jersey
-
CT 2025: ఆతిథ్య జట్టు పాక్ పేరుతో కూడిన టీమిండియా జెర్సీల ఆవిష్కరణ (ఫొటోలు)
-
సరికొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్లు.. ఫొటోలు వైరల్
-
తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఈవెంట్లో అక్కినేని అఖిల్ (ఫొటోలు)
-
చెన్నై సూపర్ చాంప్స్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో సమంత సందడి (ఫొటోలు)
-
స్నేహితురాలిని పెళ్లాడిన జెర్సీ మూవీ సింగర్.. పోస్ట్ వైరల్
ప్రముఖ సింగర్ దర్శన్ రావల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలు ధరల్ సురేలియాను ఆయన పెళ్లాడారు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు సింగర్. ఈ వివాహా వేడుకలో బంధువులతో పాటు సన్నిహితులు కూడా పాల్గొన్నారు.తాజాగా సింగర్ దర్శన్ రావల్ తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. సింగర్ దర్శన్ పలు సూపర్ హిట్ సినిమాలకు తన గాత్రాన్ని అందించాడు.దర్శన్ కెరీర్..దర్శన్ రావల్ 2014లో ఇండియాస్ రా స్టార్ మొదటి సీజన్లో పాల్గొన్నాడు. ఆషోలో ఒడిశాకు చెందిన రితురాజ్ మొహంతి చేతిలో ఓడిపోయాడు. ఆ తరవాత ది టాలెంట్ హంట్ షో అతనికి మంచి వేదికను ఇచ్చింది. అప్పటి నుంచి బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. 2015లో షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన హిమేష్ రేష్మియాకు ధన్యవాదాలు. లవ్యాత్రి చిత్రంలోని చోగడ పాటతో అతనికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత షేర్షా చిత్రం నుంచి కభీ తుమ్హే, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీలోని ధిండోరా బజే రే, ఇష్క్ విష్క్ రీబౌండ్ సినిమా నుంచి సోనీ సోని లాంటి సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా గుజరాతీలో పాటలు కూడా పాడారు. తెలుగు హీరో నాని నటించిన జెర్సీ చిత్రంలోని నీదా పదధాని అనే తెలుగు సాంగ్ను అలపించారు దర్శన్ రావల్. View this post on Instagram A post shared by Darshan Raval (@darshanravaldz) -
సిడ్నీలో భారత మాజీ క్రికెటర్కు అరుదైన గౌరవం.. మామగారి ‘స్వెటర్’తో వచ్చిన కోడలు(ఫొటోలు)
-
PR Sreejesh: జెర్సీ నంబర్ 16కు వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత దిగ్గజ గోల్కీపర్ శ్రీజేశ్ ఇకపై హాకీ మైదానంలో కనిపించడు. అలాగే అతని జెర్సీ నంబర్ 16 కూడా కనిపించదు. గోల్పోస్ట్ ముందు ప్రత్యర్థులకు అడ్డుగోడలా నిలబడి భారత జట్టుకు విశేష సేవలందించిన శ్రీజేశ్ ఘనకీర్తికి గుర్తుగా ఆ జెర్సీకి అతనితోపాటే రిటైర్మెంట్ ఇవ్వాలని హాకీ ఇండియా (హెచ్ఐ) నిర్ణయించింది. బుధవారం ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జట్టు సభ్యులను ఘనంగా సన్మానించారు. శ్రీజేశ్కు రూ. 25 లక్షల నగదు పురస్కారం చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ టిరీ్క, భోళానాథ్ సింగ్లు మాట్లాడుతూ శ్రీజేశ్ను ఆకాశానికెత్తారు. ఆధునిక భారత హాకీకి అతనొక దేవుడని కితాబిచ్చారు. భారత సీనియర్ పురుషుల జట్టులో 16వ నంబర్ జెర్సీని ఎవరికీ కేటాయించబోమని భోళానాథ్ చెప్పారు. ‘శ్రీజేశ్ త్వరలోనే జూనియర్ భారత జట్టు కోచ్గా వెళతారు. ఘనమైన కెరీర్కు అతను వీడ్కోలు పలికితే ... హాకీ ఇండియా అతని ఘనకీర్తికి గుర్తుగా జెర్సీ నంబర్ 16కు రిటైర్మెంట్ ఇచ్చింది. అయితే ఇది సీనియర్ స్థాయికే పరిమితం. జూనియర్ జట్టులో 16వ జెర్సీ యథాతథంగా కొనసాగుతుంది’ అని ఆయన వివరించారు. -
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
-
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
టీ20 వరల్డ్కప్-2024 ప్రారంభానికి మరో ఐదు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ మెగా ఈవెంట్కు సమయం దగ్గరపడతుండడంతో క్రికెట్ బోర్డులు ఒక్కొక్కటిగా తమ జట్ల జెర్సీలను రిలీజ్ చేస్తున్నాయి.ఈ క్రమంలో టీమిండియా వరల్డ్కప్ జెర్సీని బీసీసీఐ రివీల్ చేసింది. భారత క్రికెట్ జట్టు అధికారిక స్పాన్సర్ అడిడాస్ జెర్సీ రిలీజ్కు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది.టీమిండియా జెర్సీలో.. వీ షేప్ నెక్కి ట్రై కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఈసారి జెర్సీలో బ్లూతో పాటు కాషాయం రంగు కూడా ఉంది. అడిడాస్కి చెందిన లోగో.. జెర్సీ కుడివైపు ఉంది.బీసీసీఐ లోగో ఎడమవైపు ఉంది. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు జెర్సీ బాగొలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్లో జూన్5 న ఐర్లాండ్తో తలపడనుంది.ఇక పొట్టి ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టులో కేఎల్ రాహుల్, రింకూ సింగ్, శుబ్మన్ గిల్ వంటి స్టార్ క్రికెటర్లకు చోటు దక్కలేదు.టీ20 వరల్డ్ కప్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హర్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్,రిషభ్ పంత్, సంజూ శాంసన్ , శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, ఆర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.రిజర్వ్ ఆటగాళ్లు: శుభ్మాన్ గిల్, రింకు సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ View this post on Instagram A post shared by adidas India (@adidasindia) -
నేను లేనుగా.. ఎవరితో చేస్తారో చేసుకోండి: నాని
ప్రస్తుతం అంతా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. 'పుష్ప 2', 'సలార్ 2'.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడన్ని మూవీస్ లైన్లో ఉన్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలే కాదు మ్యాడ్ 2, ప్రేమలు 2 లాంటివి కూడా సెట్స్పైకి వెళ్లాయి. దీంతో ఆటోమేటిక్గా హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి రిక్వెస్ట్ హీరో నానికి ఎదురైంది. దీనికి అతడు ఇచ్చిన సమాధానం కూడా అంతే ఆసక్తికరంగా అనిపించింది. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) నేచురల్ స్టార్ నాని కెరీర్లో బెస్ట్ మూవీ అంటే 'జెర్సీ' అని చెప్పొచ్చు. క్రికెట్ బ్యాక్ డ్రాప్తో తీసిన ఈ చిత్రం ఎలాంటి కమర్షియల్ అంశాలు లేనప్పటికీ అద్భుతమైన హిట్గా నిలిచింది. ప్రేక్షకుల ముందుకొచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రాన్ని రీసెంట్గా హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో రీ రిలీజ్ చేశారు. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే 'జెర్సీ' మూవీకి సీక్వెల్ కావాలని నానికి అభిమానుల నుంచి రిక్వెస్ట్ వచ్చింది. తాజాగా 'ఆ ఒక్కటి అడక్కు' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న నానికి ఈ ప్రశ్న ఎదురైంది. దీంతో.. 'నేను లేనుగా, ఎవరితో చేస్తారో చేసుకోండి' అని నాని సమాధానమిచ్చాడు. నాని చెప్పిన దానిబట్టి చూస్తే 'జెర్సీ' సీక్వెల్ కష్టమే. ఎందుకంటే సినిమాలో నాని పాత్ర చనిపోతుంది. ఒకవేళ సీక్వెల్ తీయాలన్నా ఈ పాత్ర లేకుండా సాధ్యం అవుతుందా లేదా దర్శకుడికే తెలియాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ రెండు కాస్త స్పెషల్) -
IPL 2024: సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ ఎలా ఉందో చూడండి..!
త్వరలో (మార్చి 22) ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024 ఎడిషన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీని ఇవాళ (మార్చి 7) విడుదల చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి జెర్సీ కొంచం కొత్తగా కనిపిస్తుంది. కొత్త జెర్సీతో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫోటోలకు పోజులిచ్చాడు. కొత్త జెర్సీ విషయాన్ని రివీల్ చేస్తూ భువీ ఫోటోనే సన్రైజర్స్ మేనేజ్మెంట్ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. హైదరాబాద్ వేడిని బయటపెట్టడానికి సిద్దం.. ఐపీఎల్ 2024 కోసం మా జ్వలించే కవచం అంటూ క్యాప్షన్లు జోడించింది. సన్రైజర్స్ కొత్త జెర్సీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయగలరు. Ready to unleash the fiery heat of Hyderabad 🔥 Our 🆕 blazing armour for #IPL2024 🧡 #PlayWithFire pic.twitter.com/mMQ5SMQH6O — SunRisers Hyderabad (@SunRisers) March 7, 2024 ఇదిలా ఉంటే, రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ఆరెంజ్ ఆర్మీ ఇదివరకే సన్నాహకాలను మొదలుపెట్టింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ను షురూ చేసింది. మిగిలిన ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్కు చేరుకుంటున్నారు. ఈ సీజన్కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్ ఇదివరకే విడుదలైంది. ఈ విడతలో సన్రైజర్స్ నాలుగు మ్యాచ్లు ఆడనుంది. 𝑺𝒑𝒊𝒏𝒏𝒊𝒏𝒈 things around a little with this #FlameComing 💫 Welcome back home, Mayank 🧡 pic.twitter.com/LduWWXa89n — SunRisers Hyderabad (@SunRisers) March 6, 2024 #FlameComing season just got better with the O̶G̶ AG 🔥 Welcome home, Mayank 🧡 pic.twitter.com/uOyYxiTl1u — SunRisers Hyderabad (@SunRisers) March 6, 2024 ఎస్ఆర్హెచ్ టీమ్ ఈ సీజన్ తొలి మ్యాచ్ను మార్చి 23వ తేదీన ఆడనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే ఆ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ లోకల్ టీమ్ కేకేఆర్ను ఢీకొంటుంది. మార్చి 27న ముంబై ఇండియన్స్తో, మార్చి 31 గుజరాత్ టైటాన్స్తో, ఏప్రిల్ 5 చెన్నై సూపర్కింగ్స్తో సన్రైజర్స్ తలపడనుంది. వీటిలో ముంబై ఇండియన్స్, సీఎస్కే మ్యాచ్లు హైదరాబాద్లో జరుగనుండగా.. గుజరాత్తో మ్యాచ్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. First team huddle of the season at Uppal ft. a whole lotta orange 🥹🧡 pic.twitter.com/JV4dvzwicE — SunRisers Hyderabad (@SunRisers) March 5, 2024 కొద్ది రోజుల కిందటే సన్రైజర్స్ యాజమాన్యం పాత కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ను తప్పించి పాట్ కమిన్స్ను నూతన కెప్టెన్గా ఎంపిక చేసింది. కమిన్స్ నాయకత్వంలోని సన్రైజర్స్ ఈ సీజన్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో సన్రైజర్స్ టీమ్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అన్ని విభాగాల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లతో కళకళలాడుతుంది. సన్రైజర్స్ జట్టు వివరాలు.. అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు అన్మోల్ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు (కెప్టెన్) భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు -
'జెర్సీ' హీరోయిన్ పచ్చబొట్టు కహానీ.. 18 ఏళ్లప్పుడు ప్రేమ.. అందుకే ఇప్పటికీ!
చాలామంది ఒంటిపై పచ్చబొట్టు చూస్తూనే ఉంటాం. దీన్ని ఇప్పటి జనరేషన్ స్టైల్గా టాటూ అంటున్నారు. అయితే ఒక్కో టాటూ వెనుక ఒక్కో స్టోరీ ఉంటుంది. దాన్ని సదరు వ్యక్తులు బయటపెడితే గానీ తెలియదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇందులో మినహాయింపు ఏం కాదు. ఇప్పుడు కూడా ఓ యంగ్ హీరోయిన్.. అలా తన ఎదపై ఉన్న పచ్చబొట్టు మీనింగ్, అసలు ఇది ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) శ్రద్ధా శ్రీనాథ్.. స్వతహాగా కన్నడ బ్యూటీ. 2015లో ఓ మలయాళ మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో తెలుగులో నాని 'జెర్సీ'లో హీరోయిన్గా చేసి మన ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయింది. డిఫరెంట్ పాత్రలు చేస్తూ క్రేజ్ పెంచుకున్న ఈ భామ.. వెంకటేశ్ 'సైంధవ్'లో యాక్ట్ చేసింది. ఇది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. తాజాగా 'సైంధవ్' సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్న శ్రద్ధా శ్రీనాథ్.. మిగతా విషయాలతో పాటు తన ఎదపై ఉన్న టాటూ సీక్రెట్ కూడా చెప్పింది. 18 ఏళ్ల వయసులో ఓ అబ్బాయి అంటే తనకు క్రష్ ఉండేదని, అతడి ద్వారా తనకు బీటల్స్ బ్యాండ్ గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. లవ్ అని అర్థమొచ్చేలా ఉన్న ఈ టాటూని అప్పట్లోనే క్రష్ కోసం వేసుకున్నానని అసలు సంగతి చెప్పింది. అయితే ఆ అబ్బాయి ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. సో శ్రద్ధా శ్రీనాథ్ టాటూ సీక్రెట్ అదనమాట. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) -
ధోని జెర్సీ నంబర్ ‘7’కు రిటైర్మెంట్: బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, రెండు ప్రపంచకప్లను గెలిపించిన సారథి మహేంద్ర సింగ్ ధోనిపై బీసీసీఐ సముచిత గౌరవం ప్రదర్శించింది. అతను మైదానంలో ధరించిన ‘7’ నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దిగ్గజ క్రికెటర్గా భారత క్రికెట్కు ధోని చేసిన సేవలకు గుర్తిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీని ప్రకారం ఇకపై భారత క్రికెట్కు ప్రాతినిధ్యం వహించే ఏ ఆటగాడు కూడా తమ జెర్సీపై ‘7’ నంబర్ వాడేందుకు బోర్డు అనుమతించదు. గతంలో ఆల్టైమ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ గౌరవార్ధం కూడా అతను ధరించిన ‘10’ నంబర్కు కూడా బీసీసీఐ అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ తప్పుకున్న తర్వాత ఒకే ఒకసారి ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ ‘10’ నంబర్ జెర్సీని వేసుకోగా అభిమానుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. దాంతో అతను తన నంబర్ను మార్చుకోవాల్సి వచ్చింది. జెర్సీ నంబర్లకు రిటైర్మెంట్ ప్రకటించడం ఇతర క్రీడల్లో చాలా కాలంగా ఉంది. బాస్కెట్బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ వేసుకున్న ‘23’ నంబర్ను కూడా అతని కెరీర్ తర్వాత చికాగో బుల్స్ టీమ్ రిటైర్మెంట్ ఇచ్చింది. -
అది మెస్సీ క్రేజ్.. జెర్సీల విలువ 64 కోట్ల పై మాటే..!
ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవ్యాప్తంగా ఈ స్టార్ ఫుట్బాలర్కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మెస్సీ ప్రపంచంలో ఏ మూలలో ఫుట్బాల్ ఆడినా ఇసకేస్తే రాలనంత మంది జనాలు స్టేడియాలకు తరలి వస్తారు. అతను ధరించే బ్రాండ్లు, అతని ఎండార్స్మెంట్ల రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. తాజాగా మెస్సీ ధరించిన జెర్సీలను ఆన్లైన్లో వేలానికి పెట్టగా కళ్లు బైర్లు కమ్మే మొత్తానికి అవి అమ్ముడుపోయాయి. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్లో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను న్యూయార్క్లో ఆన్లైన్ వేలానికి పెట్టగా.. ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 78 లక్షల డాలర్లకు (రూ. 64 కోట్ల 86 లక్షలు) ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో ఓ వ్యక్తి ధరించిన జెర్సీలు అమ్ముడుపోవడం క్రీడల చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యుంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడించి, మూడోసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో మెస్సీ రెండు గోల్స్ సాధించి అర్జెంటీనాను ఒంటిచేత్తో గెలిపించాడు. -
‘జెర్సీ’భామ సినీ జర్నీ..ఎల్ఎల్బీ పట్టా పొంది సినిమాల్లోకి
శ్రద్ధా శ్రీనాథ్.. ‘జెర్సీ’తో తెలుగు తెర మీద మెరిసింది.. మెప్పించింది. తన నటనతోదక్షిణాదిన అన్ని భాషల్లో ఇటు వెండితెరనూ అటు వెబ్తెరనూ మెరిపిస్తోంది. ఆ తార గురించి కొన్ని విషయాలు.. ► శ్రద్ధా జన్మస్థలం.. జమ్మూ – కశ్మీర్లోని ఉధమ్పూర్. నాన్న.. ఆర్మీ ఆఫీసర్, అమ్మ టీచర్. బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్లో ఎల్ఎల్బీ పట్టా పుచ్చుకుంది. ► చదువు పూర్తయ్యాక కొద్ది రోజులు రియల్ ఎస్టేట్ రంగంలో లీగల్ అడ్వయిజర్గా పనిచేసింది. ► అనుకోకుండా నటించిన ఓ కమర్షియల్ యాడ్ అమెను ఒక కన్నడ చిత్రం ఆడిషన్స్కి వెళ్లేలా చేసింది. దానికి ఆమె సెలెక్ట్ కాలేదు కానీ ఆ ప్రయత్నం మాత్రం యాక్టింగ్ కెరీర్ను ఆమె సీరియస్గా తీసుకునేలా చేసింది. ► ‘కోహినూర్’ అనే మలయాళ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత కన్నడ ‘యూటర్న్’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు ఫిల్మ్ఫేర్ అవార్డ్నూ అందుకుంది. ► తమిళ, కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించే శ్రద్ధా శ్రీనాథ్.. ‘జెర్సీ’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ లోనూ నటించింది. ► నటనావకాశాలు తప్ప దాని ప్లాట్ఫామ్స్ గురించి శ్రద్ధ పెద్దగా ఆలోచించడం లేదు. అందుకే వెబ్తెర చాన్స్లనూ అందిపుచ్చుకుంటోంది. అలా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ‘ఇరుగప్పట్రు’, సోనీ లివ్ ‘విట్నెస్’ లతో అలరిస్తోంది. తను నటించిన ‘సైంధవ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. టూర్స్ చేయడం చాలా ఇష్టం. అలా వెళ్లినప్పుడల్లా అక్కడేదైనా కొత్త పని నేర్చుకుంటూంటా! ఈ మధ్య హాలిడే కోసం ఓ రిసార్ట్కు వెళ్లినప్పుడు.. అక్కడ కుండలు తయారు చేయడం నేర్చుకున్నా: శ్రద్ధా శ్రీనాథ్ -
కోహ్లి... నీకో బహుమతి: సచిన్
అహ్మదాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తన 49 సెంచరీల రికార్డును చెరిపేసిన కింగ్ కోహ్లికి అమూల్యమైన బహుమతిని బహూకరించాడు. 24 ఏళ్ల కెరీర్లో తన 10 నంబర్ జెర్సీ అంతర్జాతీయ క్రికెట్లో లిఖించిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఫైనల్కు ముందు సచిన్ స్వయంగా చేసిన ఆటోగ్రాఫ్ జెర్సీని కోహ్లికి అందజేశాడు. ఈ జెర్సీని సచిన్ 2012లో జరిగిన ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన ఆఖరి వన్డే సందర్భంగా ధరించాడు. ‘ఈ ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక అనుభూతినిచ్చే గిఫ్ట్ను సచిన్... విరాట్కు అందజేశాడు’ అని బీసీసీఐ సచిన్, కోహ్లిల ఫోటోతో పోస్ట్ చేసింది. న్యూజిలాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో విరాట్ కోహ్లి 50వ సెంచరీతో సచిన్ రికార్డు (49)ను బద్దలు కొట్టాడు. -
క్రికెట్ నేపథ్యంలో హిట్ కొట్టిన సినిమాలు.. ఈ ఓటీటీలలో చూడొచ్చు
వన్డే క్రికెట్ వరల్డ్ కప్లో భారత్ సత్తా చాటి మరికొన్ని గంటల్లో నేడు ఆస్ట్రేలియాతో ఫైనల్ ఫైట్కు రెడీ అయింది. లీగ్ దశలో పరాజయమే లేకుండా విజయ పరంపరతో కొనసాగిన భారత జట్టు.. అదే దూకుడుతో ఫైనల్ మ్యాచ్లోనూ వీర విజృంభణతో దూసుకెళ్లి కప్ సాధించాలని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా నేటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ఉద్యోగులూ, వ్యాపారులూ, సినీ సెలబ్రెటీలు తదితర క్రికెట్ క్రీడాభిమానులంతా సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో క్రికెట్ బ్యాక్డ్రాప్లో వచ్చిన కొన్ని సూపర్ హిట్ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు. ఆ సినిమాలో ఏ ఓటీటీలో ఉన్నాయో అని తెగ వెతుకుతున్నారు. సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ 2017లో 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' అనే చిత్రాన్ని జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించారు. భారతీయ త్రిభాషా డాక్యుమెంటరీ స్పోర్ట్స్ చిత్రంగా తెరకెక్కించారు. 200 నాటౌట్ ప్రొడక్షన్స్, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రవి భాగ్చంద్కా, శ్రీకాంత్ భాసీ నిర్మించారు . ఈ చిత్రం భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవితంపై రూపొందించిన డాక్యుమెంటరీ.ఇది టెండూల్కర్ క్రికెట్, వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా చూపించారు. అలాగే అతని జీవితంలో ఇంతకు ముందెన్నడూ వినని లేదా చూడని కొన్ని అంశాలను కూడా ఈ చిత్రంలో చూడవచ్చు. ఇందులో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్ కూడా కొన్ని సీన్స్లలో కనిపిస్తారు. ఈ చిత్రం చూడాలనుకుంటే సోనీ లైవ్లో అందుబాటులో ఉంది. MS ధోని: ది అన్టోల్డ్ స్టోరీ 2016లో MS ధోని: ది అన్టోల్డ్ స్టోరీ చిత్రం విడుదలైంది. ధోని బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. నీరజ్ పాండే రచించి దర్శకత్వం వహించారు. భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగారూపొందించబడింది. ఈ చిత్రంలో MS ధోనిగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించారు , వీరితో పాటు దిశా పటానీ , కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్ నటించారు. ఈ చిత్రం ధోని చిన్నప్పటి నుంచి జీవితంలోని అనేక సంఘటనల ద్వారా అతని జీవితాన్ని వివరిస్తుంది. ధోనీ అంగీకారంతో ఈ సినిమా మొదలైంది. 61 దేశాలలో ఈ సినిమా విడుదలైంది. వాణిజ్యపరంగా ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇది 2016లో అత్యధిక వసూళ్లు చేసిన ఐదవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా రూ. 215.48 కోట్లు వసూలు చేసిన ఆరవ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను చూడాలనుకుంటే.. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉచితంగానే చూడొచ్చు. 800 ముత్తయ్య మురళీధరన్ 2023లో తెలుగులో ఈ సినిమా విడుదలైంది. శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్పై వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా శ్రీదేవి మూవీస్ పై శివలెంక కృష్ణప్రసాద్ దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేశాడు. మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్గా ముత్తయ్య మురళీధరన్ ఉన్నారు. అందుకే ఈ చిత్రానికి 800 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. 'ఆజార్' 2016లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా 'ఆజార్' అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ద్వారా శోభా కపూర్, ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇమ్రాన్ హష్మీ టైటిల్ రోల్లో సూపర్గా మెప్పించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 13 మే 2016న విడుదలైంది . అజార్ జీవితంలో మ్యాచ్ ఫిక్సింగ్, వివాహేతర సంబంధం వంటి అంశాలపై కూడా ఈ చిత్రంలో క్లారిటీ ఇచ్చారు. అజార్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రికెట్ బ్యాక్డ్రాప్లో రూపొందిన సినిమాలో ఇవే ► నాని నటించిన జెర్సీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతుంది. ► గోల్కోండ హైస్కూల్ (సన్నెక్ట్స్) ► కౌసల్య కృష్ణమూర్తి (సన్నెక్ట్స్) ► విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' (అమెజాన్,డిస్నీ హాట్స్టార్) ► నాగచైతన్య 'మజిలీ' (అమెజాన్ ప్రైమ్ వీడియో) ► వెంకటేష్ 'వసంతం' (డిస్నీ హాట్స్టార్) ► లగాన్ హిందీ (నెట్ఫ్లిక్స్) -
కోహ్లి ‘జెర్సీ’ మారింది!
పాకిస్తాన్తో మ్యాచ్లో కోహ్లి కాస్త గందరగోళానికి కేంద్రంగా మారాడు. మైదానంలోకి దిగినప్పుడు అతను వేసుకున్న జెర్సీ సహచరుల జెర్సీకంటే భిన్నంగా ఉండటంతో సమస్య మొదలైంది. సాధారణంగా టీమ్ కిట్ స్పాన్సర్ ‘అడిడాస్’కు సంబంధించిన మూడు అడ్డగీతలు మన ఆటగాళ్ల జెర్సీల భుజాలపై తెల్ల రంగులో కనిపిస్తాయి. కానీ వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన జెర్సీపై త్రివర్ణ పతాకాన్ని పోలిన రంగులతో ఈ గీతలు కనిపిస్తాయి. అయితే కోహ్లి తెలుపు గీతల టీ షర్ట్తోనే వచ్చేశాడు. ఆరు ఓవర్లు ముగిసేవరకు దీనిని ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత విషయం తెలియడంతో కోహ్లి ఏడో ఓవర్లో డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి జెర్సీని మార్చుకొని తర్వాతి ఓవర్లో గ్రౌండ్లోకి వచ్చాడు. -
CWC 2023: కొత్త ట్రైనింగ్ కిట్లో టీమిండియా.. ఎలా ఉందో చెప్పండి..!
2023 వరల్డ్కప్ ప్రాక్టీస్ సెషన్ను టీమిండియా కొత్త ట్రైనింగ్ కిట్ ధరించి ప్రారంభించింది. మెగా టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్ (అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో) కోసం ఇదివరకే చెన్నైకు చేరుకున్న రోహిత్ సేన.. కొత్త ట్రైనింగ్ కిట్లో నిన్నటి నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. డ్రీమ్11 స్పాన్సర్ చేసిన ఈ కొత్త ట్రైనింగ్ కిట్ ఆరెంజ్ కలర్లో ఉంది. టీమిండియా రెగ్యులర్ జెర్సీల తరహాలోనే ఈ కిట్ భుజాలపై కూడా మూడు స్ట్రైప్స్ ఉన్నాయి. Team India is sporting a new practice jersey🧡🤩 📸: Disney + Hotstar pic.twitter.com/MRPe4SceOc — CricTracker (@Cricketracker) October 5, 2023 looks like boys in the orange jersey are ready to deliver (the world cup) 😉 https://t.co/x8ePswD5zn — Swiggy (@Swiggy) October 5, 2023 Indian team in new Practice Jersey. pic.twitter.com/x8ToDJUiHy — Johns. (@CricCrazyJohns) October 5, 2023 అలాగే కుడివైపు ఛాతిపై అడిడాస్ లోగో, ఎడమవైపు బీసీసీఐ ఎంబ్లెం ఉంది. ఆరెంజ్ కిట్లో కొత్తగా కనిపించిన టీమిండియాను చూసి భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెరైటీ కలర్లో టీమిండియా ఆటగాళ్లు చూడముచ్చటగా ఉన్నారని అనుకుంటున్నారు. జెర్సీ కలర్తో సంబంధం లేదు, ఈసారి వరల్డ్కప్ మనదే అంటూ సోషల్మీడియాను హోరెత్తిస్తున్నారు. కొత్త ట్రైనింగ్ కిట్లో విరాట్ కోహ్లి తదితర టీమిండియా ఆటగాళ్ల ఫోటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. Virat Kohli giving autographs to fans in Chennai. pic.twitter.com/20wHetv8xH — Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023 ఇదిలా ఉంటే, 2023 వరల్డ్కప్ ఇవాల్టి (అక్టోబర్ 5) ప్రారంభమైన విషయం తెలిసిందే. టోర్నీ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఇంగ్లండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 30 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. బెయిర్స్టో (33), డేవిడ్ మలాన్ (14), హ్యారీ బ్రూక్ (25), మొయిన్ అలీ (11) ఔట్ కాగా.. జో రూట్ (50), జోస్ బట్లర్ (30) క్రీజ్లో ఉన్నారు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు. -
టీమిండియా వరల్డ్కప్ జెర్సీలో మార్పులు.. తేడా గమనించారా..?
భారత క్రికెట్ జట్టు ఇటీవలే అన్ని ఫార్మాట్లలో జెర్సీలను మార్చిన విషయం తెలిసిందే. కొత్త జెర్సీ స్పాన్సర్గా అడిడాస్ వచ్చాక భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు కూడా మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను రూపొందించింది. టీ20ల్లో కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీ, వన్డేల్లో కాలర్తో లైట్ బ్లూ కలర్ జెర్సీ, టెస్ట్ల్లో వైట్ కలర్ జెర్సీలను అడిడాస్ ప్రవేశపెట్టింది. జెర్సీలపై కుడివైపు తమ (అడిడాస్) లోగోను, ఎడమవైపు టీమ్ లోగో, దానిపై మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్ స్పాన్సర్ డ్రీమ్ 11 పేరు, దాని కింద కాస్త పెద్ద అక్షరాలతో ఇండియా అని ఉంటుంది. జెర్సీపై భుజాల భాగంలో మూడు తెలుపు రంగు అడ్డ గీతలు ఉంటాయి. Indian team jersey for World Cup 2023. pic.twitter.com/q1EYsZebEK — Johns. (@CricCrazyJohns) September 20, 2023 కాగా, వరల్డ్కప్ నేపథ్యంలో అడిడాస్ కంపెనీ జెర్సీలో స్వల్ప మార్పులు చేసింది. భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో తివర్ణ పతాకంలోని మూడు రంగులను (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) ముద్రించింది. అలాగే టీమ్ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుగా కుదించింది. రెండు నక్షత్రాలు భారత్ రెండు వన్డే వరల్డ్కప్లు (1983, 2011) గెలిచిన దానికి ప్రతీక అని పేర్కొంది. టీమిండియా కొత్త జెర్సీపై భారతీయత ఉట్టిపడటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తివర్ణంతో కూడిన జెర్సీతో టీమిండియా వరల్డ్కప్ గెలవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించి రూపొందించిన వీడియో అద్భుతమని అంటున్నారు. పాత జెర్సీతో పోలిస్తే, ఇది చాలా కలర్ఫుల్గా ఉందని అంటున్నారు. -
తొలి వన్డే.. సంజూ శాంసన్కు చోటు, ఇషాన్కు మొండిచెయ్యేనా!
వెస్టిండీస్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను టీమిండియా 1-0 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియాకు రెండో టెస్టులో విజయం రాకుండా వరుణుడు అడ్డుపడ్డాడు. మొత్తానికి 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన కోహ్లి సెంచరీతో మెరిసి ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. డ్రా అయినప్పటికి కోహ్లితో పాటు రోహిత్, ఇషాన్ కిషన్లు మంచి టచ్లో కనిపించడం టీమిండియాకు సానుకూలాంశం. టెస్టులు ముగియడంతో తాజాగా టీమిండియా వన్డేలపై దృష్టి సారించింది. మరో మూడు నెలల్లో వన్డే వరల్డ్కప్ జరగనుండడంతో ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారనుంది. వరల్డ్కప్కు సంబంధించి టీమిండియా జట్టును ఇంకా ప్రకటించలేదు. విండీస్తో వన్డే సిరీస్తో పాటు ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ద్వారా యువ ఆటగాళ్లకు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశముంది. ఇక గురువారం(జూలై 27న) నుంచి విండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్తో వన్డే సిరీస్కు టీమిండియా ఆటగాళ్లు ధరించనున్న జెర్సీని రివీల్ చేసింది. డ్రీమ్ ఎలెవెన్(Dream 11) స్పాన్సర్గా ఉండడంతో జెర్సీ సెంటర్లో డ్రీమ్ 11 లోగో దానికింద ఇండియా అని రాసి ఉంది. కుడి పక్కన బీసీసీఐ లోగో ఉంది. సూర్యకుమార్, యజ్వేంద్ర చహల్, హర్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, జంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, శుబ్మన్ గిల్ ఇలా యంగ్ క్రికెటర్లంతా ఒకరి తర్వాత ఒకరు వన్డే జెర్సీ ధరించి ఫోటోలకు ఫోజిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ బుధవారం ట్విటర్లో షేర్ చేసింది. మీరు ఒక లుక్కేయండి. ఇక వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో జట్టులో సీనియర్లకే ఎక్కువ అవకాశముంది. విండీస్తో తొలి వన్డేకు తుది జట్టు అంచనాను ఒకసారి పరిశీలిస్తే.. ఓపెనర్లుగా రోహిత్, శుబ్మన్ గిల్.. వన్డౌన్లో కోహ్లి, సూర్యకుమార్, సంజూ శాంసన్లు నాలుగు, ఐదు స్థానాల్లో.. హార్దిక్ పాండ్యా, జడేజాలు ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్కు రానున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్/ చహల్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, సిరాజ్లు ఉండే అవకాశం ఉంది. కాగా వికెట్కీపర్గా సంజూ శాంసన్ వైపే బీసీసీఐ మొగ్గు చూపే అవకాశముంది. దీంతో ఇషాన్ కిషన్ బెంచ్కే పరిమితమయ్యేలా కనిపిస్తున్నాడు. విండీస్తో జరిగిన రెండో టెస్టులో ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. విండీస్తో తొలి వన్డే టీమిండియా తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/ చహల్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ Test Cricket ✅ On to the ODIs 😎📸#TeamIndia | #WIvIND pic.twitter.com/2jcx0s4Pfw — BCCI (@BCCI) July 26, 2023 చదవండి: 'హర్మన్ప్రీత్ ప్రవర్తన మరీ ఓవర్గా అనిపించింది' Prabath Jayasuriya: లంక బౌలర్ సంచలనం.. బాబర్ ఆజం వీక్నెస్ తెలిసినోడు -
టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ ఎవరంటే..?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు జెర్సీ ప్రధాన స్పాన్సర్గా ఫాంటసీ స్పోర్ట్స్ లీగ్ కంపెనీ ‘డ్రీమ్11’ ఎంపికవడం దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఎంత మొత్తానికి అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు టీమిండియా జెర్సీ స్పాన్సర్గా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘బైజూస్’ ఉంది. గత ఏప్రిల్తో బైజూస్ ఒప్పందం ముగిసింది. దాంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ల కోసం బిడ్లను పిలిచింది. గతంలో ఐపీఎల్ టోర్నీ ప్రధాన స్పాన్సర్గా కూడా డ్రీమ్11 వ్యవహరించింది. అయితే బీసీసీఐతో కొత్త ఒప్పందం ప్రకారం... ఇప్పటివరకు బైజూస్ చెల్లించిన మొత్తం (ఒక్కో మ్యాచ్కు)కంటే డ్రీమ్11 తక్కువగా చెల్లించనున్నట్లు సమాచారం. లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత దీనిపై బోర్డు అధికారిక ప్రకటన చేయనుంది. -
భార్య జెర్సీ నెంబర్ తో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్
-
భార్య జెర్సీ నెంబర్ తో అదరగొడుతున్న రుతురాజ్ గైక్వాడ్..!
-
WTC Final: కొత్త జెర్సీలో మెరిసిపోతున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
WTC Final: తెలుపులో నీలం రంగు.. మెరిసిపోతున్న టీమిండియా క్రికెటర్లు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా ఆటగాళ్లు ధరించబోయే జెర్సీని ఇటీవలే (జూన్ 1) భారత జట్టు అఫీషియల్ కిట్ స్పాన్సర్ అడిడాస్ ఆవిష్కరించింది. తాజాగా టెస్ట్ జెర్సీలో టీమిండియా ఆటగాళ్ల ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కొత్త టెస్ట్ కిట్ ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. King Kohli and captain Rohit Sharma in India's new Test and ODI jerseys. pic.twitter.com/G5QyQtykiZ — Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2023 తెలుపు, నీలం రంగుతో కూడిన ఈ జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు మెరిసిపోతున్నారు. భుజాలు, కాలర్పై నీలం రంగు బార్డర్ కలిగి, నీలం రంగులో ఇండియా అని రాసి ఉండి, ఎడమవైపు ఛాతిపై బీసీసీఐ ఎంబ్లమ్, కుడివైపు అడిడాస్ సింబల్తో కూడిన ఈ జెర్సీ చాలా కొత్తగా, అద్భుతంగా ఉందంటూ అభిమానులు కొనియాడుతున్నారు. Virat Kohli and Rohit Sharma in the new Indian Test jersey!😍 Rate this jersey out of 10 pic.twitter.com/MkeSXBtp2H — CricTracker (@Cricketracker) June 3, 2023 గతంలో టెస్ట్లకు పూర్తి తెలుపు రంగు కిట్ వాడేవారని, అది చూడటానికి అంత బాగుండేది కాదని, ప్రస్తుతమున్న కిట్ చాలా బాగుందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు వన్డే, టీ20 జెర్సీలు సైతం పర్వాలేదని మెచ్చుకుంటున్నారు. రోహిత్, కోహ్లి, హార్ధిక్, బుమ్రా, వుమెన్స్ క్రికెట్ టీమ్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధన కొత్త వన్డే, టీ20 జెర్సీలు ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. Rohit Sharma, Virat Kohli, and Hardik Pandya in new Indian jerseys 👕🇮🇳 Which kit did you like the most? 😍 📸: Adidas India#CricTracker #IndianCricket pic.twitter.com/OKOSxUuvXX — CricTracker (@Cricketracker) June 3, 2023 కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్లో ఉండే జెర్సీ టీ20లకు.. లైట్ బ్లూ కలర్లో కాలర్తో ఉన్న జెర్సీని వన్డేలకు.. వైట్ కలర్ జెర్సీని టెస్ట్లకు టీమిండియా ఆటగాళ్లు ధరించనున్నారు. కాగా, భారత జట్టు అఫీషియల్ కిట్ స్పాన్సర్ అడిడాస్ సంస్థనే టీమిండియా జెర్సీ స్పాన్సర్గా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. నైక్ కంపెనీ తర్వాత కిట్ స్పాన్సరే (అడిడాస్) జెర్సీని కూడా తయారు చేయడం ఇదే మొదటిసారి. King Kohli is ready to roar in India's new jersey. pic.twitter.com/QtEDpWpHaH — Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2023 ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనుంది. ఈ ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ కోసం భారత్, ఆసీస్ జట్లు ప్రత్యేక జెర్సీలు ధరించనున్నారు. ఇరు జట్లు ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. బలాబలాల విషయంలో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని అభిమానలు అంచనా వేస్తున్నారు. pic.twitter.com/226XFwjTxC — CricTracker (@Cricketracker) June 3, 2023 Pat Cummins and Co. are ready for the WTC Final🤩 📸 : ICC #Australia #INDvsAUS #WTCFinal pic.twitter.com/xD62y9bpdP — CricTracker (@Cricketracker) June 3, 2023 -
డబ్ల్యూటీసీ ఫైనల్ల్లో ఆస్ట్రేలియా ధరించబోయే ప్రత్యేక జెర్సీ ఇదే..!
టీమిండియాతో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో (జూన్ 7-11 వరకు లండన్లోని కెన్నింగ్స్టన్ ఓవల్) టీమ్ ఆస్ట్రేలియా ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనుంది. ప్రతిష్టాత్మక మ్యాచ్లో ఆసీస్ జట్టు ధరించబోయే జెర్సీని ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా రివీల్ చేశాడు. ప్రత్యేక జెర్సీతో తీసుకున్న సెల్ఫీని ఖ్వాజా ట్విటర్లో షేర్ చేశాడు. ట్వీట్కు క్యాప్షన్గా.. అబద్దం ఆడటం లేదు, ఈ జెర్సీ గ్యాంగ్స్టా అంటూ కామెంట్ జోడించాడు. Not gonna lie. These vest are gangsta 🔥. World Test Championship. #straya🇦🇺🦘🪃 #loveavest #prizedpossession #wtc #gonnaneedit❄️ pic.twitter.com/wr6npGJs38 — Usman Khawaja (@Uz_Khawaja) May 23, 2023 రెగ్యులర్ ఆస్ట్రేలియా జెర్సీతో పోలిస్తే చాలా వైవిధ్యంగా కనిపిస్తున్న ఈ జెర్సీ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. డార్క్ గ్రీన్ కలర్లో 'V' నెక్ బోర్డర్తో ఈ జెర్సీ డబ్ల్యూటీసీ లోగోను కలిగి ఉంది. మరోవైపు టీమిండియా సైతం డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రత్యేక జెర్సీని ధరించనుంది. అయితే ఆటగాళ్లు ఐపీఎల్తో బిజీగా ఉన్న కారణంగా జెర్సీ వివరాలు ఇంకా తెలియరాలేదు. పైగా బీసీసీఐ.. భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్ను కూడా మార్చింది. కిల్లర్ జీన్స్ స్థానంలో కొత్తగా అడిడాస్ భారత కిట్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ధరించబోయే ప్రత్యేక జెర్సీపై అడిడాస్ లోగో కనిపించనుంది. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత బృందం (మొదటి బ్యాచ్) ఇవాళ (మే 23) ఉదయం ఇంగ్లండ్కు బయల్దేరింది. ఈ బృందంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, స్టాండ్ బై ప్లేయర్ ముకేశ్ కుమార్, నెట్ బౌలర్లు ఆకాశ్దీప్, పుల్కిత్ నారంగ్లతో పాటు సహాయ సిబ్బంది ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో ఉండి, ఐపీఎల్-2023 నుంచి నిష్క్రమించిన జట్లలోని కీలక సభ్యులు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్లు రేపు (మే 24) లండన్కు బయల్దేరతారని క్రిక్బజ్ తెలిపింది. ఇంగ్లండ్లోని పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా ఫస్ట్ బ్యాచ్ రెండు వారాల ముందుగానే లండన్కు బయల్దేరింది. మిగతా భారత బృందం దశల వారీగా ఇంగ్లండ్కు వెళ్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, అజింక్య రహానే, శుభ్మన్ గిల్, మహ్మద్ షమీ ఐపీఎల్ 2023 ముగిసాక (మే 31 లోపు) ఇంగ్లండ్కు బయల్దేరతారని సమాచారం. చదవండి: కోహ్లి ఒక్కడితోనే వేగలేకుంటే మరొకరు తయారయ్యారు.. ప్రపంచ దేశాల్లో వణుకు..! -
విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 వెనుక సూపర్బ్ స్టోరీ
-
కోహ్లీ జెర్సీ నెంబర్ వెనుక కన్నీటి కథ.. ఏంటంటే?
ప్రపంచ క్రికెట్లో జెర్సీ నంబరు 18ను ఎంతమంది ధరించినా.. టక్కున గుర్తుచ్చేది మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లినే. విరాట్ ఏ ఫార్మట్ లో చూసినా నెంబర్ 18 జెర్సీనే ధరిస్తాడు. అండర్ 19 ఆడేటప్పటి నుంచి ఈ జెర్సీనే వేసుకుంటాడు. మరో నెంబర్ మార్చే ప్రయత్నం చేయలేదు. కోహ్లి జెర్సీ నెంబర్ 18 వెనుక ఓ కన్నీటి గాధ దాగి ఉంది. తన తండ్రి గుర్తుగా నెంబర్ 18 ధరిస్తున్నట్లు కోహ్లినే స్వయంగా వెల్లడించాడు. నాన్నకు ప్రేమతో.. 2006 డిసెంబర్ 18వ తేదీ కోహ్లికి తన జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ రోజున కోహ్లి తన తండ్రిని కోల్పోయాడు. ప్రేమ్ కోహ్లి గుండెపోటుతో మరణించాడు. తన తండ్రి మరణించిన సమయంలో కోహ్లి కర్ణాటకతో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ వార్త విన్న కోహ్లి బాధను దిగిమింగి మరి తన ఆటను కొనసాగించాడు. ఈ మ్యాచ్లో కోహ్లి 90 పరుగులు చేసి ఢిల్లీని ఫాలోఆన్ గండం నుంచి తప్పించాడు. మ్యాచ్ ముగిశాక తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అయితే తన జీవితంలో ఆ చీకటి రోజుని మరోసారి విరాట్ గుర్తుచేసుకున్నాడు. "మా నాన్న చనిపోయిన ఆ రాత్రి నాకు ఇంకా గుర్తుంది. కానీ మా నాన్న మరణం తర్వాత నా ఆటను కొనసాగించాలని పిలుపు వచ్చింది. నేను కూడా ఆ రోజు ఉదయం ఢిల్లీ కోచ్కు ఫోన్ చేసాను. నేను ఈ మ్యాచ్లో ఆడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆటను మధ్యలో విడిచిపెట్టి రావడం సరికాదు అని భావించాను. ఆ క్షణం నన్ను ఒక వ్యక్తిగా మార్చింది. నా జీవితంలో క్రికెట్కు చాలా ప్రాముఖ్యత ఇస్తాను. ఇక మా నన్న మరణించిన రోజు గుర్తుగా జెర్సీ నంబరు 18గా ఎంచుకున్నాను. అదృష్టవశాత్తూ భారత జట్టులో చేరేటప్పటికీ ‘జెర్సీ నంబరు 18’ ఖాళీగా ఉంది. దీంతో అదే నంబరును కొనసాగించాను అని కోహ్లి సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్కు సన్నద్దం అవుతున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన విరాట్.. చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. చదవండి: IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించాడు.. ఇప్పుడు రాజస్తాన్ జట్టులో చోటు కొట్టేశాడు! -
రీల్లైఫ్లో హీరో నాని.. రియల్ లైఫ్లో కేన్ మామ
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు అసలు సిసలు టెస్టు మజాను రుచి చూపించింది. సంప్రదాయ క్రికెట్లో మ్యాచ్ గెలవాలనే తపనతో ఇరుజట్లు ఆడిన తీరు టెస్టు చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న శ్రీలంక.. సొంతగడ్డపై ప్రత్యర్థికి అవకాశమివ్వకూడదన్న పంతంతో న్యూజిలాండ్.. గెలవాలంటే ఐదు బంతుల్లో 7 పరుగులు కావాలి.. 70వ ఓవర్.. క్రీజులో కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ.. చేతిలో మూడు వికెట్లు.. అంతలోనే సమన్వయలోపం కారణంగా రనౌట్.. బౌలర్ అషిత ఫెర్నాండో చురుగ్గా కదిలి డైవ్ చేసి మరీ బంతిని వికెట్లకు గిరాటేయడంతో హెన్రీ అవుట్. క్రీజులోకి నీల్ వాగ్నర్.. చేతిలో రెండు వికెట్లు.. గెలవాలంటే ఆరు పరుగులు కావాలి.. ఇక విలియమ్సన్ ఆలస్యం చేయలేదు.. ఫెర్నాండో బౌలింగ్లో అద్భుత బౌండరీతో నాలుగు పరుగులు రాబట్టాడు.. న్యూజిలాండ్ గెలుపు సమీకరణం రెండు బంతుల్లో ఒక పరుగు.. వెంటనే డాట్బాల్.. ఇరు జట్ల స్కోర్లు సమం.. గెలవాలంటే మిగిలిన ఒక్క బంతికి ఒక్క పరుగు కావాలి.. శ్రీలంకతో పాటు టీమిండియా అభిమానుల్లోనూ నరాలు తెగే ఉత్కంఠ.. బైస్.. షాట్ ఆడేందుకు కేన్ విలియమ్సన్ ప్రయత్నం.. వాగ్నర్కు కాల్.. సింగిల్ తీసేందుకు కేన్ మామ క్రీజు వీడాడు. ఆలోపే బంతిని అందుకున్న వికెట్ కీపర్ డిక్విల్లా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫెర్నాండో వైపు విసరగా.. బాల్ అందుకున్న ఫెర్నాండో వెంటనే వికెట్లకు గిరాటేశాడు.. మరి కేన్ మామ అప్పటికే పరుగు పూర్తి చేశాడా లేదోనన్న సందేహం! కివీస్కు అనుకూలంగా థర్డ్ ఎంపైర్ నుంచి స్పందన.. లంక ఆశలపై నీళ్లు.. ఆఖరి బంతికి కివీస్ను గెలిపించిన కేన్ విలియమ్సన్పై ప్రశంసల జల్లు. మొత్తానికి రనౌట్ నుంచి తప్పించుకొని కేన్ మామ హీరోగా నిలిచాడు. ఇదంతా రియల్ లైఫ్ మ్యాచ్లో జరిగింది. అయితే ఇది సీన్ ఒక సినిమాలో కూడా జరిగిందంటే మీరు నమ్ముతారా.. అది కూడా ఒక తెలుగు సినిమాలో. ఆశ్చర్యపోయినా ఇది నిజం. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. అయితే సినిమా క్లైమాక్స్లో నాని తన జట్టును గెలిపించడానికి పడే తపన అచ్చం కేన్ మామ ఇన్నింగ్స్ను తలపించింది. రియల్ లైఫ్ మ్యాచ్ లాగానే సినిమాలోనూ నాని ఆఖరి బంతికి రనౌట్ నుంచి తప్పించుకొని జట్టును గెలిపిస్తాడు. ఆ తర్వాత నాని పైకి లేచి బ్యాట్ను పైకెత్తి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా విలియమ్సన్ తన బ్యాట్ను పైకెత్తి గెలుపును సెలబ్రేట్ చేసుకోవడం కనిపిస్తుంది. ఈ రెండు మ్యాచ్లకు సంబంధించిన వీడియోలను పక్కపక్కన ఉంచి ఒక అభిమాని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by TwEETA PORADU (@tweetaporadu) చదవండి: 'నా స్థానాన్ని ఆక్రమించావు.. అందుకే కృతజ్ఞతగా' NZ Vs SL: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! -
మాపై దయ చూపలేదు, నా గుండె ముక్కలయ్యింది: బాలీవుడ్ హీరో
ఒక భాషలో ఏదైనా సినిమా హిట్టయిందంటే చాలు దాన్ని వేరే భాషలో రీమేక్ చేయాలని తహతహలాడిపోతుంటారు సినీతారలు. ఈ క్రమంలో కొన్నిసార్లు సూపర్ హిట్లు తీసినా మరికొన్నిసార్లు మాత్రం చేతులు కాల్చుకుంటారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇలా రీమేక్లు తీసి వరుస ఫ్లాపులు మూటగట్టుకుంటోంది. సౌత్లో హిట్ అయిన చిత్రాలను హిందీలో రీమేక్ చేసి వదులుతోంది. కానీ ఎందుకో అక్కడ అస్సలు వర్కవుట్ కావడం లేదు. అయినా సరే పట్టు వదలకుండా రీమేక్లు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో విక్రమ్ వేద, హిట్, జెర్సీ, షెహజాదా (అల వైకుంఠపురములో), డ్రైవింగ్ లైసెన్స్(సెల్ఫీ) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అయినా సరే వాటిని లెక్క చేయకుండా బోలెడన్ని సినిమాలు ఇంకా క్యూలో ఉన్నాయి. లవ్ టుడే, సూరరై పోట్రు, ఎఫ్ 2, బ్రోచెవారెవరురా, ఖైదీ, కత్తి, అయ్యప్పనుమ్ కోషియుమ్.. ఇలా చాలా చిత్రాలు రీమేక్ బాటపట్టాయి. హిందీ ప్రేక్షకులు సౌత్ కంటెంట్ను ఇష్టపడటం లేదని కాదు.. దక్షిణాది సినిమాలను చూస్తున్నారు, ఒరిజినల్ కంటెంట్ను మాత్రమే ఇష్టపడుతున్నారు.. రీమేక్లకు మాత్రం నిర్మొహమాటంగా నో చెప్తున్నారు. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాను వ్యతిరేకిస్తే తట్టుకోలేమంటున్నాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. నాని హీరోగా నటించిన జెర్సీ మూవీకి తెలుగులో విశేష స్పందన లభించింది. ఈ సినిమా హిందీ రీమేక్లో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. కోవిడ్ కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్లో రిలీజవగా ఘోర పరాజయం పొందింది. దీనిపై షాహిద్ మాట్లాడుతూ.. 'నా గుండె పగిలినట్లైంది. ఎంతో మంచి సినిమా అది, కానీ ఈ ప్రపంచం మాపై దయచూపలేదనుకుంటా.. పాటలు విడుదలైన మరో నాలుగు నెలలకు సినిమా రిలీజైంది. జెర్సీతో ఓ విషయం నాకు బాగా అర్థమైంది. సినిమాలు ఫాస్ట్ఫుడ్ వంటివి. అది వేడివేడిగా ఉన్నప్పుడే వెంటనే తినేయాలి.. దాన్ని వాయిదాలు వేసుకుంటూ ఆలస్యం చేస్తే అంత మజా రాదు. అప్పుడు కరోనా టైంలో సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా అర్థం కాలేదు. దురదృష్టవశాత్తూ సినిమా ఫ్లాప్ అయింది' అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఫర్జీ వెబ్ సిరీస్తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాడు షాహిద్ కపూర్. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్లో ప్రసారమవుతున్న ఈ సిరీస్కు మంచి ఆదరణ లభించింది. -
BCCI: మరో కీలక మార్పు.. డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి అమల్లోకి!
Team India New Jersey: టీమిండియా జెర్సీ మరోసారి మారబోతోందా? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. ప్రఖ్యాత యూరోప్ బ్రాండ్ అడిడాస్ రూపొందించనున్న జెర్సీల్లో భారత ఆటగాళ్లు త్వరలోనే దర్శనమివ్వనున్నట్లు పేర్కొన్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అడిడాస్తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపాయి. కాగా 2016- 2020 మధ్య కాలంలో నైకీ టీమిండియా కిట్ స్పాన్సర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక నాలుగేళ్ల కాలానికి గానూ ఎంపీఎల్ స్పోర్ట్స్(మొబైల్ ప్రీమియర్ లీగ్) 370 కోట్ల రూపాయల భారీ ఒప్పందంతో టీమిండియా జెర్సీ స్పాన్సర్గా వ్యవహరించింది. అయితే, గతేడాది డిసెంబరులో తమ హక్కులను మరో సంస్థకు బదలాయించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎంపీఎల్ బీసీసీఐని కోరింది. మార్చి వరకు ఒప్పందం ఉన్న నేపథ్యంలో.. కేవల్ కిరణ్ క్లాతింగ్ లిమిటెడ్(కేకేసీఎల్) సీన్లోకి వచ్చింది. దీంతో.. శ్రీలంకతో సిరీస్నుంచి కేకేసీఎల్ తమ పాపులర్ బ్రాండ్ ‘కిల్లర్ జీన్స్’ లోగోను ప్రదర్శించింది. అయితే, ఈ కేకేసీఎల్ ఒప్పందం పూర్తైన తర్వాత ప్రముఖ బ్రాండ్ అడిడాస్తో చేతులు కలిపేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు న్యూస్18 వెల్లడించింది. ఈ క్రమంలో జూన్ 1 నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జూన్ 7 నుంచి జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో రోహిత్ సేన అడిడాస్ జెర్సీలో కనిపించనున్నట్లు తన కథనంలో పేర్కొంది. కాగా ఇప్పటికే ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ సహా ఇంగ్లండ్ క్రికెట్ టీమ్కు అడిడాస్ జెర్సీ స్పాన్సర్గా వ్యవహరించింది. అంతేగాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్లతో అడిడాస్కు గతంలో ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాటింగ్హాంషైర్, సౌత్ ఈస్ట్ స్టార్స్, సర్రే జట్లకు జెర్సీ స్పాన్సర్గా ఉన్న అడిడాస్.. త్వరలోనే టీమిండియా జెర్సీ స్పాన్సర్గా మారనున్నట్లు సమాచారం. చదవండి: Steve Smith: గిల్కు అంత సీన్ లేదు.. ప్రపంచ క్రికెట్ను శాసించబోయేది అతడే..! IND vs AUS: టీమిండియాను ఓడించడానికి సాయం చేస్తా.. ఒక్క రూపాయి కూడా వద్దు! -
ప్రధాని మోదీకి మెస్సీ జెర్సీ కానుకగా..
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ జెర్సీ గిఫ్ట్గా రావడం ఆసక్తి కలిగించింది. అర్జెంటీనాకు చెందిన వైపీఎఫ్ అనే పెట్రోలియన్ అండ్ గ్యాస్ కార్పోరేషన్ సంస్థ బెంగళూరులో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వారోత్సవాలకు హాజరయ్యింది. సంస్థ అధ్యక్షుడు పాబ్లో గొంజాలెజ్ ప్రధాని మోదీకి మంగళవారం మెస్సీ జెర్సీని అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా ఫైనల్లో ఫ్రాన్స్ను షూటౌట్లో 4-2తో మట్టికరిపించి జగజ్జేతగా అవతరించింది. మారడోనా తర్వాత దిగ్గజ ఆటగాడిగా పేరు పొందిన మెస్సీ ఫిపా వరల్డ్కప్ను అందుకోవాలన్న తన కలను సాకారం చేసుకోవడంతో పాటు అర్జెంటీనా 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానులు మెస్సీ ఘనతను పొగడ్తలతో ముంచెత్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెస్సీని ప్రశంసించిన జాబితాలో ఉన్నారు. -
అర్జెంటీనా జెర్సీలో వరుడు.. ఫ్రాన్స్ జెర్సీలో వధువు..
తిరువనంతపురం: క్రికెట్కు అంతులేని ఆదరణ ఉన్న మన దేశంలో ఈ నూతన వధూవరులు ఫుట్బాల్పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. కేరళకు చెందిన సచిన్.ఆర్, ఆర్.అథీరా ఆదివారం పెళ్లి చేసుకున్నారు. ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ కూడా అదే రోజు జరిగింది. అర్జెంటీనా స్టార్ అటగాడు మెస్సీకి సచిన్ వీరాభిమాని. అథీరాకు ఫ్రెంచ్ టీమ్ అంటే ప్రాణం. ఫైనల్కు కొన్ని గంటల ముందే కొచ్చిలో వీరి పెళ్లి జరిగింది. దాంతో సంప్రదాయ దుస్తులు, నగలతోపాటు అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ జెర్సీని సచిన్, ఫ్రెంచ్ స్టార్ ఎంబాపె జెర్సీని అథీరా ధరించి పెళ్లి పీటలపై కూర్చున్నారు. వివాహమై విందు పూర్తియన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు కొత్త దంపతులు కొచ్చి నుంచి 206 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురంలోని వరుని ఇంటికి ఆగమేఘాలపై చేరుకున్నారు. సచిన్కు ఇష్టమైన అర్జెంటీనా సంచలనం విజయం సాధించడంతో చివరికి ఇరువురూ సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, అర్జెంటీనా గెలిస్తే ప్రజలకు ఉచితంగా బిర్యానీ వడ్డిస్తానని కేరళలోని త్రిసూర్లో ఓ హోటల్ యజమాని ముందే ప్రకటించాడు. చెప్పినట్లుగానే తన హోటల్కు వచ్చిన వారందరికీ ఉచితంగా బిర్యానీ పంపిణీ చేసి మాట నిలుపుకున్నాడు! చదవండి: మెస్సీ అసోంలో పుట్టాడు..! -
టైటిల్తో సహా కాపీ, పేస్ట్.. ఆ రెండు చిత్రాలపై బోనీ కపూర్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీలో రీమేక్గా వచ్చిన విక్రమ్ వేద, జెర్సీ సినిమాలు సక్సెస్ కాకపోవడంపై మాట్లాడారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమాలు ఫెయిల్యూర్ కావడానికి గల కారణాలను వివరించారు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న సౌత్ డబ్బింగ్ చిత్రాలు కొన్ని మాత్రమే ఎందుకు హిట్ అవుతున్నాయన్న విషయంపై ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. బోనీ కపూర్ మాట్లాడుతూ..'కొన్ని దక్షిణాది చిత్రాల హిందీ రీమేక్ సినిమాలు సక్సెస్ కాకపోవడానికి కారణం కాపీ-పేస్ట్ చేయడం. విక్రమ్ వేద, జెర్సీ మూవీలకు కనీసం టైటిల్స్ కూడా మార్చలేదు. అలాగే సౌత్ సినిమాలను రీమేక్ చేసేటప్పుడు హిందీ ప్రేక్షకులకు తగ్గట్లుగా నార్త్ ఇండియన్ సంస్కృతిని జోడించాలి. అప్పుడు పాన్ ఇండియా అంగీకరించే సినిమా తీయాలి.' అని అన్నారు. విక్రమ్ వేద భారతీయ జానపద కథ విక్రమ్ ఔర్ బేతాల్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా అదే పేరుతో తమిళంలో విడుదలైంది. ఈ చిత్రంలో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. జెర్సీ మూవీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఇది టాలీవుడ్లో నాని హీరోగా నటించిన చిత్రానికి రీమేక్. షాహిద్ కపూర్ తన కొడుకు కోరిక కోసం ఆటలోకి తిరిగి వచ్చే మాజీ క్రికెటర్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం బోనీ కపూర్ మలయాళ చిత్రం హెలెన్కి బాలీవుడ్ రీమేక్తో వస్తున్నాడు. ఈ చిత్రానికి మిలీ అని పేరు పెట్టారు. అతని కుమార్తె జాన్వీ కపూర్ ఈ మూవీలో టైటిల్ రోల్లో నటించింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ నవంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. -
అడగ్గానే ఇద్దామనుకున్నాడు.. ధావన్ చర్య వైరల్
టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఎప్పుడు ముందుంటాడు. మైదానంలో బరిలోకి దిగితే పరుగులు చేయడమే కాదు.. మైదానం బయట కూడా అంతే చలాకీగా ఉంటాడు. తాను ఎక్కడుంటే అక్కడ నవ్వులు విరపూయాల్సిందే. తాజాగా జింబాబ్వేతో మూడో వన్డే సందర్భంగా ధావన్ చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే.. మూడో వన్డేలో ధావన్ 68 బంతుల్లో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా బ్యాటింగ్ సమయంలో ధావన్ తన జెర్సీ కాకుండా శార్దూల్ ఠాకూర్ జెర్సీ వేసుకొని రావడం విశేషం. అంతేకాదు జెర్సీపై శార్దూల్ పేరు కనబడకుండా దానిపై టేప్ అతికించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా చక్కర్లు కొట్టింది. అయితే ధావన్ ఔటై డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాకా మరొక ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన ఒక అభిమాని.. ప్లకార్డు చేత బట్టుకొని శిఖర్.. ''మీ జెర్సీ నాకు ఇవ్వగలరా'' అని అడిగాడు. దీంతో కెమెరాలన్ని ధావన్వైపు తిరిగాయి. అభిమాని చర్యకు సంతోషపడిన ధావన్.. తన షర్ట్ బయటికి తీసే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉన్న ఆవేశ్ ఖాన్, కెప్టెన్ కేఎల్ రాహుల్లు నవ్వల్లో మునిగిపోయారు. అభిమానులు అడిగితే నేను ఏదైనా ఇవ్వడానికి సిద్ధమే అని చెప్పడం కోసమే ధావన్ ఇలా చేశాడని అభిమానులు పేర్కొన్నారు. ఇక 36 ఏళ్ల ధావన్ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్లో 154 పరుగులు సాధించాడు. ఇక చివరి వన్డేలో శిఖర్ ధావన్ 40 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ డెబ్యూ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ కిషన్ అర్థ సెంచరీతో మెరవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. అనంతరం 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్ సికందర్ రజా వీరోచిత సెంచరీ వృథా అయినప్పటికి.. తన ఇన్నింగ్స్తో అభిమానుల మనసు దోచుకున్నాడు. 📹 | 𝙔𝙚 𝙨𝙝𝙞𝙧𝙩 𝙝𝙪𝙢𝙠𝙤 𝙙𝙚𝙙𝙚 𝙂𝙖𝙗𝙗𝙖𝙧𝙧𝙧𝙧 🤭🔫 P.S: Watch till the end for @SDhawan25's hilarious reaction 👻#ShikharDhawan #ZIMvIND #TeamIndia #SirfSonyPeDikhega pic.twitter.com/1Oz4MUAfxY — Sony Sports Network (@SonySportsNetwk) August 22, 2022 చదవండి: సిరీస్ క్లీన్స్వీప్.. 'కాలా చష్మా' పాటకు చిందేసిన టీమిండియా Tim Paine: రీఎంట్రీ ఇవ్వనున్న ఆసీస్ వివాదాస్పద క్రికెటర్ -
బ్యాట్ పట్టిన చిరంజీవి..పిక్స్ వైరల్ (ఫొటోలు)
-
అభిమానం పరాకాష్టకు.. చెమట వాసనను ఆస్వాదించిన వేళ
'అభిమానానికి ఎల్లలు లేవు' అని అంటుంటారు. నిజమే.. ఒక్కోసారి ఆటగాడిపై అభిమానం తారాస్థాయికి చేరుకుంటుంది. ఎంతలా అంటే.. అతని జెర్సీ నుంచి వస్తున్న చెమట వాసనను కూడా ఆస్వాదించేంతలా. వినడానికి కాస్త వింతగా ఉన్న ఈ ఘటన ఒక ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బుండేస్లిగా ఫుట్బాల్ లీగ్లో భాగంగా గత శుక్రవారం(ఆగస్టు 12న) డోర్ట్మండ్, ప్రీబర్గ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో డోర్ట్మెంట్ 3-1 తేడాతో విజయం అందుకుంది. ఇదే మ్యాచ్లో డోర్టమంట్ మిడ్ఫీల్డర్ బెల్లింగమ్ రెండు గోల్స్తో కీలకపాత్ర పోషించాడు. కాగా మ్యాచ్ అనంతరం బెల్లింగమ్ను ఒక అభిమాని.. ''షర్ట్పై సైన్ చేసి నాకు గిఫ్ట్గా ఇవ్వగలరా'' అని అడిగింది. దానికి వెంటనే స్పందించిన బెల్లింగ్హమ్ తన షర్ట్ను విప్పేసి ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కాగా గిఫ్ట్ అందుకున్న యువతి పక్కనే మరొక మహిళ నిల్చున్నారు. ఆమె 19 ఏళ్ల బెల్లింగ్హమ్కు వీరాభిమాని. బెల్లింగ్హమ్ షర్ట్ను ప్రేమతో దగ్గరికి తీసుకొని వాసన చూస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇది చూసిన టీనేజర్ కూడా సదరు మహిళ లాగానే జెర్సీ వాసన చూడడం విశేషం. మామూలుగా చెమట వాసనను భరించలేం. కానీ ఈ ఇద్దరు మాత్రం చెమట వాసనను కూడా ఆస్వాదించడాన్ని చూస్తే హద్దులు దాటిన అభిమానం ఏదైనా చేయిస్తుందని అనిపిస్తోంది. చదవండి: Cristiano Ronaldo: ఫుట్బాల్ స్టార్ రొనాల్డోకు పోలీసుల వార్నింగ్.. -
ఆసియా కప్ ముంగిట.. భారత అభిమానుల్లో 'జెర్సీ' భయం
ఒక క్రికెట్ మ్యాచ్లో ఒక జట్టు అన్ని విభాగాల్లో బాగా రాణించిందంటే కచ్చితంగా ఆ జట్టునే విజయం వరిస్తుంది. అయితే కొన్ని ఓటములను మాత్రం సెంటిమెంట్తో ముడిపడుతుంటారు. తాజాగా టీమిండియా అభిమానులకు జెర్సీ భయం పట్టుకుంది. మెగా టోర్నీలకు ముందు మార్చిన జెర్సీలు టీమిండియాకు కలిసి రావడం లేదు. 2011 వన్డే వరల్డ్కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ గెలిచిన అనంతరం టీమిండియా మళ్లీ ఎటువంటి మేజర్ టోర్నీ గెలవలేకపోయింది. 2016లో టి20 ప్రపంచకప్లో ఫైనల్, 2015 ప్రపంచకప్లో సెమీఫైనల్, 2019 ప్రపంచకప్లో సెమీస్లోనే వెనుదిరిగింది. ఇక 2021 టి20 ప్రపంచకప్లో టీమిండియా దారుణ ప్రదర్శనను కనబరుస్తూ లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఈ ఓటములన్నీ టీమిండియా జెర్సీ మార్చినందుకే అని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ ముగిసిన తర్వాత వార్మప్ మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు.. తీరా టోర్నీ మొదలయ్యాక అసలు మ్యాచుల్లో తేలిపోయింది. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో మొట్టమొదటి సారి పాక్ చేతుల్లో పరాజయాన్ని ఎదుర్కొన్న భారత జట్టు, ఆ తర్వాత న్యూజిలాండ్తో మ్యాచ్లోనూ ఓడి గ్రూప్ స్టేజీకే పరిమితమైంది... దీంతో టీమిండియా జెర్సీపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది. ఆ తర్వాత కొన్నిరోజులకు జెర్సీని మరోసారి మార్చింది. ప్రస్తుతం భారత జట్టు సౌండ్ వేవ్స్ లేకుండా పాత డార్క్ బ్లూ కలర్ జెర్సీనే వాడుతోంది. ఆసియా కప్ 2022 టోర్నీలోనూ భారత్ ఇదే జెర్సీతో బరిలో దిగనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా సిరీస్లను కైవసం చేసుకుంటూ జైత్ర యాత్ర కొనసాగిస్తోంది టీమిండియా. దీంతో ఈ జెర్సీ భారత జట్టుకి కాస్త బాగానే కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ కొత్త జెర్సీని తీసుకువచ్చే ఆలోచనను విరమించుకోవాలని బీసీసీఐని కోరుతున్నారు అభిమానులు. జెర్సీ మారిస్తే మరోసారి భారత జట్టుకి పరాభవం తప్పదేమోనని భయపడుతున్నారు. చదవండి: Asia Cup 2022: భారత్-పాక్ మ్యాచ్.. టికెట్స్ అమ్మకాలు ఎప్పటి నుంచి అంటే..? Anderson Peters: అథ్లెట్పై అమానుష దాడి.. వీడియో వైరల్ -
స్టార్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న ఆడియెన్స్
బాలీవుడ్ లో వింత ట్రెండ్ కొనసాగుతోంది. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న స్టార్స్ నటించిన మూవీస్ కు మినియం కలెక్షన్స్ ఉండటం లేదు.లేడీ సూపర్ స్టార్ కంగనా నటించిన భారీ బడ్జెట్ ఫిల్మ్ ధాకడ్ ఇటీవలే అక్కడ రిలీజైంది. సుమారు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఈ మూవీ పట్టుమని 3 కోట్లు రాబట్టుకులేకపోయింది.అన్నిటికంటే కంగనాకు పెద్ద అవమానం ఏంటంటే సినిమా రిలీజైన 8వ రోజున కేవలం 20 టికెట్లు అమ్ముడుపోవడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. జెర్సీ విషయంలో షాహిద్ కపూర్,జాయేష్ భాయ్ జోర్దార్ తో రణవీర్ సింగ్, ధాకడ్ తో కంగనా ఆడియెన్స్ నుంచి అవుట్ రైట్ రిజెక్షన్ ఎదుర్కొన్నారు. బాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ అనేక్ కూడా బాక్సాఫీస్ వద్ద 5 కోట్లు మార్క్ దాటేందుకు అష్టకష్టాలు పడుతోంది. థియేటర్స్ కు వచ్చిన సినిమాల సంగతి ఇలా ఉంటే థియేటర్ కు వచ్చేందుకు రెడీ అవుతున్న మరికొన్ని సినిమాలను ర్యాగింగ్ చేస్తున్నారు నెటిజన్స్. ఆమిర్ ఖాన్ నటించిన కొత్త చిత్రం లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ లో రిలీజ్ అవుతోంది. 2018లో తగ్స్ ఆఫ్ హిందుస్తాన్ డిజాస్టర్ కావడంతో కొంత సమయం తీసుకుని ఆమిర్ ఈ చిత్రంతో తిరిగొస్తున్నాడు. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ అఫీసియల్ రీమేక్ లాల్ సింగ్ చెద్దా. తెలుగు నటుడు నాగ చైతన్య ముఖ్యపాత్రలో పోషించాడు. ప్రమోషన్స్ లో భాగం యూనిట్ ఇటీవలే ఐపీఎల్ ఫైనల్లో ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ పై కూడా బాలీవుడ్ లో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మూవీలో ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ గతంలో వచ్చిన పీకే, ధూమ్ 3 చిత్రాల్లో కనిపించిన విధంగానే ఉందంటున్నారు నెటిజన్స్. అంతేకాదు ఈ మూవీ గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ దారిలోనే ఉందంటూ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కు చుక్కలు చూపించడం స్టార్ట్ చేశారు. -
అడగ్గానే ఇచ్చేశాడు.. వైరల్గా మారిన రాజస్తాన్ బౌలర్ చర్య
ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ అద్భుత ఆటతీరుతో ఫైనల్ చేరుకుంది. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్-2లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జాస్ బట్లర్ మెరుపు సెంచరీతో మ్యాచ్ మొత్తం వన్సైడ్గా మారిపోయింది. మ్యాచ్ గెలవడంతో రాజస్తాన్ ఆటగాళ్లంతా సంబురాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తన చర్యతో అభిమానిని ఆనందంలో ముంచెత్తాడు. విషయంలోకి వెళితే.. మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తున్న బౌల్ట్ను ఒక కుర్రాడు ఆపాడు. మీరంటే నాకు చాలా అభిమానం.. మీ బౌలింగ్ అంటే చాలా ఇష్టం.. మీ జెర్సీ నాకు గిఫ్ట్గా ఇస్తారా అని అడిగాడు. కుర్రాడి మాటలకు ముచ్చటపడిన బౌల్ట్ అక్కడే తన షర్ట్ను విప్పేసి పెవిలియన్ గ్లాస్ నుంచి ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే వీలు కాకపోవడంతో ఎంట్రీ వద్ద ఉన్న మరో రాజస్తాన్ ఆటగాడి వద్దకు జెర్సీ విసిరేసి.. ఆ కుర్రాడికి జెర్సీని అందివ్వు అని చెప్పాడు. ఆ తర్వాత కుర్రాడు బౌల్ట్ ఇచ్చిన జెర్సీని వేసుకొని తెగ సంతోషపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తన ట్విటర్లో షేర్ చేసింది. ''ఇంత చేశాకా నిన్ను లవ్ చేయకుండా ఉలా ఉంటాం బౌల్ట్'' అని క్యాప్షన్ జత చేసింది. కాగా బౌల్ట్ ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరపున మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆరంభంలోనే వికెట్లు తీస్తూ జట్టుకు మంచి బ్రేక్ ఇస్తున్నాడు. ఇప్పటివరకు 15 మ్యాచ్ల్లో 8.24 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీశాడు. ఇక 2008 తర్వాత మరోసారి ఫైనల్ చేరిన రాజస్తాన్ రాయల్స్ మే29(ఆదివారం) జరగనున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. చదవండి: Paul Stirling: ఒక్క ఓవర్లో 34 పరుగులు.. అయినా మొహంలో చిరాకే! Trolls On RCB Fan Girl: 'ఆర్సీబీ కప్ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు' How can you not love Trent Boult? 😍 Watch him make a young fan's day after #RRvRCB. 💗 pic.twitter.com/YrWgRsAgsN — Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్ఆర్ఆర్, ఆచార్య.. ఫ్రైడే స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలేంటంటే?
స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అటు బాక్సాఫీస్ కూడా బాగానే కలెక్షన్లు దండుకుంటోంది. అయితే థియేటర్లను రఫ్ఫాడించేసిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే వసూళ్లు రాబట్టిన చిత్రాలు సైతం ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇంతకీ ఈరోజు(మే 20) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో చూసేయండి.. ఆర్ఆర్ఆర్ జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ కలిసి నటించిన మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సినీవర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించిన ఈ చిత్రం తాజాగా జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదట రూ.100 కడితేనే ఈ సినిమా చూడనిస్తామంది జీ 5. ఈ నిర్ణయంపై అభిమానులు భగ్గుమనడంతో వెనక్కు తగ్గిన సదరు ఓటీటీ సంస్థ తమ సబ్స్క్రైబర్లు ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఒక్క హిందీ వర్షన్ మాత్రం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఆచార్య చిరంజీవి, రామ్చరణ్ నటించిన మల్టీస్టారర్ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలైంది. ఓ మోస్తరు కలెక్షన్లతో పర్వాలేదనిపించిన ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. భళా తందనాన యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం భళా తందనాన. ‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. మే 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో 15 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. జెర్సీ నాని నటించిన హిట్ మూవీ జెర్సీ అదే టైటిల్తో హిందీలో రీమేక్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 22న థియేటర్లలో రిలీజైంది. ఇవేకాకుండా 12th మ్యాన్, ఎస్కేప్ లైవ్ హాట్స్టార్లో ప్రసారం అవుతుండగా జాంబీవ్లి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరింకెందుకాలస్యం. నచ్చిన సినిమాను ఇప్పుడే వీక్షించేయండి.. చదవండి 👇 ఓ వైపు చెల్లి పెళ్లి, మరోవైపు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ బిగ్బాస్ ఓటీటీ విజేతగా బిందు, రన్నర్గా అఖిల్! -
ఓటీటీలో జెర్సీ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
షాహిద్ కపూర్ నటించిన తాజా చిత్రం 'జెర్సీ'. తెలుగు నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీని హిందీలో అదే పేరుతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేశాడు. ఇందులో షాహిద్ 40 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానం సంపాదించి కొడుకు కోరికను నెరవేర్చిన అర్జున్ తల్వార్ అనే తండ్రి పాత్రలో కనిపించాడు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడీ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్లో జెర్సీ సినిమా ఈనెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో షాహిద్కు జోడిగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించింది. దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. -
భారత్పై పదికి పది వికెట్లు తీసిన బౌలర్ టీషర్ట్ వేలానికి..
న్యూజిలాండ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ మీ అందరికి గుర్తుండే ఉంటాడు. గతేడాది డిసెంబర్లో వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు తీసి ఎజాజ్ పటేల్ క్రికెట్ చరిత్రను తిరగరాశాడు. తద్వారా టెస్టు క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు తీసిన మూడో బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఎజాజ్ పటేల్ కంటే ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేలు ఈ ఘనత సాధించారు. తాజాగా ఎజాజ్ పటేల్ ఏ జెర్సీతో ఆ ఫీట్ సాధించాడో.. అదే జెర్సీని వేలం వేయబోతున్నట్లు తెలిపాడు. ఎజాజ్ పటేల్ తన టీషర్ట్ వేలం వేయడం వెనుక దాగున్న చిన్నకథను స్టఫ్ డాట్కామ్ వెబ్సైట్ రివీల్ చేసింది. గతేడాది ఎజాజ్ పటేల్ కూతురు ఆరోగ్య సమస్యతో బాధపడింది. న్యూజిలాండ్లోని స్టార్షిప్ చిల్రన్ ఆసుపత్రిలో తన కూతురుకు చికిత్స చేయించాడు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కొన్నిరోజులు ఉండాల్సి వచ్చింది. కొంచెం భయమైనప్పటికి ఎజాజ్ పటేల్ కూతురు తొందరగానే రికవరీ అయింది. అయితే తన కూతురును బాగు చేసిన ఆసుపత్రికి ఏదైనా చేయాలని భావించాడు. కొన్నిరోజుల క్రితం స్టార్షిప్ ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగం చిన్న పిల్లల చికిత్స కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న ఎజాజ్ పటేల్ 10 వికెట్ ఫీట్ సాధించిన రోజున వేసుకున్న టీషర్ట్ను వేలానికి వేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ టీషర్ట్పై న్యూజిలాండ్ జట్టు సభ్యుల సంతకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎజాజ్ తన టీషర్డ్ను వేలానికి పెట్టాడు.. బుధవారం(మే 11తో) వేలం ముగియనుంది. ఇక టీమిండియాతో తొలి టెస్టులో 14 వికెట్లతో ఎజాజ్ పటేల్ మంచి ప్రదర్శన చేసినప్పటికి జట్టు ఓటమిపాలైంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత న్యూజిలాండ్ 65 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ ఆడిన భారత్ ఇన్నింగ్స్ను 276 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తద్వారా న్యూజిలాండ్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచగా.. కివీస్ 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. రెండు టెస్టుల సిరీస్లో మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టును గెలిచిన టీమిండియా 1-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మకు రెగ్యులర్ టెస్టు కెప్టెన్గా ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. ఆ తర్వాత జరిగిన మూడు టి20 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. చదవండి: IND Vs NZ: వహ్వా అజాజ్! ఏమా బౌలింగ్.. ధనాధన్గా ‘టెన్’ రికార్డు -
వేలానికి విరాట్ కోహ్లి జెర్సీ.. ధర ఎంతంటే
టీమిండియా స్టార్.. మనం ముద్దుగా 'మెషిన్ గన్' అని పిలుచుకునే విరాట్ కోహ్లికి అభిమానుల్లో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత క్రికెట్లో సచిన్, ధోని తర్వాత అత్యంత పాపులర్ అయిన వ్యక్తిగా కోహ్లి స్థానం సంపాదించాడు. ఇక ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన జాబితాలో కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు. ఫుట్బాల్ స్టార్స్ క్రిస్టియానోరొనాల్డో, లియోనల్ మెస్సీ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక విషయంలోకి వెళితే.. ఇంగ్లీష్ క్రికెట్ మీడియా విజ్డెన్ విరాట్ కోహ్లి జెర్సీని వేలం వేయనుంది. కోహ్లి సంతకంతో కూడిన జెర్సీని ఒక ఫోటో ఫ్రేమ్లో పెట్టింది. జెర్సీతో పాటు కోహ్లికి సంబంధించిన ఫోటోలను కూడా ఫ్రేమ్లో ఉంచింది. ఈ జెర్సీని ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ పద్దతిలో వేలం వేయనుంది. కోహ్లి జెర్సీ దక్కించుకోవాలంటే విజ్డెన్ వైబ్సైట్ను ఓపెన్ చేయాల్సిందే. కాగా విజ్డెన్ మీడియా కోహ్లి జెర్సీ ప్రారంభ ధరను 2499.99 పౌండ్లుగా నిర్ణయించింది(భారత కరెన్సీలో దాదాపు రూ. 2.42 లక్షలు). మరి కోహ్లి జెర్సీ ఎంతకు అమ్ముడవుతుందో వేచి చూడాలి. ఇక కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్ 2022లో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్లాడి 128 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు గోల్డెన్ డక్లు ఉండడం విశేషం. కాగా వరుసగా విఫలమవుతున్న కోహ్లిని జట్టు నుంచి కొన్ని మ్యాచ్లు దూరంగా ఉంచాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆర్సీబీ యాజమాన్యం మాత్రం కోహ్లి రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. మంగళవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 145 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆర్సీబీ 115 పరుగులకే ఆలౌట్ అయి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ను ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది. చదవండి: Virat Kohli: ఎత్తుపల్లాలు సహజం.. జట్టు నుంచి తీసేయాలనడం కరెక్ట్ కాదు! Trolls On Virat Kohli: ఓపెనర్గా వచ్చినా అదే ఆటతీరు.. పక్కన పెట్టాల్సిందేనా! Signed Virat Kohli framed India Cricket Shirt is available in the Wisden shop for Rs 1,91,376.https://t.co/zeGigPUWkZ pic.twitter.com/teBy5dytG2 — Johns. (@CricCrazyJohns) April 26, 2022 -
బాలీవుడ్కు తెలుగు వైరస్, జెర్సీ రీమేక్ అవసరమా?: ఆర్జీవీ
తెలుగు హిట్ చిత్రం జెర్సీ హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే! షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 22న థియేటర్లలో రిలీజైంది. అయితే అప్పటికే బాక్సాఫీస్ను రఫ్ఫాడిస్తున్న కేజీఎఫ్ 2 దూకుడు ముందు జెర్సీ నిలబడలేకపోయింది. ఓ మోస్తరు కలెక్షన్లు మాత్రమే వసూలు చేస్తూ ఫ్లాప్ దిశగా పయనిస్తోంది. తాజాగా జెర్సీ మూవీపై సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డిజాస్టర్ దిశగా పయనిస్తున్న జెర్సీ చిత్రం హిందీలో రీమేక్లకు కాలం చెల్లిందనడానికి సంకేతాలనిస్తోందన్నాడు. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి డబ్బింగ్ చిత్రాలు హిందీలో బాగా ఆడుతున్నాయన్నాడు. నాని జెర్సీ డబ్ చేసి ఉంటే రూ.10 లక్షలు ఖర్చయ్యేదని, కానీ దాన్ని హిందీలో రీమేక్ చేయడానికి దాదాపు రూ.100 కోట్ల మేర ఖర్చు పెడితే తీరా భారీ నష్టాలు చవిచూడక తప్పడం లేదని విమర్శించాడు. పుష్ప, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలనే కాదు, అందులోని స్టార్లను సైతం హిందీ ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చాడు. కాబట్టి మున్ముందు రీమేక్ హక్కులను కూడా బాలీవుడ్కు అమ్మే అవకాశం ఉండకపోవచ్చన్నాడు. తెలుగు, కన్నడ చిత్రాలు బాలీవుడ్కు వైరస్లా మారాయని, దీనికి త్వరలోనే హిందీ ఇండస్ట్రీ వ్యాక్సిన్ను కనుగొనాలని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు వర్మ. The DISASTROUS fate of JERSEY film in Hindi signals the DEATH of REMAKES for the simple reason it has been proved multiple times that dubbed films like #Pushpa #RRR #KGF2 are doing far better than originals ,if the content is good #DeathOfRemakes — Ram Gopal Varma (@RGVzoomin) April 26, 2022 If Nani ‘s original JERSEY from Telugu was dubbed and released it would have costed the producers just 10 lakhs whereas the remake in Hindi costed 100 cr resulting in losing enoromous money ,time, effort and face #DeathOfRemakes — Ram Gopal Varma (@RGVzoomin) April 26, 2022 After the monstrous successes of dubbed films like #Pushpa , #RRR and #KGF2 , no south film with good content will be sold for remake rights as even both the content and regional stars are being liked by the Hindi audiences #DeathOfRemakes — Ram Gopal Varma (@RGVzoomin) April 26, 2022 Bollywood will be now getting ducked from both front and back as they neither seem to know how to make superhits nor can they hope to survive on remaking south films because nobody will sell them REMAKE rights #DeathOfRemakes — Ram Gopal Varma (@RGVzoomin) April 26, 2022 Moral of the story is it’s smart to release dubbed films instead of remaking them because it’s obvious that the audiences are ok with any face or any subject from anywhere as long as it interests them #DeathOfRemakes — Ram Gopal Varma (@RGVzoomin) April 26, 2022 TELUGU and KANNADA films have INFECTED Hindi films like a COVID VIRUS..Hoping that BOLLYWOOD will soon come up with a VACCINE 💐 — Ram Gopal Varma (@RGVzoomin) April 26, 2022 చదవండి: పాన్ ఇండియా సినిమాల సక్సెస్, కలవరపడుతున్న కోలీవుడ్ అందుకే జెర్సీ ఆఫర్ను వదులుకున్న, నావల్ల నిర్మాతలు.. -
అందుకే ‘జెర్సీ’లో నటించనని చెప్పా: రష్మిక వివరణ
Rashmika Mandanna Was 1st Choice For Shahid Jersey: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన జెర్సీ ఈ నెల 22న విడుదలై బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఇందులో షాహిద్ నటకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో షాహిద్ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి. తెలుగులో బ్లాక్బస్టర్ హిట్ సాధించిన నేచులర్ స్టార్ నాని జెర్సీకి ఇది హిందీ రీమేక్ అనే విషయం తెలిసిందే. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీ ఇదే పేరుతో ఈ మూవీని రీమేక్ చేశాడు. ఇందులో షాహిద్ 40 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానం సంపాదించి కొడుకు కోరికను నెరవేర్చిన అర్జున్ తల్వార్ అనే తండ్రి పాత్రలో కనిపించాడు. చదవండి: నా తండ్రి గుర్తింపుతో బతకాలని లేదు: వేదాంత్ షాకింగ్ కామెంట్స్ ఈ క్రమంలో షాహిద్ పోషించిన భావోద్వేగ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయినప్పటికీ మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో షాహిద్ భార్యగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకుర్ నటించింది. అయితే మొదట ఈ పాత్ర కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను సంప్రదించారట చిత్ర బృందం. అయితే తను ఈ ఆఫర్ను తిరస్కరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక స్పందించింది. ఐఏఎన్ఎస్తో ముచ్చటించిన రష్మిక హిందీ జెర్సీ ఆఫర్పై నోరు విప్పింది. తనకు హిందీ జెర్సీ ఆఫర్ వచ్చిందని, కానీ దాన్ని తిరస్కరించానని తెలిపింది. చదవండి: షాపింగ్ మాల్ ఓపెనింగ్కు వెళ్లిన అనుపమకు షాకిచ్చిన ఫ్యాన్స్ ‘ఎందుకంటే నేను ఇప్పటి వరకు చేసినవన్ని కమర్షియల్ సినిమాలే. అలాంటి నేను జెర్సీలాంటి చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది. జెర్సీ మంచి సినిమా కాదు అని నేను అనడం లేదు. ఇది రియలిస్టిక్ చిత్రం. జెర్సీ తెలుగు వెర్షన్లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించారు. ఆ పాత్రకు తనకన్న గొప్పగా ఎవరూ నటించలేరని నా ఉద్దేశం. అందుకే ఈ పాత్రకు నేను కరెక్ట్ కాదని అనిపించింది. అనుకుంటే నేను ఈ సినిమాలో నటించేదాన్నే. కానీ నా వల్ల దర్శక-నిర్మాతలు నష్టపోకూడదనుకున్న. ఈ సినిమా కోసం వారికి నాకంటే బెటర్ ఆప్షన్స్ ఎన్నో ఉండోచ్చు కదా. అందుకే ఈ సినిమాకు నో చెప్పాను’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం రష్మిక తెలుగు పుష్ప 2తో పాటు హిందీలో యానిమల్ చిత్రాలతో బిజీగా ఉంది. -
నాకెప్పటికీ ఆ స్కూల్ డేస్ అంటే అసహ్యం: షాహిద్ కపూర్
Shahid Kapoor Says He Hates His School Days: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. కబీర్ సింగ్తో ఫాంలోకి వచ్చిన షాహిద్ ఈ మూవీతో ఎలాగైన మరో హిట్ కొట్టాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (ఏప్రిల్ 22న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. చదవండి: ‘ఆచార్య’ హిందీ వెర్షన్పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్ అయినప్పటికీ ఈ చిత్రంలో షాహిద్ పాత్రకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. క్రికెట్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో కొడుకు కోరికను నేరవెర్చే తండ్రిగా షాహిద్ ఒదిగిపోయాడు. ఈ క్రమంలో షాహిద్ పోషించిన భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ నేషనల్ చానల్తో ముచ్చటించిన షాహిద్ వ్యక్తిగతం జెర్సీ కథకు బాగా కనెక్ట్ అయ్యానన్నాడు. అనంతరం ఈ సినిమాలో తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఇక తన వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడుతూ ముంబైలోని తన స్కూలింగ్ డేస్ను గుర్తు చేసుకున్నాడు. చదవండి: రాజమౌళి గురించి ఈ విషయం 12 ఏళ్ల క్రితమే చెప్పా: భాను చందర్ ఈ సందర్భంగా ముంబైలో తను చదివిన స్కూల్ అంటే అసహ్యం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘నా పదేళ్ల వయసు వరకు ఢిల్లీలో చదివాను. అక్కడ స్కూల్స్ అంటే నాకు చాలా ఇష్టం. టీచర్లంతా స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు. విషయం ఏదైనా అర్థమయ్యేలా వివరించేవారు. ఇక అమ్మ జాబ్ నేపథ్యంలో మేం ముంబైకి వచ్చాం. దీంతో నేను ముంబై స్కూళ్లో చేరాను. ఆ స్కూల్ అంటే నాకెప్పటికీ అసహ్యం. ఎందుకంటే ఆ స్కూల్ టీచర్లు తరచూ నన్ను వేధించేశారు. వాళ్లు నాతో సరిగ్గా ఉండేవాళ్లు కాదు. అందుకే ఆ స్కూల్ డేస్ నాకెప్పటికీ నచ్చవు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అల్లు అరవింద్ సమర్పణలో దిల్రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్గిల్ నిర్మించిన హిందీ జెర్సీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జెర్సీ మూవీ టీంకు భారీ షాక్, గంటల వ్యవధిలోని ఆన్లైన్లో లీక్
Shahid Kapoor Jersey Movie Leaked Online: షాహిద్ కపూర్ తాజా చిత్రం జెర్సీ మూవీ టీంకు షాక్ తగిలింది. ఎన్నోసార్లు వాయిదా పుడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు నేడు(ఏప్రిల్ 22న) విడుదలైంది. ఇప్పటికే తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’తో హిట్ కొట్టిన షాహిద్ ఈ మూవీతో మరో హిట్కొట్టాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో జెర్సీ విడుదలైన గంటల వ్యవధిలోనే ఆన్లైన్లో లీకవడంతో మూవీ టీం, హీరో షాహిద్ ఆందోళనకు గురవుతున్నారు. ఈ మూవీ విడులైన గంట వ్యవధిలోనే తమిళ్రాక్స్, టెలిగ్రామలో లీకైంది. అయితే ఈ సినిమా పైరసి పట్ల చిత్ర బృందం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికి లీకువీరులు తమ చేతివాటం చూపించారు. చదవండి: సమంత ఫేక్ ఫొటో షేర్ చేసిన విజయ్, పడిపడి నవ్విన సామ్ కేజీయఫ్, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ చిత్రాలు గట్టి పోటి ఇస్తున్న నేపథ్యంలో చిన్న సినిమాగా వచ్చిన జెర్సీ తొలి రోజే ఆన్లైన్లోకి లీకవడం మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో షాహిద్ ఎమోషనల్గా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో అతడి పాత్రపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీని హిందీలో అదే పేరుతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రీమేక్ చేశాడు. ఇందులో షాహిద్కు జోడిగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించింది. దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సాచెట్ అండ్ పరంపర మ్యూజిక్ అందించారు. చదవండి: హిందీ ‘జెర్సీ’ చూసిన నాని ఏమన్నాడంటే.. -
హిందీ ‘జెర్సీ’ చూసిన నాని ఏమన్నాడంటే..
Nani Interesting Comments on Shahid Kapoor: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన హీరో స్టార్ నాని జెర్సీని హిందీలో షాహిద్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంతరం ఈ రోజు(ఏప్రిల్ 22) థియేటర్లో విడుదలైంది. ఇందులో షాహిద్ పాత్రకు సినీ సెలబ్రెటీల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అలాగే ఈ సినిమా చూసిన నాని కూడా చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపించాడు. చదవండి: కన్నడ ప్రేక్షకులకు సారీ చెప్పిన నాని, అసలేం జరిగిందంటే.. హిందీ జెర్సీలో తన రోల్ పోషించిన షాహిద్ను పొగడ్తలతో ముంచెత్తాడు.ఈ మేరకు నాని ట్వీట్ చేస్తూ అర్జున్ పాత్రకు షాహిద్ పూర్తి న్యాయం చేశాడని పేర్కొన్నాడు. ‘జెర్సీ సినిమా చూశాను. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో మరోసారి హిట్ కొట్టేనట్టే. షాహిద్కపూర్ అర్జున్ పాత్రను మనస్సు పెట్టి చేశాడు. మృణాళ్ ఠాకూర్, పంకజ్ కపూర్ సర్, మై బాయ్ రోనిత్ (చైల్డ్ యాక్టర్) కూడా చాలా బాగా చేశారు.. నిజమైన మంచి సినిమా ఇది. చిత్రయూనిట్కు నా శుభాకాంక్షలు’ అంటూ నాని రాసుకొచ్చాడు. చదవండి: జెర్సీ సినిమా భరించలేకున్నానంటూ కేఆర్కే రివ్యూ ఇక నాని ట్వీట్కు షాహిద్ సమాధానం ఇచ్చాడు. ‘థాంక్యూ మై ఫ్రెండ్(అర్జున్ నుంచి మరోక అర్జున్). మీది చాలా పద్ద మనసు అందుకే జెర్సీకి ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మోర్ పవర్ టూ యూ’ అంటూ రీట్వీట్ చేశాడు. కాగా ఇప్పటివరకు స్క్రీనింగ్ అయిన షోల వరకు ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇందులో షాహిద్కు జోడిగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ నటించింది. దిల్ రాజు, నాగవంశీ, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సాచెట్ అండ్ పరంపర మ్యూజిక్ అందించారు. Thank you. From one Arjun to another. Big love my friend. You have a big heart and that’s what jersey is all about. More power to you. https://t.co/mMOkevCH5T — Shahid Kapoor (@shahidkapoor) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జెర్సీ సినిమా భరించలేకున్నానంటూ కేఆర్కే రివ్యూ
తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన జెర్సీ హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే! షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఎన్నో వాయిదాల అనంతరం నేడు (ఏప్రిల్ 22న) థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాపై బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ రివ్యూ ఇచ్చాడు. 'జెర్సీ సినిమాను చూసి భరించలేకపోతున్నాను. ఇదేం సినిమారా బాబు. కబీర్ సింగ్లో షాహిద్ ఎలా హింసాత్మకంగా ఉన్నాడో ఇక్కడ కూడా అలానే ఉన్నాడు. ఈ సినిమా చేసేందుకు షాహిద్కు ఇదొక్కటి సరిపోతుందేమో!' అని ట్వీట్ చేశాడు కేఆర్కే. మరో ట్వీట్లో 'కేవలం క్రికెట్ చూడటానికి నేను జెర్సీ సినిమా ఎందుకు చూడాలో నాకైతే అర్థం కావడం లేదు. అంతగా కావాల్సి వస్తే ఐపీఎల్ చూస్తాను. జెర్సీ నిర్మాతలు సినిమా క్రికెట్ గురించి కాదని ప్రతిచోటా చెబుతూ వచ్చారు. వారి మాటలను నమ్మి నేను సినిమా చూడాలని నిర్ణయించుకున్నాను. తీరా సినిమా చూశాక ఆరు గంటల క్రికెట్ను వారు జెర్సీ ద్వారా మూడు గంటల్లో చూపించినట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు మినహా అంతా క్రికెట్ చుట్టూనే సాగుతోంది' అంటూ కేఆర్కే వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మరోపక్క ఇషాన్ ఖట్టర్, వరుణ్ ధావన్, రకుల్ ప్రీత్ సింగ్, కునాల్ కెమ్ము తదితరులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. Ye Film #Jersey Mujhse Jheli Nahi Jaa Rahi. Ye Kaya Hai Bhai? Film Ka Hero #KabirSingh main mental and violent tha. Waisa Hi Yahan hai. Toh Bas Shahid Ke Liye Itna Hi Kafi tha Film Karne Ke Liye. These actors are really Big Jhandu. — KRK (@kamaalrkhan) April 21, 2022 I really can’t understand that why should I watch film #jersey to watch cricket. If I have to watch cricket only then better I will watch #IPL. — KRK (@kamaalrkhan) April 21, 2022 Makers of #Jersey are saying everywhere that the film is not about cricket. So I decided to watch the film on their words. After watching the film, I can say that makers must be thinking to show 6hours cricket in 3hours film. Coz This film is all about cricket except few scenes. — KRK (@kamaalrkhan) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1361281962.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: ఓటీటీలో అమితాబ్ బచ్చన్ లేటెస్ట్ మూవీ, ఎక్కడో తెలుసా? 'కేజీయఫ్-2' విజయంపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో లుక్కేయండి!
కరోనా వల్ల పూర్తిగా చతికిలపడ్డ బాక్సాఫీస్ బిజినెస్ అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 హిట్లతో తిరిగి ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాల సక్సెస్ను చూసి మరిన్ని చిత్రాలు రిలీజ్కు రెడీ అయ్యాయి. ప్రేక్షకుడికి బోలెడంత వినోదాన్ని పంచేందుకు సై అంటున్నాయి. అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలేంటో చూసేయండి.. జెర్సీ షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగులో బ్లాక్బస్టర్ హిట్ సాధించిన జెర్సీకి ఇది రీమేక్. తెలుగు జెర్సీని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్కు సైతం దర్శకత్వం వహించాడు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతోంది. 1996 ధర్మపురి ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ సమర్పణలో గగన్ విహారి, అపర్ణ హీరోహరోయిన్లుగా నటించిన సినిమా 1996 ధర్మపురి. విశ్వజగత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 22న రిలీజవుతోంది. ఆహా గని - ఏప్రిల్ 22 అమెజాన్ ప్రైమ్ ఓ మై డాగ్ - ఏప్రిల్ 21 గిల్టీ మైండ్స్ - ఏప్రిల్ 22 జీ 5 అనంతం - ఏప్రిల్ 22 నెట్ఫ్లిక్స్ కుథిరైవాల్ - ఏప్రిల్ 20 ద మార్క్డ్ హార్ట్ - ఏప్రిల్ 20 హి ఈజ్ ఎక్స్పెక్టింగ్ (వెబ్సిరీస్) - ఏప్రిల్ 21 సోని లివ్ అంత్యాక్షరి - ఏప్రిల్ 22 వూట్ లండన్ ఫైల్స్ - ఏప్రిల్ 21 చదవండి: అందుకే దక్షిణాది సినిమాలు హిట్ అవుతున్నాయి భారీ ఆఫర్ను తిరస్కరించిన బన్నీ!, ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్ -
వివాదంలో జెర్సీ మూవీ, విడుదల ఆపాలంటూ రచయిత డిమాండ్
Shahid Kapoor Jersey Movie In Trouble: షాహిద్ కపూర్ జెర్సీకి వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. తెలుగు నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కేజీఎఫ్ 2, బీస్ట్ చిత్రాల కారణంగా ఏప్రిల్ 22కు మరోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీని ఓ వివాదంలో చూట్టుముట్టుంది. బాలీవుడ్ సినీ రచయిత రూపేశ్ జైశ్వల్ జెర్సీ విడుదలను ఆపాలంటూ తాజాగా కోర్టును ఆశ్రయించాడు. చదవండి: యశ్, విజయ్ ఎఫెక్ట్, వెనక్కి తగ్గిన షాహిద్ కపూర్ జెర్సీ స్క్రిప్ట్ తనదంటూ కాపీరైట్ కింద కేసు నమోదు చేశాడు. ఈ మేరకు ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘‘ది వాల్’ అనే పేరుతో ఈ కథకు సంబంధించిన కాపీరైట్స్ను ఫిలిం రైటర్స్ అసోసియేషన్లో 2007లోనే రిజిస్టర్ చేయించాను. తెలుగుతో పాటు హిందీ జెర్సీ సినిమా కథ నాదే. నా కథలో ఎన్నో మార్పులు చేసి నాకు తెలియకుండా స్క్రిప్ట్ తీసుకున్నారు’ అని తన పిటిషన్లో ఆయన పేర్కొన్నాడు. అంతేకాదు ఏప్రిల్ 22న విడుదల కాబోతోన్న ఈమూవీని వెంటనే ఆపివేయాలని కోర్టును కోరాడు. థియేటర్లతో సహా మరే ఇతర ఓటీటీల్లో కూడా ఈ మూవీ విడుదల కాకుండా చూడాలన్నాడు. చదవండి: అందుకే మీకు చరణ్ డామినేషన్ ఎక్కువ ఉందనిపిస్తుంది కనీసం ఈ కేసు తీర్పు వచ్చేవరకైనా ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశాడు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుంది, ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో వేచి చూడాలి. తెలుగు జెర్సీని నిర్మాతలైన అల్లు అరవింద్, నాగవంశీలు హిందీ జెర్సీ కూడా నిర్మాతలుగా వ్యవహించారు. అయితే ఈ సినిమా షూటింగ్కు కరోనా లాక్డౌన్ కారణంగా మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా సెకండ్ లాక్ డౌన్ వచ్చి సినిమా రిలీజ్ను ఆపేసింది. సంక్రాంతి సమయంలో ఈ మూఏవీరి రిలీజ్ చేయాలనుకోగా కరోనా భయంతో థియేటర్స్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి జెర్సీని వాయిదా పడేలా చేసింది. ఇక ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని కెజిఎఫ్ 2 సినిమా రావడంతో మళ్ళీ వాయిదా వేసుకున్నారు. -
యశ్, విజయ్ ఎఫెక్ట్, వెనక్కి తగ్గిన షాహిద్ కపూర్
Shahid Kapoor Jersey Postponed New Release Date Here: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే విడుదలకు ఇంకా 3 రోజులు ఉందనగా మరోసారి జెర్సీని పోస్ట్పోన్ చేస్తూ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. చదవండి: స్టార్ హీరో అయ్యుండి ఇలా చేస్తారనుకోలేదు: విజయ్పై పూజా కామెంట్స్ ఇదే వారం పాన్ ఇండియా చిత్రాలు కేజీఎఫ్ 2, బీస్ట్లు విడుదల అవుతోన్న నేపథ్యంలో జెర్సీ టీం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జెర్సీ పోస్ట్పోన్ అయిందని, ఏప్రిల్ 22కు ఈ మూవీని వాయిదా వేసినట్లు తాజాగా సినీ విశ్లేషకుడు తరణ్ అదర్శ్ ట్వీట్ చేశాడు. ‘ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్.. జెర్సీ మరో వారానికి వాయిదా పడింది. నిన్న(ఆదివారం) రాత్రి మేకర్స్ ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 22 ఏప్రిల్ 22న జెర్సీ థియేటర్లోకి రానుంది’ అంటూ తరణ్ ఆదర్శ్ రాసుకొచ్చాడు. కాగా క్రికెటర్గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? అనే ఎమోషనల్ అంశాలతో తెరకెక్కించిన సినిమా జెర్సీ. #Xclusiv... BREAKING NEWS... #Jersey POSTPONED by one week... Will arrive in *cinemas* on 22 April 2022... The stakeholders arrived at the decision late last night. pic.twitter.com/7ZY5JU4zQV — taran adarsh (@taran_adarsh) April 11, 2022 చదవండి: RK Roja: కామెడీ షో జబర్దస్త్కు ఆర్కే రోజా గుడ్బై -
రాఖీభాయ్తో పోరుకు విజయ్, షాహిద్ సై.. విజయం ఎవరిది?
ఏప్రిల్ 14న తుపాన్ వేగంతో వస్తున్నాడు రాఖీభాయ్. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కేజీఎఫ్ అభిమానులను అదే రోజు పలకరించనున్నాడు. మొదటి భాగాన్ని మించి రెండో భాగం ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పడం.. అందుకు తగ్గట్టే టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ఉండడంతో కేజీఎఫ్2పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే రాఖీభాయ్ని ఢీ కొట్టేందుకు ఇటు విజయ్, అటు షాహిద్ కపూర్ రెడీ అవుతున్నారు. కేజీఎఫ్ 2 విడుదలకు ఒక్క రోజు ముందే.. అంటే ఏప్రిల్ 13న విజయ్ కొత్త చిత్రం ‘బీస్ట్’ థియేటర్స్లోకి రాబోతుంది. పాన్ ఇండియా వైడ్గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు విజయ్. ఈ చిత్రంలోని ‘అరబిక్ కత్త’సాంగ్ బ్లాక్ బస్టర్ కావడం, ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా బంపర్ హిట్ కొట్టడంతో రాఖీభాయ్ వసూళ్లకు బీస్ట్ పెద్ద ఎత్తున గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు బాలీవుడ్ లో రాఖీభాయ్ స్పీడ్ కు గట్టిగానే బ్రేకులు వేస్తానంటున్నాడు షాహిద్ కపూర్. గతంలో నాని నటించిన సూపర్ హిట్ ఫిల్మ్, అతని కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసాడు షాహిద్ కపూర్.తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని ఇంకాస్త బెటర్ గా, బాలీవుడ్ ఆడియెన్స్ ను అలరించే విధంగా తెరకెక్కించాడు.రీసెంట్ గా రిలీజైన న్యూ ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేస్తోంది. కేజీఎఫ్ 2 రిలీజ్ అవుతున్న రోజే(ఏప్రిల్ 14) జెర్సీ కూడా థియేటర్స్ లోకి వస్తోంది.కబీర్ సింగ్ తర్వాత షాహిద్ కపూర్ కనిపిస్తున్న సినిమా కావడంతో, కేజీఎఫ్ 2 కలెక్షన్స్ కు ఈ చిత్రం కూడా కొంత కోత పెట్టే అవకాశాలు బాగానే ఉన్నాయి. చదవండి: ఆన్సర్ షీట్లో 'పుష్ప' డైలాగ్స్ రాసిన టెన్త్ స్టూడెంట్ విజయ్ బీస్ట్ గా మారినా,షాహిద్ కపూర్ బ్యాట్ తో క్రికెట్ ఆడినా తాను సృష్టించే విధ్వంసం ముందు తక్కువే అంటున్నాడు రాఖీభాయ్.ప్రశాంత్ నీల్ లాంటి మెగా మేకర్ అండతో,కనివిని ఎరుగని వయలెన్స్ తో కేజీఎఫ్ 2 ఆడియెన్స్ ను మైండ్ బ్లాక్ చేస్తోందనే నమ్మకంగా ఉన్నాడు హీరో యశ్. పైగా అధీర పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తుండటం తనకు అదనపు బలంగా చెప్పుకొస్తున్నాడు రాఖీభాయ్. మరి ఈ బాక్సాఫీస్ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. -
నా నటన చూసి నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్ కపూర్
Shahid Kapoor Recalls Wife Mira Reaction After Watching Udta Punjab: విభిన్న సినిమాలు, నటనతో అలరిస్తున్నాడు బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్. తాజాగా షాహిద్ నటిస్తున్న చిత్రం 'జెర్సీ'. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్లో బిజీగా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ భార్య మీరా రాజ్పుత్ తనను ఓ సినిమా చూసి వదిలేద్దామనుకుందంటూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. 'ఉడ్తా పంజాబ్' చిత్రంలో తన నటనను చూసి తను రాంగ్ పర్సన్ని పెళ్లి చేసుకున్నానని మీరా భావించినట్లు షాహిద్ పేర్కొన్నాడు. 'మీరా సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మాకు వివాహం జరిగిన ప్రారంభంలో నా ఉడ్తా పంజాబ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్కు ముందు నటీనటుల కోసం ఎడిటింగ్ గదిలో ప్రత్యేక షో వేశారు. నేను నాతోపాటు మీరాను కూడా తీసుకెళ్లాను. సినిమా చూస్తున్నంతా సేపు మీరా మాములుగానే ఉంది. కానీ మూవీ ఇంటర్వెల్ సీన్ వచ్చాకా మీరా ప్రవర్తన చూసి షాక్ అయ్యాను. తను నా పక్క నుంచి లేచి దూరంగా వెళ్లి నిల్చుంది. నేను ఏమైందని అడిగా. దానికి తను 'నువ్ ఇలాంటి వాడివా ? నీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా ? నువ్ ఆ టామీ సింగ్లాంటివాడివా? నీతో నేనింకా కలిసి ఉండను. నేను తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నేను వెళ్లిపోతా.' అని చెప్పింది. తన మాటలకు ఒక్కసారిగా షాకయ్యా. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. తర్వాత తనకు అదంతా సినిమా. అందులోనే అలా నటిస్తారని అర్థమయ్యేలా చెబితే గానీ మీరా కుదుటపడలేదు. ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను.' అని షాహిద్ చెప్పుకొచ్చాడు. షాహిద్, మీరా 2015లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కుమార్తె మిషా, కుమారుడు జైన్ ఉన్నారు. -
నెంబర్-7 మిస్టరీ వెనుక మనం ఊహించని ట్విస్ట్
క్రీడల్లో ఆటగాళ్లకంటూ ప్రత్యేకమైన జెర్సీలు ఉంటాయి. ఆ జెర్సీలను వాళ్ల తమ అదృష్టంగా భావిస్తూ రిటైర్ అయ్యేవరకు ఆ ఒక్క జెర్సీతోనే ఆడుతుంటారు. ఉదాహరణకు ఫుట్బాల్ స్టార్ ఆటగాళ్లు లియోనల్ మెస్సీ (జెర్సీ నెంబర్ 10), లెబ్రన్ జేమ్స్(జెర్సీ నెంబర్ 23), క్రిస్టియానో రొనాల్డో(జెర్సీ నెంబర్ 7), క్రికెట్లో సచిన్ టెండూల్కర్(జెర్సీ నెంబర్ 10), విరాట్ కోహ్లి( జెర్సీ నెంబర్ 18), యువరాజ్ సింగ్(జెర్సీ నెంబర్ 12).. ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. మరి టీమిండియాకు రెండుసార్లు ప్రపంచకప్ అందించిన కెప్టెన్గా ఘనత సాధించిన మహేంద్ర సింగ్ ధోని కూడా తన కెరీర్ మొత్తం ఒకటే జెర్సీతో బరిలోకి దిగాడు. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన సమయంలో.. ప్రస్తుత ఐపీఎల్లోనూ ధోని నెంబర్-7 జెర్సీతోనే ఆడడం చూస్తున్నాం. ధోని 7వ నెంబర్ జెర్సీ ధరించడంపై క్రికెట్ ఫ్యాన్స్ రకరకాలుగా చెప్పుకున్నారు. అయితే తాజాగా నెంబర్-7 వెనుక ఉన్న మిస్టరీని ధోని వివరించాడు.నెంబర్ -7 జెర్సీ ధరించడం వెనుక కారణం కేవలం అదే తేదీన తన పుట్టినరోజు కావడమేనని ధోని పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రారంభం సందర్భంగా ధోని ఒక ఇంటర్య్వూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ''చాలా మంది నెంబర్-7 నాకు లక్కీ నెంబర్ అని అభిప్రాయపడ్డారు. కానీ అలాంటిదేం లేదు. వాస్తవానికి జూలై 7న నా పుట్టినరోజు. ఏడో నెలలో.. ఏడో తారీఖున పుట్టాను గనుక ఆ నెంబర్ ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇంకో విశేషమేమిటంటే.. నేను పుట్టిన సంవత్సరం 1981. దీనిలో చివరి రెండు అంకెలు చూసుకుంటే.. (8-1=7).. ఈ నెంబర చాలా న్యూట్రల్గా ఉంటుంది. ఇలాంటివి పెద్దగా నమ్మను. కానీ ఎందుకో ఆ నెంబర్ నా గుండెల్లోకి దూసుకుపోయింది. అందుకే నా కెరీర్లో నెంబర్-7 జెర్సీని ఎవరికి ఇవ్వకుండా నా దగ్గరే పెట్టుకున్నా.. ఇకపై నా దగ్గరే ఉంటుంది'' అని చెప్పుకొచ్చాడు. ఇక ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ గెలిచి ధోనికి కానుకగా ఇవ్వాలని సీఎస్కే భావిస్తోంది. ఇప్పటికే అందరికంటే ముందే సూరత్ వేదికగా ట్రెయినింగ్ క్యాంప్ను ప్రారంభించిన సీఎస్కే తమ ప్రాక్టీస్ను వేగవంతం చేసింది. ఇక మార్చి 26న సీఎస్కే, కేకేఆర్ మధ్య జరగనున్న మ్యాచ్లో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు తెరలేవనుంది. చదవండి: Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్.. యోయో టెస్ట్లో విఫలమైన కీలక ప్లేయర్ European Cricket League: మరి ఇంత తొందరేంటి.. రనౌట్ చేయాల్సింది pic.twitter.com/GAurxDqU6X — Sports Hustle (@SportsHustle3) March 16, 2022 -
బైజూస్తో అనుబంధాన్ని కొనసాగించనున్న బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రముఖ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ కంపెనీ బైజూస్తో అనుబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిశాక బైజూస్తో టీమిండియా జెర్సీ ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయించింది. భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్గా బైజూస్ను మరో ఏడాది పాటు పొడిగించనున్నట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది. 2019 సెప్టెంబర్ నుండి బైజూస్ భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. అంతకుముందు చైనీస్ మొబైల్ సంస్థ ఒప్పో టీమిండియా జెర్పీ స్పాన్సర్గా ఉండింది. జెర్సీ స్పాన్సర్షిప్కు గాను బైజూస్ ద్వైపాక్షిక సిరీస్లకు రూ. 4.61 కోట్లు, అంతర్జాతీయ మ్యాచ్లకు రూ. 1.56 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది. చదవండి: షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..! -
12వ ఆటగాడికి జెర్సీ గిఫ్ట్గా.. ఎవరా వ్యక్తి?
మొహలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 222 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కోహ్లి వందో టెస్టు అన్న మాటేగాని మొత్తం జడేజా మ్యాచ్గా మారిపోయింది. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో కోహ్లికి మంచి బహుమతి అందించాడు. మొదట బ్యాటింగ్లో 175 పరుగులు నాటౌట్, ఆ తర్వాత బౌలింగ్లో తన మ్యాజిక్ ప్రదర్శిస్తూ తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు.. మలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు.. ఓవరాల్గా తొమ్మిది వికెట్లు తన ఖాతాలో వేసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక కోహ్లికి తన వందో టెస్టులో ఒకసారే బ్యాటింగ్ అవకాశం వచ్చినప్పటికి 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే బ్యాటింగ్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని అనుకున్నాడేమో.. ఫీల్డింగ్ చేసే సమయంలో ఫ్యాన్స్ను ఎంకరేజ్ చేయడం వైరల్గా మారింది. ముఖ్యంగా అల్లుఅర్జున్ పుష్ప సినిమాలోని డైలాగులు చెబుతూ ఆడియెన్స్ను సంతోషంలో మునిగిపోయేలా చేశాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి టీమిండియా అన్అఫీషియల్ 12వ ఆటగాడికి తన జెర్సీని గిఫ్ట్గా ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి ఆ అన్ అఫీషియల్ 12వ ఆటగాడు ఎవరనే కదా మీ డౌటు.. అతనే ధరమ్వీర్ పాల్. ఎవరీ ధరమ్వీర్ పాల్... మధ్యప్రదేశ్కు చెందిన ధరమ్వీర్ పాల్ పుట్టుకతోనే పోలియో బారిన పడ్డాడు. క్రికెట్ను ప్రాణంగా భావించే ధరమ్వీర్ టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్కు వస్తుంటాడు. అంగవైకల్యం తనకు ఇష్టమైన క్రికెట్ను ఏనాడు ఆపలేదని.. అందుకే టీమిండియా ఆడే ప్రతీ మ్యాచ్కు ఎంతదూమైనా వెళ్తుంటానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే పలువురు టీమిండియా ఆటగాళ్లకు ధరమ్వీర్ పాల్ అభిమానిగా మారిపోయారు. ఆ లిస్ట్లో కోహ్లి కూడా ఉన్నాడు. దీంతో ధరమ్వీర్ను ఫ్యాన్స్ టీమిండియా అన్ అఫీషియల్ 12వ ఆటగాడిగా పిలుస్తుంటారు. ఇక మొహలీలో మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా బస్సులో బయలుదేరేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో ధరమ్వీర్ పాల్ బస్సు దగ్గరికి వచ్చాడు. ఇది గమనించిన కోహ్లి బస్సు నుంచి కిందకు దిగి అతని వద్దకు వచ్చి తన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. కాగా దీనికి సంబంధించిన వీడియోనూ ధరమ్వీర్ తన ఫేస్బుక్లో షేర్ చేసుకున్నాడు. ''థాంక్యూ సో మచ్ చాంపియన్.. నువ్వు ఎప్పటికి నా చాంపియన్వే.. ఇంకా కొన్నేళ్లు నీ ఆట నిరంతరాయంగా సాగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా'' అంటూ కోహ్లికి సందేశాన్ని అందించాడు. ఇక 2017లో ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ధరమ్వీర్ కొన్ని ముఖ్యవిషయాలు వెల్లడించాడు. సచిన్ పాజీ, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్, సెహ్వాగ్, కోహ్లి లాంటి ఆటగాళ్లతో మంచి సంబంధాలున్నాయి. ఎన్నోసార్లు నాకు సాయమందించారు. వారికి కృతజ్ఞతుడిగా ఉంటాను అని చెప్పుకొచ్చాడు. ఇక మధ్యప్రదేశ్ దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ధరమ్వీర్ పాల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండడం విశేషం. చదవండి: Ind Vs Sl- Rohit Sharma: టీమిండియా భారీ విజయం.. రోహిత్ శర్మ సరికొత్త రికార్డు! -
‘క్రీమ్లైన్’ ఏటా రూ.40 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ జెర్సీ బ్రాండ్తో పాలు, పాల ఉత్పత్తుల తయారీలో ఉన్న క్రీమ్లైన్ డెయిరీ ప్రొడక్ట్స్ ఏటా రూ.30–40 కోట్ల దాకా పెట్టుబడి చేస్తోంది. 2016 నుంచి ఇప్పటి వరకు రూ.200 కోట్లు ఖర్చు చేశామని కంపెనీ సీఈవో భూపేంద్ర సూరి వెల్లడించారు. సీవోవో ప్రమోద్ ప్రసాద్తో కలిసి మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్ సమీపంలోని కేశవరం వద్ద ఉన్న ప్లాంటు విస్తరణకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నాం. టెట్రా ప్యాక్లో పాలు, పాల పదార్థాలు ఇక్కడ తయారవుతాయి. విస్తరణ పూర్తి అయితే ఈ కేంద్రం సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 22,000 నుంచి 70,000 లీటర్లకు చేరుతుంది. 10 ప్లాంట్లలో కలిపి రోజుకు 13.6 లక్షల లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేయగలిగే సామర్థ్యం ఉంది’ అని వివరించారు. రవాణా వ్యయాలు, పాల సేకరణ ఖర్చు అధికం అయినందున ధర పెరిగే అవకాశం ఉందన్నారు. -
ఆరు ఫ్రాంచైజీలకు కొత్త స్పాన్సర్లు, జెర్సీలు.. కొత్తకొత్తగా
ఐపీఎల్ మెగావేలం 2022కు రెండు రోజులు మాత్రమే మిగిలిఉంది. మొత్తం 590 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఏ ఆటగాడు ఏ ఫ్రాంచైజీకి వెళతాడు.. ఎంతకు అమ్ముడుపోతాడనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఐపీఎల్లో అదనంగా రెండు జట్లు వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న 8 జట్లకు తోడూ లక్నో సూపర్జెయింట్స్, అహ్మదాబాద్ టైటాన్స్ చేరడంతో మొత్తం ఫ్రాంచైజీల సంఖ్య 10కి చేరింది. కాగా ఇందులో ఆరు జట్లకు సంబంధించి.. స్పాన్సర్లు, జెర్సీలు మారే అవకాశాలు ఉన్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ స్పాన్సర్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇక మిగిలిన ఆరు జట్లు సీఎస్కే, ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్, లక్నో సూపర్జెయింట్స్, అహ్మదాబాద్(గుజరాత్ టైటాన్స్)ల స్పాన్సర్స్, జెర్సీలు కొత్తగా రానున్నాయి. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగావేలం జరగనుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. సీఎస్కే- టీవీఎస్ యూరోగ్రిప్ ముంబై ఇండియన్స్- స్లైస్ ఎస్ఆర్హెచ్- కార్స్24 లక్నో సూపర్జెయింట్స్- మై11సర్కిల్ గుజరాత్ టైటాన్స్(పరిశీలనలో స్లైస్) రాజస్తాన్ రాయల్స్(ఖరారు కాలేదు) పాత స్పాన్సర్స్ కొనసాగనున్న నాలుగు జట్లు.. ఆర్సీబీ- ముత్తూట్ ఫిన్కార్ప్ ఢిల్లీ క్యాపిటల్స్-జేఎస్డబ్య్లూ పెయింట్స్ పంజాబ్ కింగ్స్- ఎబిక్స్ క్యాష్ కోల్కతా నైట్రైడర్స్-ఎంపీఎల్ ఐపీఎల్ 2022 మెగావేలం ముఖ్య విషయాలు.. ►10 ఫ్రాంచైజీలు 33 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి ►ఐపీఎల్ మెగావేంలో భాగంగా మొత్తం రూ.900 కోట్ల బడ్జెట్లో ఇప్పటికే రూ.343.7 కోట్లు ఖర్చు చేశారు. ►వేలంలో పాల్గొననున్న 10 ఫ్రాంచైజీల వద్ద మిగిలిన మొత్తం కలిపి రూ.556.3 కోట్లు ►వేలానికి రానున్న 590 మంది ఆటగాళ్లలో 217 స్థానాలకు ఎంపిక చేయనున్నారు. ►ఫిబ్రవరి 12,13 తేదీల్లో 217 స్థానాలకు రూ.556.3 కోట్లతో 590 మంది ఆటగాళ్ల నుంచి ఎంపికచేయనున్నారు. -
'జెర్సీ' పేరు మీద ఓ జబ్బు ఉంది తెలుసా? చికిత్స వివరాలు ఇవిగో..
ఆటగాళ్లు ధరించే ప్రత్యేకమైన షర్ట్ను ‘జెర్సీ’ అంటారన్న సంగతి తెలిసిందే కదా. ఆ జెర్సీ పేరు మీద కూడా ఓ జబ్బు ఉంది. దాని పేరే ‘జెర్సీ ఫింగర్’! ఈ జబ్బు ఎందుకు వస్తుందో, దానికి చికిత్స ఏమిటన్న విషయాలు తెలిపే సంక్షిప్త కథనమిది. మైదానంలో ఆటగాళ్లంతా ఒకరితో ఒకరు పోటీపడుతూ, ప్రత్యర్థిని నిలువరిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ ప్రయత్నంలో తమకు తెలియకుండానే వేళ్లన్నీ గుప్పిటలా బిగించి... ప్రత్యర్థి జెర్సీని అప్రయత్నంగానే లాగేస్తుతుంటారు. మరీ ముఖ్యంగా ఫుట్బాల్ ఆటలో ఈ తరహా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఆటగాళ్లు వేగంగా ఆడే సమయంలో... వారి వేళ్ల కండరాలు చురుగ్గా కదిలేందుకు కొన్ని టెండన్స్ తోడ్పడుతుంటాయి. ఈ టెండన్స్ అనేవి ఎముకలనూ, కండరాలను కలుపుతూ ఉంటాయి. ఇలాంటి టెండన్స్లో ‘ఫ్లెక్సార్ టెండన్’ చాలా ప్రధానమైనది. ఆటగాళ్ల కదలికల సమయంలో ఈ ఫ్లెక్సార్ టెండన్ చీరుకుపోవడమో లేదా దెబ్బతినడమో జరగవచ్చు. ఇదే జరిగితే... ఆటగాళ్ల మణికట్టులోగానీ, అరచేతిలోగానీ లేదా నేరుగా వేళ్లకే తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ కారణంగా వచ్చే నొప్పినే ‘జెర్సీ ఫింగర్’ అంటారు. జెర్సీ ఫింగర్తో బాధపడే ఆటగాళ్లు... తమ వేలిని ఏమాత్రం ఒంచలేకపోవడం, అది పూర్తిగా మొద్దుబారడం, గాయపడిన భాగం ఎర్రబారడం, ముట్టుకోనివ్వకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. మేనేజ్మెంట్ / చికిత్స : గాయపడ్డ చేతికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం లేదా దాని కదలికలను పూర్తిగా నివారించేలా ఓ స్లింగ్ అమర్చడం ద్వారా కొద్దిరోజుల్లోనే సమస్య దానంతట అదే తగ్గుతుంది. బాధ చాలాకాలం పాటు తగ్గకుండా అలాగే ఉంటే... అప్పుడు ఫ్లెక్సార్ టెండన్ అతుక్కుని ఉండవలసిన కండరానికి, ఎముకకూ దాన్ని కలిపేలా ఓ చిన్నపాటి శస్త్రచికిత్స అరుదుగా అవసరం పడవచ్చు. టెండన్ చిరిగినప్పుడు మాత్రమే ఈ శస్త్రచికిత్స అవసరమవుతుంది. -
జెర్సీ ఓటీటీ రిలీజ్పై మేకర్స్ క్లారిటీ
Shahid Kapoor Jersey Movie Makers Clarity On OTT Release: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం ‘జెర్సీ’.నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో షాహిద్కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన ఈ చిత్రం విడుదల తేదీని డిసెంబర్ 31, 2021కి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇక మూవీ విడుదల మరోసారి వాయిదా పడుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. జెర్సీని దిల్ రాజు నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు తెలిసింది. డిసెంబర్ 31 నుంచి కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో ఈ మూవీ థియేటర్లో విడుదల చేయడం కంటే ఓటీటీ రిలీజ్ చేయడం బెటర్ ఆయన అభిప్రాయడుతున్నాడని, ఇందుకోసం ఇప్పటికే ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్తో దిల్ రాజు చర్చలు జరపగా మంచి ఫ్యాన్సీ రేటుకు ఒప్పందం కూడా కుదిరినట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు షాహిద్ నిరాకరించాడని, కావాలంటే తన పారితోషికంలో 31 కోట్ల రూపాయలను తగ్గించుకుంటానని నిర్మాత దిల్ రాజుకు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో షాహిద్, దిల్ రాజు మధ్య విభేదాలు కూడా తలెత్తినట్లు ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై మేకర్స్ స్పందించారు. జెర్సీ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడం లేదని వారు స్పష్టం చేశారు. తాజా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో మూవీని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అంతేగాక మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్తో పాటు విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, అప్పటి వరకు అందరూ సేఫ్గా ఉండాలంటూ మేకర్స్ ప్రకటన ఇచ్చారు. -
'జెర్సీ' విడుదల ఇప్పట్లో లేనట్లే.. సినిమా మళ్లీ వాయిదా
Jersey Movie Again Postponed From December 31: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన ఈ చిత్రం విడుదల తేదిని డిసెంబర్ 31, 2021కి ఖరారు చేశారు. అయితే తాజాగా డిసెంబర్ 31న కూడా జెర్సీ చిత్రం విడుదలకు నోచుకోనట్లు తెలుస్తోంది. ఈ సినిమా వాయిదా పడినట్లు ప్రముఖ చిత్ర పరిశ్రమ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విటర్లో తెలిపాడు. 'ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్.. జెర్సీ చిత్రం డిసెంబర్ 31 విడుదల కావట్లేదు. కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వినిపిస్తున్న మాటల్లో నిజం లేదు.' అని ట్వీట్ చేశారు. క్రికెటర్గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? అనే ఎమోషనల్ అంశాలతో తెరకెక్కించిన సినిమా జెర్సీ. #Xclusiv... #BreakingNews... #Jersey POSTPONED... WON'T RELEASE ON 31 DEC... New date will be announced shortly... Industry talk that #Jersey will be Direct-to-OTT release is FALSE. pic.twitter.com/1MBwsSdWCC — taran adarsh (@taran_adarsh) December 28, 2021 ఇదీ చదవండి: 83 చిత్రంపై రజనీ కాంత్ రియాక్షన్.. పొగడ్తలతో బౌండరీలు -
దీని కోసం పద్నాలుగేళ్లుగా ఎదురుచూశా: అల్లు శిరీష్
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న మూవీ 'ప్రేమ కాదంటా?'. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్తో, ఫస్ట్ లుక్ తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ మధ్య నవంబర్ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకం అంటూ ట్వీట్ చేయడంతో ఏంటి, శిరీష్ ప్రేమలో పడ్డాడా? అని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. దీనిపై అతడు స్పందిస్తూ తన కొత్త సినిమా ఫిక్స్ అయిందని పుకార్లకు చెక్ పెట్టాడు. తాజాగా అతడు సోషల్ మీడియాలో మరోసారి ఎమోషనల్ అయ్యాడు. తెలుగులో నాని నటించిన 'జెర్సీ' మూవీ హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ హోర్డింగ్లో అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని రాసి ఉండటాన్ని చూసి ఉద్వేగానికి లోనయ్యాడు. అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని జుహు సర్కిల్లో ఓ హోర్డింగ్లో చూడాలని పద్నాలుగేళ్లుగా ఎదురుచూశాను. మొత్తానికి జరిగింది అని రాసుకొచ్చాడు. కాగా జెర్సీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 31న విడుదలవుతోంది. Waited 14 years to see a billboard of an Allu Entertainment film at the Juhu circle. Finally it's happening. pic.twitter.com/JoOT45hhT1 — Allu Sirish (@AlluSirish) December 24, 2021 -
ఆట ఏదైనా ఆ జెర్సీ అంటే ఎందుకంత క్రేజ్!
Top 11 Players Who Wear Number 10 Jersey In Cricket: క్రీడల్లో నెంబర్ 10 జెర్సీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక్క క్రికెట్లోనే కాదు.. ఫుట్బాల్లోనూ నెంబర్ 10 జెర్సీకి వేరే లెవెల్ క్రేజ్ ఉంది. ఫుట్బాల్ దిగ్గజాలుగా పేరు పొందిన పీలే, మారడోనా, జినదిన్ జిదానే, రొనాల్డీనో, డెల్పోరో, వెయిన్ రూనీ, మెస్సీ లాంటి స్టార్స్ ధరించే జెర్సీ నెంబర్ 10 కావడం విశేషం. ఆ జెర్సీ ధరిస్తే స్టార్ హోదా వస్తుందని చాలా మంది నమ్మకం. ఇక క్రికెట్లో నెంబర్ 10 జెర్సీ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. తన కెరీర్లో ఎక్కువకాలం ఈ జెర్సీతోనే ఆడిన సచిన్ ఎన్నోమైలురాళ్లను అందుకున్నాడు. ఈ విధంగా క్రికెట్ చరిత్రలో 10వ నెంబర్ జెర్సీ ధరించిన కొందరి ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. - సాక్షి, వెబ్డెస్క్ సచిన్ టెండూల్కర్(టీమిండియా) టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మొదట్లో 99 జెర్సీతో బరిలోకి దిగాడు. ఆ తర్వాత 33 జెర్సీ నెంబర్తో ఆడాడు. ఇక చివరగా 10వ నెంబర్ జెర్సీతో రిటైర్మెంట్ వరకు ఆడిన సచిన్ ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించాడు. క్రికెట్ చరిత్రలో వంద సెంచరీలు సాధించి చరిత్రలో నిలిచిపోయాడు. టెస్టు, వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. చదవండి: Abu Dhabi T10 League: సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో.. అయినా ఊచకోతే క్రెయిగ్ మెక్మిలన్(న్యూజిలాండ్) 1997-2007 కాలంలో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రెయిగ్ మెక్మిలన్ మంచి బ్యాటర్గా గుర్తింపు పొందాడు. తన 10 ఏళ్ల కెరీర్లో ఎక్కువశాతం 10వ నెంబర్ జెర్సీలోనే కనిపించాడు. న్యూజిలాండ్ తరపున 55 టెస్టుల్లో 3116 పరుగులు.. 197 వన్డేల్లో 4707 పరుగులు సాధించాడు. ఇక 8 టి20ల్లో ఆడిన మెక్మిలన్ 187 పరుగులు సాధించాడు. స్టువర్ట్ లా(ఆస్ట్రేలియా) 1994-95 మధ్య కాలంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా గాయంతో వెనుదిరిగిన సమయంలో అతని స్థానంలో టెస్టు జట్టులోకి వచ్చాడు స్టువర్ట్ లా. ఇదే అతను ఆడిన ఒకే ఒక్క టెస్టు మ్యాచ్. ఇక క్రికెట్ ఆడినంత కాలం తన కెరీర్లో 10వ నెంబర్ జెర్సీని ధరించాడు. ఆసీస్ తరపున 54 వన్డేల్లో 1237 పరుగులు.. ఒక్క టెస్టు మ్యాచ్లో 54 పరుగులు సాధించాడు. చదవండి: Joshua da Silva Vs Dhananjaya de Silva: వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా! అలెన్ డొనాల్డ్(దక్షిణాఫ్రికా) దక్షిణాఫ్రికా తరపున దిగ్గజ బౌలర్గా పేరు పొందిన అలెన్ డొనాల్డ్ జెర్సీ నెంబర్ 10. దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో 300 వికెట్లు సాధించిన తొలి బౌలర్గా డొనాల్డ్ చరిత్ర సృష్టించాడు. ఒక ఓవరాల్గా 72 టెస్టులాడిన అలెన్ డొనాల్డ్ 330 వికెట్లతో సౌతాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేగాక 164 వన్డేల్లో 272 వికెట్లు తీసిన డొనాల్డ్ రిటైర్మెంట్ తర్వాత అంతర్జాతీయంగా కొన్ని దేశాలకు.. చాలా ప్రైవేట్ లీగ్ల్లో కోచ్గా వ్యవహరించాడు. షాహిద్ అఫ్రిది(పాకిస్తాన్) ఆసియా నుంచి చూస్తే క్రికెట్లో సచిన్ తర్వాత జెర్సీ నెంబర్ 10తో ఫేమస్ అయిన ఆటగాడు షాహిద్ అఫ్రిది మాత్రమే. పాకిస్తాన్ దిగ్గజ ఆల్రౌండర్గా పేరుపొందిన అఫ్రిది వ్యక్తిగత జీవితంలో వివాదాలకు కొదువ లేకపోయిన.. ఆటలో మాత్రం పలు రికార్డులను బద్దలుకొట్టాడు. వన్డే చరిత్రలో 37 బంతుల్లోనే సెంచరీ సాధించిన అఫ్రిది రికార్డు 17 ఏళ్ల పాటు చెక్కుచెదరలేదు. వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అఫ్రిది తొలి స్థానంలో ఉన్నాడు. ఇక పాకిస్తాన్ తరపున అఫ్రిది 398 వన్డేల్లో 8064 పరుగులు.. 395 వికెట్లు, 99 టి20ల్లో 1416 పరుగులు.. 98 వికెట్లు తీశాడు. చదవండి: Steve Smith: 'ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను బాత్రూం అద్దానికి అంటించా' డారెన్ లీమన్(ఆస్ట్రేలియా) 1996లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన డారెన్ లీమన్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారడానికి ఐదేళ్లు పట్టింది. లీమన్ 2004-05 కాలంలో 10వ నెంబర్ జెర్సీ ధరించి ఆడాడు. ఆస్ట్రలియా తరపున 117 వన్డేల్లో 3078 పరుగులు సాధించాడు. ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియాకు ప్రధాన కోచ్గా సేవలందించిన లీమన్ 2017 బాల్టాంపరింగ్ ఉదంతం తర్వాత పదవి నుంచి వైదొలిగాడు. జెరెయింట్ జోన్స్(ఇంగ్లండ్) ఇంగ్లండ్ వికెట్ కీపర్గా 2004-06 మధ్య కాలంలో సేవలందించిన జెరెయింట్ జోన్స్ తన కెరీర్ మొత్తం జెర్సీ నెంబర్ 10నే ధరించాడు. ఈ కాలంలో అతను ఇంగ్లండ్ తరపున 51 వన్డేల్లో 862 పరుగులు.. 34 టెస్టుల్లో 1172 పరుగులు చేశాడు. పీటర్ సిడిల్(ఆస్ట్రేలియా) 2019లో ఆస్ట్రేలియా క్రికెట్కు గుడ్బై చెప్పిన పీటర్ సిడిల్ .. 2008 అరంగేట్రం నుంచి రిటైర్ అయ్యేవరకు జెర్సీ నెంబర్ 10తోనే ఆడాడు. ఆస్ట్రేలియా తరపున 67 టెస్టుల్లో 217 వికెట్లు.. 20 వన్డేల్లో 17 వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్(టీమిండియా) టీమిండియా నుంచి సచిన్ తర్వాత శార్దూల్ మాత్రమే జెర్సీ నెంబర్ 10 ధరించాడు. అయితే సచిన్ కానుకగా ఉన్న ఆ జెర్సీని ధరించడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారడంతో బీసీసీఐ అనధికారికంగా ఆ జెర్సీ నెంబర్ను తొలగించింది. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న శార్దూల్ 4 టెస్టులు, 15 వన్డేలు, 24 టి 20లు ఆడాడు. డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా) ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు ఆడుతున్న మిల్లర్ కీలక బ్యాటర్గా మారాడు. అలెన్ డొనాల్డ్ తర్వాత జెర్సీ నెంబర్ 10 ధరించిన ఆటగాడిగా మిల్లర్ నిలిచాడు. విధ్వంసకర ఆటకు మారుపేరుగా ఉన్న మిల్లర్ దక్షిణాఫ్రికా తరపున 137 వన్డేలు.. 95 టి20లు ఆడాడు. చదవండి: Tim Paine scandal: క్రికెట్కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్లో నలిగిన ఆటగాళ్లు షాహిన్ అఫ్రిది(పాకిస్తాన్) దిగ్గజ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ధరించిన 10వ నెంబర్ జెర్సీని ధరించడం సంతోషంగా ఉందంటూ షాహిన్ అఫ్రిది ట్వీట్ చేయడం వైరల్గా మారింది. అయితే క్రికెట్లో అడుగుపెట్టిన మొదట్లో 40వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగిన షాహిన్ ఆ తర్వాత 10వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కీలకబౌలర్గా మారిన షాహిన్ టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. -
సెట్లో గాయపడ్డ యంగ్ హీరో, 25 కుట్లు, 2 నెలలు షూటింగ్కు బ్రేక్..
Shahid Kapoor Opens Up On His Horrific Lip Injury In Jersey Shooting Set: షూటింగ్స్లో ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటివల్ల కథానాయకులు తీవ్రంగా గాయపడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎక్కువడా యాక్షన్ చిత్రాల్లో పోరాట సన్నివేశాల సమయంలో హీరోలు గాయపడటం సహజమే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా ఇటీవల షూటింగ్ సెట్లో గాయపడినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చదవండి: శివన్న అని పునీత్ నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తోంది: శివ రాజ్కుమార్ హిందీ ‘జెర్సీ’ సినిమా కోసం క్రికెట్ ప్రాక్టిస్ చేస్తుండగా తీవ్రంగా గాయపడినట్లు షాహిద్ పేర్కొన్నారు. గ్రౌండ్ క్రికెట్ ఆడుతుండగా తన కింది పెదవికి బాల్ బలంగా తాకడంతో 25 కుట్లు పడ్డాయని చెప్పాడు. కాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవాలని తపించే క్రికెటర్గా షాహిద్కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమా తాలూకు ప్రయాణం గురించి ఇటీవల ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షాహిద్ కపూర్ ముచ్చటించాడు. చదవండి: నాగ్ సరసన మెహరీన్ ఈ సందర్భంగా ‘క్రికెటర్ పాత్ర కోసం సన్నద్ధమవుతున్న సమయంలో ఓ రోజు బాల్ బలంగా తాకడంతో నా క్రింది పెదవి చిట్లింది. 25 కుట్లు పడ్డాయి. ఈ గాయం వల్ల నా పెదవి ఎప్పటికీ పనిచేయదని భయపడ్డా. కదిలించడమే కష్టమైంది. కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఈ ప్రమాదం కారణంగా రెండు నెలల పాటు షూటింగ్ను ఆపివేశాం’ అని గుర్తుచేసుకున్నారు. నాని కథానాయకుడిగా తెలుగులో రూపొందిన ‘జెర్సీ’కి రీమేక్ ఇది. హిందీలో అల్లు అరవింద్ సమర్పణలో దిల్రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్గిల్ నిర్మిస్తున్నారు. చదవండి: ఆ సినిమా తర్వాత బిచ్చగాడినయ్యా: స్టార్ హీరో View this post on Instagram A post shared by Shahid Kapoor (@shahidkapoor) -
ఆ సినిమా తర్వాత బిచ్చగాడినయ్యా: స్టార్ హీరో
Shahid Kapoor: 200-250 కోట్ల బడ్జెట్తో సినిమాలు తీసే పలువురు చిత్ర నిర్మాతల వద్దకు వెళ్లి తనతో ఓ సినిమా నిర్మించాలని ఓ బిచ్చగాడివలే అడుకున్నానని బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తెలిపారు. షాహిద్ నటించిన హింది ‘జెర్సీ’ మూవీ ట్రైలర్ను చిత్ర బృందం మంగళవారం రిలీజ్ చేసింది. అయితే ఈ సందర్భంగా ‘బాలీవుడ్ లైఫ్’ అనే మీడియాతో షాహిద్ మాట్లాడుతూ.. తాను కబీర్ సింగ్ మూవీ విడుదలైన తర్వాత పలువురు నిర్మాతల దగ్గరకు రోజూ వెళ్లానని తెలిపాడు. వారంతా 200-250 కోట్ల బడ్జెట్తో సినిమాలు నిర్మించే పెద్ద నిర్మాతలని అన్నాడు. అయితే గతంలో తాను అటువంటి భారీ బడ్జెట్ క్లబ్లోకి చేరలేదని, కానీ ప్రస్తుతం జెర్సీతో ఆ ఫీట్ సాధించడంతో.. అది చాలా కొత్తగా అనిపిస్తోందని తెలిపాడు. ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15-16 ఏళ్లు అవుతున్నా.. భారీ బడ్జెట్ మూవీ చేయలేదని అన్నాడు. చివరికి ఇలా సాధ్యమైందని తెలిపాడు. ఇది ఎక్కడివరకు వెళుతుందో తెలియదని.. కానీ తనకు చాలా కొత్తగా ఉందని పేర్కొన్నాడు. షాహిద్ నటించిన తెలుగు రీమేక్ ‘జెర్సీ’ డిసెంబర్ 31న విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరినే ఈ సినిమాను కూడా రూపొందించారు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మంగళవారం విడుదలైన ‘జెర్సీ’ మూవీ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. -
ట్రెండింగ్లో 'జెర్సీ' ట్రైలర్.. మరో హిట్టు గ్యారెంటీ!
Jersey Trailer Is Out: ‘అర్జున్రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్సింగ్’ అనంతరం షాహిద్ కపూర్ చేస్తున్న మరో తెలుగు రీమేక్ జెర్సీ. నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ మూవీని అదే పేరుతో బాలీవుడ్లోనూ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరినే ఈ సినిమాను కూడా రూపొందించారు. ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా జెర్సీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా వేస్తే వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు డిసెంబర్31న థియేటర్స్లో సందడి చేయనుంది. -
విడుదల తేదిలలో కన్ఫ్యూజన్.. నాలుగు సినిమాలు వాయిదా
విడుదల తేదీల విషయంలో తెలుగు పరిశ్రమలోనే కాదు.. ఇతర భాషల్లోనూ కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా నాలుగు హిందీ చిత్రాల విడుదల వాయిదా పడటం హాట్ టాపిక్ అయింది. శనివారం ఈ నాలుగు చిత్రాల కొత్త విడుదల తేదీని ఆయా చిత్రబృందాలు అధికారికంగా ప్రకటించాయి. ఆ విశేషాల్లోకి వెళితే... వచ్చే ఏడాది ఫిబ్రవరి విడుదలకు సిద్ధమైన ‘లాల్సింగ్ చద్దా’ రిలీజ్ ఏప్రిల్ 14కి వాయిదా పడింది. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్గంప్’కు హిందీ రీమేక్గా రూపొందిన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ హీరోగా నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేశారు. వాయిదా లిస్ట్లో ఉన్న మరో సినిమా షాహిద్ కపూర్ నటించిన ‘జెర్సీ’ (తెలుగు ‘జెర్సీ’కి రీమేక్). అలాగే వరుణ్ ధావన్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ‘జగ్ జగ్ జీయో’, రాజ్కుమార్ రావ్ ‘హిట్’ (తెలుగు ‘హిట్’కి రీమేక్) చిత్రాల కొత్త విడుదల తేదీలు కూడా శనివారం ఖరారయ్యాయి. ‘జెర్సీ’ డిసెంబరు 31న, ‘జగ్ జగ్ జీయో’ వచ్చే ఏడాది జూన్ 24న, హిందీ ‘హిట్’ 2022 మే 20న విడుదల కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ చిత్రాలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు బీ టౌన్ టాక్. -
క్రిస్మస్ సిత్రాలు.. థియేటర్లలో సందడికి సిద్ధంగా..
Upcoming Movies In Theaters On This Christmas Festival: సినిమా విడుదలకు దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడుతుంటారు. పండగ వేళ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి అనేక కసరత్తులు చేస్తారు. పర్వదినాల్లో సినిమాలను ప్రదర్శించేందుకు ఆసక్తిగా సిద్ధమవుతుంటారు మేకర్స్. ఈ సవంత్సరం దసరా, దీపావళి సందడి ముగిసింది. దీపావళికి థియేటర్లలో రిలీజై హిట్ సాధించిన బాలీవుడ్ చిత్రం 'సూర్యవంశీ'. ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ పండుగ. గతేడాది క్రిస్మస్కు కొవిడ్ కారణంగా ఏ చిత్రం థియేటర్లతో విడుదల కాలేదు. కరోనాతో దెబ్బతిన్న థియేటర్లకు మళ్లీ పాతవైభవాన్ని తీసుకురానున్నాయి పలు చిత్రాలు. 1. గని గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్తేజ్ నుంచి వస్తోన్న చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. 2. శ్యామ్ సింగరాయ్ డిసెంబర్ 24న రిలీజ్ కానున్న నాని చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రంపై నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంతకుముందు వచ్చిన టక్ జగదీష్, వీ చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కాగా, చాలా కాలం తర్వాత నాని సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బెంగాల్ నేపథ్యం ఉన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ‘టాక్సీవాలా’తో విజయం అందుకున్న రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 3. '83' బాలీవుడ్ హీరో రణ్వీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘83’. భారత క్రికెట్ జట్టు 1983లో సాధించిన ప్రపంచ కప్పు విజయం నేపథ్యంలో సాగే చిత్రమిది. రణ్వీర్ కెప్టెన్ కపిల్దేవ్గా ఆయన భార్య రోమీ భాటియాగా దీపికా పదుకొణె నటించారు. ప్రముఖ దర్శకుడు కబీర్ఖాన్ తెరకెక్కించిన ఈ సినిమా 2019 జూన్లో మొదలైంది. 2020 ఏప్రిల్ 10న విడుదల అనుకున్నా కరోనా కారణంగా ఆ ఏడాది డిసెంబరు 25కి మారింది. అప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఈ ఏడాది జూన్ 4న విడుదల అని ప్రకటించారు. ఎక్కువ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ అమల్లో ఉండటంతో మళ్లీ వాయిదా వేసి డిసెంబరు 24 అని ఖరారు చేశారు. ఈ తేదీ ఎట్టిపరిస్థితుల్లోనూ మారే అవకాశం లేదని చిత్రబృందం చెబుతోంది. ‘83’ విజయంపై బాలీవుడ్ వ్యాపార వర్గాలు చాలా నమ్మకంగా ఉన్నాయి. 4. జెర్సీ (హిందీ) తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘జెర్సీ’ చిత్రం అదే పేరుతో హిందీలోనూ రూపొందింది. ఆయనే ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. షాహిద్కపూర్ కథానాయకుడిగా నటించారు. ‘అర్జున్రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్సింగ్’గా మెప్పించిన షాహిద్ ఈ చిత్రంపైనా భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానుంది. చదవండి: కిక్కెక్కించే ఐదు కొరియన్ వెబ్ సిరీస్ ఇవే.. -
రొనాల్డో గోల్ కొట్టలేదని ఏడ్చేసింది.. హత్తుకొని జెర్సీ గిఫ్ట్గా
Ronaldo Given Jersey As Gift To Irish Girl.. పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో క్రేజ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేంగా చెప్పనవసరం లేదు. తాజాగా రొనాల్డో గోల్ కొట్టలేదని ఏడ్చిన చిన్నారిని హత్తుకొని జెర్సీని గిఫ్ట్గా ఇచ్చి అభిమానుల మనసు కొల్లగొట్టాడు. విషయంలోకి వెళితే.. ఫిపా వరల్డ్కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా శుక్రవారం పోర్చుగల్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ఆధ్యంతం పోటాపోటీగా సాగడంతో నిర్ణీత సమయంలో ఇరుజట్లు ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాయి. చదవండి: FIFA 2022: ప్రపంచకప్కు బ్రెజిల్ అర్హత.. తొలి దక్షిణ అమెరికా జట్టుగా కాగా ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన ఐర్లాండ్ అమ్మాయి రొనాల్డోకు వీరాభిమాని. అయితే మ్యాచ్లో పోర్చుగల్ కెప్టెన్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. దీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చిన ఆమె రొనాల్డొను పట్టుకొని ఏడ్చింది. రొనాల్డో ఆమెను హత్తుకొని ఓదార్చి తన జెర్సీని గిఫ్ట్గా ఇచ్చి సంతోషపరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక పోర్చుగల్ తన తర్వాతి మ్యాచ్ను సెర్బియాతో ఆడనుంది. చదవండి: Wrestrler Nisha Dahiya: 'నేను చనిపోలేదు.. అది ఫేక్ న్యూస్' @Cristiano con un niño después del partido. Cristiano le dio su camiseta a la chica fan de Irlanda después de tiempo completo. pic.twitter.com/w8ArtK6AyR — Elia M. V. (@emariahn) November 11, 2021 -
67th National Film Awards: తెలుగులో జెర్సీకి రెండు,మహర్షికి 3 అవార్డులు
-
T20 WC IND VS PAK: న్యూ లుక్లో టీమిండియా ఆటగాళ్లు..
BCCI Official Update On Team India New Jersey : త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో కనిపించనున్నారు. ఈ విషయమై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. అయితే కొత్త జెర్సీ ఎలా ఉంటుంది, దాని రంగు వంటి విషయాలను ఈ నెల 13న వెల్లడించనున్నట్లు ఇవాళ ట్విట్టర్లో వెల్లడించింది. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ నుంచి నేవీ బ్లూ జెర్సీలో దర్శనమిస్తున్న భారత క్రికెటర్లు.. అక్టోబర్ 24న పాక్తో జరగబోయే మెగా పోరులో సరికొత్త జెర్సీలో కనిపించనున్నారు. భారత క్రికెట్ జట్టుకు అఫిషియల్ కిట్ స్పాన్సర్ అయిన ఎంపీఎల్ స్పోర్ట్స్ నూతన జెర్సీని ఆవిష్కరించనుంది. The moment we've all been waiting for! Join us for the big reveal on 13th October only on @mpl_sport. 🇮🇳 Are you excited? 🥳 pic.twitter.com/j4jqXHvnQU — BCCI (@BCCI) October 8, 2021 ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. లీగ్ దశలో టీమిండియా తలపడబోయే మ్యాచ్ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: పాక్ జట్టుకు బంపర్ ఆఫర్.. టీ20 ప్రపంచకప్లో టీమిండియాను ఓడిస్తే..? -
బ్లూ జెర్సీలో ఆర్సీబీ.. మ్యాచ్ తర్వాత ఏం చేస్తారంటే..?
RCB Blue Jersey 2021: ఐపీఎల్ రెండో విడతలో భాగంగా ఈ నెల 20న అబుదాబి వేదికగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)తో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఎరుపు రంగు జెర్సీకి బదులు బ్లూ కలర్ జెర్సీని ధరించి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్కి సంఘీభావంగా ఆర్సీబీ ఆటగాళ్లు నీలం రంగు జెర్సీలను ధరించనున్నారు. ఫ్రంట్లైన్ యోధులు ధరించే పీపీఈ కిట్ల రంగును పోలివుండే బ్లూ జెర్సీని ధరించడం గర్వకారణం అని పేర్కొన్న ఆర్సీబీ బృందం.. మ్యాచ్ అనంతరం ఆ జెర్సీలను వేలం వేస్తామని, వచ్చిన డబ్బులను దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ల పంపిణీకి వినియోగిస్తామని వెల్లడించింది. Blue jerseys resembling the colour of the PPE kits of frontline warriors, worn by our players on the 20th Sept v KKR, will be auctioned on @FankindOfficial. Proceeds from the auction will be used for free vaccination among lesser privileged communities in India.#1Team1Fight pic.twitter.com/QDK5q3kVGT — Royal Challengers Bangalore (@RCBTweets) September 18, 2021 కాగా, 2011 ఐపీఎల్ నుంచి ఏదో ఒక మ్యాచ్లో కోహ్లి సేన ఆకుపచ్చ రంగు జర్సీలను ధరిస్తూ వచ్చింది. పర్యావరణం పట్ల అవగాహణ పెంపొందించేందుకు ఆకుపచ్చ జెర్సీలను ధరించేది. ఐపీఎల్ ఫేజ్-1 సమయంలో కూడా మే 3న కేకేఆర్తో జరగాల్సిన మ్యాచ్లో బ్లూ జెర్సీలో కనిపించబోతున్నట్లు ఆర్సీబీ ప్రకటించింది. అయితే, కరోనా కారణంగా ఐపీఎల్ ఆర్ధంతరంగా వాయిదా పడడంతో ఇప్పుడా బ్లూ జెర్సీను ధరించనున్నారు. ఇదిలా ఉంటే, ఫేజ్-1లో రాయల్ ఛాలెంజర్స్ మొదటి ఏడు మ్యాచ్ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. United to help and support the frontline warriors who have worked selflessly and tirelessly to fight the Covid Pandemic. 🙌🏻🙌🏻 We are #1Team1Fight! 🔴🔵#PlayBold #WeAreChallengers #IPL2021 #KKRvRCB pic.twitter.com/W7fMXnvwrL — Royal Challengers Bangalore (@RCBTweets) September 14, 2021 చదవండి: బీసీసీఐ, కోహ్లి మధ్య అగాధం.. అందుకే ఆ నిర్ణయం..! -
ఆ జెర్సీ ధరించినప్పుడు, నీ ముఖానికి అంత సీన్ లేదన్నారు: శార్దూల్ ఠాకూర్
లండన్: ఓవల్ టెస్ట్ విజయం అనంతరం టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. ఈ మ్యాచ్లో శార్దూల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగల్లో సత్తా చాటి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. పేలవ బ్యాటింగ్ కారణంగా తొలి ఇన్నింగ్స్లో పేక మేడలా కుప్పకూలుతున్న జట్టును శార్దూల్ తన మెరుపు అర్ధశతకంతో ఆదుకోవడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ను చేయగలిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో రిషబ్ పంత్తో కలిసి అతను నెలకొల్పిన శతక భాగస్వామ్యం జట్టు విజయానికి బాటలు వేసింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో క్రీజులో పాతుకుపోయిన రోరీ బర్న్స్ను ఔట్ చేసి తొలి వికెట్ కోసం సుదీర్ఘంగా సాగుతున్న నిరీక్షణకు తెరదించిన శార్దూల్.. అత్యంత కీలకమైన జో రూట్ వికెట్ను కూడా పడగొట్టి టీమిండియా విజయాన్ని ఖాయం చేశాడు. ఇదిలా ఉంటే, ఓవల్ టెస్ట్ తర్వాత రాత్రికిరాత్రే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నశార్డూల్ ఠాకూర్ కూడా చాలామంది స్టార్ క్రికెటర్లలాగే ఎన్నో కష్టాలు దాటి ఈ స్థాయికి చేరాడు. కెరీర్ ప్రారంభంలో గాయాలతో సతమతమయ్యి, భారీగా బరువు పెరిగిన ఇతను.. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్ను ఎదుర్కొన్నాడు. తన బర్త్ డే నెల కలిసొచ్చేలా మొదట్లో జెర్సీ నెంబర్ 10తో బరిలోకి దిగిన శార్దూల్.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ‘నీ ముఖానికి అంత సీన్ లేదంటూ' ఘాటు విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, స్వతాహాగా సచిన్ అభిమాని అయిన శార్దూల్.. వెంటనే తన తప్పిదాన్ని గుర్తించి తన జెర్సీ నెంబర్ను 54గా మార్చుకున్నాడు. కాగా, ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో అద్భుత ప్రదర్శన అనంతరం శార్దూల్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏ అభిమానుల చేత ట్రోలింగ్కు గురయ్యాడో వారి చేతనే ప్రస్తుతం శభాష్ అనిపించుకున్నాడు. అతని ఆరాధ్య దైవమైన సచిన్ కూడా అతన్ని ప్రశంసించడంతో శార్దూల్ ఆనందానికి అవధుల్లేవు. చదవండి: ఐదో టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. బట్లర్, లీచ్ రీ ఎంట్రీ -
అభిమానానికి గుర్తుగా గిఫ్ట్; గుక్కపట్టి ఏడ్చేసిన అమ్మాయి
లండన్: యూఈఎఫ్ఏ చాంపియన్షిప్ యూరోకప్ 2020లో ఇంగ్లండ్, డెన్మార్క్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ ఫుట్బాలర్ మాసన్ మౌంట్ మ్యాచ్ విజయంతో పాటు అభిమానుల మనుసులు గెలుచుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు.. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 2-1 తేడాతో డెన్మార్క్పై విజయం సాధించి 55 ఏళ్ల తర్వాత మరో మెగాటోర్నీలో ఫైనల్కు అడుగుపెట్టింది. ఈ చిరస్మరణీయ సన్నివేశాన్ని మైదానంలో ఉన్న అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. వారి సంబరాలను మరింత రెట్టింపు చేయడానికి మౌంట్ తన జెర్సీని ఒక అమ్మాయికి కానుకగా ఇచ్చాడు. మ్యాచ్ ఆరంభం నుంచి తమకు మద్దతిచ్చిన ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి తన జెర్సీని ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఆ అమ్మాయి ఏం అనుకుందో ఏమో తన తండ్రిని హద్దుకొని గట్టిగా ఏడ్చేసింది. ఇదంతా చూసిన మిగతావాళ్లు.. '' మీ తండ్రీ కూతుళ్లు అదృష్టవంతులు.. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం'' అంటూ కంగ్రాట్స్ చెప్పారు. కాగా ఈ వీడియోనూ రెమ్ విలియ్స్ అనే వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయగా ట్రెండింగ్గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ దాదాపు 6.7 మిలియన్ వ్యూస్ రాగా.. వేల సంఖ్యలో లైక్లు, కామెంట్లు వచ్చాయి. ఇక 55 ఏళ్ల తర్వాత ఒక మెగాటోర్నీలో ఫైనల్ చేరిన ఇంగ్లండ్ జూలై 11న ఇటలీతో టైటిల్ పోరుకు తలపడనుంది. This moment had me 🥺 @masonmount_10 👏🏾 pic.twitter.com/tzWWlPijW6 — Rem Williams (@remmiewilliams) July 8, 2021 -
ఒక జెర్సీ.. 11 మంది ఆటగాళ్లు; 8 ఏళ్ల చిన్నారి ప్రాణాలు
ఆక్లాండ్: న్యూజిలాండ్ క్రికెటర్ టిమ్ సౌథీ ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు వేసుకున్న జెర్సీని వేలం వేయనున్నాడు. క్యాన్సర్తో పోరాడుతున్న 8 ఏళ్ల బాలికను రక్షించడానికి సౌథీ ఈ పని చేయనున్నాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన 11 మంది ఆటగాళ్లతో ఇప్పటికే జెర్సీపై సంతకాలు చేయించగా.. తాజాగా ఆ జెర్సీని వేలం వేయనున్నట్లు ప్రకటించాడు. వేలం ద్వారా వచ్చే డబ్బును చిన్నారి చికిత్సకు ఉపయోగించనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో షేర్ చేసుకున్న సౌథీ స్పందిస్తూ..' హోలీ బీటీ అనే 8 ఏళ్ల బాలిక మూడేళ్లుగా న్యూరోబ్లస్టోమా క్యాన్సర్తో పోరాడుతుంది. రెండున్నరేళ్లుగా చికిత్స తీసుకుంటున్న బెట్టీ రెండున్నర సంవత్సరాలుగా చికిత్స తీసుకుంటుంది. కాగా ఇటీవలే ఆమె మెదుడులో మూడు సెంటీమీటర్ల ట్యూమర్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని నాకు మా కుటంబసభ్యులు తెలిపారు. నా కుటుంబసభ్యులు కూడా చిన్నారి చికిత్సకు అవసరమైన మందులు, పరికరాలు సమకూర్చారు. ఇక ఆ చిన్నారిని బతికించేందుకు నేను డబ్ల్యూటీసీ ఫైనల్లో వేసుకున్న జెర్సీని వేలం వేయాలని నిర్ణయించుకున్నా. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బెట్టీ కుటుంబానికి అందజేస్తాను. నా జెర్సీని దక్కించుకోవాలనే వాళ్లు బిడ్ వేయండి అంటూ చెప్పుకొచ్చాడు. సౌథీ జెర్సీ వేలంపై అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఇక డబ్ల్యూటీసీ టోర్నీలో భాగంగా 2019-21 కాలంలో 11 టెస్టులు ఆడిన సౌథీ 56 వికెట్లు తీసి న్యూజిలాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఇక భారత్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌథీ రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: ఊహించని విధంగా బౌన్సర్ వేశాడు.. దాంతో View this post on Instagram A post shared by Tim Southee (@tim_southee) -
ఇంగ్లండ్ మహిళ క్రికెటర్కు సీఎస్కే గిఫ్ట్
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో సీఎస్కే దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో దారుణ ప్రదర్శన కనబరిచిన సీఎస్కే ఈసారి మాత్రం దానికి భిన్నంగా రాణించింది. అయితే దురదృష్టవశాత్తు ఐపీఎల్కు కూడా కరోనా సెగ తగలడంతో బీసీసీఐ మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కోవిడ్ దృశ్యా సీజన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయం పక్కనబెడితే.. ఈ సీజన్లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న సీఎస్కే తన అభిమానికి జెర్సీని గిఫ్ట్గా పంపింది. అయితే ఆ అభిమాని ఎవరో కాదు.. ఇంగ్లండ్ మహిళ స్టార్ క్రికెటర్ కేట్ క్రాస్. సీఎస్కే అంటే విపరీతమైన అభిమానం చూపించే కేట్కు సీఎస్కే జెర్సీని పంపింది. అయితే సీఎస్కే జెర్సీని అందుకున్న కేట్ దానిని ధరించి తన ట్విటర్లో షేర్ చేసింది. ''మీ అభిమానానికి థ్యాంక్స్ సీఎస్కే.. మీరు పంపిన జెర్సీని ఇప్పుడే వేసుకున్నా. సీఎస్కే జెర్సీపై 16 నెంబర్ కేటాయించడం నాకు సంతోషంగా అనిపించింది. కానీ కరోనా పరిస్థితుల దృశ్యా ఐపీఎల్ రద్దు కావడం బాధ కలిగించింది. అయితే బీసీసీఐ మంచి నిర్ణయమే తీసుకుంది. ఆట కంటే ముందు ప్రాణాలు ముఖ్యం.. పరిస్థితులు చక్కబడి మళ్లీ లీగ్ ఆరంభిస్తే చూడాలని ఉంది'' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా సీఎస్కే జట్టులో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కరోనా పాజిటివ్గా తేలగా.. తాజాగా ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కూడా కరోనా బారీన పడినట్లు సీఎస్కే మంగళవారం రాత్రి ట్వీట్ చేసింది. చదవండి: 'అక్కడ ప్రాణాలు పోతున్నాయి.. రద్దు చేయడం మంచిదే' A HUGE thank you to @cskfansofficial and @chennaiipl for sending me my first CSK shirt. When it is safe to start the tournament again, I can #whistlefromhome 💛 #Yellove #WhistlePodu #nandri pic.twitter.com/aobCKSTNgd — Kate Cross (@katecross16) May 4, 2021 As disappointing as people will be to see this news, it’s the right decision. Health comes before cricket. All my thoughts are with everyone involved in the current COVID crisis in India 🇮🇳 https://t.co/hWII9zxx3M — Kate Cross (@katecross16) May 4, 2021 -
అందుకే ఆ హీరోతో నటించలేదు : రష్మిక
రష్మిక మందన్నా..ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్ నుంచి ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయిన రష్మిక ప్రస్తుతం బాలీవుడ్లో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ల కంటే ముందే ఈ అమ్మడికి బీటౌన్ నుంచి ఓ మంచి ఆఫర్ వచ్చింది. స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన జెర్సీ రీమెక్లో నటించేందుకు మొదట రష్మికనే సంప్రదించారట. బాలీవుడ్ పిలుపు కోసం హీరోయిన్లు తహతహలాడుతుంటే.. రష్మిక మాత్రం ఈ ఆఫర్ను తిరస్కరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక తాను ఈ ప్రాజెక్ట్ను ఎందుకు రిజెక్ట్ చేసిందో చెప్పుకొచ్చింది. 'జెర్సీ' మూవీలో నాని సరసన హీరోయిన్గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించిందని,ఆ పాత్రకు తనకన్నా గొప్పగా ఎవరూ న్యాయం చేయలేరని భావించిందట. అందుకే తాను ఈ సినిమా ఒప్పుకోలేదని తెలిపింది. ఇక తెలుగులో జెర్సీని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరే బాలీవుడ్లోనూ రీమేక్ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో షాహిద్కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. చదవండి : ఆరోజు నా పేరెంట్సే నన్ను నమ్మలేదు : రష్మిక రష్మిక కోరిక త్వరలోనే నెరవేరుస్తానన్న బన్నీ