Ranji Trophy 2024: గెలుపు దిశగా ఆంధ్ర జట్టు.. | Assam batting collapse gives Andhra control | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2024: గెలుపు దిశగా ఆంధ్ర జట్టు..

Published Mon, Jan 22 2024 7:04 AM | Last Updated on Mon, Jan 22 2024 8:42 AM

Assam batting collapse gives Andhra control - Sakshi

డిబ్రూఘర్‌: రంజీ ట్రోఫీ సీజన్‌లో ఆంధ్ర మొదటి విజయం దిశగా సాగుతోంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో అస్సాం ఓటమికి చేరువైంది. 363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అస్సాం మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. కెపె్టన్‌ రియాన్‌ పరాగ్‌ (48 నాటౌట్‌) పోరాడుతుండగా...చేతిలో ఉన్న ఐదు వికెట్లతో అస్సాం మరో 282 పరుగులు చేయాల్సి ఉంది.

ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్‌ రెడ్డి 3, లలిత్‌ మోహన్‌ 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 147/1తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 334 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రికీ భుయ్‌ (187 బంతుల్లో 125; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకం పూర్తి చేసుకోగా, హనుమ విహారి (63) అర్ధసెంచరీ సాధించాడు. షేక్‌ రషీద్‌ (40 నాటౌట్‌) కూడా రాణించగా... అస్సాం బౌలర్లలో సిద్ధార్థ్‌ వాసుదేవ్‌ 5 వికెట్లు తీశాడు.
చదవండిSA20 2024: సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement