అభిమానానికి గుర్తుగా గిఫ్ట్‌; గుక్కపట్టి ఏడ్చేసిన అమ్మాయి | EURO 2020: England Footballer Wins Hearts Giving Jersey For Young Girl | Sakshi
Sakshi News home page

EURO 2020: అభిమానానికి గుర్తుగా గిఫ్ట్‌; గుక్కపట్టి ఏడ్చేసిన అమ్మాయి

Jul 9 2021 1:26 PM | Updated on Jul 9 2021 1:49 PM

EURO 2020: England Footballer Wins Hearts Giving Jersey For Young Girl - Sakshi

లండన్‌: యూఈఎఫ్‌ఏ చాంపియన్‌షిప్‌ యూరోకప్‌ 2020లో ఇంగ్లండ్‌, డెన్మార్క్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌ ఫుట్‌బాలర్‌ మాసన్‌ మౌంట్‌ మ్యాచ్‌ విజయంతో పాటు అభిమానుల మనుసులు గెలుచుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 2-1 తేడాతో డెన్మార్క్‌పై విజయం సాధించి 55 ఏళ్ల తర్వాత మరో మెగాటోర్నీలో ఫైనల్‌కు అడుగుపెట్టింది.

ఈ చిరస్మరణీయ సన్నివేశాన్ని మైదానంలో ఉన్న అభిమానులు కూడా ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు. వారి సంబరాలను మరింత రెట్టింపు చేయడానికి మౌంట్‌ తన జెర్సీని ఒక అమ్మాయికి కానుకగా ఇచ్చాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి తమకు మద్దతిచ్చిన ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి తన జెర్సీని ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఆ అమ్మాయి ఏం అనుకుందో ఏమో తన తండ్రిని హద్దుకొని గట్టిగా ఏడ్చేసింది.

ఇదంతా చూసిన మిగతావాళ్లు.. '' మీ తండ్రీ కూతుళ్లు అదృష్టవంతులు.. ఇది సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన సమయం'' అంటూ కంగ్రాట్స్‌ చెప్పారు.  కాగా ఈ వీడియోనూ రెమ్‌ విలియ్స్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేయగా ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ దాదాపు 6.7 మిలియన్‌ వ్యూస్‌ రాగా.. వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ఇక 55 ఏళ్ల తర్వాత ఒక మెగాటోర్నీలో ఫైనల్‌ చేరిన ఇంగ్లండ్‌ జూలై 11న ఇటలీతో టైటిల్‌ పోరుకు తలపడనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement