
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలన్నీ గెలుపు గుర్రం ఎక్కేందుకు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తాను కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది.
రాబోయే ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)పై మరింత బలమైన ప్రచార దాడి చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ కొత్తగా ఐదు ప్రత్యేక మొబైల్ వ్యాన్లను ప్రారంభించింది. ఇవి ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో తిరుగుతాయి. రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాల గురించి ప్రజలకు తెలియజేస్తాయి. ‘10 ఏళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ అవసరం’ అనే నినాదాన్ని ప్రదర్శిస్తూ రూపొందించిన ఎల్ఈడీ వ్యాన్ను ఢిల్లీ మాజీ మంత్రి నరేంద్ర నాథ్ ప్రారంభించారు.
आज दिल्ली प्रदेश कांग्रेस कमेटी कार्यालय पर पूर्व मंत्री श्री @DrNath007जी वार रूम वाइस चेयरमैन श्री @sidharthraoinc , श्री @TasveerSolanki और वरिष्ठ कांग्रेस नेताओं द्वारा विधानसभा चुनाव हेतु कांग्रेस के चुनाव प्रचार रथ को हरी झंडी दिखाकर रवाना किया गया।
यह रथ सभी 70… pic.twitter.com/nFt94VtBsK— Delhi Congress (@INCDelhi) January 14, 2025
కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలలో ‘ప్యారీ దీదీ యోజన’ కింద మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సహాయం, ఢిల్లీ నివాసితులందరికీ రూ. 25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకం, విద్యావంతులైన, నిరుద్యోగ యువత(Unemployed youth)కు నెలకు రూ. 8,500 ఆర్థిక సహాయం మొదలైనవి ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నెరవేర్చిన వాగ్దానాల గురించి కూడా ఈ వ్యాన్లు ప్రజలకు తెలియజేస్తాయని పార్టీ నేతలు తెలిపారు. 2013లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ నుంచి ఢిల్లీ అధికారాన్ని సొంతం చేసుకుంది.
తాజాగా ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో జరిగిన పార్టీ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ప్రభుత్వాన్ని నడిపిన విధానాన్ని దేనితోనూ పోల్చలేమని అన్నారు. ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను కూడా టార్గెట్ చేసుకున్నారు. ఢిల్లీలో ఎన్నికలకు ముందు రాహుల్ నిర్వహించిన తొలి ర్యాలీ 2020లో మత హింసకు ప్రభావితమైన ప్రాంతంలో జరిగింది. ఈ అల్లర్లలో 50 మందికి పైగా జనం మృతిచెందారు.
ఇది కూడా చదవండి: New Delhi: కాంగ్రెస్కు కొత్త కార్యాలయం.. నేడు ప్రారంభించనున్న సోనియా
Comments
Please login to add a commentAdd a comment