలోని రోడ్లను ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే అన్ని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపలలాగా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. .. సీఎం ఆతీషి ఆమె తండ్రినే మార్చేశారు. గతంలో ఆమెకు ఒక ఇంటి పేరు ఉండగా.. ప్రస్తుతం మరో పేరును వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ అఫ్జల్ గురుకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆమె తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు’’ అంటూ రమేశ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
నాకు ఇల్లు లేకుండా చేశారు: సీఎం అతిషి
న్యూఢిల్లీ:సీఎంగా తనకు కేటాయించిన ఇంటిని కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి రద్దు చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మండిపడ్డారు. మూడు నెలల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారని చెప్పారు. మంగళవారం(జనవరి7) ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు. ఇంటి కేటాయింపును రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం కూడా నోటీసులు వచ్చాయని తెలిపారు. ఇప్పుడుంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా అందులో కోరారని వివరించారు.తన కుటుంబ సభ్యులను కూడా బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని అతిషి ఆరోపించారు.తాను సీఎంగా ఎన్నికైన తర్వాత మా వస్తువులన్నింటినీ బీజేపీ కార్యకర్తలు రోడ్డుమీదకి విసిరేశారని చెప్పారు. తమ ఇళ్లను బీజేపీ లాక్కోవచ్చేమో గాని ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం పని చేయకుండా తమను ఎవరూ ఆపలేరన్నారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లలోనే ఉంటూవాళ్ల కోసం పని చేస్తానన్నారు.కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం(జనవరి 7) ప్రకటించింది. ఫిబ్రవరి 5వ పోలింగ్ జరగనుంది.అదే నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోరు జరగనున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఆప్, బీజేపీ మధ్యే ఉండనుంది. ఇదీ చదవండి: కాంగ్రెస్కు షాక్..‘ఆప్’కు అఖిలేష్ మద్దతు -
కాంగ్రెస్కు షాక్..! ‘ఆప్’కు అఖిలేష్ మద్దతు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Elections) షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన కొద్ది సేపటికే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కు తాము మద్దతిస్తున్నట్లు ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ సమాజ్వాదీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్(Akilesh Yadav) ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ వేరువేరుగా పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్ కాంగ్రెస్కు కాకుండా ఆప్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. అఖిలేష్ మద్దతు తెలపడంపై కేజ్రీవాల్(Kejriwal) స్పందించారు. అఖిలేష్కు కృతజ్ఞతలు తెలిపారు.అఖిలేష్ తమ కోసం ఎల్లప్పుడు మద్దతుగా ఉన్నారని, తమ వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ఆప్ ఇటీవల నిర్వహించిన మహిళా అదాలత్ కార్యక్రమంలోనూ అఖిలేష్ పాల్గొని ప్రచారం నిర్వహించారు. కాగా, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణ పోరు జరగనుంది. అయితే ప్రధాన పోటీ మాత్రం ఆప్,బీజేపీ మధ్యే ఉండనుంది. ఢిల్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది.ఇదీ చదవండి: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. -
ఢిల్లీలో ఒకే విడతలో ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. విజ్ఞాన్ భవన్లో జరిగిన సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇలా.. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికలకు పోలింగ్.. ఫిబ్రవరి 5ఎన్నికల ఫలితాలు.. ఫిబ్రవరి 8నామినేషన్లకు చివరి తేదీ.. జనవరి 17నామినేషన్ల విత్ డ్రా చివరి తేదీ.. జనవరి 20 #WATCH | Delhi to vote in a single phase on February 5; counting of votes on February 8 #DelhiElections2025 pic.twitter.com/QToVzxxADK— ANI (@ANI) January 7, 2025ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది. గతేడాది ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. ఢిల్లీలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. ఓట్ల తొలగింపు ఆరోపణలను ఖండిస్తున్నాం. ఎన్నికలను పారదర్శంగా నిర్వహిస్తున్నాం. ఈవీఎంల పనితీరుపై పూర్తి విశ్వాసంగా ఉన్నాం. ఈవీఎంల వాడకంలో పారదర్శకత ఉంది. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగినట్టు ఆధారాలు లేవు. ఈవీఎంల విషయంలో అసత్యాలను నమ్మవద్దు. ఈ ఏడాది తొలి ఎన్నికల్లో ఢిల్లీలో జరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ(Delhi Assembly)లో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఏడవది. దీని గడువు ఫిబ్రవరి 15వ తేదీతో ముగియనుంది. ఢిల్లీకి స్టేట్ స్టేటస్ వచ్చాక 1993లో జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. అయితే ఐదేళ్ల పాలనలో ముగ్గురు సీఎంలను మార్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. షీలా దీక్షిత్ సారథ్యంలో హస్తం పార్టీ హ్యాట్రిక్ పాలన సాగించింది. ఇక..2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. దీంతో..ఈసారి ఎలాగైనా హస్తినను చేజిక్కించుకోవాలని బీజేపీ(BJP) భావిస్తోంది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అధికారంపై కన్నేసింది. హర్యానా ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్-కాంగ్రెస్లు మరోసారి ఢిల్లీ ఎన్నికల ముక్కోణ్ణపు పోటీలో తలపడనున్నాయి. -
మేము సహకరించకుండా ఉండి ఉంటే.. ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సూటి ప్రశ్న
డిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) భాగంగా అధికార ఆప్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత హీట్ను పెంచుతోంది. ఢిల్లీ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని భుజానకెత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi).. ఆప్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఆప్ కూడా మోదీ వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్టీఎస్ కారిడార్లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్ను ప్రారంభించారు. అనంతరం మోదీ ప్రసంగించారు. ‘ఆప్ ప్రభుత్వం 10 ఏళ్లను వృధా చేసింది. భారత్ ఆకాంక్షలు నెరవేరాలంటే ఢిల్లీ అభివృద్ధి అవసరం.అది బీజేపీతోనే సాధ్యం. ఢిల్లీ ప్రజలకు ఆపద స్పష్టంగా ఉంది. అందుకే ఇక్కడ మోదీ.. మోదీ అనే పేరు మాత్రమే ప్రతిధ్వనిస్తుంది. ‘ఆప్దా AApada నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే'(మేం ఆపదను సహించం..మార్పు తీసుకొస్తాం)’అని వ్యాఖ్యానించారుదీనికి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) కూడా తీవ్రంగానే స్పందించారు. ‘ మీకు ఎప్పుడూ ఆప్ను తిట్టడమే పని. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తిడుతున్నారంటే మీరు ఢిల్లీ ప్రజల్ని కూడా తిడతున్నట్లే. ఢిల్లీ ప్రజలు ఈ విషయాన్ని గమనించండి. ఈరోజు మీరు ప్రారంభించిన ఆర్ఆర్టీఎస్ కారిడార్ మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఢిల్లీ ప్రజల కోసం ఏ మంచి పని అయినా స్వాగతిస్తాం. మీరుప్రారంభించిన ప్రాజెక్టులో మా సహకారం ఉంది. అటు కేంద్రం, ఇటు మా ప్రభుత్వం సహకారం వల్ల అది ఈ రోజు మీరు ప్రారంభించకలిగారు. మేము ప్రజల కోసమే పని చేస్తామనేది మీరు ప్రారంభించిన ప్రాజెక్టే ఉదాహరణ. మీరు మా నాయకుల్ని వేధింపులకు గురి చేస్తున్నా మీరు చేపట్టే ఏ ప్రాజెక్ట్కు మేము అడ్డుచెప్పలేదు. మేము మీకు సహకారం అందించకపోతే ఆర్ఆర్టీఎస్ కారిడార్ ను మీరు ప్రారంభించేవారా? అది మాకు ఢిల్లీ ప్రజల పట్ల ఉన్న నిబద్ధత. మేము దేన్నీ సమస్యగా మార్చలేదు. ప్రజల కోసం పని చేయడమే మాకు తెలిసిన రాజకీయం’ అని కేజ్రీవాల్ బదులిచ్చారు.‘ నేటి మీ ప్రసంగం 38 నిమిషాలు పాటు సాగితే.. అందులో 29 నిమిషాల పాటు ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మీ వ్యాఖ్యల్ని చూసి నేను చింతిస్తున్నా. ఈరోజు మీరు ప్రారంభించిన ప్రాజెక్ట్ను 2020లో ఇచ్చిన హామీకే మేరకే అమలు చేశారు. ఇందులో మా సహకారం మీకు పూర్తిగా లభించింది కాబట్టే అది జరిగింది’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.అంతకుముందు ఆర్ఆర్టీఎస్ కారిడార్ను ప్రారంభించిన క్రమంలో మోదీ మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘మీరు కేజ్రీవాల్ ఇల్లును చూశారా? తన నివాసం కోసం కళ్లు బైర్లు కమ్మేలా భారీ మొత్తంలో వెచ్చించారు. మోదీ తన కోసం షీష్ మహల్ని నిర్మించుకోవచ్చు. కానీ ఢిల్లీ ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకే మా తొలి ప్రాధాన్యం.దేశం బీజేపీపై నమ్మకాన్ని చూపుతోంది. ఈశాన్యలో, ఒడిశాలో కమలం వికసించింది. హర్యానాలో మూడోసారి బీజేపీని ఎన్నుకుంది. మహారాష్ట్రలో బీజేపీ ఘనవిజయం సాధించింది. కాబట్టి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం వికసిస్తుందని నేను నమ్ముతున్నాను. అందుకే ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీని అభివృద్ధి చేసేది బీజేపీయే. ఇప్పుడు ఢిల్లీలో ‘ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే’ అనే నినాదం మాత్రమే వినిపిస్తోంది. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అది బీజేపీతో సాధ్యమనే నమ్మకంతో ఉన్నారు’ అని మోదీ తనదైన శైలిలో ప్రసంగించారు. -
ప్రియాంకపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి నేతల మాటలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిదూరి సీఎం అతిషిపై బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బిదూరి తాజాగా ప్రియాంకపై మాట తూలారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకగాంధీ బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. ఈ విషయమై మీడియా ఆయనను ప్రశ్నించగా తాను ఆ వ్యాఖ్యలు చేసింది నిజమేనని ఒప్పుకున్నారు. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హీరోయిన్ హేమమాలినిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, ఆయన చేసింది తప్పయితే తనది కూడా తప్పేనన్నారు. లాలూ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరేంటని ప్రశ్నించారు. నిజానికి ప్రియాంకగాంధీ కంటే హేమమాలిని జీవితంలో ఎంతో సాధించారని బిదూరి గుర్తు చేశారు.ఇదీ చదవండి: సోషల్మీడియాలో ఆప్ వర్సెస్ బీజేపీ..ఢిల్లీలో హాట్ పాలిటిక్స్ -
బీజేపీ కుట్రలను సమర్థిస్తున్నారా?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, పూర్వాంచల్ ప్రజల ఓట్లను, దళితుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపిస్తుండగా, ఆయనలో ఓటమి భయం కనిపిస్తోందని, అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ తాజాగా రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్కు లేఖ రాశారు. డిసెంబర్ 30వ తేదీతో రాసిన ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ చేస్తున్న తప్పుడు పనులను మీరు సమర్థిస్తున్నారా? అని నిలదీశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తుందా? అని భగవత్ను ప్రశ్నించారు. దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని అన్నారు. ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచడం, కొందరు ఓటర్ల పేర్లను తొలగించడం మీకు సమ్మతమేనా? అని అడిగారు. దేశాన్ని బలహీనపర్చడానికి బీజేపీ కుట్రలు పన్నుతుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం..సీఎం వర్సెస్ ఎల్జీ -
బెళగావి దోవ చూపుతుందా?
ఎన్నికలొచ్చినప్పుడల్లా భంగపాటు రివాజైన కాంగ్రెస్కు ఈసారి ఢిల్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే అవమానం ఎదురైంది. ‘ఇండియా’ కూటమి నుంచి ఆ పార్టీని తక్షణం సాగనంపాలని ఆప్ పిలుపునివ్వటం వర్తమాన రాజకీయాల్లో కాంగ్రెస్ దయనీయస్థితిని వెల్లడిస్తోంది. వాస్తవానికి పార్టీ అధ్యక్ష హోదాలో గాంధీ మహాత్ముడు బెల్గాం (ప్రస్తుతం బెళగావి) కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గురువారంనాడు రెండురోజుల శత వార్షిక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగు తున్నాయి. సైద్ధాంతిక వైరుద్ధ్యాలతో పరస్పరం కలహించుకునే పక్షాలు ఒక దరి చేరి కూటమిగా చెప్పుకున్నంత మాత్రాన అవి కలిసి కాపురం చేస్తాయన్న నమ్మకం ఎవరికీ ఉండదు. అందువల్లేఇండియా కూటమికి ప్రారంభంలోనే పగుళ్లొచ్చాయి. కూటమిలో ఉంటాను గానీ బెంగాల్ వరకూ ఎవరికీ ఒక్కటంటే ఒక్క సీటివ్వనని తొలుతే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. అనంతరకాలంలో ఆమె దూరం జరిగారు. ఢిల్లీ వరకూ ఆప్ సైతం ఇంచుమించు అదే వైఖరి తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుకు అంగీకరించినా ఈ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్తామన్నది. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈలోగా ఆప్పై రాజకీయంగా పైచేయి సాధించటం కోసం కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. తాము గెలిస్తే మహిళా సమ్మాన్ పేరుతో ఇప్పటికే ఇస్తున్న రూ. 1,000ని రూ. 2,100కు పెంచుతామని ఆప్ వాగ్దానం చేయడాన్ని కాంగ్రెస్ ప్రధానంగా తప్పుబడుతోంది. ఆప్ ఇస్తున్న సంక్షేమ హామీలు ప్రజలను మోసగించడమేనని, ఇది శిక్షార్హమైన నేరమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై, ముఖ్యమంత్రి అతిశిపై కాంగ్రెస్ కేసులు పెట్టింది. ఆయన్ను జాతి వ్యతిరేకిగా అభివర్ణించింది. ఆప్ వైఫల్యాలపై శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేసినా ఇంతగా వైషమ్యాలు లేవు. బెళగావి సమావేశాల్లో కాంగ్రెస్ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. అయితే దేనిపైనా తనకంటూ స్పష్టమైన వైఖరి లేకుండా గాలివాటుకు కొట్టుకుపోయే విధానాలను అవలంబించినంత కాలమూ ఇలాంటి కార్యాచరణలు ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది సందే హమే. ఆర్నెల్లక్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఆప్పై ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం హఠాత్తుగా స్వరం మార్చి విమర్శలు లంకించుకోవటం వెనకున్న అంత రార్థాన్ని జనం గ్రహించలేరని కాంగ్రెస్ భావిస్తున్నదా అన్న సందేహం వస్తుంది. ఢిల్లీని వరసగా మూడు దఫాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ తనకెదురవుతున్న చేదు అనుభవాలకు కారణ మేమిటో లోతైన అధ్యయనం చేస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. దానికి బదులు బీజేపీ మాదిరే ఆప్పై విమర్శలు చేస్తే చాలన్నట్టు కాంగ్రెస్ పోకడ ఉంది. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీ కాంగ్రెస్ హెచ్కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ గ్రూపులుగా విడిపోయి అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తరుణంలో దాదాపు బయటి వ్యక్తిగా ముద్రపడిన షీలా దీక్షిత్కు ఢిల్లీ పీసీసీ చీఫ్ పదవి అప్పగించారు. ఆ తర్వాతే అక్కడ కాంగ్రెస్ గట్టెక్కింది. ఇప్పుడు ఆ మాదిరి వ్యూహం ఉన్నట్టు కనబడదు. ఈసారి మౌలికస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి నడుం బిగించామని, ఢిల్లీలో తమకు మంచిస్పందన ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే బస్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా కాలుష్యంపై ఆ పార్టీ దృష్టి సారించాలి. పార్టీ అంతర్గత నిర్మాణం చక్క దిద్దుకోవాలి. కానీ జరుగుతున్నది వేరు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ పొరపాటే చేసింది. ఆ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ పొత్తు మెరుగైన ఫలితాలనిస్తుందని అందరూ భావించారు. కానీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీతోసహా కీలక నేతలు పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశారన్నది విశ్లేషకుల అంచనా. అరవింద్ సింగ్ ఇప్పుడు బీజేపీలో చేరారు. పేరుకు ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నా భాగస్వామ్య పక్షాల నుంచి కాంగ్రెస్కు సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పక్షాలు కాంగ్రెస్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో ఆప్ సైతం గొంతు కలపటం కాంగ్రెస్ దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయి. కార్యాచరణ మాట అటుంచి ముందు మిత్రులతో కలిసి ప్రయాణించలేని పరిస్థితులు ఎందుకేర్పడ్డాయో ఆత్మవిమర్శ చేసుకో వాల్సిన అవసరం కనబడుతోంది. ఒక విపక్షంగా ఎటూ సమస్యలు వచ్చిపడుతుంటాయి. కానీ తెచ్చిపెట్టుకుంటున్న సమస్యలు కోకొల్లలని ఆ పార్టీ గ్రహించలేకపోతున్నది. ఎంతసేపూ పార్టీ వైఫల్యాలకు స్థానికంగా ఉండే నేతలను వేలెత్తి చూపటం మినహా తమ వ్యవహార శైలి ఎలాఉంటున్నదన్న స్పృహ అగ్ర నాయకత్వానికి కరువైంది. స్థానికంగా పార్టీని బలోపేతం చేస్తున్న వారిని అనుమానదృక్కులతో చూడటం, చురుగ్గా పనిచేస్తున్నవారికి వ్యతిరేకంగా ముఠాలను ప్రోత్సహించటం, విశ్వాసపాత్రులనుకున్న నాయకులకే అంతా కట్టబెట్టడం ఇంకా తగ్గలేదు. హరియాణాలో ఓటమికి ఇలాంటి పోకడలు కూడా కారణం. ఇప్పుడు ఢిల్లీ పార్టీలో ఉన్న అంతర్గత లోటుపాట్లను సవరించి బలోపేతం చేయటంపై దృష్టి సారించక ఆప్పై ఆరోపణతో కాలక్షేపం చేయటం కాంగ్రెస్ బలహీనతను సూచిస్తుంది. బెళగావిలోనైనా ఆ పార్టీకి జ్ఞానోదయమవుతుందా? -
సీనియర్ సిటిజన్లకు కేజ్రీవాల్ ‘సంజీవని’
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించిన ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 60 ఏళ్లు పైబడిన వారికి పూర్తి ఉచితంగా వైద్యం అందించే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్ పేరు ‘సంజీవని’ అని తెలిపారు.ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆదాయంతో సంబంధం లేదని పేద,మధ్యతరగతి, ధనిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ స్కీమ్ కింద ఉచిత వైద్యం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పతత్రుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ వైద్యం పొందవచ్చన్నారు. #WATCH | Delhi | AAP National Convenor Arvind Kejriwal says, “Elderly over the age of 60 will receive free treatment under the Sanjeevani Yojna, in private and government hospitals both… There will be no upper limit on the cost of treatment. Registration for this will start in a… pic.twitter.com/WYQGjQI8Ga— ANI (@ANI) December 18, 2024 మహిళలకు నెలవారి నగదు అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన స్కీమ్ను ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మహిళలు, వృద్ధుల ఓట్లపై ఫోకస్ చేయడం ద్వారా ఢిల్లీలో అధికారాన్ని నిలబెట్టుకోవచ్చని ఆప్ భావిస్తోంది. -
సార్! నేను కాంగ్రెస్ వాడిని కాను! 'ఆప్' నేతను టోపీ సేమ్ టూ సేమ్ అంతే!