Denmark
-
అమెరికా ‘గ్రీన్ల్యాండ్’ కలలకు చెక్ పెట్టిన డెన్మార్క్!
గ్రీన్ల్యాండ్ స్వాదీనం కోసం డెన్మార్క్కు అగ్రరాజ్యం బెదిరింపులు.. కొన్ని లక్షల మంది ఊబకాయులున్న అమెరికాపైనే ప్రభావం చూపించనున్నాయి. బెదిరింపులకు, ఊబకాయులకు సంబంధమేంటనే సందేహం వస్తోంది కదూ.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే! గ్రీన్ల్యాండ్పై ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం అమెరికా, యూరప్ దేశం డెన్మార్క్ ప్రచ్ఛన్న పోరు కొనసాగుతోంది. గ్రీన్ల్యాండ్ ఖనిజ సంపదపై కన్నేసిన డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైన నాటినుంచే కొనుగోలు ఆలోచనను తెరపైకి తెచ్చారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన చర్యలను వేగవంతం చేశారు. గ్రీన్ల్యాండ్పై అధికారాలున్న డెన్మార్క్పై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే అధిక సుంకాలు విధిస్తామంటూ డెన్మార్క్ను హెచ్చరించారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమనే సంకేతాలూ ఇచ్చారు. అయినా గ్రీన్ల్యాండ్ అమ్మకానికి లేదంటూ డెన్మార్క్ స్పష్టం చేసింది. అమెరికా టారిఫ్ బెదిరింపులు డెన్మార్క్ను ప్రభావితం చేయడం ప్రశ్నార్థకమే. ఎందుకంటే అమెరికాను ఎదుర్కోవడానికి డెన్మార్క్ దగ్గర కీలక ఆయుధాలున్నాయి. వీటిలో మొదటిది ఊబకాయాన్ని తగ్గించే ఔషదం ఓజెంపిక్, రెండోది పిల్లలకు ఇష్టమైన లెగో బొమ్మల ఎగుమతులు. ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయులు అమెరికాలోనే.. ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయం రేటు అమెరికాలో ఉంది. ఓ నివేదిక ప్రకారం.. 23 అమెరికన్ రాష్ట్రాల్లో, ముగ్గురు పెద్దల్లో ఒకరి కంటే ఎక్కువ మంది (35%) ఊబకాయంతో బాధపడుతున్నారు. డానిష్ ఫార్మా దిగ్గజం నోవో నోర్డిస్క్ తయారు చేసిన ఓజెంపిక్, వెగోవి మందులు.. అమెరికాలో ఊబకాయం, డయాబెటిస్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. 2021 నుంచి 2023 వరకు అమెరికాలో ఓజెంపిక్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య 400 శాతం పెరిగింది. ఇప్పటికే అమెరికన్లు ఒక ఓజెంపిక్ ప్యాకెట్ కోసం దాదాపు వెయ్యి డాలర్లు చెల్లిస్తున్నారు. బీమా, డిస్కౌంట్లు లేకుండా అది కాస్తా 1300 డాలర్లు అవుతుంది. ఒకవేళ అమెరికా ఈ మందులు తయారు చేయాలనుకున్నా.. ఓజెంపిక్, వెగోవిలకు అవసరమైన సెమాగ్లుటైడ్ డెన్మార్క్లోనే తయారవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఇప్పటికే ఈ మందుల ధర ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ డెన్మార్క్పై భారీ సుంకాలు విధిస్తే ఓజెంపిక్, వెగోవి ధరలు పెంచే అవకాశం ఉంది. ఆ ఒక్కటే కాదు.. ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం 2023లో డెన్మార్క్ నుంచి 5.7 బిలియన్ డాలర్ల విలువైన మందులు, వ్యాక్సిన్లు మరియు యాంటీబయాటిక్స్ను అమెరికా దిగుమతి చేసుకుంది. డెన్మార్క్ కేంద్రంగా లెగో గ్రూప్... ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల తయారీ సంస్థ లెగో గ్రూప్ కూడా డెన్మార్క్ కేంద్రంగానే పనిచేస్తోంది. ఈ బొమ్మలకు అమెరికాలో ప్రజాదరణ ఎక్కువ. అంతేకాదు.. అమెరికాకు వినికిడి పరికరాల సరఫరాలో కూడా డెన్మార్క్దే అగ్రస్థానం. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ టారిఫ్ బెదిరింపులు.. తిరిగి అమెరికాకు తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళా ప్రధానికి ట్రంప్ బెదిరింపులు?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేసేలా కనిపిస్తున్నారు. డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడరికన్సన్కు ఫోన్లో వాగ్వాదానికి దిగారు. గ్రీన్ల్యాండ్ అంశం విషయంలోనే ఈ హాట్ హాట్ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులను ఉటంకిస్తూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రముఖంగా కథనం ప్రచురించింది. ఉత్తర అమెరికా, రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో, యూరప్కి వాయువ్యంగా వ్యూహాత్మక ప్రాంతంగా ఉంది గ్రీన్ల్యాండ్(Greenland). స్వయం ప్రతిపత్తి కలిగిన దేశం అయినప్పటికీ.. డెన్మార్క్ సామ్రాజ్యపు నియంత్రణలో ఉంటోంది. దీంతో ఎలాంటి సంప్రదింపులకైనా డెన్మార్క్తో చర్చించాల్సిందే. గ్రీన్ల్యాండ్ను కొనుగోలు చేయాలని డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెన్మార్క్తో ఆయన సంప్రదింపులు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ట్రంప్, డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. తన ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే డెన్మార్క్ను ఆర్థికంగా శిక్షిస్తానని ట్రంప్ ఈ ఫోన్కాల్లో హెచ్చరించారట. ఫోన్కాల్లో ట్రంప్ సంభాషించిన తీరుకు తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆ అధికారులు వెల్లడించినట్లు సదరు కథనం పేర్కొంది. ఫోన్ కాల్లో సంభాషణ ఇలా.. గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకునే విషయంలో తాము సీరియస్ ఆలోచన చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. దానికి ఫ్రెడెరిక్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే గ్రీన్ల్యాండ్ అమ్మడంపై ఎలాంటి ఆసక్తి లేదని ఆమె తేల్చిచెప్పారు. తన ప్రతిపాదనను తిరస్కరించడంతో ట్రంప్ కోపంతో ఆమెతో దూకుడుగా మాట్లాడారట. ఒక దశలో బెదిరింపులకు దిగారని సదరు కథనం పేర్కొంది. వీరిద్దరి మధ్య సుమారు 45 నిమిషాల పాటు ఫోన్ కాల్ సాగినట్లు సమాచారం. డొనాల్డ్ ట్రంప్ 2016లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఈ ప్రతిపాదనను తెర పైకి తెచ్చారు. కానీ, ట్రంప్ కంటే చాలాఏళ్ల ముందే అమెరికా నుంచి ఈ ప్రతిపాదన వెళ్లింది. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన హ్యారీ ట్రూమాన్ ఈ ద్వీపం కొనుగోలుపై ఆసక్తి చూపించారు. గ్రీన్ల్యాండ్ భౌతిక స్వరూపం, అక్కడ నిక్షిప్తమైన సహజ సంపద వనరులే అందుకు కారణం. అయితే.. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ దానిని డెన్మార్క్ తిరస్కరించింది.మళ్లీ ఇన్నాళ్లకు.. పనామా కాలువు, కెనడా, గ్రీన్ల్యాండ్ ప్రకటనలతో ట్రంప్ సంచలన చర్చకు దారి తీశారు. తమ ప్రతిపాదనకు ఒప్పుకోకుంటే.. ఆర్థిక ఆంక్షలు విధిస్తానని, అవసరమైతే సైన్యపరమైన చర్యలకు తాను వెనకాడబోనంటూ ప్రకటించారాయన. అయితే ట్రంప్ బహిరంగ ప్రకటన ప్రపంచ దేశాలను.. ప్రత్యేకించి ఈయూ దేశాలను ఆందోళనకు గురి చేసింది. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, భవిష్యత్తులో అమ్మే ప్రసక్తే లేదని, అది తమ దేశ ప్రజల గౌరవానికి సంబంధించిన విషయమని ఆ దేశ ప్రధాని మ్యూట్ బౌరప్ ఎగిడే ఇటీవల స్పష్టంచేసిన విషయం తెలిసిందే.గ్రీన్లాండ్లో ఏముందంటే..గ్రీన్ల్యాండ్ చాలా వనరులు అధికంగా ఉన్న ద్వీపం. ఇది చమురు, గ్యాస్ నిల్వలతో సమృద్ధిగా ఉంది. రేర్ ఎర్త మెటీరియల్ లభ్యం అవుతుంది. రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికా వాటిపై దృష్టిపెట్టింది. గ్రీన్లాండ్ ఖనిజ సంపద విలువ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.94 లక్షల కోట్లు)గా ఉండొచ్చని ఓ అంచనా. చైనాకు కూడా గ్రీన్ ల్యాండ్పై కన్నుంది. -
డెన్మార్క్: ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు
కోపెన్హాగన్: డెన్మార్క్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడి చేసిన నేటికి (అక్టోబర్ 7 తేదీ) ఏడాది. ఈ నేపథ్యంలోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోపెన్హాగన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్ రాయబార భవనానికి సమీపంలో ఐదు రోజుల క్రితం రెండు పేలుళ్లు సంభవించిన తర్వాత మళ్లీ పేలుడు జరగటం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం జరిగిన పేలుళ్లలో ఇద్దరు స్వీడిష్ జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు.The #blast occurred some 500 metres (yards) from the embassy in Copenhagen and came five days after two explosions near the building for which two Swedish nationals have been remanded in #custody.#IsraelEmbassy #denmark https://t.co/MynYeyyNzZ— The Daily Star (@dailystarnews) October 7, 2024 క్రెడిట్స్: The Daily Star‘‘ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధం ఉందా? లేదా? అనే విషయం పరిశీలిస్తున్నాం’’ అని కోపెన్హాగన్ పోలీసు ఇన్స్పెక్టర్ ట్రిన్ మొల్లెర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే.. ఈ పేలుడు ఘటన తుపాకీ కాల్పుల వల్ల సంభవించి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను స్థానిక మీడియా ప్రసారం చేసింది.మరోవైపు.. డెన్మార్క్లో ఇటీవల అక్టోబర్ 2న జరిగిన పేలుళ్లలో ఇరాన్ ప్రమేయం ఉండవచ్చని, స్టాక్హోమ్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన కాల్పుల్లో సైతం ఆ దేశ ప్రమేయం ఉందని స్వీడన్ గూఢచార సంస్థ సపో అనుమానం వ్యక్తం చేసింది.చదవండి: కిమ్ కాదు, సోరోస్ కాదు.. ఉపవాసానికే నా ఓటు! -
డెన్మార్క్లో వరుస బాంబు పేలుళ్లు
కోపెన్హాగన్:డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. బుధవారం(అక్టోబర్2)ఉదయం జరిగిన ఈ పేలుళ్లలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డెన్మార్క్ పోలీసులు ప్రకటించారు.పేలుళ్లపై ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధవాతారణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుళ్లు చోటు చేసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైళ్ల దాడులు -
సంతాన లేమి : అవే కొంప ముంచుతున్నాయి!
వంధ్యత్వం లేదా ఇన్ఫెర్టిలిటీ అనేది ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య. గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఏడు జంటలలో ఒకరిని ప్రభావితం చేస్తోంది దక్షిణ , మధ్య ఆసియా, సబ్-సహారా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో అత్యధిక ఈ సమస్య కనిపిస్తోంది. పురుషుల్లో వాయు కాలుష్యం, మహిళల్లో రోడ్డు ట్రాఫిక్ శబ్దం కారణంగా వంధ్యత్యం వేధిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. నార్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు బీఎంజే జర్నల్లో పబ్లిష్ అయ్యాయి.డెన్మార్క్లోని నోర్డ్ అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం పాటు ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (PM 2.5) వాయు కాలుష్యాన్ని గురైన పురుషుల్లో సంతాన లేమి ఏర్పడే ముప్పు అధికంగా ఉందని పేర్కొంది. పీఎం 2.5 పురుషులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. దీనికి ఎక్కువ ఎక్స్పోజ్ కావడంతో పురుషులలో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదేవిధంగా, శబ్ద కాలుష్యం మహిళల్లో అధిక వంధ్యత్వానికి దారితీస్తోంది. సగటు కంటే 10.2 డెసిబుల్స్ ఎక్కువగా ఉండే రోడ్డు ట్రాఫిక్ శబ్దం 35 ఏళ్లు పైబడిన మహిళల్లో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనం కనుగొంది. 2000-2017 మధ్య డెన్మార్క్లో 30-45 ఏళ్ల వయసున్న 5,26,056 మందిపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. పీఎం 2.5కి ఐదేళ్లకు పైన గురైన 30-45 ఏళ్ల వయసున్న వారిలో వంధ్యత్య ముప్పు 24 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనం వివరించింది. -
ఒలింపిక్స్లో తాప్సీ సందడి.. ఆ తర్వాత అక్కడే మకాం!
బాలీవుడ్ నటి, హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని తాప్సీ నటించిన హిట్ చిత్రం హసీన్ దిల్రూబాకు సీక్వెల్గా తీసుకొస్తున్నారు. ఇందులో విక్రాంత్ మాస్సే, జిమ్మీ షెర్గిల్, సన్నీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9 నుంచి నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.అయితే ఈ ఏడాది మార్చిలో తన ప్రియుడు మథియాస్ బో పెళ్లాడిన సంగతి తెలిసిందే. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినా మథియాస్ ప్రస్తుతం భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టుకు పురుషుల డబుల్స్ కోచ్గా ఉన్నారు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ గేమ్స్తో బిజీగా ఉన్నారు. తాజాగా తాప్సీ సైతం పారిస్ చేరుతుంది. భారత టీమ్తో పాటు భర్తకు మద్దతు తెలిపేందుకు పారిస్ చేరుకుంది.అయితే తాప్సీ పన్ను, తన భర్త మథియాస్ బో డెన్మార్క్లో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. త్వరలోనే డెన్మార్క్ ఇంట్లో గృహప్రవేశం జరుగుతుందని తెలిపింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత తన భర్తతో పాటు డెన్మార్క్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాప్సీ పేర్కొంది. సమ్మర్లో డెన్మార్క్ ఎక్కువ సమయం ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. -
ఇంగ్లండ్, డెన్మార్క్ మ్యాచ్ ‘డ్రా’
ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ): యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో గత రన్నరప్ ఇంగ్లండ్ జట్టు ఖాతాలో తొలి ‘డ్రా’ చేరింది. డెన్మార్క్తో గురువారం జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్ను ఇంగ్లండ్ 1–1 గోల్స్తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ తరఫున ఆట 18వ నిమిషంలో హ్యారీ కేన్ గోల్ చేయగా... 34వ నిమిషంలో హిజుల్మండ్ గోల్తో డెన్మార్క్ జట్టు స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి. గ్రూప్ ‘ఎ’లో స్కాట్లాండ్, స్విట్జర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో... గ్రూప్ ‘సి’లో స్లొవేనియా, సెర్బియా మధ్య జరిగిన మ్యాచ్ కూడా 1–1తో ‘డ్రా’గా ముగిశాయి. -
డెన్మార్క్ ప్రధానిపై దాడి
కోపెన్హాగెన్/న్యూఢిల్లీ: డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడెరిక్సన్(46)పై దాడి జరిగింది. శుక్రవారం ఆమె రాజధాని కోపెన్హాగెన్లోని కుల్వోర్వెట్ స్క్వేర్ వద్ద సోషల్ డెమోక్రాట్ల తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎదురుగా వచి్చన ఓ వ్యక్తి చేతితో ప్రధానిని భుజాన్ని బలంగా నెట్టివేశాడు. దీంతో, ఆమె పక్కకు తూలారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనతో ప్రధాని ఫ్రెడెరిక్సన్కు ఎటువంటి గాయాలు కాలేదు కానీ, షాక్కు గురయ్యారని ఆమె కార్యాలయం తెలిపింది. ఘటన నేపథ్యంలో శనివారం ప్రధాని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని వివరించింది. యూరోపియన్ పార్లమెంట్కు ఆదివారం ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫ్రెడెరిక్సన్పై దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. -
డెన్మార్క్ ప్రధానిపై దాడి
కోపెన్హగన్: డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సెన్పై దాడి జరిగింది. కోపెన్హాగన్ స్క్వేర్ వద్ద ప్రధానిపై దుండగుడు ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఘటనతో ప్రధాని షాక్కు గురైనట్లు ఆమె కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దాడికి దిగిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే ప్రధానిని సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారని ఘటనకు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ప్రధానిపై దాడి తమను కలిచివేసిందని పర్యావరణ మంత్రి ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. మూడు వారాల క్రితమే యూరప్ దేశం స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. -
కాదేదీ రికార్డుకనర్హం! కనుకే అగ్గిపుల్లలతో సరికొత్త రికార్డు..
'జీవితంలో ఎన్నో వింతలు, విశేషాలు తారసపడుతూంటాయి. కొందరి జీవతంలో వారే వింతగా ఏదేదో సాధిస్తూంటారు. అలా చేసేదాకా వారికి అదే ధ్యాసనో, లేక అదే ప్రపంచమో..! ఇలాగే డెన్మార్క్లోని ఓ వ్యక్తి చేసిన రికార్డును చూస్తే.. వ్హా అనక తప్పదు. ఇక ఆ రికార్డు ఏంటో తెలుసుకందాం.' ‘అగ్గిపుల్లా సబ్బుబిళ్లా కుక్కపిల్లా కాదేదీ కవితకనర్హం’ అన్నాడు శ్రీశ్రీ. పీటర్ వాన్ టాంగెన్ బుస్కోవ్ అనే ఈ డేనిష్ పెద్దమనిషి మాత్రం కాదేదీ రికార్డుకనర్హం అనుకుని, ఏకంగా అగ్గిపుల్లలతో రికార్డు సృష్టించాడు. రెండు ముక్కురంధ్రాల్లోనూ 68 అగ్గిపుల్లలను దట్టించుకుని, అత్యధిక సంఖ్యలో అగ్గిపుల్లలను ముక్కులో దట్టించుకున్న వ్యక్తిగా కొత్త రికార్డును నెలకొల్పాడు. డెన్మార్క్లోని ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తున్న పీటర్, త్వరలోనే ఉపాధ్యాయ వృత్తిలోకి మారాలనుకుంటున్నాడు. తన చర్మానికి సాగే గుణం సాధారణం కంటే కొంత ఎక్కువని, అందువల్లనే సునాయాసంగా ఈ రికార్డును సాధించగలిగానని అతడు చెప్పాడు. ఇదివరకు ఒక వ్యక్తి ముక్కురంధ్రాల్లో 44 అగ్గిపుల్లలను దట్టించుకుని రికార్డు నెలకొల్పాడు. పీటర్ ఆ రికార్డును సునాయాసంగా అధిగమించడం విశేషం. ఇవి చదవండి: పరీక్షల పద్ధతిని ప్రవేశ పెటిందెవరో మీకు తెలుసా..! -
డెన్మార్క్ రాజుగా పదో ఫ్రెడరిక్
కోపెన్హేగెన్: డెన్మార్క్ రాజ సింహాసనాన్ని పదో ఫ్రెడరిక్ ఆదివారం అధిష్టించారు. రాణి రెండో మార్గరెట్ (83) అనారోగ్య కారణాలతో సింహాసనం వీడుతున్నట్లు కొత్త సంవత్సరం మొదటి రోజే ప్రకటించారు. 900 ఏళ్ల డెన్మార్క్ రాచరిక చరిత్రలో రాజు స్వచ్ఛందంగా సింహాసనం వీడటం ఇదే తొలిసారి. రాజధాని కోపెన్హేగెన్లోని జరిగిన కేబినెట్ సమావేశంలో సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపే పత్రంపై రాణి సంతకం చేశారు. తర్వాత ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్ రాజభవనం బాల్కనీ నుంచి పదో ఫ్రెడరిక్ను రాజుగా ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాజభవనం వెలుపల వేలాది మంది గుమికూడారు. ‘గాడ్ సేవ్ ది కింగ్’అని చెబుతూ రాణి అక్కడి నుంచి ని్రష్కమించారు. రెండో మార్గరెట్తో పాటు ఆస్ట్రేలియా మూలాలున్న ఫ్రెడరిక్ భార్య క్వీన్ మేరీ రూపంలో డెన్మార్క్కు ఇద్దరు రాణులుంటారు. ఫ్రెడరిక్, మేరీల పెద్ద కుమారుడు క్రిస్టియన్ (18) యువరాజు హోదాతో సింహాసనానికి వారసుడయ్యారు. డెన్మార్క్ రాజరికం యూరప్లోనే అత్యంత పురాతనమైంది. 10వ శతాబ్దంలో వైకింగ్ రాజు గోర్డ్ ది ఓల్డ్ కాలం నుంచి అప్రతిహతంగా కొనసాగుతోంది. 1146లో అప్పటి డెన్మార్క్ రాజు మూడో ఎరిక్ లామ్ స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగి, సన్యాసం తీసుకున్నారు. డెన్మార్క్ రాజుగా తొమ్మిదో ఫ్రెడరిక్ 1947 నుంచి 1972వరకు కొనసాగారు. ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన కుమార్తె రెండో మార్గరెట్ సింహాసనం అధిíÙ్ఠంచారు. దాదాపు 52 ఏళ్లపాటు రాణిగా కొనసాగారు. -
పబ్లో తొలి ప్రేమ ఇపుడు డెన్మార్క్ రాణిగా..అద్భుత లవ్ స్టోరీ
డెన్మార్క్ రాణి పదవినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో కానున్న డెన్మార్క్ రాణి మేరీ డొనాల్డ్సన్ ఎవరు, ఏంటి అనేదానిపై ఆసక్తి నెలకొంది. అసలు ఎవరీ మేరీ. ఒక సాధారణ యువతి యువరాణిగా , రాచకుటుంబంలో ఒక ట్రెండ్ సెట్టర్గా, ఎలా మారింది. ఈ వివరాలు చూద్దాం. మాజీ ఆస్ట్రేలియన్ అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ , రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న టాస్మానియాకు చెందిన 28 ఏళ్ల యువతితో, డెన్మార్క్ యువరాజు ఫ్రెడెరిక్ (ఫ్రెడ్) తో పరిచయం ప్రేమ పరిచయం ఒక అద్భుత కథ. 2000, సెప్టెంబరులో ఒక పబ్లో ఇద్దరూ కలుసుకున్నారు. తొలిసారి ఆయనను కలిసినపుడు, షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు డెన్మార్క్ యువరాజు అని తనకు తెలియదని మేరీ 2003లో ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు తాను యువరాణి అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. అలాగే ఫ్రెడ్తో మాట కలిసింది మొదలు మాట్లాడుకుంటూనే ఉన్నామంటూ తమ ప్రేమ కథను గుర్తుచేసుకున్నారు. తన ఫోన్ నెంబరు తీసుకోవడం, కలిసిన మరునాడే కాల్ చేయడం లాంటి సంగతులను ముచ్చటించారు. అలాగే ఆమెను చూసిన తొలిచూపులోనే ప్రేమ, తన సోల్మేట్ను కలిసిన అనుభూతి కలిగిందని ఫ్రెడరిక్ చెప్పడం విశేషం. ఇదీ చదవండి: హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా! ప్రేమ, వివాహం తరువాత రాచరికపు మర్యాదలకు, గౌరవాలకు భంగం కలగకుండా ప్రవర్తించిందామె. డానిష్ అనర్గళంగా మాట్లాడటంతోపాటు, తన సొంత ఊరిని, భాషను, యాసను మర్చిపోలేదు.అంతేకాదు ప్రిన్సెస్ మేరీ టాస్మానియాకు అద్భుతమైన రాయబారి అని టాస్మానియా ప్రీమియర్ జెరెమీ రాక్లిఫ్ ఇటీవల ప్రకటించడం ఇందుకు నిదర్శనం. కోపెన్హాగన్లోని ఆస్ట్రేలియన్ ప్రవాసులు తమ దేశ బిడ్డ మేరీ డెన్మార్క్ క్వీన్ అయినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే తనదైన వ్యక్తిత్వంతో, ప్రగతి శీలంగా ఉంటూ మహిళలు, పిల్లల హక్కులు, గృహహింసకు వ్యతిరేకంగా తన భావాలను పంచుకుంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకున్నారు. 23 ఏళ్ల తరువాత 51 ఏళ్ల వయసులో డెన్మార్క్ తదుపరి రాణిగా అవతరించబోతున్నారు. ఈ (జనవరి 14,2024) ఆదివారం భర్త ఫ్రెడరిక్ సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత ఆమె రాణి హోదాను దక్కించుకోనున్నారు. ఇదీ చదవండి: బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి? రాణి మార్గరెట్ -2పదవీ విరమణ వయసు, అనారోగ్య కారణాలు, 2023 ఫిబ్రవరిలో తన వెన్నెముకకు జరిగిన ఆపరేషన్ తదితర కారణాల రీత్యా దేశ సింహాసనం నుంచి తప్పుకుంటూ డెన్మార్క్ రాణి మార్గరెట్ -2 (83) సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 14తో రాణిగా 52 ఏళ్లు పూర్తి కాబోతున్నాయని, అదే రోజున సింహాసనాన్ని వీడనున్నట్టు ప్రకటించారు. కొత్త ఏడాది రోజు తన నిర్ణయాన్ని ప్రకటించగానే దేశ ప్రజలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే తన వారసుడిగా కుమారుడు క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడెరిక్ కిరీటాన్ని ధరిస్తాడని కూడా అదే రోజు వెల్లడించారు. "నేను ఎక్కువ వెలుగులో ఉంటాను కాబట్టి, కొంతమంది నా భర్త నా ప్రభావంలో ఉన్నారని అనుకుంటారు కానీ మేము అలా కాదు. ఒకరి నీడలో మరొకరం ఉండం, నిజానికి ఆయనే నా వెలుగు’’ - ప్రిన్స్ ఫ్రెడరిక్ ( 2017) బయోగ్రఫీలో మేరీ రాశారు. ఫిబ్రవరి 5, 1972న టాస్మానియా రాజధాని హోబర్ట్లో జన్మించారు మేరీ. ఆమె తండ్రి గణితశాస్త్ర ప్రొఫెసర్ , ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. గుర్రపు స్వారీ, ఆటల్లో మంచి ప్రవేశం ఉంది. లా అండ్ కామర్స్ చదివి మెల్బోర్న్, సిడ్నీలో ప్రకటన రంగంలో కరియర్ను స్టార్ట్ చేసింది.అలా ఆస్ట్రేలియాలో అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నప్పుడు, 2000లో వేసవి ఒలింపిక్స్లో సిడ్నీలోని స్లిప్ ఇన్ బార్లో స్నేహితులతో కలిసి బయటికి వెళ్లినప్పుడు అప్పటి 34 ఏళ్ల ఫ్రెడరిక్ను కలుసుకుంది.ఈ జంట అధికారికంగా 2003 అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్నారు . అలాగే మే 14, 2004న కోపెన్హాగన్ కేథడ్రల్లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ప్రిన్స్ క్రిస్టియన్( 18) ప్రిన్సెస్ ఇసాబెల్లా(16), కవల పిల్లలు ప్రిన్స్ విన్సెంట్ ప్రిన్సెస్ జోసెఫిన్ (13) ఉన్నారు. ఇదీ చదవండి: ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్ వినేష్ ఫోగట్ -
డెన్మార్క్ రాణి మార్గరేట్-II పదవీ విరమణపై కీలక ప్రకటన
కోపెన్హాగన్: న్యూఇయర్ రోజున డెన్మార్క్ రాణి మార్గరేట్-II(83) కీలక ప్రకటన చేశారు. జనవరి 14న తాను పదవీ విరమణ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తన కుమారుడు ప్రిన్స్ ఫ్రెడరిక్కు తన బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు. యూరప్లోనే అత్యధికంగా 52 ఏళ్లుగా పదవిలో ఉన్న చక్రవర్తిగా మార్గరేట్-II నిలిచారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మరణం తర్వాత యూరప్లో అధికారంలో ఉన్న ఏకైక రాణి మార్గరేట్. డెన్మార్క్ టెలివిజన్లో ప్రసారమయ్యే సాంప్రదాయ నూతన సంవత్సర ప్రసంగం సందర్భంగా ఆమె తన వయస్సు, ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ ఆశ్చర్యకరంగా పదవీ విరమణ ప్రకటన చేశారు. డెన్మార్క్లో 1972లో సింహాసనం అధిరోహించిన రాణి మార్గరేట్.. చక్రవర్తిగానే గాక వివిధ కళల్లో ఉన్న ప్రతిభతో సాధారణ ప్రజల్లో ప్రజాధరణ పొందారు. ఆమె హయాంలోనే డెన్మార్క్ సహా ప్రపంచంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచీకరణ, 1970, 1980నాటి ఆర్థిక సంక్షోభాలు, 2008 నుంచి 2015 మధ్య తీవ్ర కరువు, కరోనా మాహమ్మారి వంటి పరిస్థితులను డెన్మార్క్ ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ డెన్మార్ను ఐక్యంగా ఉంచడంలో ఆమె సఫలం అయ్యారు. మెరిసే నీలి కళ్లతో నిత్యం ఉత్సాహంగా ఉండే మార్గరేట్.. అనేక కళల్లో నిష్ణాతురాలు. పేయింటింగ్, కాస్ట్యూమ్, సెట్ డిజైనర్గా రాయల్ డానిష్ బ్యాలెట్, రాయల్ డానిష్ థియేటర్తో కలిసి పనిచేశారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్వీడిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. "ఆల్ మెన్ ఆర్ మోర్టల్"తో సహా అనేక నాటకాలను కూడా ఆమె అనువదించారు. ఇదీ చదవండి: మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్ -
వ్యర్థాల ప్లాంట్.. వినోదాల స్పాట్!
నగరాల్లో ఇంటింటి నుంచి చెత్తను సేకరించి ఓ ప్రదేశంలో కాల్చేయడమో లేదా రీసైక్లింగ్ చేయడమో జరుగుతూ ఉంటుంది. తీవ్ర దుర్గంధభరితమైన, అత్యంత కాలుష్యమయమైన ఆ ప్రాంతానికి పొరపాటున కూడా వెళ్లే సాహసం చేయలేం కదా? కానీ అలాంటి ప్రదేశానికి వెళ్లి సేద తీరడమే కాదు.. ఆడొచ్చు.. పాడొచ్చు.. ఇంకా కావాల్సింది సుష్టుగా తినొచ్చు. అవాక్కవుతున్నారా? నిజంగా ఇది నిజం. మరి అ అందమైన చెత్త వినోద కేంద్రం ఎక్కడుంది, దాని విశేషాలేంటో చూద్దామా? డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్.. రాజరిక వారసత్వం, ఆధునిక వాస్తుశిల్పాన్ని మిళితం చేసిన పర్యావరణ అనుకూలమైన అందమైన నగరం. 2017లో కోపెన్హాగన్ను ప్రపంచంలోని గ్రీన్సిటీగా ప్రకటించారు. ఇది ప్రధానంగా పునరుత్పాదక శక్తిని పెంపొందించడం, క్లీనర్ మొబిలిటీపై దృష్టి పెట్టింది. దీంతో నగరంలోని వ్యర్థాలను మొత్తం విద్యుత్గా మార్చే ఒక పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టారు. కేవలం ప్లాంటు ఒకటే ఏం బాగుంటుందని అనుకున్నారు డెన్మార్క్ అధికారులు. అంతే వ్యర్థాల శుద్ధి కేంద్రానికి వినోదపు టచ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు అదిరిపోయే డిజైన్తో ఈ ప్లాంట్ నిర్మించారు. కోపెన్హాగన్లోని ఎత్తైన భవనాల్లో ఒకటైన ఈ ఆర్కిటెక్ట్ అద్భుతాన్ని అమేజర్ బక్కే లేదా కోపెన్హిల్గా పిలుస్తారు. కార్పొరేట్ ఆఫీసులను తలదన్నేలా ఉన్న ఈ భవ నాన్ని చూస్తే ఇది వ్యర్థ శుద్ధి కేంద్రమా అనే సందేహం కలగక మానదు. 100 మీటర్ల ఎత్తైన ఈ భవనంపైన అనేక కార్యకలాపాలతో కూడిన డైనమిక్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. ఇందులో స్కైయింగ్, హైకింగ్, క్లైంబింగ్ వంటి వినోద సదుపాయాలు ఉన్నాయి. దీంతో ఇది వ్యర్థాలను ప్రాసెస్ చేసే ప్లాంట్గానే కాకుండా.. వినోదాలు పంచే విహారాల స్పాట్గా కూడా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. కార్బన్ న్యూట్రల్ సిటీగా.. 2025 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ సిటీగా కోపెన్హాగన్ అవతరించాలనే లక్ష్యంతోనే ఈ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. వ్యర్థాలను భూగర్భంలో ఉండే ఓ బాయిలర్లో ప్రాసెస్ చేయడం ద్వారా ప్లాంట్ పనిచేస్తుంది. రోజుకు 300 ట్రక్కుల వ్యర్థాలను వెయ్యి డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వాతావరణంలోకి 250 కిలోగ్రాముల కార్బన్డైఆక్సైడ్ నీటి ఆవిరి రూపంలో 124 మీటర్ల చిమ్నీ ద్వారా బయటకు వస్తుంది. ఏటా 4,40,000 టన్నుల వ్యర్థాలను మండించడం ద్వారా 1,50,000 గృహాల విద్యుత్ అవసరాలను ఈ ప్లాంట్ తీరుస్తోంది. పర్వతారోహకులకు పండుగే.. పర్యాటకులు ఈ ప్లాంట్ పై స్కైయింగ్ చేయొచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 85 మీటర్ల క్లైంబింగ్ వాల్ను ఈ ప్లాంట్లో ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడకు వచ్చే పర్వతారోహకులు బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు కింది భాగంలో గ్లైడింగ్ ప్రాక్టీస్ చేసే సదుపాయం కూడా ఉంది. ఇక రిసార్ట్స్ తరహాలో ఇక్కడ కెఫే, బార్ కూడా ఉన్నాయండోయ్.. రూఫ్టాప్ కెఫేలో వేడి వేడి కాఫీ, చల్లని శీతలపానీయాలతో సేద తీరొచ్చు. సముద్రాన్ని చూస్తూ మీకు నచి్చన ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడైనా డెన్మార్క్ వెళితే ఈ ప్లాంట్ను ఓ లుక్కేసి రండి. -
ఆ్రస్టేలియన్ ఓపెన్ బరిలో వొజ్నియాకి
ప్రపంచ మాజీ నంబర్వన్, డెన్మార్క్ టెన్నిస్ స్టార్ వొజ్నియాకికి వచ్చే ఏడాది జరిగే తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో బరిలోకి దిగనుంది. ప్రస్తుతం 242వ ర్యాంక్లో ఉన్న 33 ఏళ్ల వొజ్నియాకికికి నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. 2018లో ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్గా నిలిచిన వొజ్నియాకికి 2020లో టెన్నిస్కు గుడ్బై చెప్పింది. గత ఏడాది ఆగస్టులో పునరాగమనం చేసి యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆడింది. -
మతోన్మాదం యూరప్ కొంప ముంచుతుందా?
యూరప్లో మతోన్మాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. స్వీడన్ తర్వాత ఇప్పుడు మరో యూరోపియన్ దేశం డెన్మార్క్లో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ను తగలబెట్టినా ఆ ప్రక్రియను ఆపే చర్యలేవీ జరగడంలేదు. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లో మితవాద సంస్థ ఖురాన్ను తగులబెట్టడంపై సౌదీ అరేబియా మొదలుకొని పాకిస్తాన్ వరకు అన్ని ముస్లిం దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. డెన్మార్క్ దౌత్యవేత్త సమక్షంలో.. ఖురాన్ దహనం చేసిన ఘటనపై ఆగ్రహించిన సౌదీ అరేబియా.. డెన్మార్క్ దౌత్యవేత్త సమక్షంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అదే సమయంలో డెన్మార్క్లో జరిగిన ఘటనపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా తీవ్ర విమర్శలు గుప్పించింది. తాజాగా జరిగిన సమావేశంలో సౌదీ అధికారులు డెన్మార్క్ రాయబారి ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను తక్షణం ఆపాలని డెన్మార్క్కు వారు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి సంఘటనలు అన్ని మతాల సందేశాలకు, అంతర్జాతీయ చట్టాలు, ప్రమాణాలకు విరుద్ధమని సౌదీ పేర్కొంది. ఖురాన్ను తగులబెట్టడం వల్ల వివిధ మతాల మధ్య విద్వేషాలు వ్యాపిస్తాయని తెలిపింది. ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహం దీనికిముందు డెన్మార్క్కు చెందిన పేట్రియాటర్ ఒక వీడియోను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఖురాన్ను తగులబెట్టడం ఆ వీడియోలో కనిపిస్తుంది. తాజాగా స్వీడన్, డెన్మార్క్లలో కూడా ఖురాన్ను దగ్ధం ఘటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. మక్కా, మదీనా వంటి నగరాలు కలిగిన దేశమైన సౌదీ అరేబియా.. స్వీడన్లో ఖురాన్ను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక ఇరాకీ శరణార్థి స్టాక్హోమ్లోని ప్రధాన మసీదు బయట ఖురాన్ను తగులబెట్టాడు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో సౌదీ అరేబియా, ఇరాక్ సంయుక్తంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ) అసాధారణ సమావేశానికి పిలుపునిచ్చాయి. దీనిలో స్వీడన్, డెన్మార్క్లలో ఖురాన్ దహనం చేసిన అంశంపై చర్చించనున్నారు. మరోవైపు స్వీడన్ ప్రధాని తమ దేశానికి ఉగ్రదాడుల భయం ఎదురుకావడంతో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేశారు. ఇస్లామిక్ దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు స్వీడన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది కూడా చదవండి: ఆ పాప నా మనవరాలే : బైడెన్ -
సంప్రదాయం పేరిట సముద్రంలో దారుణం..
డెన్మార్క్: అంబాసిడర్ లైన్ అనే బ్రిటీష్ నౌక ఫరో ద్వీప సందర్శన సందర్బంగా అందులోని ఒక బృందం వారి ప్రాచీన సంప్రదాయమని చెబుతూ 70కి పైగా తిమింగలాలను అత్యంత క్రూరంగా వేటాడి చంపేశారు. ఆ సమయంలో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ అంబాసిడర్ నావికుడు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరారు. మనిషి కంటే క్రూరమైన జంతువు భూమ్మీద లేదు. దీన్ని నిజం చేస్తూ ఫరో ద్వీపాల్లో మనిషి అమానుషత్వం మరోసారి బయటపడింది. ఈ నెల 9న ఫరో ద్వీప రాజధాని టోర్శావ్న్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నిండు సందర్శకులతో ఫరో ద్వీపాల సందర్శనకు బయలుదేరిన అంబాసిడర్ లైన్ అనే ఒక పెద్ద ఓడలోని కొందరు అనాగరికులు వందల ఏళ్ల నాటి సంప్రదాయమని చెబుతూ 70కి పైగా పెద్ద రెక్కలున్న తిమింగలాలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అలా వేటాడిన తిమింగలాలను తినడం వారి సాంప్రదాయమట. ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో అందులోని ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, వేటగాళ్ళ ఆకృత్యాలను ప్రత్యక్షంగా చూసిన వారు భయభ్రాంతులకు గురైయ్యారని క్రూజ్ సిబ్బంది తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి తెలుకుసుకున్న సముద్ర సముద్రజీవుల పరిరక్షణ సంస్థ (ఓ.ఆర్.సి.ఏ) దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వేట సమయంలో ఈ సంస్థకు చెందిన ప్రతినిధులు కూడా ఓడలో ఉన్నట్లు సమాచారం. ఓడ నావికుడు ట్విట్టర్ వేదికగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ తెలిపారు. ఇది కూడా చదవండి: 40 అస్తిపంజరాలతో ఇల్లు డెకరేషన్.. తీగలాగితే.. -
ఇన్ఫోసిస్ జాక్పాట్! రూ. 3,722 కోట్ల భారీ డీల్ కైవసం..
ఇన్ఫోసిస్ జాక్పాట్ కొట్టేసింది. డెన్మార్క్ దేశానికి చెందిన డాన్స్కే బ్యాంక్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్ను దక్కించుకుంది. ఇందు కోసం 454 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 3,722 కోట్లు) డీల్ దక్కించుకున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా తెలిపింది. ఐదేళ్ల కాలానికి కుదిరిన ఈ ఒప్పందం విలువ 900 మిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని, మరో మూడు సంవత్సరాల వరకు పునరుద్ధరించరించే ఆస్కారం ఉందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. యూకేకి చెందిన నేషనల్ ఎంప్లాయిమెంట్ సేవింగ్స్ ట్రస్ట్ (NEST) నుంచి 1.1 బిలియన్ డాలర్ల డీల్ను టీసీఎస్ దక్కించుకున్న కొన్ని రోజులకే ఇన్ఫోసిస్కు ఇంత పెద్ద డీల్ దక్కడం గమనార్హం. తమ మెరుగైన డిజిటల్, క్లౌడ్, డేటా సామర్థ్యాలతో డాన్స్కే బ్యాంకు కోర్ వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు ఇన్ఫోసిస్ సహకరిస్తుందని కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ ఒక ప్రకటనలో తెలిపారు. శక్తివంతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు డాన్స్కే బ్యాంకుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. యాక్సెంచర్పై గెలిచి.. పోటీలో ఉన్న యాక్సెంచర్ కంపెనీపై గెలిచి డాన్స్కే బ్యాంకు డీల్ను ఇన్ఫోసిస్ సాధించింది. ఈ డీల్లో భాగంగా భారత్లోని బెంగళూరులో ఉన్న డాన్స్కే బ్యాంక్ ఐటీ కేంద్రం కూడా ఇన్ఫోసిస్ నిర్వహణలోకి రానుంది. ఈ కేంద్రంలో సుమారు 1,400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా గత మేలో అంతర్జాతీయ ఇంధన సంస్థ ‘బీపీ’ నుంచి 1.5 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ను దక్కించుకోవడం తెలిసిందే. 2020 సంవత్సరం చివరిలో జరిగిన డైమ్లర్ ఒప్పందం తర్వాత ఇదే అతిపెద్ద డీల్. ఇదీ చదవండి: అమెరికాలో నిరుద్యోగ భృతికి లక్షలాది దరఖాస్తులు -
విమానం ఎక్కకుండా ప్రపంచాన్ని చుట్టేశాడు
2013 అక్టోబర్ 10న డెన్మార్క్లోని ఇంటి నుంచి బయలుదేరాడు థోర్. 3,512 రోజుల తర్వాత 203 దేశాలు చూసి మే 23, 2023న మాల్దీవుల్లో యాత్ర ముగించాడు. విమానం ఎక్కకుండా ఇలా ప్రపంచాన్ని చుట్టినవాడు ఇతడే. ‘ఇన్ని దేశాలు తిరగడం ఎందుకు?’ అనంటే ‘అన్ని దేశాలు ఉన్నాయి కనుక’ అని జవాబు. జూన్ 13న మాల్దీవుల నుంచి ఇంటికి మరలుతున్నాడు థోర్. ‘తువాలు’, ‘టోంగా’, ‘సమోవా’, ‘పలావు’, ‘నౌరు’, ‘కిరిబటి’.... ఇవేంటని అనుకుంటున్నారా? దేశాలు. ఇవి మీరు విని ఉండొచ్చు. వినకపోయి ఉండొచ్చు. ఏమంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు 193. ‘కాని ఇంకా ఉన్నాయి. అవి తమను తాము దేశాలుగా చెప్పుకుంటాయి. ఐక్యరాజ్యసమితి ఇంకా గుర్తించకపోవచ్చు’ అంటాడు థోర్. అందువల్ల థోర్ చుట్టి వచ్చిన దేశాల సంఖ్య అక్షరాలా 203. వీటిలో యూరప్ నుంచి 37, ఆసియా నుంచి 20, సౌత్ అమెరికా నుంచి 12, ఆఫ్రికా నుంచి 54... ఇలా ప్రపంచ పటంలోని అన్ని దేశాలు అతను చుట్టి వచ్చాడు. ► మనుషుల్ని కలవడానికి... ‘స్నేహితుడు అని ఎవర్ని అనాలంటే అప్పటి దాకా పరిచయం కాని అపరిచితుణ్ణే’ అనే స్లోగన్తో థోర్ తన ప్రపంచ యాత్ర మొదలెట్టాడు. డెన్మార్క్కు చెందిన 44 ఏళ్ల ఈ వివాహితుడు కొంతకాలం మిలట్రీలో, ఆ తర్వాత షిప్పింగ్ లాజిస్టిక్స్లో పని చేశాడు. దేశాలు చూడటం పిచ్చి. కొత్త మనుషుల్ని కలవడం ఇష్టం. అందుకని ప్రపంచంలోని అన్ని దేశాలు చుట్టి రావాలనుకున్నాడు. అయితే డబ్బు పరిమితుల దృష్ట్యా, ఎటువంటి సవాలుకు వీలులేని విమానయానం ద్వారా కాకుండా రైళ్లు, ఓడలు, వాహనాల ద్వారా ప్రపంచం చుట్టాలనుకున్నాడు. దాదాపు పదేళ్ల పాటు ఇంటి ముఖం చూడకుండా తిరిగేశాడు. ► రోజుకు 20 డాలర్లు డెన్మార్క్కు చెందిన కొన్ని సంస్థల స్పాన్సర్షిప్తో యాత్ర మొదలెట్టాడు థోర్. ప్రయాణానికి, తిండికి, వీసా ఫీజులకు కలిపి రోజుకు కేవలం 20 డాలర్లు (1600 రూపాయలు) ఖర్చు చేస్తూ ఈ యాత్ర సాగించాలనుకున్నాడు. దొరికిన తిండి తినడం, ఫ్రీగా బస పొందడం... లాంటి పనుల ద్వారా ఇది సాధ్యమే అనిపించాడు. అతని యాత్రను బ్లాగ్లో, ఫేస్బుక్లో రాస్తూ వెళ్లడం వల్ల చదివిన పాఠకులు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ వెళ్లారు. దాంతో ఇన్ని రోజులు అతని విశ్వదర్శనం సాగింది. ‘ఒక్కో దేశంలో కేవలం 24 గంటలు మాత్రమే గడుపుతూ వెళ్లాను. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం ప్రయాణించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ దారిలో మనుషుల్ని కలవడమే ఇష్టపడ్డాను’ అంటాడు థోర్. అతను తన ప్రయాణంలో భాగంగా మన దేశానికి డిసెంబర్ 12, 2018న వచ్చాడు. ► ప్రతిదీ లెక్క థోర్ తన ప్రయాణంలో ప్రతిదీ రికార్డు చేశాడు. ఏ మోసం లేకుండా ఎక్కడికక్కడ టికెట్లు పెడుతూ వెళ్లాడు. తన మొత్తం ప్రయాణంలో 351 బస్సులు, 158 ట్రైన్లు, 43 టుక్టుక్లు (ఆటో), 37 కంటైనర్ షిప్లు, 33 పడవలు, 9 ట్రక్కులు, 3 సెయిల్బోట్లు, 2 క్రూయిజ్ షిప్లు ఉపయోగించాడు. మే 23న మాల్దీవుల్లో ఇతని యాత్ర ముగిసింది. అయితే ఇన్నాళ్లూ కుటుంబానికి దూరంగా ఉన్నాడా? లేదు. అతని భార్య అతణ్ణి వెతుక్కుంటూ వెళ్లి కలిసేది. మొత్తం ఇన్ని రోజుల్లో 27 చోట్ల 27 సార్లు కలిసిందామె. అన్నట్టు ఈ మొత్తం యాత్ర పేరు ‘ఒన్స్ అపాన్ ఏ సాగా’. -
‘మారాజు’లు.. ప్రపంచంలో ఇంకా రాచరికమున్న దేశాలివే..
ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు నేర్పించిన బ్రిటన్ దేశపు రాణి ఎలిజిబెత్–2 మరణం, ఛార్లెస్–3 పట్టాభిషేకం నేపథ్యంలో.. రాచరికానికి సంబంధించిన పలు ప్రశ్నలు సమాజంలో వస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల పార్లమెంట్లకు తల్లిలాంటిది బ్రిటన్ పార్లమెంట్. ప్రజాస్వామ్యానికి నిజమైన స్ఫూర్తిగా నిలుస్తున్న బ్రిటన్ ప్రజలకు రాచరికం పట్ల అంతులేని ఆకర్షణ ఉందని ఇటీవల ప్రస్ఫుటమయింది. మరణించిన రాణి ఎలిజబెత్ తర్వాత రాజుగా సింహాసనం ఎక్కిన ఛార్లెస్–3 కేవలం బ్రిటన్కే కాకుండా, మరో 14 దేశాలకూ రాజుగా (దేశాధినేతగా) ఉన్నారనే విషయం ఆశ్చర్యం కలిగించే అంశమే. ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని దేశాల్లోనూ రాచరికమే ఉంది. కొన్ని దేశాల్లో రాజే సర్వాధికారి. మరికొన్ని దేశాల్లో పాక్షిక అధికారాలను కలిగి ఉంటారు. బ్రిటన్ పాలించిన వలస దేశాలను కామన్వెల్త్ దేశాలుగా పిలుస్తారు. మొత్తం 56 కామన్వెల్త్ దేశాలు ఉన్నాయి. వీటిలో 14 దేశాలు బ్రిటన్ రాజు/రాణినే తమ దేశ రాజు/రాణిగా అంగీకరిస్తాయి. మిగిలిన దేశాల్లో 36 పూర్తి గణతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. మిగిలిన దేశాలకు సొంత రాచరికాలు ఉన్నాయి. బ్రిటన్ రాజునే తమ రాజుగా అంగీకరిస్తున్న 14 దేశాలు 1. కెనడా, 2. ఆస్ట్రేలియా, 3. న్యూజిలాండ్, 4. యాంటిగు అండ్ బాబోడ, 5. ది బహామస్, 6. బెలీజ్, 7. గ్రెనాడ, 8. జమైకా, 9. పాపువా న్యూ గీని, 10. సెయింట్ కిట్స్ అండ్ నెవస్, 11. సెయింట్ లూసియా, 12. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీస్, 13. సోలోమన్ ఐలండ్స్, 14. తువాలు మొత్తం 43 దేశాల్లో ఇప్పటికీ రాచరికమే ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లో ఇప్పటికీ రాచరికమే ఉంది. యూకేతో కలిపి మొత్తం 15 దేశాలకు రాజుగా బ్రిటన్ రాజు వ్యవహరిస్తున్నారు. రాచరిక వ్యవస్థ ఉన్న దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలూ ఉండటం గమనార్హం. బలమైన ఆర్థిక వ్యవస్థలుగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి నిలయాలుగా ఉన్న దేశాలూ ఉన్నాయి. యూకే, జపాన్, కెనడా, డెన్మార్క్, స్పెయిన్ తదితర దేశాలే ఇందుకు ఉదాహరణలు. వెనుకబడిన సమాజం ఆనవాళ్లకు రాచరిక వ్యవస్థ గుర్తుగా ఉందనే వాదన చాలా దేశాలకు వర్తించడంలేదని ఆయా దేశాలు వివిధ రంగాల్లో పురోగమిస్తున్న తీరు చెబుతోంది. రాచరిక వ్యవస్థ 3 రకాలు ఆయా దేశాల సంస్కృతి, భాషను బట్టి రాచరికంలో దేశాధినేతను రాజు, రాణి, అమీర్, సుల్తాన్ వంటి హోదాలతో వ్యవహరిస్తున్నారు. రాచరిక స్వభావం, వాటికున్న అధికారాలను బట్టి 3 రకాలుగా విభజించవచ్చు. రాజ్యాంగపరమైన రాచరికం కేవలం రాజ్యాంగ విధులు (సెరిమోనియల్ డ్యూటీస్) నిర్వర్తించడానికి మాత్రమే రాచరికం పరిమితమవుతుంది. రాజకీయ అధికారాలు ఏమీ ఉండవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే నిజమైన అధికారాన్ని అనుభవిస్తుంది. ఇలాంటి రాచరికం బ్రిటన్ (యూకే), జపాన్, డెన్మార్క్ దేశాల్లో ఉంది. పూర్తి రాచరికం దేశంలో రాజుదే పూర్తి అధికారం. చట్టాలను రూపొందించే, సవరించే, తిరస్కరించే అధికారం రాజు/రాణికి ఉంటుంది. విదేశీ వ్యవహారాలను కూడా రాజే పర్యవేక్షిస్తారు. రాజకీయ నేతలను నామినేట్ చేస్తారు. సౌదీ అరేబియా, వాటికన్ సిటీ, యస్వటినీ తదితర దేశాలు ఈ కోవలోకి వస్తాయి. మిశ్రమ రాచరికం కొన్ని అంశాల్లో సంపూర్ణ అధికారాలను వినియోగించుకుంటూనే, కొన్ని అంశాల్లో ప్రజా ప్రభుత్వాలు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఇలాంటి జాబితాలో జోర్డాన్, మొరాకో, లిక్టన్స్టైన్ తదితర దేశాలు ఉన్నాయి. - (ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) ఇది కూడా చదవండి: అంగరంగ వైభవంగా..చార్లెస్ పట్టాభిషేకం -
Davis Cup 2023: తొలి సింగిల్స్లో యూకీ బాంబ్రీ ఓటమి
హిలెరాడ్ (డెన్మార్క్): భారత్తో జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్స్ తొలి రౌండ్ పోటీలో డెన్మార్క్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హోల్గర్ రూన్ 6–2, 6–2తో యూకీ బాంబ్రీని ఓడించాడు. కేవలం 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో 19 ఏళ్ల రూన్ తన ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఏటీపీ ప్రొఫెషనల్ సర్క్యూట్లో సింగిల్స్ మ్యాచ్లు ఆడటం మానేసిన యూకీ ఈ మ్యాచ్లో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసిన యూకీ ఒక్కసారి కూడా ప్రత్యర్థి సర్వీస్లో బ్రేక్ పాయింట్ అవకాశం సంపాదించలేకపోయాడు. -
FIFA WC: ఆస్ట్రేలియా 2006 తర్వాత ఇదే తొలిసారి!
FIFA world Cup Qatar 2022: గత ప్రపంచకప్నకు అర్హత పొందలేకపోయిన అమెరికా జట్టు ఈసారి మాత్రం గ్రూప్ దశను దాటి నాకౌట్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఫిఫా వరల్డ్కప్-2022 టోర్నీలో భాగంగా ఇరాన్తో జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్లో అమెరికా 1–0తో గెలిచింది. ఆట 38వ నిమిషంలో క్రిస్టియన్ పులిసిక్ గోల్తో అమెరికా ఖాతా తెరిచింది. 11వసారి ప్రపంచకప్లో ఆడుతున్న అమెరికా ఆరోసారి గ్రూప్ దశను అధిగమించింది. ప్రి క్వార్టర్స్లో నెదర్లాండ్స్తో అమెరికా తలపడుతుంది. ఆస్ట్రేలియా 2006 తర్వాత... గత మూడు ప్రపంచకప్లలో గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టిన ఆస్ట్రేలియా ఈసారి నాకౌట్ బెర్త్ను సంపాదించింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 1–0 గోల్తో డెన్మార్క్ జట్టును ఓడించింది. ఆట 60వ నిమిషంలో మాథ్యూ లెకీ ఆసీస్ జట్టుకు గోల్ అందించాడు. ఫిఫా వరల్డ్కప్-2022లో ఆస్ట్రేలియాకిది రెండో విజయం. దాంతో 2006 తర్వాత ఆస్ట్రేలియా ఈ మెగా ఈవెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. రెండు విజయాలతో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచినా మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఫ్రాన్స్ జట్టు గ్రూప్ ‘డి’ టాపర్గా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియాకు రెండో స్థానం ఖరారైంది. చదవండి: Sanju Samson: పంత్ సెంచరీ చేసి ఎన్నాళ్లైందని! అతడికి అండగా ఉంటాం.. ఎవరిని ఆడించాలో తెలుసు: వీవీఎస్ లక్ష్మణ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup Qatar 2022: ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్
దోహా: వరుసగా రెండో విజయం నమోదు చేసిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్లో నాకౌట్ బెర్త్ను (ప్రిక్వార్టర్ ఫైనల్) ఖరారు చేసుకుంది. డెన్మార్క్ జట్టుతో శనివారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో ఫ్రాన్స్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. స్టార్ ప్లేయర్ కిలియాన్ ఎంబాపె (61వ, 86వ ని.లో) రెండు గోల్స్ సాధించి ఫ్రాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. డెన్మార్క్ తరఫున క్రిస్టెన్సన్ (68వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. థియో హెర్నాండెజ్ అందించిన పాస్ను గోల్పోస్ట్లోనికి పంపించి తొలి గోల్ సాధించిన ఎంబాపె... గ్రీజ్మన్ క్రాస్ షాట్ను గాల్లోకి ఎగిరి లక్ష్యానికి చేర్చి రెండో గోల్ చేశాడు. ప్రపంచకప్లో నేడు జపాన్ X కోస్టారికా మధ్యాహ్నం గం. 3:30 నుంచి బెల్జియం X మొరాకో సాయంత్రం గం. 6:30 నుంచి క్రొయేషియా X కెనడా రాత్రి గం. 9:30 నుంచి జర్మనీ X స్పెయిన్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్లో ప్రత్యక్ష ప్రసారం. -
FIFA WC: డెన్మార్క్కు చెక్ పెట్టిన ట్యునీషియా.. మెక్సికో- పోలాండ్ మ్యాచ్ కూడా
FIFA World Cup 2022- దోహా: పట్టుదలతో ఆడితే ప్రపంచకప్లాంటి గొప్ప ఈవెంట్లోనూ తమకంటే ఎంతో మెరుగైన జట్టుపై మంచి ఫలితం సాధించవచ్చని ట్యునీషియా జట్టు నిరూపించింది. ఫుట్బాల్ ప్రపంచకప్లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో ప్రపంచ 30వ ర్యాంకర్ ట్యునీషియా 0–0తో ప్రపంచ 10వ ర్యాంకర్ డెన్మార్క్జట్టును నిలువరించింది. రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. ట్యునీషియా గోల్పోస్ట్ లక్ష్యంగా డెన్మార్క్ జట్టు ఐదుసార్లు షాట్లు కొట్టినా ఫలితం లేకపోయింది. డెన్మార్క్ ఆటగాళ్లు బంతిని తమ ఆధీనంలో 62 శాతం ఉంచుకున్నా ట్యునీషియా రక్షణ శ్రేణిని ఛేదించి గోల్ చేయలేకపోయారు. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. మరో ‘డ్రా’ దోహా: ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో మరో ‘డ్రా’ నమోదైంది. పోలాండ్, మెక్సికో జట్ల మధ్య మంగళవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. మెక్సికో జట్టు పోలాండ్ గోల్పోస్ట్ లక్ష్యంగా నాలుగు సార్లు షాట్లు సంధించగా ఒక్కటీ లక్ష్యానికి చేరలేదు. పోలాండ్ స్టార్ ప్లేయర్ లెవన్డౌస్కీను మెక్సికో జట్టు వ్యూహత్మకంగా కట్టడి చేసింది. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. వేల్స్ను గట్టెక్కించిన బేల్ 64 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీకి అర్హత సాధించిన వేల్స్ జట్టు తొలి మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. అమెరికాతో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్ను వేల్స్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట 82వ నిమిషంలో వేల్స్ జట్టుకు లభించిన పెనాల్టీని గ్యారెత్ బేల్ గోల్గా మలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. 36వ నిమిషంలో టిమోతి చేసిన గోల్తో అమెరికా ఖాతా తెరిచింది. మ్యాచ్ ‘డ్రా’ కావడంతో రెండు జట్లుకు ఒక్కో పాయింట్ దక్కింది. చదవండి: FIFA World Cup: ప్రపంచకప్లో సంచలనాల జాబితా.. ఇప్పుడు సౌదీ.. అప్పట్లో -
‘ఫ్రెంచ్ కిక్’ అదిరేనా!
తొమ్మిది దశాబ్దాల ఫుట్బాల్ ప్రపంచకప్ చరిత్రలో డిఫెండింగ్ చాంపియన్ జట్టు టైటిల్ నిలబెట్టుకొని 60 ఏళ్లు గడిచాయి. చివరిసారి బ్రెజిల్ జట్టు ఈ ఘనత సాధించింది. బ్రెజిల్ వరుసగా 1958, 1962 ప్రపంచకప్లలో చాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత మరో విజేత జట్టు తదుపరి ప్రపంచకప్లో టైటిల్ సాధించలేకపోయింది. 1994 తర్వాత ప్రపంచకప్ చాంపియన్గా నిలిచిన యూరోప్ జట్టు తదుపరి వరల్డ్కప్లో గ్రూప్ దశ దాటడంలో విఫలమవుతోంది. చరిత్రపరంగా చూస్తే ప్రస్తుత విజేత ఫ్రాన్స్ జట్టుకు ప్రతికూలాంశాలు ఉన్నాయనుకోవాలి. కానీ ఎంతోమంది స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతున్న ఫ్రాన్స్ జట్టు ఖతర్లో చరిత్రను తిరగరాస్తుందా? 60 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలుస్తుందా వేచి చూడాలి. ఫ్రాన్స్ బలగాన్ని చూస్తే మాత్రం గ్రూప్ ‘డి’లో ఉన్న మిగతా జట్లు డెన్మార్క్, ఆస్ట్రేలియా, ట్యునీషియాలను దాటుకొని నాకౌట్ దశకు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరో అవకాశం ఉండని నాకౌట్ దశ నుంచి ఆ జట్టుకు అసలు సవాళ్లు ఎదురవుతాయి. ఫ్రాన్స్ ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: విజేత (1998, 2018). ‘ఫిఫా’ ర్యాంక్: 4. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘డి’ విన్నర్. ప్రపంచకప్లో 16వసారి బరిలోకి దిగుతున్న ఫ్రాన్స్ జట్టు క్వాలిఫయింగ్ పోటీల్లో అజేయంగా నిలిచింది. యూరో టోర్నీలో వైఫల్యం తర్వాత గత ఏడాది నేషన్స్ లీగ్ టైటిల్ను సాధించి ‘ది బ్లూస్’ జట్టు ఫామ్లోకి వచ్చింది. వ్యక్తిగత వివాదాల్లో ఇరుక్కొని 2018 ప్రపంచకప్నకు దూరమైన 34 ఏళ్ల స్టార్ స్ట్రయికర్ కరీమ్ బెంజెమా ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ ఆడనుండటం శుభసూచకం. ఈ ఏడాది యూరోప్ ప్రొఫెషనల్ లీగ్స్ చాంపియన్స్ లీగ్, లా లీగాలో రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టుకు టైటిల్ దక్కడంలో కరీమ్ బెంజెమా కీలకపాత్ర పోషించాడు. కరీమ్ బెంజెమాతోపాటు ఇతర స్టార్ ఆటగాళ్లు కిలియాన్ ఎంబాపె, గ్రీజ్మన్, థియో హెర్నాండెజ్ రాణిస్తే మాత్రం ఫ్రాన్స్ జట్టు ఈసారీ ప్రపంచకప్ టైటిల్ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గ్రూప్ దశలో ఒక్క డెన్మార్క్ తప్ప ఇతర జట్ల నుంచి ఫ్రాన్స్కు గట్టిపోటీ లభించే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. గ్రూప్ దశ దాటి నాకౌట్ మ్యాచ్లకు అర్హత పొందాకే ఫ్రాన్స్ జట్టుకు అసలు సవాళ్లు ఎదురవుతాయి. డెన్మార్క్ ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్స్ (1998). ‘ఫిఫా’ ర్యాంక్: 10. అర్హత ఎలా: యూరోపియన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎఫ్’ విన్నర్. ఆరోసారి ప్రపంచకప్లో పాల్గొంటున్న డెన్మార్క్ క్వాలిఫయింగ్లో అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఆడిన పది మ్యాచ్ల్లో తొమ్మిదింట గెలిచి, కేవలం ఒక మ్యాచ్లో ఓడింది. 30 గోల్స్ సాధించి, కేవలం మూడు గోల్స్ ప్రత్యర్థి జట్లకు ఇచ్చింది. స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్పైనే అందరి దృష్టి ఉంది. ఒకరిద్దరిపైనే ఆధారపడకుండా సమష్టిగా రాణించడం డెన్మార్క్ జట్టు ప్రత్యేకత. తమ గ్రూప్లో ఫ్రాన్స్ జట్టుతో మ్యాచ్ను మినహాయిస్తే మిగతా రెండు మ్యాచ్ల్లో డెన్మార్క్ జట్టుకు విజయాలు దక్కే అవకాశాలున్నాయి. తాము ఆడిన గత నాలుగు ప్రపంచకప్లలో డెన్మార్క్ గ్రూప్ దశను దాటి నాకౌట్ రౌండ్ మ్యాచ్లకు అర్హత సాధించింది. ఈసారి ఆ జట్టు ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగుస్తుందో ముందుకు సాగుతుందో చూడాలి. ఆస్ట్రేలియా ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (2006). ‘ఫిఫా’ ర్యాంక్: 38. అర్హత ఎలా: ఆసియా–దక్షిణ అమెరికా మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ విజేత. ఆరోసారి ప్రపంచకప్లో ఆడుతున్న ఆస్ట్రేలియా నాకౌట్ దశకు చేరాలంటే విశేషంగా ఆడాల్సి ఉంటుంది. ట్యునీషియాపై ఆ జట్టుకు గెలిచే అవకాశాలున్నా... ఫ్రాన్స్, డెన్మార్క్ జట్ల మ్యాచ్ల ఫలితాలే ఆ జట్టుకు కీలకం కానున్నాయి. యూరోపియన్ లీగ్స్లో పలు మేటి జట్లకు ఆడిన స్ట్రయికర్ అజ్దిన్ రుస్టిక్పై ఆసీస్ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. గత రెండు ప్రపంచకప్లలో ఆసీస్ ఆరు మ్యాచ్లు ఆడి ఐదింటిలో ఓడి, ఒక మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంది. ఈసారి తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్తో ఆడనున్న ఆస్ట్రేలియా కనీసం ‘డ్రా’తో గట్టెక్కినా అది విజయంతో సమానమే. ట్యునీషియా ప్రపంచకప్లో ఉత్తమ ప్రదర్శన: గ్రూప్ దశ (2018). ‘ఫిఫా’ ర్యాంక్: 30. అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్లో మూడో రౌండ్ విన్నర్. ఆరోసారి ప్రపంచకప్ ఆడుతున్న ట్యునీషియా జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. ఎక్కువగా రక్షణాత్మకంగా ఆడే అలవాటున్న ట్యునీషియా ఈ ఏడాది 12 మ్యాచ్లు ఆడి కేవలం మూడు గోల్స్ మాత్రమే తమ ప్రత్యర్థి జట్లకు కోల్పోయింది. వాబి ఖాజ్రి, యూసెఫ్ మసాక్ని, నయీమ్ జట్టులోని కీలక ఆటగాళ్లు. పటిష్ట జట్లయిన ఫ్రాన్స్, డెన్మార్క్లతో జరిగే మ్యాచ్లే ఈ మెగా ఈవెంట్లో ట్యునీషియా ప్రస్థానాన్ని నిర్ణయిస్తాయి. –సాక్షి క్రీడా విభాగం -
ఆర్టిఫీయల్ ఇంటెలిజన్స్తో నడుస్తున్న రాజకీయ పార్టీ..ఎక్కడో తెలుసా?
రాజకీయ పార్టీ అన్నాక దానికో అధినేత ఉండాలి, కార్యకర్తలూ ఉండాలి. పార్టీకో సిద్ధాంతం, మేనిఫెస్టో వంటివి ఉండాలి. ఓటర్లను ఆకర్షించడం ఆషామాషీ పని కాదు. కాకలు తీరిన నేతలే ఒక్కోసారి బోల్తా పడతారు. అలాంటి అధినేతతో పనిలేని ఒక వింత రాజకీయ పార్టీ ఇటీవల డెన్మార్క్లో ప్రారంభమైంది. కృత్రిమ మేధ సూచనలతో పనిచేసే ఈ రాజకీయ పార్టీకి ‘డేనిష్ సింథటిక్ పార్టీ’ అని నామకరణం చేశారు. ‘మైండ్ ఫ్యూచర్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ‘కంప్యూటర్ లార్స్’ ద్వారా సృష్టించిన కృత్రిమ మేధతో ఈ ఏడాది మే నెలలో కొత్త రాజకీయ పార్టీని– అదే డేనిష్ సింథటిక్ పార్టీని ప్రకటించింది. ఈ ఏడాది జరగనున్న డెన్మార్క్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కృత్రిమ పార్టీ పోటీకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. డెన్మార్క్ ఎన్నికల్లో 1970ల నాటి నుంచి పోటీ చేస్తున్నా, ఇంతవరకు ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన చిల్లర రాజకీయ పార్టీల సిద్ధాంతాలన్నింటినీ వడగట్టి, ప్రోగ్రామ్ చేయడం ద్వారా ‘మైండ్ ఫ్యూచర్ ఫౌండేషన్’ ఈ కొత్త కృత్రిమ పార్టీకి రూపునిచ్చింది. ఎన్నికల్లో ఏనాడూ ఓటు వేయని 20 శాతం డెన్మార్క్ ఓటర్లకు ప్రత్యామ్నాయంగా ఉద్భవించడమే కాకుండా, పార్లమెంటులో కృత్రిమ మేధకు ప్రాతినిధ్యాన్ని దక్కించుకోవాలని ఈ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. -
ఉచిత విద్యను 'రేవడీ' అనడం బాధాకరం.. ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలి
సాక్షి,న్యూఢిల్లీ: ఉచిత విద్యపై మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. డెన్మార్క్లో ఫ్రీ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఓ పాత నివేదికను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. విద్యార్థులందరికీ ఉచిత విద్య అందించినందువల్లే ఆ దేశం సుసంపన్నమైందని పేర్కొన్నారు. అలాంటిది మనదేశంలో మాత్రం ఉచిత విద్యను 'రేవడీ' సంస్కృతి అనడం తను బాధిస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. భారత్ను సంపన్న దేశంగా అభివృద్ధి చేయాలంటే దేశంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను పైసా ఖర్చు లేకుండా అందించాలని సూచించారు. డెన్మార్క్ ప్రభుత్వం యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు నెలకు 1000 డాలర్ల వరకు సాయంగా అందిస్తున్నట్లు కేజ్రీవాల్ వీడియో రూపంలో షేర్ చేసిన నివేదికలో ఉంది. వాళ్లకు చదువుకుంటూనే పని చేసుకుని సంపాదించుకునే వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం. పలు ఇతర దేశాల్లో మాత్రం విద్య కోసమే రూ.లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. ये वीडियो देखिए… अमीर देशों में शिक्षा फ्री है। मुझे बहुत दुःख होता है कि हमारे देश में फ्री शिक्षा को ये नेता फ्री की रेवड़ी कहते हैं ये देश अमीर इसलिए बने क्योंकि ये फ्री शिक्षा देते हैं। अगर हर भारतीय को अमीर बनाना है तो भारत के हर बच्चे को अच्छी शिक्षा फ्री देनी ही होगी। pic.twitter.com/iAincN3phy — Arvind Kejriwal (@ArvindKejriwal) October 25, 2022 ఇటీవల మధ్యప్రదేశ్లో గృహప్రవేశ కార్యక్రమానికి వర్చువల్గా హాజరైన ప్రధాని మోదీ.. దేశానికి రేవడీ సంస్కృతి(ఉచితాలు) నుంచి విముక్తి కల్పించాలని వ్యాఖ్యానించారు. ఎంతో మంది పన్నుచెల్లింపుదారులు తనకు లేఖలు రాసి బాధపడ్డారని పేర్కొన్నారు. ఈ విషయంపై కేజ్రీవాల్ ఇప్పిటికే ప్రధానిపై విమర్శలు గుప్పించగా.. మంగళవారం మరోసారి డెన్మార్క్ ఉచిత విద్యా విధానాన్ని చూపి మోదీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. చదవండి: షిండేకు పదవీ గండం.. ఏ క్షణమైనా మహారాష్ట్రకు కొత్త సీఎం? -
అలా అంటుంటే చాలా బాధపడ్డాను: అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొంతమంది రాజకీయ నాయకులు ఉచిత విద్యావిధానం విషయంలో చేసిన వ్యాఖ్యలకు బాధపడ్డానన్నారు. తాను ప్రతి ఒక్క భారతీయుడు చదువుకునేలా... ఉచితంగా మంచి విద్యనభ్యసించాలని ఆకాంక్షించానన్నారు. కానీ భారత్లో ఉన్న రాజకీయ నాయకులు వీటిని ఉచిత రేవడి లేదా ఉచిత స్కీంల ఎర వంటివిగా అభివర్ణించారని చెప్పారు. డెన్మార్క్ వంటి దేశాలు ఉచిత విద్యా విధానంతో ధనిక దేశాలుగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఈ మేరకు కేజ్రీవాల్ 2017లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ...."డెన్మార్క్ తమ దేశంలోని విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉండనట్లయితే వారి నెలవారి ఖర్చుల నిమిత్తం దాదాపు రూ. 82 వేలు అందిస్తున్నట్లు పేర్కొంది. అలాగే వారి తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈ విధానంతో విద్యార్థులకు మంచి విద్యను పొందే అవకాశాన్ని మాత్రం ఇస్తున్నాయి అని" అన్నారు. తాను కూడా ఆ ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకువచ్చానన్నారు. ప్రతి భారతీయుడు ధనవంతుడు కావాలంటే ప్రతి ఒక్క చిన్నారికి ఉచితంగా నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలని అన్నారు. వాస్తవానికి కేజ్రీవాల్ మోదీ పేరు ప్రస్తావించకుండానే ఆయన్ను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీది ఉచితంగా ఇస్తానని చెప్పకూడదని, రాజకీయ సంస్కృతిలో ఈ ఉచిత రేవడిలు ఒక ఎత్తుగడ వంటివని విమర్శించిన సంగతి తెలిసిందే. (చదవండి: కొరడాతో కొట్టించుకున్న చత్తీస్గఢ్ సీఎం.. ఎందుకంటే?) -
గంటకు 160 కి.మీ వేగంతో ప్రచండ తుపాను గాలులు.. సరదాగా ఎదురెళ్తారా?
తుపానుల సమయంలో వీచే పెను గాలుల హోరు ఏ స్థాయిలో ఉంటుందో మనం అప్పుడప్పుడూ టీవీల్లో చూసే ఉంటాం.. కానీ గంటకు సుమారు 160 కి.మీ. వేగంతో వీచే ప్రచండ గాలుల తీవ్రతను ఎప్పుడైనా అనుభూతి చెందారా? డెన్మార్క్లోని యూనివర్స్ సైన్స్ పార్క్ ఔత్సాహికులకు ఈ వెరైటీ అవకాశాన్ని కల్పిస్తోంది! అది కూడా పూర్తి సురక్షితమైన వాతావరణంలోనే!! ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? కృత్రిమంగా ప్రచండ గాలులను సృష్టించడం ద్వారానేలెండి. ఇందుకోసం సైన్స్ పార్క్లో తాజాగా రెండు సిములేటర్లతో కూడిన గ్లాస్ చాంబర్ను నిర్వాహకులు ఏర్పాటు చేసి కృత్రిమంగా పెను గాలులను సృష్టిస్తున్నారు. బీట్ ద స్టార్మ్గా పిలిచే ఈ చాంబర్లోకి ఐదేళ్ల చిన్నారులు మొదలు 80 ఏళ్ల వృద్ధుల వరకు వెళ్లి భారీ గాలులను అనుభూతి చెందొచ్చు. అయితే పిల్లల కోసం 35 కి.మీ. వేగంతో వీచే సాధారణ గాలులను సిములేటర్ల ద్వారా సృష్టిస్తుండగా పెద్దల కోసం 160 కి.మీ. వేగం వరకు కేటగిరీ–2 హరికేన్ గాలులను సృష్టిస్తున్నారు. గాలులు ఇక చాలనుకుంటే ఔత్సాహికులు గ్లాస్ చాంబర్లో ఒకవైపు నుంచి మరోవైపునకు గాలికి ఎదురెళ్లి అక్కడున్న బటన్ను నొక్కాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టమాట కెచప్ ప్రియులకు చేదువార్త!
టమాట కెచప్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. బయట రెస్టారెంట్లలో, హోటళ్లలో ప్రధానమైనది ఈ కెచప్. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాక అందరూ ఈ టమాట సాస్లకు అలవాటు పడిపోయారు. ఐతే ఇక ఆ టమటా కెచప్ తయారు చేయడం కష్టమైపోతుందంటున్నారు వాతావరణ పరిశోధకులు. అందుకు వాతావరణ మార్పులే కారణమంటున్నారు. ఈ అధిక ఉష్టోగ్రతలు కారణంగా టమాట పంట ఉండదేమోనని భయపడుతున్నారు కూడా. ఇటీవల అధిక ఉష్ణోగ్రతలు కారణంగా కూరగాయాల ధరలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అందులోనూ టమాట ధర ఇటీవల కనివినీ ఎరుగని రీతిలో ఆకాశన్నంటింది. ఇందంతా ఒకత్తెయితే ఇక రాను రాను ఈ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే ఇక టమాట ఉత్పత్తి తగిపోతుందని వాతావరణ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ మేరకు డెన్మార్క్లోని ఆర్హస్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం పెరుగుతున్న ఉష్ణోగ్రత టమాటల ఉత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో ఒక గణిత నమూనాను రూపొందించింది కూడా. ఇప్పటివరకు ఇటలీ, చైనా మరియు కాలిఫోర్నియా టమాట ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయని పరిశోధకులు బృందం పేర్కొంది. ఇవి ప్రపంచ ఉత్పత్తిలో ఈ దేశాలే అధికంగా సరఫరా చేస్తున్నాయి. ఐతే ఇప్పుడూ ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రమాదంలో ఉన్నాయని అధ్యయనం తెలిపింది. గణిత నమూనా ప్రకారం 2050 నుంచి 2100 మధ్యకాలంలో టమాట పంట సగానికి తగ్గిపోతుందని తెలిపింది. 2050 నాటికి టమాట ఉత్పత్తి ఆరు శాతం క్షీణిస్తుందని పరిశోధన బృందం పేర్కొంది. అంతేకాదు 2040 నుంచి 2069 మధ్య టమాట ఉత్పత్తి ప్రాంతాలలో సుమారు 2.6 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత ఉంటుందని తదుపరి 30 సంవత్సరాలలో 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదల ఉంటుందని వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రత పెరుగుదలను 1980 నుంచి 2009 మధ్య కాలంలో ఉష్ణోగ్రతల పెరుగుదలను బట్టి పరిశోధకులు అంచనావేశారు. పదకొండు అతి పెద్ద సాగు పంటల్లో ఒకటైన ఈ టమాట పంట ప్రస్తుతం 14 మిలియన్ల టన్నుల నుంచి 7 మిలియన్ల టన్నులకు పడిపోతోంది. గతేడాది కూడా మార్చి నుంచి ఏప్రిల్ నెలల్లో పాకిస్తాన్, భారత్ వంటి దేశాల్లో టమాట పంట దారుణంగా పడిపోయింది. ఇలా టమటాల ఉత్పత్తి దారుణంగా పడిపోతే టమాట కెచప్, టమాట పేస్ట్ వంటివి ఇక ఉండవేమో అంటున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: మంటల్లో వేసినా కాలిపోని పుస్తకం...వేలంలో ఎంత పలికిందంటే..?) -
భారత్లో అవకాశాలు అపారం
కోపెన్హగెన్/పారిస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్ పర్యటన బుధవారం మూడోరోజుకు చేరుకుంది. డెన్మార్క్ రాజధాని కోపెన్హగెన్లో నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్ల్యాండ్ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్–ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. భారత్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని నార్డిక్ దేశాల పెట్టుబడిదారులను కోరారు. భారత కంపెనీలతో జట్టుకట్టాలన్నారు. ప్రధానంగా టెలికాం, డిజిటల్ రంగాల్లో అద్భుత అవకాశాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ తొలుత నార్వే ప్రధాని జోనాస్ గాహ్ర్స్టోర్తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తొలిభేటీ ఇదే కావడం విశేషం. బ్లూ ఎకానమీ, క్లీన్ ఎనర్జీ, స్పేస్ హెల్త్కేర్ తదితర కీలక అంశాలపై జోనాస్తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు మోదీ ట్వీట్ చేశారు. భారత్ ఇటీవల ప్రకటించిన ఆర్కిటిక్ పాలసీలో నార్వే ఒక మూలస్తంభం అని కొనియాడారు. స్వీడన్ ప్రధానమంత్రి మాగ్డలినా ఆండర్సన్, ఐస్ల్యాండ్ ప్రధానమంత్రి కాట్రిన్ జాకబ్స్డాటిర్, ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్తోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాలుగు దేశాల ప్రధానులతో సంతృప్తికరమైన చర్చలు జరిగినట్లు మోదీ వెల్లడించారు. రెండో ఇండియా–నార్డిక్ సదస్సు కోపెన్హగెన్లో బుధవారం నిర్వహించిన రెండో ఇండియా–నార్డిక్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఫిన్లాండ్, ఐస్ల్యాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్ ప్రధానమంత్రులు పాల్గొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, పరిణామాలు, ప్రపంచంపై దాని ప్రతికూల ప్రభావాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఉక్రెయిన్లో కొనసాగతున్న సంక్షోభం, సామాన్య ప్రజల అగచాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పౌరులు క్షేమంగా బయటకు వెళ్లేందుకు, సురక్షిత ప్రాంతాలకు చేరుకొనేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్, రష్యాను కోరారు. ప్రపంచంలో చాలాదేశాలు ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం నడుచుకోవడం లేదని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం లేదని ప్రధానమంత్రులు ఆక్షేపించారు. ఉక్రెయిన్పై చట్టవిరుద్ధంగా రష్యా సేనలు సాగిస్తున్న దాడులను నిరసిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటనలో వెల్లడించారు. నిబంధనల ఆధారిత ఇంటర్నేషనల్ ఆర్డర్కు తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సంస్కరణలు చేపట్టాలని కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లోనూ సంస్కరణలు అవసరమన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని, అందుకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని నార్డిక్ దేశాల అధినేతలు ఉద్ఘాటించారు. పారిస్లో మాక్రాన్తో భేటీ ప్రధాని బుధవారం సాయంత్రం ఫ్రాన్స్ చేరుకున్నారు. పారిస్లో ల్యాండయ్యానంటూ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకున్నారు. -
రండి.. భారత్లో పెట్టుబడులు పెట్టండి!
కోపెన్హెగెన్: భారత మౌలిక సదుపాయాల కల్పన రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ డెన్మార్క్ కంపెనీలు, పెన్షన్ ఫండ్స్కు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. డెన్మార్క్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సెన్తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్లో ఇప్పటికే 200కు పైగా డెన్మార్క్ కంపెనీలు పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యాపార సులభతర నిర్వహణ చర్యలతో ప్రయోజనం పొందుతున్నట్టు వివరించారు. ‘‘డెన్మార్క్ కంపెనీలు, డెన్మార్క్ పెన్షన్ ఫండ్స్కు భారత మౌలికరంగంతోపాటు పర్యావరణ అనుకూల (గ్రీన్) పరిశ్రమల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి’’ అని ప్రకటించారు. అంతకుముందు ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తృతిపై చర్చలు నిర్వహించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తృతి చేసుకోవాలన్న అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదలైంది. రెన్యువబుల్ ఎనర్జీ, టెర్మినళ్లు, పోర్టుల ఆధునికీకరణ, విస్తరణ, ఆహార శుద్ధి, ఇంజనీరింగ్ రంగాల్లో డెన్మార్క్ పెట్టుబడులకు ఇరువురు నేతలు పిలుపునిచ్చినట్టు ఈ ప్రకటన తెలియజేసింది. చదవండి👉‘డిజిటల్ ఇండియా ఇన్సైడ్’ నినాదం మార్మోగాలి! -
డెన్మార్క్ పీఎంతో మోదీ చర్చలు
కోపెన్హాగన్: డెన్మార్క్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సన్తో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సమావేశమై పలు విషయాలను చర్చించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేయడం సహా అనేక అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. మోదీకి డెన్మార్క్లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని ఫ్రెడెరిక్సన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలికారు. తన అధికార నివాసానికి తోడ్కొని వెళ్లి, భారత పర్యటనలో ఆయన తనకిచ్చిన పెయింటింగ్ను చూపించారు. మోదీని మంచి స్నేహితుడిగా అభివర్ణించారు. డెనార్క్లో పర్యటించిడం మోదీకి ఇదే తొలిసారి. బుధవారం కూడా ఆయన డెన్మార్క్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. డెన్మార్క్ రాణి మార్గరెథే2తో సమావేశమవుతారు. అక్కడి భారతీయులతో కలిసి ఇండో డెన్మార్క్ రౌండ్టేబుల్ వ్యాపార సమావేశంలో పాల్గొంటారు. డెన్మార్క్లో 60కి పైగా భారత కంపెనీలున్నాయి. 16వేల దాకా ప్రవాస భారతీయులున్నారు. ఇండో నార్డిక్ సమావేశం రెండో ఇండియా నార్డిక్ సమావేశంలో మోదీ పాల్గొననున్నారు. నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే ప్రధానులు ఈ సమావేశానికి హాజరవుతారు. 2018లో జరిగిన తొలి ఇండో నార్డిక్ సదస్సు అనంతరం పురోగతిని సమీక్షిస్తారు. ఆర్థిక రికవరీ, శీతోష్ణస్థితి మార్పు, టెక్నాలజీ, పునర్వినియోగ ఇంధన వనరులు, అంతర్జాతీయ భద్రత, ఆర్కిటిక్ ప్రాంతంలో ఇండో నార్డిక్ సహకారం తదితరాలపై సదస్సు దృష్టి పెడుతుందని మోదీ చెప్పారు. నార్డిక్ ప్రధానులతో మోదీ విడిగా కూడా చర్చిస్తారు. నార్డిక్ దేశాలు, భారత్ మధ్య 2020–21లో 500 కోట్ల డాలర్లకు పైగా వాణిజ్యం జరిగింది. A special start to a special visit. PM @narendramodi was welcomed by PM Frederiksen at Copenhagen. @Statsmin pic.twitter.com/iRnJt6J8k3— PMO India (@PMOIndia) May 3, 2022 యుద్ధం తక్షణం ఆగాలి: మోదీ రష్యా, ఉక్రెయిన్ తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని మోదీ పిలుపునిచ్చారు. వెంటనే చర్చలతో సంక్షోభానికి తెర దించాలన్నారు. రష్యాపై ప్రభావం చూపగల భారత్ యుద్ధాన్ని ఆపేందుకు డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్సన్ ఆశాభావం వెలిబుచ్చారు. భూమికి భారత్ హాని చేయదు! భారత్ పర్యావరణ విధ్వంసకారి కాదని మోదీ అన్నారు. భూ పరిరక్షణ యత్నాల్లో ముందంజలో ఉంటుందని చెప్పారు. భారత్లో పునర్వినియోగ ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను, కాప్ 26 సదస్సుల్లో ఇచ్చిన వాగ్దానాలను వివరించారు. ‘‘2070 నాటికి కర్బన ఉద్గారరహిత దేశంగా రూపొందేందుకు ప్రయత్నిస్తున్నాం. 2030 నాటికి దేశ ఇంధనావసరాల్లో 40 శాతం పునర్వినియోగ ఇంధన వనరుల ద్వారా తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని వివరించారు. ప్రతి ప్రవాస భారతీయుడూ కనీసం ఐదుగురు విదేశీ స్నేహితులు భారత్ను సందర్శించేలా ప్రోత్సహించాలని సూచించారు. అప్పుడు దేశీయ టూరిజానికి పునర్వైభవం వస్తుందన్నారు. వైవిధ్యమే భారత బలం భారతీయ సమాజానికి సమ్మిళిత, సాంస్కృతిక వైవిధ్యమే బలాన్నిస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ శక్తితోనే భారతీయులు ప్రతి క్షణం జీవిస్తారని, ఈ విలువలే భారతీయుల్లో వేలాది సంవత్సరాలుగా పెంపొందాయని ఆయన చెప్పారు. డెన్మార్క్లోని ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతీయులంతా దేశరక్షణలో భాగస్వాములు కావాలని, జాతి నిర్మాణంలో ప్రతిఒక్కరూ చేతులు కలపాలని ఆయన కోరారు. భారతీయుడు ఏదేశమేగినా ఆ దేశాభివృద్ధికి నిజాయతీగా పనిచేస్తాడన్నారు. ప్రధాని ప్రసంగం సందర్భంగా పలుమార్లు ప్రాంగణమంతా మోదీ, మోదీ అని మారుమోగింది. తాను పలువురు ప్రపంచ నేతలను కలిసానని, వారంతా తమ దేశాల్లో భారతీయుల విజయాలను తనతో పంచుకునేవారని మోదీ చెప్పారు. ప్రవాస భారతీయుల జనాభా కొన్ని దేశాల మొత్తం జనాభా కన్నా అధికమని గుర్తు చేశారు. కరోనా నియంత్రణలు సడలించిన అనంతరం డెన్మార్క్ ప్రధానినే తొలిసారి భారత్కు ఆహ్వానించామని గుర్తు చేశారు. చదవండి: ప్రధాని నరేంద్రమోదీ సలహాదారుగా తరుణ్ కపూర్ #WATCH | Prime Minister Narendra Modi and Danish PM Mette Frederiksen hold a conversation at the latter's residence in Copenhagen, Denmark. pic.twitter.com/wUGfJBYcOc— ANI (@ANI) May 3, 2022 ‘Walking the talk’ PM @narendramodi and @Statsmin PM Mette Frederiksen at Marienborg. The bonhomie between the two leaders mirrors the close ties between India and Denmark. pic.twitter.com/bdADrUpUUl— Arindam Bagchi (@MEAIndia) May 3, 2022 -
PM Modi Europe Visit: జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: యూరప్ దేశాల పర్యటనలో భాగంగా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం ఆయన బెర్లిన్-బ్రాండెన్బర్గ్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ముందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ.. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో భేటీ అవుతారు. ఆపై ఆరవ ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ)లో పాల్గొంటారు. ఐజీసీ ప్రతి రెండేళ్లకొకసారి ఇరు దేశాల మధ్య జరుగుతుంటుంది. రెండు దేశాలకు చెందిన టాప్ సీఈవోలు.. వీరిరువురితో ఇంటెరాక్ట్ అవుతారు. ఇక తన పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ మంగళవారం డెన్మార్క్లో, బుధవారం ఫ్రాన్స్లో పర్యటిస్తారు. ఈమధ్యే కొత్తగా ఫ్రాన్స్కు తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మాన్యుయెల్ మాక్రోన్కు పీఎం మోదీ శుభాకాంక్షలు తెలియజేసి.. భేటీ అవ్వనున్నారు. PM Modi gets a warm welcome from the Indian diaspora in Berlin He will hold his first in-person meeting with the newly appointed German Chancellor Olaf Scholz and co-chair the 6th India-Germany Inter-Governmental Consultations today pic.twitter.com/cs1c6GGMGZ — ANI (@ANI) May 2, 2022 -
2 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రధాని మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు ప్రధాని జర్మనీ, ఫ్రాన్సు, డెన్మార్క్లను సందర్శించనున్నారని శనివారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో యూరప్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన నేపథ్యంలో జరుగుతున్న ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడు దేశాలకు చెందిన 8 మంది నేతలతో ద్వైపాక్షిక, బహుళపాక్షిక చర్చలు జరుపుతారు. మొదటగా జర్మనీకి, తర్వాత డెన్మార్క్కు వెళ్లనున్న ప్రధాని తిరుగు ప్రయాణంలో పారిస్లో కొద్దిసేపు ఆగి, అధ్యక్షుడు మాక్రాన్తో భేటీ అవుతారు. -
వరుస పథకాలతో సత్తా చాటుతోన్న మాధవన్ తనయుడు
R Madhavan Son Wins Gold Medal in Danish Open: స్టార్ హీరో మాధవన్ కొడుకు వేదాంత్పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.స్విమ్మింగ్లో రాణిస్తున్న వేదాంత్ ఇప్పటికే భారత్కు పలు పతకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేదాంత్ డెన్మార్క్లో జరుగుతున్న డానిష్ స్విమ్మింగ్ ఓపెన్ పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు. వరుస విజాయలతో దూసుకుపోతూ భారత్కు పథకాలను అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ పోటీలో వేదాంత్ ఆదివారం రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే పోటీలో సోమవారం గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కొడుకు వేదాంత్కు గోల్డ్ మెడల్ ప్రకటిస్తున్న వీడియోను మాధవన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. చదవండి: గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్ ‘మీ అందరి ఆశీర్వాదం, ఆ దేవుడి దయ వల్ల వేదాంత్ వరస విజాయలను అందుకుంటున్నాడు. ఈ రోజు గోల్డ్ మెడల్ సాధించాడు. ఇక ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వేదాంత్ గురువు ప్రదీప్కు కూడా థ్యాంక్స్ చెప్పాడు’ అంటూ పోస్ట్ పంచుకున్నాడు. కాగా డానిష్ ఓపెన్ 2022లో వేదాంత్ 800 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో మొదటి స్థానంలో నిలిచాడు. ఆదివారం కేవలం 10మిల్లీ సెకన్ల తేడాతో గోల్డ్ కోల్పోయిన వేదాంత్ సోమవారం సక్సెస్ ఫుల్గా రేసును పూర్తి చేసి భారత్ తరుపున బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా పలువరు ప్రముఖులతో పాటు నెటీజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: R Madhavan: స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటిన హీరో మాధవన్ కొడుకు View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) -
వరల్డ్ గ్రూప్–1లోనే భారత్.. డెన్మార్క్పై ఘన విజయం
న్యూఢిల్లీ: ఈ ఏడాది డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు వరల్డ్ గ్రూప్–1లోనే కొనసాగనుంది. డెన్మార్క్తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత్ 4–0తో నెగ్గింది. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ ద్వయం 6–7 (4/7), 6–4, 7–6 (7/4)తో నీల్సన్–టార్పెగార్డ్ జంటను ఓడించి భారత్కు 3–0తో విజయాన్ని ఖాయం చేసింది. భారత్ విజయం ఖరారు అయినప్పటికీ రివర్స్ సింగిల్స్ను నిర్వహించారు. రామ్కుమార్ 5–7, 7–5, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఇంగిల్డ్సెన్పై గెలిచి భారత ఆధిక్యాన్ని 4–0కు పెంచాడు. అనంతరం నామ మాత్రమైన ఐదో మ్యాచ్ను నిర్వహించలేదు. చదవండి: Pak vs Aus: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ? -
New Year 2022: న్యూ ఇయర్ రోజున ఇలా చేస్తే ఏడాదంతా మంచి జరుగుతుంది!
New Year's Traditions From Around the Globe 2020, 21 సంవత్సరాల్లో.. ఎందరో ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బతిన్నారు. అప్పటివరకూ కళ్ల ముందున్న ఆత్మీయులు హఠాత్తుగా తిరిగిరానిలోకాలకు చేరారు. ఈ కరోనా మారణహోమం చాలదన్నట్టు ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసేశాయి. దురదృష్టం తిష్టేసుకు కూర్చున్నట్లు ఉందీ పరిస్థతి చూడబోతే! మరి కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. శతకోటి ఆనందాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో అడుగిడాలని వెయ్యి ఆశలతో ఎదురుచూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఐతే న్యూ ఇయర్ రోజున ఈ విధంగా చేస్తే సంవత్సరమంతా మంచే జరుగుతుందని ప్రపంచంలోని వివిధ దేశాలు భిన్న ఆచారాలను, నమ్మకాలను పాటిస్తున్నాయి. ఆవూసులేంటో తెలుసుకుందాం.. స్పెయిన్ ఈ దేశంలో నూతన సంవత్సరంలోకి అడుగిడిన మొదటి రోజు 12 ద్రాక్ష పండ్లను తింటే ఏడాది పొడవునా సంతోషంగా ఉంటారని నమ్ముతారు. ఈ సంప్రదాయం 1909లో ప్రారంభమైంది. బ్రెజిల్ సముద్రం అలల్లో తెల్లటి పువ్వులు విసిరి బ్రెజిల్ దేశ ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. పూలతోపాటు చాలా మంది పర్ఫ్యూమ్స్, నగలు, దువ్వెనలు, లిప్స్టిక్లను కూడా సముద్రంలోకి విసిరేస్తారు. ఇలా కొత్త సంవత్సరం రోజున సముద్ర దేవత 'యెమాంజ'కి కానుకను సమర్పించడం ద్వారా తమ కోరికలు తీరుస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. డెన్మార్క్ డిసెంబర్ 31 రాత్రి ఈ దేశ ప్రజలు పాత ప్లేట్లు, స్పూన్లు పొరుగిళ్ల మీదకు విసిరేస్తారట. జనవరి 1వ తేదీ ఉదయం ఇంటి తలుపు తియ్యగానే ఎన్ని ఎక్కువ విరిగిన పాత్రలుంటే ఆ సంవత్సరమంతా అంత అదృష్టం కలిసివస్తుందని నమ్ముతారు. ఇతర దేశాల్లో ఇలా.. ►థాయిలాండ్లో తుపాకులను గాలిలో పేల్చడం ద్వారా చెడు ఆత్మలను భయపెట్టడం ఆచారం. ►సౌత్ ఆఫ్రికాలోని ఈక్వెడార్కు చెందిన ప్రజలు ప్రసిద్ధ వ్యక్తుల దిష్టిబొమ్మలను తగలబెట్టడం ఆచారంగా కొనసాగుతోంది. తద్వారా గడచిన సంవత్సరం తాలూకు చెడును నాశనం చేసి, కొత్త సంవత్సరం తాజాగా ప్రారంభమౌతుందనేది వారి నమ్మకం. ►అనేక దేశాల్లో చర్చ్ లేదా గడియారం గంటలు వినడం ఆచారం. ►డచ్లో రింగ్ ఆకారంలో ఉండే ఏదైనా ఆహారాన్ని తింటారు. పూర్ణ వృత్తం వారి భవిష్యత్తును అదృష్టమయం చేస్తుందని నమ్ముతారు. ఇక మనదేశంలోనైతే న్యూ ఇయర్ రోజున కొత్తకొత్త నిర్ణయాలు తీసుకోవడం ఆచారంగా వస్తుంది. నమ్మకం ఏదైనా.. మనసావాచాఖర్మనా ఇతరులకు కీడు తలపెట్టకుండా, అందరి ఆనందాన్ని మన ఆనందంగా భావిస్తే సంవత్సరమేదైనా, ఎక్కడున్నా, ఎందరిలో ఉన్నా అదృష్టం మనవెంటే ఉంటుంది. ‘యద్భావం తద్భవతి' సూక్తి భావం కూడా ఇదే. పాటిద్దామా.. చదవండి: ‘నీపై నాకున్నప్రేమ క్రిస్మస్ చెట్టులోని లైట్ల కన్నా మరింతగా వెలుగుతోంది'! -
కరోనాపై పోరులో కొత్తమందు!
లండన్: కోవిడ్ వైరస్ ఉపరితలాన్ని అతుకోవడం ద్వారా, సదరు వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిరోధించే ఒక మాలిక్యూల్(ఔషధి, చిన్న సైజు ఆర్గానిక్ కాంపౌండ్)ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. డెన్మార్క్కు చెందిన ఆర్హస్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. ఈ ఔషధి చౌకైనదని, కోవిడ్పై పోరులో ఉపయోగపడే యాంటీ బాడీల ఉత్పత్తితో పోలిస్తే దీన్ని ఉత్పత్తి చేయడం తేలికన్నారు. పీఎన్ఏఎస్ జర్నల్లో పరిశోధనా ఫలితాలను మంగళవారం ప్రచురించారు. చదవండి: ప్రధాని మోదీని కలిసిన ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ ఈ మాలిక్యూల్ ఆర్ఎన్ఏ ఆప్టమర్స్ జాతికి చెందిన కాంపౌండ్ అని, ఎంఆర్ఎన్ఏ టీకాల తయారీలో ఉపయోగపడే బిల్డింగ్ బ్లాక్స్ దీనిలో ఉంటాయని తెలిపారు. 3డీ నిర్మితిలో మలిచేందుకు వీలయ్యే జన్యు పదార్ధం(డీఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ)ను ఆప్టమర్ అంటారు. ఇవి నిరి్ధష్ట లక్షిత కణాలను కనుగొనే శక్తి కలిగి ఉంటాయి. ఈ మాలిక్యూల్ వైరస్ ఉపరితలానికి అతుక్కోగానే వైరస్లోని స్పైక్ ప్రోటీన్ మానవ కణంలోకి ప్రవేశించకుండా నిరోధించడం జరుగుతుందని పరిశోధకులు తెలిపారు. దీన్ని కేవలం కోవిడ్ నిరోధానికే కాకుండా, గుర్తించడానికి వాడుకోవచ్చన్నారు. -
అందరూ!....వెక్కిరించి అవమానించే ఏకైక వైకల్యం...నత్తి!!
మనకు ఉండే చిన్నలోపాల్ని మనమే పెద్దపెద్ద సమస్యగా చూసి నిరాశనిస్ప్రహలకి లోనైపోతాం. అంతేకాదు సరైన విధంగా ఆలోచించం. పైగా ఎవర్ని సలహలు, సూచనలు కూడా అడగకుండా అట్లా ఉసూరుమంటూ ఉండిపోతాం. కానీ ఇక్కడొక అమ్మాయి తన లోపాన్ని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడితో ముచ్చటించి సరి చేసుకుంటుంది చూడండి.! (చదవండి: హే!..రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్!!) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ థాంక్స్ గివింగ్ సెలవుదినం సందర్భంగా నాన్టుకెట్కు వెళ్లిన సమయంలో డెన్మార్క్ మాజీ రాయబారి రూఫస్ గిఫోర్డ్ మేనకోడలు అవేరితో మాట్లాడిన సంభాషణ చూడముచ్చటగా ఉంటుంది. ఈ మేరకు అవేరికి కాస్త నత్తి ఉంటుంది. దీంతో ఆమె బైడెన్తో కాస్త తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది. దీంతో బైడెన్ అవేరిని ప్రోత్సహిస్తూ ...నత్తిగా వస్తున్న పర్వాలేదు అలాగే మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉండు అని అంటాడు. ఆ తర్వాత ఆమె తన ప్రసంగాన్ని ముగించి బైడెన్ని ఆనందంగా కౌగలించుకుంటుంది. ఈ మేరకు ఈ సంభాషణకు సంబధించిన వీడియోని రూఫస్ గిఫోర్డ్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ...ఈ రోజు నా మేనకోడలు ఇప్పటి వరకు నత్తితో పోరాడితోంది. ఈ రోజు తనకు తెలిసిన వ్యక్తితో సంభాషించి నత్తిని ఎలా జయించాలో తెలుసుకుంది అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు గతంలో సీఎన్ఎన్ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.." నేను కూడా చిన్నతనంలో నత్తిగా మాట్లాడేవాడిని . అంతేకాదు ప్రజలందరూ వెక్కిరించి అవమానించే ఏకేక వైకల్యం. ఆ లోపాన్ని పోగొట్టుకునేందకు చాలా కష్టపడ్డాను. పైగా అద్దం ముందు నిలబడి గంటల తరబడి ప్రసంగిస్తూ ఆ లోపాన్ని జయించాను" అని చెప్పారు. (చదవండి: ఎంత అమానుషం!.... గాయపడిన మూగజీవిపై పైశాచికం!!) My amazing niece and goddaughter Avery has struggled with a stutter much of her life. She was just told by a guy who knows a little something about it that she can be anything she wants to in this world. A day she will never ever forget. Thank you sir. ❤️🇺🇸❤️ pic.twitter.com/RDP5Y0FfTa — Rufus Gifford (@rufusgifford) November 28, 2021 -
ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి తీపికబురు చెప్పిన నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: రాబోయే రెండేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ధర పెట్రోల్ వాహనాల స్థాయికి చెరనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. "రాబోయే రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వేరియెంట్లతో సమానంగా ఉంటుంది. ఇప్పటికే ఈవీలపై జీఎస్టీ కేవలం 5% మాత్రమే ఉంది. లిథియం అయాన్ బ్యాటరీల ఖర్చు కూడా తగ్గుతోంది. అంతేగాకుండా, పెట్రోల్ పంపులు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది" అని గడ్కరీ డెన్మార్క్ దేశ రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాలపై ది సస్టైనబిలిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. "భారత దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ మంచి ఊపు అందుకుంది. పెట్రోల్ వాహనం కిలోమీటరు ప్రయాణించడానికి ₹10, డీజిల్ వాహనం కిలోమీటరు ప్రయాణించడానికి ₹7 ఖర్చు అయితే, అదే ఈవీలు కిలోమీటరు ప్రయాణించడానికి ₹1 ఖర్చు అవుతుంది" అని ఆయన అన్నారు. 2030 నాటికిఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) అమ్మకాలు ప్రైవేట్ కార్ల అమ్మకాలలో 30%, వాణిజ్య వాహనాల అమ్మకాలలో 70%, బస్సుల అమ్మకాలలో 40%, ద్విచక్ర & త్రిచక్ర వాహనాల అమ్మకాలలో 80% చేరుకోవాలని భారతదేశం లక్ష్యాన్ని పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 2/3 ఎలక్ట్రిక్-కార్ వేరియెంట్ల ధర ₹15లక్షల కంటే తక్కువగా ఉంది. కేంద్రం సబ్సిడీ అందించిన తర్వాత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల ధర ఇప్పటికే ఉన్న పెట్రోల్ వాహనాలతో సమానంగా ఉంది అని అన్నారు. పెట్రోల్ స్టేషన్లలో ఛార్జింగ్ పాయింట్లు ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వేలో ఎలక్ట్రిక్ హైవే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పైలట్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు, ఈ ప్రాంతంలో సమృద్ధిగా సౌర శక్తి శక్తిని ఉపయోగించి విద్యుదీకరణ చేయవచ్చు. దీనితో పాటు పెట్రోల్ స్టేషన్లలో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) 2023 నాటికి దేశంలోని జాతీయ రహదారులలో వెంట కనీసం 700 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొందించింది. వీటిని ప్రతి 40-60 కిలోమీటర్లకు ఒకటి ఏర్పాటు చేయనున్నారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు సౌరశక్తి ద్వారా విద్యుత్తును పొందేలా చూడటంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించిందని కేంద్ర మంత్రి తెలిపారు. త్వరలో దేశంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. "బొగ్గు ఆధారిత విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో ప్రయోజనం లేదు. సౌర, టైడల్, పవన శక్తి, బయోమాస్ వంటి పునరుత్పాదక వనరులపై మా దృష్టి ఇప్పుడు ఉంది. రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ద్వారా డొమెస్టిక్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయవచ్చు. దేశవ్యాప్తంగా కిడబ్ల్యుహెచ్ సగటు రిటైల్ విద్యుత్ ఛార్జ్ ధర ₹7-8 వరకు ఉంది, అదే డీజిల్ జనరేటర్ విద్యుత్ ₹20/కెడబ్ల్యుహెచ్ ఉంది. కానీ, సౌరశక్తి విద్యుత్ ధర నేడు ₹2/కెడబ్ల్యుహెచ్ కంటే తక్కువగా ఉంది. కాబట్టి, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ సోలార్ పవర్ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల తలెత్తే విద్యుత్ సమస్యను పరిష్కరించగలదు" అని ఆయన అన్నారు. ఈవీల ఎగుమతి దేశంగా ఇండియా ప్రస్తుతం, భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని(145 జీడబ్ల్యు) కలిగి ఉంది. సోలార్ పివీ సెల్స్, ఇళ్ల వద్ద ప్యానెల్ సిస్టమ్, మాల్స్, పార్కింగ్ స్థలాలు, కార్యాలయాల ద్వారా దేశీయ ఈవి ఛార్జింగ్ ధరలను మరింత చౌకగా మారుస్తుందని గడ్కరీ అన్నారు. గత రెండేళ్లలో ఈ-స్కూటర్లు, ఈ-కార్ట్ లు, ఈ-ఆటోలు, ఈ-సైకిళ్లు వంటి చిన్న బ్యాటరీతో నడిచే వాహనాలకు దేశంలో భారీగా డిమాండ్ పెరిగిందని గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్ టూ వీలర్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు కోవిడ్ పూర్వ కాలంతో పోలిస్తే వరుసగా 145%, 190% పెరుగుదలను చూశాయి అని ఆయన అన్నారు. ఈ రెండు సెగ్మెంట్లలో భారతదేశం ఎగుమతిదారుగా మారే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. -
క్వార్టర్స్లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్ విభాగంలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–19, 21–9తో క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్)పై అద్భుత విజయాన్ని సాధించింది. తొలి గేమ్లో 0–5తో వెనుకబడిన సింధు అనంతరం తేరుకొని ఆ గేమ్ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె గేమ్తో పాటు మ్యాచ్నూ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో లక్ష్యసేన్ (భారత్) 21–17, 21–13తో లో కీన్ య్యూ (సింగపూర్)పై నెగ్గాడు. హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్ నుంచి సమీర్ వర్మ (భారత్) గాయంతో మధ్యలోనే వైదొలిగాడు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో భారత ద్వయం అశ్విని పొన్నప్ప–సాత్విక సాయిరాజ్ 21–15, 17–21, 19–21తో రెండో సీడ్ మెలాటి ఒక్తవియాంటి–ప్రవీణ్ జొర్డాన్ (ఇండోనేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. -
మడత పెట్టే స్మార్ట్ఫోన్లే కాదు..! మడత పడే కార్ను చూశారా..!
నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు పెరిగే కొద్ది కొత్త కొత్త పరిష్కారాలూ పుట్టుకొస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యలకు విరుగుడుగా పుట్టుకొచ్చిన సరికొత్త పరిష్కారమే ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు. చూడటానికి ఇది పిల్లలు ఆడుకునే టాయ్ కారులా కనిపించినా, రోడ్లపై సవారీకి భేషుగ్గా పనికొస్తుంది. రద్దీగా ఉండే రహదారుల్లో కాస్తంత చోటు దొరికినా, ఈ కారు సులువుగా ముందుకు సాగగలదు. చదవండి: అదరగొట్టిన టీవీఎస్ మోటార్స్..! డెన్మార్క్కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ ‘సిటీ ట్రాన్స్ఫార్మర్’ పేరిట రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ కారు, త్వరలోనే యూరోప్ అంతటా మార్కెట్లోకి విడుదల కానుంది. అయితే, ఇందులో ఒక్కరు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది. స్టార్ట్ చేసిన ఐదు సెకన్లలోనే 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ కారు, గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు. ఇందులోని బ్యాటరీని అరగంట సేపు చార్జ్ చేసుకుంటే, ఏకధాటిగా 180 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారుకు మరో అదనపు సౌకర్యమూ ఉంది. పార్క్ చేసేటప్పుడు దీని ఛెసిస్ను మడత పెట్టుకోవచ్చు. దీనివల్ల వంద సెంటీమీటర్ల చోటులోనే దీనిని సునాయాసంగా పార్క్ చేసుకోవచ్చు. అంటే ఒక మామూలు కారును పార్క్ చేయగల స్థలంలో ఇలాంటి నాలుగు కార్లను పార్క్ చేసుకోవడానికి వీలవుతుందన్నమాట! చదవండి: NASA:చంద్రుడిపై మానవుని అడుగు మరోసారి..! ఎప్పుడంటే..? -
Uber Cup: ఐదేళ్ల తర్వాత... తొలిసారిగా..
అర్హుస్ (డెన్మార్క్): ప్రపంచ చాంపియన్ పీవీ సింధు లేకపోయినా... గాయం కారణంగా మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సేవలు అందుబాటులో లేకపోయినా... భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు అద్భుత ఆటతీరుతో ఉబెర్ కప్ టోర్నమెంట్లో నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 4–1తో స్కాట్లాండ్ జట్టును ఓడించింది. వరుసగా రెండో విజయం నమోదు చేసిన భారత్ క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘బి’లో భారత్, థాయ్లాండ్ జట్లు రెండేసి విజయాలు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత పొందాయి. నేడు థాయ్ లాండ్, భారత్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ద్వారా గ్రూప్ విజేత ఎవరో తేలుతుంది. 2014, 2016ల లో ఉబెర్కప్లో సెమీఫైనల్ చేరుకొని తమ అత్యు త్తమ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు 2018లో లీగ్ దశలోనే వెనుదిరిగింది. ఐదేళ్ల విరామం తర్వాత భారత్ మళ్లీ నాకౌట్ దశకు చేరుకుంది. స్కాట్లాండ్తో జరిగిన పోటీలో తొలి మ్యాచ్లో ప్రపంచ 104వ ర్యాంకర్ మాళవిక బన్సోద్ 13–21, 9–21తో ప్రపంచ 26వ ర్యాంకర్ క్రిస్టీ గిల్మోర్ చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో అదితి భట్ 21–14, 21–8తో రాచెల్ సుగ్డెన్పై నెగ్గి స్కోరును 1–1తో సమం చేసింది. మూడో మ్యాచ్లో తనీషా–రితూపర్ణ ద్వయం 21–11, 21–8తో జూలీ–క్లారా టోరెన్స్ జోడీపై గెలిచి భారత్ ఆధిక్యాన్ని 2–1కి పెంచింది. నాలుగో మ్యాచ్లో తస్నీమ్ మీర్ 21–15, 21–6తో లౌరెన్ మిడిల్టన్ను ఓడించి 3–1తో భారత్ విజయాన్ని ఖరారు చేసింది. నామమాత్రమైన ఐదో మ్యాచ్లో త్రిసా జాలీ–గాయత్రి గోపీచంద్ జోడీ 21–8, 19–21, 21–10తో క్రిస్టీ గిల్మోర్–ఎలానోర్ జంటపై గెలిచింది. చదవండి: DC vs KKR, Qualifier 2: చెన్నైని ఢీ కొట్టేదెవరు? -
డెన్మార్క్తో చర్చలు సఫలం
న్యూఢిల్లీ: డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సెన్తో ఫలవంతమైన చర్చలు జరిగాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వెల్లడించారు. ఆరోగ్య, వ్యవసాయ, నీటి నిర్వహణ, వాతావరణ మార్పు, పునరి్వనియోగ ఇంధనాల విషయంలో సహకారాన్ని మరింత పెంచుకునేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఇండో డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్య పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. తాజాగా నాలుగు అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. గ్రీన్ టెక్పై శ్రద్ధపెడుతున్నందుకు మోదీని ఫ్రెడెరిక్సెన్ ప్రశంసించారు. ఆయన ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. పర్యావరణం– పురోగతి జంటగా ఎలా పయనిస్తాయో తమ భాగస్వామ్యమే ఉదాహరణ అన్నారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. 3 రోజుల పర్యటనకు ఆమె ఇండియాకు వచ్చారు. రాజ్ఘాట్ను సందర్శించి గాం«దీకి నివాళి అరి్పంచారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఇరు దేశాలు గతేడాది గ్రీన్ర్స్టాటజిక్ ఒప్పందాన్ని చేసుకున్నాయి. -
యాష్లే బార్టీ జోరు
న్యూయార్క్: ఏడాది చివరి గ్రాండ్స్లామ్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్వన్ యాష్లే బార్టీ జోరు కనబరుస్తోంది. గురువారం జరిగిన మహిళల రెండో రౌండ్లో బార్టీ 6–1, 7–5తో క్లారా టౌసన్ (డెన్మార్క్)పై వరుస సెట్లలో గెలిచి మూడో రౌండ్కు అర్హత సాధించింది. మ్యాచ్లో బార్టీ 11 ఏస్లు కొట్టి రెండు డబుల్ ఫాల్ట్లను చేయగా... క్లారా రెండు ఏస్లను సంధించి మూడు డబుల్ ఫాల్ట్లను చేసింది. ఆమెతో పాటు ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత బార్బొరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–1తో క్రిస్టినా మెకాలే (అమెరికా)పై, రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) 6–3, 6–1తో తామర జిదాన్సెక్ (స్లొవేనియా)పై, 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్టీఫెన్స్ 6–4, 6–2తో కోకో గాఫ్ (అమెరికా)పై గెలుపొందారు. సిట్సిపాస్, మెద్వెదేవ్ ముందంజ... పురుషుల విభాగంలో గ్రీస్ ప్లేయర్, మూడో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్, ఈ టోర్నీ రెండు సార్లు రన్నరప్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) మూడో రౌండ్లో ప్రవేశించారు. రెండో రౌండ్లో సిట్సిపాస్ 3–6, 6–4, 7–6 (7/4), 6–0తో అడ్రియాన్ మనారినో (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. మ్యాచ్లో సిట్సిపాస్ ఏకంగా 27 ఏస్లు సంధించాడు. మెద్వెదేవ్ 6–4, 6–1, 6–2తో డొమినిక్ కొఫెర్ (జర్మనీ)పై గెలిచి మూడు రౌండ్కు చేరుకున్నాడు. -
అభిమానానికి గుర్తుగా గిఫ్ట్; గుక్కపట్టి ఏడ్చేసిన అమ్మాయి
లండన్: యూఈఎఫ్ఏ చాంపియన్షిప్ యూరోకప్ 2020లో ఇంగ్లండ్, డెన్మార్క్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ ఫుట్బాలర్ మాసన్ మౌంట్ మ్యాచ్ విజయంతో పాటు అభిమానుల మనుసులు గెలుచుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు.. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 2-1 తేడాతో డెన్మార్క్పై విజయం సాధించి 55 ఏళ్ల తర్వాత మరో మెగాటోర్నీలో ఫైనల్కు అడుగుపెట్టింది. ఈ చిరస్మరణీయ సన్నివేశాన్ని మైదానంలో ఉన్న అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. వారి సంబరాలను మరింత రెట్టింపు చేయడానికి మౌంట్ తన జెర్సీని ఒక అమ్మాయికి కానుకగా ఇచ్చాడు. మ్యాచ్ ఆరంభం నుంచి తమకు మద్దతిచ్చిన ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి తన జెర్సీని ఆమె చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఆ అమ్మాయి ఏం అనుకుందో ఏమో తన తండ్రిని హద్దుకొని గట్టిగా ఏడ్చేసింది. ఇదంతా చూసిన మిగతావాళ్లు.. '' మీ తండ్రీ కూతుళ్లు అదృష్టవంతులు.. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం'' అంటూ కంగ్రాట్స్ చెప్పారు. కాగా ఈ వీడియోనూ రెమ్ విలియ్స్ అనే వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయగా ట్రెండింగ్గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ దాదాపు 6.7 మిలియన్ వ్యూస్ రాగా.. వేల సంఖ్యలో లైక్లు, కామెంట్లు వచ్చాయి. ఇక 55 ఏళ్ల తర్వాత ఒక మెగాటోర్నీలో ఫైనల్ చేరిన ఇంగ్లండ్ జూలై 11న ఇటలీతో టైటిల్ పోరుకు తలపడనుంది. This moment had me 🥺 @masonmount_10 👏🏾 pic.twitter.com/tzWWlPijW6 — Rem Williams (@remmiewilliams) July 8, 2021 -
తొలిసారి ‘యూరో’ ఫైనల్లో ఇంగ్లండ్
లండన్: ఇంగ్లండ్ ఫుట్బాల్ అభిమానుల 55 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది. ఒక మెగా టోర్నీలో కొన్ని దశాబ్దాల ఎదురుచూపుల తర్వాత ఆ జట్టు ఫైనల్ చేరింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ కప్లో ఇంగ్లండ్ తుది పోరుకు అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో డెన్మార్క్పై విజయం సాధించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు సమంగా నిలవగా... అదనపు సమయంలో సాధించిన గోల్తో ఇంగ్లండ్ ముందంజ వేసింది. డెన్మార్క్ తరఫున మైకేల్ డామ్స్గార్డ్ 30వ నిమిషంలో గోల్ చేసి ఆధిక్యం అందించగా... డెన్మార్క్కే చెందిన సైమన్ జార్ ‘సెల్ఫ్ గోల్’ (39వ నిమిషం)తో ఇంగ్లండ్ ఖాతాలో గోల్ చేరి స్కోరు సమమైంది. నిర్ణీత సమయం 1–1తో ముగిసింది. అనంతరం మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్లో 104వ నిమిషంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ గోల్ సాధించి తన జట్టును గెలిపించాడు. 1966లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఇంగ్లండ్ ప్రపంచ కప్లో గానీ, యూరో కప్లో గానీ (26 ప్రయత్నాల్లో) ఫైనల్ చేరలేకపోయింది. ఆద్యంతం హోరాహోరీ... ఇంగ్లండ్, డెన్మార్క్ పోరు ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. సుమారు 66 వేల మంది సొంత ప్రేక్షకుల సమక్షంలో వెంబ్లీ స్టేడియంలో ఇంగ్లండ్ దూకుడు ప్రదర్శించగా...టోర్నీలో సత్తా చాటుతూ వచ్చిన డెన్మార్క్ కూడా అదే జోరు కనబరిచింది. ముఖ్యంగా డెన్మార్క్ గోల్ కీపర్ కాస్పర్ స్కెమికల్ అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థిని పదే పదే అడ్డుకున్నాడు. ఇరు జట్లు తొలి గోల్ కోసం శ్రమిస్తున్న దశలో ఇంగ్లండ్ ఫౌల్ కారణంగా డెన్మార్క్కు ఫ్రీ కిక్ అవకాశం దక్కింది. డామ్స్గార్డ్ దీనిని సమర్థంగా ఉపయోగించుకోవడంతో ఆ జట్టు ముందంజ వేసింది. ఆ తర్వాత హ్యారీ గోల్ చేసేందుకు చేరువగా వచ్చినా....డెన్మార్క్ కీపర్ ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే కొద్ది సేపటికే హ్యారీ సహచరుడు స్టెర్లింగ్కు బంతి అందకుండా తప్పించే ప్రయత్నంలో డెన్మార్క్ ఆటగాడు జార్ తన గోల్పోస్ట్లోకే బంతిని పంపించడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. వివాదాస్పద పెనాల్టీ... స్కోర్లు సమమైన తర్వాత మరో 51 నిమిషాల పాటు ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా ఎవరికీ ఆధిక్యం దక్కలేదు. ఎక్స్ట్రా టైమ్లో పెనాల్టీ ఏరియాలోకి దూసుకొచ్చిన ఇంగ్లండ్ ఆటగాడు స్టెర్లింగ్, డెన్మార్క్ ఆటగాడు మథియాస్ జెన్సన్కు తగిలి కింద పడ్డాడు. రిఫరీ పెనాల్టీ ప్రకటించగా... వీడియో రివ్యూ (వార్) తర్వాత అదే ఖాయమైంది. హ్యారీ కొట్టిన కిక్ను ఈసారి కూడా స్కెమికల్ సమర్థంగా అడ్డుకున్నా... ‘రీబౌండ్’లో హ్యరీ మళ్లీ గోల్ పోస్ట్లోకి పంపించడంతో వెంబ్లీ మైదానం హోరెత్తిపోయింది. ఈ పెనాల్టీపై డెన్మార్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా లాభం లేకపోయింది. -
55 ఏళ్ల తర్వాత ఫైనల్కు ఇంగ్లండ్
లండన్: యూఈఎఫ్ఏ చాంపియన్షిప్ యూరోకప్ 2020లో ఇంగ్లండ్ జట్టు 55 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. డెన్మార్క్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 2-1 తేడాతో విజయం సాధించింది. 1966 ప్రపంచకప్ తర్వాత ఒక మేజర్ టోర్నీలో ఇంగ్లండ్ ఫైనల్లో అడుగుపెట్టడం ఇదే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆట 30వ నిమిషంలో డెన్మార్క్ ఆటగాడు మిక్కెల్ డ్యామ్స్గార్డ్ ఫెనాల్టీ కిక్ను అద్బుతమైన గోల్గా మలిచాడు. అయితే డెన్మార్క్ ఆటగాళ్ల తప్పిదంతో ఇంగ్లండ్ కూడా కాసేపటికే ఖాతా తెరిచింది. మ్యాచ్ ముగిసేసమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో ఆట అదనపు సమయానికి వెళ్లింది. అయితే అదనపు సమయం అవకాశాన్ని ఇంగ్లండ్ అద్భుతంగా ఉపయోగించుకుంది. ఆ జట్టు ఆటగాడు హారీ కేన్ ఫెనాల్టీ కిక్ను అద్బుత గోల్గా మలవడంతో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి వెళ్లగా.. అదనపు సమయం ముగిసేలోపు డెన్మార్క్ మరో గోల్ చేయడంలో విఫలమైంది. దీంతో ఇంగ్లండ్ యూరోకప్లో ఫైనల్ చేరింది. -
29 ఏళ్ల తర్వాత...
బాకు (అజర్బైజాన్): యూరో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో డెన్మార్క్ జట్టు 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. చెక్ రిపబ్లిక్తో శనివారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ 2–1తో గెలిచింది. చివరిసారి డెన్మార్క్ 1992లో సెమీఫైనల్ చేరుకోవడమే కాకుండా ఏకైకసారి టైటిల్ కూడా సాధించింది. డెన్మార్క్ తరఫున డెలానీ (5వ ని.లో), డాల్బెర్గ్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. చెక్ రిపబ్లిక్ తరఫున షిక్ (49వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. మరో క్వార్టర ఫైనల్లో ఇటలీ 2–1తో బెల్జియంను ఓడించి సెమీఫైనల్ చేరింది. -
వైరల్: వేటగాళ్ల క్రూరత్వం.. తీరం మొత్తం రక్త సిక్తం..
మనిషిని సంప్రదాయం పేరిట ఉండే మూఢ నమ్మకం పిచ్చివాడిని చేస్తుంది. మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెబుతోంది. అయితే భూమి ఆవిర్భవించిన తరువాత పుట్టిన చాలా జంతువులు ఇప్పుడు లేవు. ఈ ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతుజాతులు కనుమరుగైపోతున్నాయి. పూర్వం వన్యప్రాణులను రకరకాల కారణాల వల్ల వేటాడుతుండేవారు. కొందరు తమ బలప్రదర్శన, ధైర్య సాహసాలు నిరూపించుకోవడం కోసం జంతువులను వేటాడి చంపేవారు. ఫారో ఐస్లాండ్స్(తోర్షావ్న్): ఫారో దీవులలోని వేటగాళ్ళు 175 పైగా తిమింగలాలను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటన ఫ్రోస్లోని గ్రిన్డ్రాప్ లేదా గ్రైండ్ అని పిలిచే ద్వీపంలో ఆదివారం చోటు చేసుకుంది. దాదాపు 20 పడవల్లో వచ్చిన వేటగాళ్లు హుక్స్, కత్తులు, స్పియర్స్తో విచక్షణారహితంగా తిమింగలాలపై దాడి చేసి చంపారు. సముద్ర తీర ప్రాంతంలో ఓ చోట 52 పైలట్ తిమింగలాలను చంపగా.. మరో చోట 123 తిమింగలాలను హతమార్చారు. దీంతో సముద్ర తీరం మొత్తం రక్త సిక్తమైంది. ఈ విధంగా గత దశాబ్ద కాలంలో 6,500 పైగా తిమింగలాలు, డాల్ఫిన్లను బలితీసుకున్నారు. ఇదో అనాగరికమైన చర్యగా సీ షెపర్డ్ పేర్కొంది. ఇలా వెలుగులోకి.. సీ షెపర్డ్ పరిరక్షణకారులు ఓ డ్రోన్ను పంపించారు. అది తిమింగలాలు ఉండే ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఈ సంగతి బయట పడింది. అయితే ఆ సమయంలో ఓ ముష్కరుడు ఫోర్మ్యాన్ను వేటాడండి అంటూ.. డ్రోన్పై షాట్గన్తో కాల్పులు జరిపాడు. ఇక దీనిపై ఫారో దీవుల్లోని వారు కొన్ని గ్రూపులుగా విడిపోయాయి. కానీ చాలామంది వారి సంస్కృతిని గౌరవించాలని విదేశీ మీడియా, ఎన్జీఓలను కోరుతున్నారు. తిమింగలం మాంసం చాలా మంది స్థానికులు తింటారు. అయితే ఈ విధంగా భారీగా హతమార్చడాన్ని భరించలేమని వాటి పరిరక్షకులు వాదిస్తున్నారు. చదవండి: Covaxin: భారత్ బయోటెక్కు మరోసారి ఎదురుదెబ్బ జాకబ్ జుమాకు 15నెలల జైలు శిక్ష -
గుండెపోటే.. చనిపోయాడనుకున్నాం!
యూరో ఛాంపియన్షిప్ 2021 టోర్నీ మ్యాచ్లో ఫుట్బాల్ మైదానంలోనే కుప్పకూలిన డెన్మార్క్ ఆటగాడు క్రిస్టియన్ ఎరిక్సెన్ వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైదానం నుంచి అతని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటి నుంచి ‘ఔట్ ఆఫ్ డేంజర్’ అని డాక్టర్లు చెప్పేదాకా.. అసలు అతనికి ఏం జరిగిందన్న విషయం చెప్పకుండా ఆసక్తిని రేకెత్తించారు. అయితే చివరికి 29 ఏళ్ల ఈ డెన్మార్క్ ఆటగాడికి గుండెపోటు వచ్చిందని డాక్టర్లు ధృవీకరించారు. ‘‘అతనికి గుండెపోటు వచ్చింది. అవును.. బతకడం అతని అదృష్టం అని టీం డాక్టర్ మోర్టెన్ బోయిసెన్ మీడియాకు వెల్లడించాడు. ఎరిక్సెన్ కుప్పకూలిపోయినాక.. దగ్గరికి వెళ్లి చూశాం. అతనికి గుండెపోటు వచ్చిందని అప్పుడే అర్థమైంది. చనిపోయాడనుకున్నాం. కానీ, అదృష్టం బతికాడు.. ప్రస్తుతం అతని ఆరోగ్య స్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేం. ఇంతకంటే విషయాలేమీ ఇప్పుడు వివరించలేను’’ అని మోర్టెన్ హడావిడిగా వెళ్లిపోయాడు. వేటు తప్పదా? తని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మళ్లీ ఆడతానని ముందుకొచ్చినా.. తీసుకునే ప్రసక్తే లేదని ఇటలీ ప్రకటించింది. క్రిస్టియన్ డెన్మార్క్ జాతీయ జట్టులోనే కాకుండా.. ఇంటర్ మిలన్(సిరీ ఎ క్లబ్) తరపున ఆడుతున్నాడు కూడా. ఈ క్రమంలో అక్కడి చట్టాల ప్రకారం అతనిపై నిషేధం విధించే అవకాశం ఉందని క్లబ్ మెంబర్ ఒకరు తెలిపారు. ఇక డెన్మార్క్ జట్టు కూడా అతని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. తిరిగి జట్టులోకి చేర్చుకునే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక క్రిస్టియన్ తిరిగి మైదానంలో అడుగుపెట్టే ప్రసక్తే ఉండబోదని అతని ప్రేయసి/భార్య విస్ట్ జెన్సన్ నిన్న మీడియా ముందు భావోద్వేగంగా వెల్లడించింది. కాగా, ఎరిక్సెన్ 2010 మార్చ్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడగా.. 2010 ఫిఫా వరల్డ్ కప్లో ఆడిన యంగెస్ట్ ప్లేయర్ ఘనత దక్కించుకున్నాడు. ఐదేళ్లపాటు డెన్మార్క్ ‘ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ దక్కించుకున్నాడు కూడా. చదవండి: కుప్పకూలిన ఫుట్బాల్ ప్లేయర్ -
డెన్మార్క్కు షాక్
కొపెన్హగన్: యూరో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో తొలిసారి ఆడుతున్న ఫిన్లాండ్ జట్టు... తమ మొదటి మ్యాచ్లోనే మాజీ చాంపియన్ డెన్మార్క్కు షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఫిన్లాండ్ 1–0తో డెన్మార్క్పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఫిన్లాండ్ ఆటగాడు పొహాన్పొలావో ఆట 60 నిమిషంలో గోల్ చేశాడు. గ్రూప్ ‘బి’ మ్యాచ్లో బెల్జియం 3–0తో రష్యాపై నెగ్గింది. గ్రూప్ ‘డి’ మ్యాచ్లో ఇంగ్లండ్ 1–0తో క్రొయేషియాపై... గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ఆస్ట్రియా 3–1తో నార్త్ మెసడోనియాపై నెగ్గాయి. -
మ్యాచ్ మధ్యలో కుప్పకూలిన ఫుట్బాల్ ప్లేయర్
రోమ్: యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో అపశ్రుతి చోటు చేసుకుంది. కొపెన్హగన్ వేదికగా డెన్మార్క్, ఫిన్లాండ్ జట్ల మధ్య గ్రూప్ ‘బి’ మ్యాచ్లో అంతరాయం ఏర్పడింది. 42వ నిమిషంలో ఒక్కసారిగా డెన్మార్క్ ఆటగాడు క్రిస్టియాన్ ఎరిక్సన్ మైదానంలో కుప్పకూలిపోయాడు. అతన్ని వైద్య సబ్బంది ఆస్పత్రికి తీసుకువెళ్లారు. క్రిస్టియన్ కుప్పకూలడంతో మ్యాచ్ను రిఫరీలు రద్దుచేశారు. ఇక క్రిస్టియన్ ఎరిక్సన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అతను స్పృహలోకి వచ్చాడని, ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. క్రిస్టియన్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు, క్రీడా ప్రముఖలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. చదవండి: ఇటలీ శుభారంభం -
క్వార్టర్స్లో సింధు, సైనా నిష్క్రమణ
బర్మింగ్హామ్: 20 ఏళ్లుగా భారత షట్లర్లను అందని ద్రాక్షలా ఊరిస్తోన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ను ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న పీవీ సింధు ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–8, 21–8తో క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్)పై సునాయస విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. కేవలం 25 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన సింధు... ప్రత్యర్థిని ఏ దశలోనూ పుంజుకోనివ్వకుండా వరుస గేముల్లో మ్యాచ్ను ముగించేసింది. అయితే మరో టాప్ షట్లర్ సైనా నెహ్వాల్కు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్లో సైనా గాయంతో మధ్యలోనే వైదొలిగింది. మియా బ్లిచ్ఫెల్డ్ (డెన్మార్క్)తో జరిగిన ఈ పోరులో సైనా 8–21, 4–10తో వెనుకబడి ఉన్న తరుణంలో తప్పుకుంది. పురుషుల ప్రిక్వార్టర్స్లో లక్ష్యసేన్ 21–18, 21–17తో థామస్ రౌక్సెల్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. అయితే ఇతర భారత షట్లర్లు భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్లకు మాత్రం ప్రిక్వార్టర్స్లో నిరాశే ఎదురైంది. సాయిప్రణీత్ 21–15, 12–21, 12–21తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో... ప్రణయ్ 15–21, 14–21తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో అశ్విని పొన్నప్ప– సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 21–17, 21–10తో గాబ్రియెల్ స్టోయేవా– స్టెఫాని స్టోయేవా (బల్గేరియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ పోరుల్లో సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 19–21, 9–21తో యుకీ కనెకొ– మిసాకి మత్సుటోటోమో (జపాన్) ద్వయం చేతిలో, ప్రణవ్ చోప్రా–సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 15–21, 17–21తో రాస్మస్ స్పెర్సెన్–క్రిస్టిన్ బుష్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడి ఇంటిదారి పట్టాయి. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 16–21, 21–11, 17–21తో కిమ్ అస్త్రుప్–ఆండ్రెస్ స్కరుప్ రస్ముస్సెన్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడింది. మరో వైపు టోర్నీ నుంచి ఇండోనేసియా జట్టు తప్పుకుంది. ఆ జట్టు ప్రయాణించిన విమానంలోనే ఉన్న ఒకరు కరోనా పాజిటివ్గా తేలడంతో... టీమ్ను 10 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ టోర్నీ నిర్వాహకులు ఆదేశించారు. -
ఆస్ట్రాజెనెకా కరోనా టీకాకు మరో షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ వినియోగంపై వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కరోనా వైరస్ నివారణకు గాను వాక్సీన్ తీసుకున్న తరువాత రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తాజాగా డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్ దేశాలు గురువారం ప్రకటించాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు రక్తం గడ్డకట్టినట్లు కేసులు వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డెన్మార్క్ ఆరోగ్య అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. డెన్మార్క్లో పరిస్థితులు బాగానే ఉన్నా, వ్యాక్సిన్తో ముడిపడి ఉన్న కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. వీటిని మరింత దగ్గరగా పరిశీలించాల్సిన అవసరం ఉందని హెల్త్ అథారిటీ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ తెలిపారు.అందుకే వాడకాన్ని పూర్తిగా నిషేధించలేదు కానీ, తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. టీకా సురక్షితమైనది సమర్థవంతమైందని రుజువు చేసే విస్తృత డాక్యుమెంటేషన్ ఉంది కానీ, ఇతర యూరోపియన్ దేశాలలో తీవ్రమైన దుష్ప్రభావాల గురించి సమాచారాన్ని పరిశీలించాలని బ్రోస్ట్రోమ్ చెప్పారు. (అమెరికన్ల జీవితాలు మారుతాయ్!) మార్చి 9 నాటికి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 30 లక్షలమందికి పైగా టీకాలు తీసుకోగా.. రక్తం గడ్డకట్టిన 22 కేసులు నమోదయ్యాయని యూరోపియన్ మెడిసన్స్ ఏజెన్సీ (ఇఎంఎ) తెలిపింది. అలాగే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కారణంగా ఆస్ట్రియా నర్సు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. టీకా తీసుకున్న తరువాత ఆమె తీవ్రమైన రక్త గడ్డంకట్టే సమస్యతో చనిపోవడంతో ఆస్ట్రాజెనెకా టీకా వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు యూరోపియన్ యూనియన్ దేశాలు ఎస్టోనియా, లాట్వియా, లిధుయేనియా, లక్సంబర్గ్లు కూడా తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ క్రమంలో డెన్మార్క్ నార్వే, ఐస్లాండ్ కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. (కోవిడ్ ముప్పు తొలగిపోలేదు) -
వావ్..ఆ పల్లెటూరు బ్యూటిఫుల్
పచ్చని పంటలు, పాడి పశువులు, కల్మషమెరుగని మనుషులతో ఉండే పల్లెటూళ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పట్నవాసాల్లో బిజీబిజీగా జీవితాలు గడిపేవారు పచ్చని పరిసరాలను చూసి మనసుపారేసుకోకుండా ఉండరు. అసలు ఇండోనేసియాలోని ఓ పల్లెటూరును, డెన్మార్క్లోని మరో పట్నాన్ని చూస్తే వావ్.. వాట్ ఏ బ్యూటిఫుల్ అనకుండా ఎవరూ ఉండలేరేమో.! అచ్చం బండి చక్రంలా.. డెన్మార్క్ రాజధాని కొపెన్హెగాన్ ఆనుకుని ఉన్న బ్రాండ్బీ హేవ్బీ నగరంలోని ప్లాట్ల లేఅవుట్ చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. చక్రం ఆకారంలోని లేఅవుట్లో, ఆకుపచ్చని పరిసరాల మధ్య ఉన్న ఇళ్లను చూసి భలే ముచ్చటపడిపోతారు. పురాతన డానిష్ గ్రామాల నమూనాతో ఈ ప్రాంతాన్ని 1964లో ఎరిక్ మైగిండ్ అనే ఆర్కిటెక్ట్ అభివృద్ధి చేశాడు. అచ్చం ఎడ్లబండి చక్రంలా ఉండే లేఅవుట్లో ఇళ్లను నిర్మించారు. ఇలాంటి పలు చక్రాలతో ఓ పట్టణాన్నే సృష్టించారు. చక్రం లేఅవుట్ చుట్టూ పచ్చని మొక్కలు ఉంటాయి. మధ్యలో ఇరుసులాంటి ప్రాంతం అంతా ఖాళీగా ఉంటుంది. అక్కడ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయని ఆర్కిటెక్టులు చెబుతున్నారు. ఇళ్ల మధ్య కాంపౌండ్ వాల్ను కూడా మొక్కలతోనే నిర్మించారు. ఈ లేఅవుట్ను ఇటీవల హెండ్రీ డో అనే ఫొటోగ్రాఫర్ డ్రోన్ సాయంతో ఫొటోలు తీసి ఇన్స్టా గ్రాంలో ఉంచాడు. దీంతో ఈ ఇళ్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయల ఊరు ఇండోనేసియా, బాలి దీవుల్లో ఉన్న పెంగ్లిపురన్ గ్రామంలో పురాతన సంప్రదాయాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చుట్టూ కొండలు, మధ్యలో ఇళ్ల సముదాయం, వ్యవసాయ ఆధారిత గ్రామం. ఆధునికతకు దూరంగా.. ప్రకృతి ఒడిలో ఆ ఊరు విలసిల్లుతోంది. అసలు ఆ ఊరిలోకి మోటార్ సైకిల్కు కూడా అనుమతి ఉండదు అంటే నమ్మలేం కదా?. అందమైన రహదారులు, వాటిని ఆనుకుని వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలు, రోడ్డుకు ఆనుకుని అందమైన పూల మొక్కలు, పురాతన సంప్రదాయ రీతిలో పెంకులతో నిర్మితమైన ఇళ్లు.. ఆ వీధుల్లో నుంచి నడుచుకుంటూ వెళితే, అసలు మనం ఈ లోకంలోనే ఉన్నామా అనే భావన కలుగుతుంది. ప్రపంచంలో క్లీన్ విలేజ్గా ఈ ఊరికి పేరుంది. పెంగ్లిపురన్ అంటే పూర్వీకులను గుర్తు చేసే ఊరు అని అర్థమట. చాలా మంది ఇక్కడికి వచ్చి తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. బాలి ప్రాంతంలోని హిందూ సంప్రదాయం ప్రకారం గ్రామ నిర్మాణం ఉంటుంది. పర్యాంగన్ (పుణ్యకార్యక్రమాలు జరిగే ప్రాంతం), పవోంగన్ (నివేశన స్థలం), పాలేమహన్ (శ్మశానం, సాగుభూమి తదితర కార్యకలాపాలు) ప్రాంతాలుగా గ్రామ నిర్మాణం జరిగింది. గ్రామంలో లభించే వెదురు, కలప, రాళ్లతోనే ఇళ్లను నిర్మించారు. ఏడు వందల మంది జనాభా ఈ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ గ్రామాన్ని చూడటానికి పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో ఏటా వేల సంఖ్యలో వస్తారు. -
స్టెయిన్తో యూరప్ బెంబేలు, మరణాలూ ఎక్కువే!
కోపెన్హాగెన్: బ్రిటన్లో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ యూరప్ని ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. 70శాతం వేగంగా కొత్త స్ట్రెయిన్ కేసులు వ్యాప్తి చెందుతున్నట్టుగా డెన్మార్క్ ప్రభుత్వ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది. డెన్మార్క్లో అత్యంత కఠినంగా లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ ఒకే వారంలో కేసుల సంఖ్య ఏకంగా 70శాతం ఎగబాకింది. ఈ వైరస్ జన్యుక్రమాన్ని త్వరితగతిన మార్చుకుంటూ ఉండడంతో పాజిటివ్ కేసులు నమోదైన వారిలో ఏ రకమైన వైరస్ సోకిందో విశ్లేషించాల్సి ఉంటుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ సైంటిఫిక్ డైరెక్టర్ ట్యారా గ్రోవ్ క్రాజ్ అన్నారు. టీకా తీసుకున్నా జాగ్రత్తలు తప్పదు కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే రోగ నిరోధక శక్తి రాదని, అందుకే ప్రజలం దరూ కచ్చితంగా లాక్డౌన్ నిబంధనల్ని పా టించాలని ఇంగ్లాండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ జొనాథన్ వాన్–టామ్ అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న మూడు వారాల తర్వాతే అది పని చేయడం మొదలవుతుందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందదని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అందుకే ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. ‘‘వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా ప్రజలందరూ కచ్చితంగా నిబంధనల్ని పాటించాలి. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఇచ్చే సలహాల్ని స్వీకరించాలి. మరణాలు అధికం.. కొత్త స్ట్రెయిన్ వల్ల మరణా లు అధికంగా సంభవిస్తున్నా యని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. యూకే ఆరోగ్య సంస్థలతో కూడా సీడీసీ మాట్లాడింది. సాధారణ కరోనా వైరస్ సోకిన ప్రతీ వెయ్యి మందిలో 10 మంది ప్రాణాలు కోల్పోతే ఈ కొత్త స్ట్రెయిన్తో సగటున వెయ్యి కేసుల్లో 14 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఈ వైరస్తో అత్యధికంగా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. అంతేగాక గత వారం రోజుల్లో బ్రిటన్లో మృతుల సంఖ్య ఏకంగా 16 శాతం పెరిగింది. -
ఒక్కరిపైనే ఆధారం.. ప్రమాదం
న్యూఢిల్లీ: గ్లోబల్ సప్లయ్ చైన్ కేవలం ఒకే ఒక్క వనరుపైనే అధికంగా ఆధారపడి ఉండటం ఎంత ప్రమాదకరమో కోవిడ్ తెలియజెప్పిందని ప్రధాని మోదీ అన్నారు. డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్తో మోదీ సోమవారం వర్చువల్ విధానంలో ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఈ క్లిష్ట సమయంలో గ్లోబల్ సప్లయ్ చైన్ను ఒకే దేశానికి బదులు అనేక దేశాలకు విస్తరించుకునే క్రమంలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో భారత్ పనిచేస్తోందనీ, భావసారూప్యం గల దేశాలను ఆహ్వానిస్తోందని మోదీ వివరించారు. గత కొద్ది నెలలుగా సంభవిస్తున్న పరిణామాలు పారదర్శకత, ప్రజాస్వామ్య వ్యవస్థ, నియమాల ఆధారంగా ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని చాటిచెప్పాయని పేర్కొన్నారు. అధికార గణాంకాల ప్రకారం.. భారత్–డెన్మార్క్ ద్వైపాక్షిక వాణిజ్యం 2016–2019 సంవత్సరాల్లో 2.82 బిలియన్ డాలర్ల నుంచి 3.68 బిలియన్ డాలర్లకు పెరిగింది. సుమారు 200 డెన్మార్క్ కంపెనీలు దేశంలో నౌకాయానం, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. డెన్మార్క్ కంపెనీల్లో 5వేల మంది భారతీయ నిపుణులు పనిచేస్తున్నారు. -
స్కిన్ ఎలర్జీ.. ఈ అమ్మాయి ఏం చేసిందంటే!
సాధారణంగా చర్మంపై దద్దుర్లు వచ్చినా.. కాస్త మంట పుట్టినా ఏమైందోనని కంగారు పడి డాక్టర్ల దగ్గరకు పరిగెత్తేవాళ్లు చాలామందే ఉంటారు. వెంటనే డెర్మటాలజిస్టును సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకుని మందులు వాడతారు. అయితే డెన్మార్క్ చెందిన ఓ యువతి మాత్రం తనకు ఉన్న అరుదైన చర్మ వ్యాధిని ఓ హాబీగా మలచుకుంది. కుంచెపై గీయాల్సిన కళాకృతులను చర్మంపై గీస్తూ కాన్వాస్లా మార్చేసుకుని నలుగురిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. వివరాలు... ఆరస్ పట్టణానికి చెందిన 18 ఏళ్ల యువతి ఎమ్మా అల్డెన్రిడ్కు డెర్మాటోగ్రఫియా అనే డిజార్డర్ ఉంది. (600 క్యాలరీలను కరిగించే బ్లాంకెట్) సాధారణ పరిభాషలో దీనిని స్కిన్ రైటింగ్ అంటారు. చర్మం ఉబ్బిపోవడం, ఎర్రగా మారడం, విపరీతమైన దురద దీని లక్షణాలు. అంతగా ప్రమాదకరం కాకపోయినప్పటికీ ఈ ఎలర్జీ కారణంగా నలుగురిలో ఉన్నపుడు కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు డెర్మాటోగ్రఫియా ఉన్నవాళ్లు. కాగా మూడేళ్ల క్రితం ఎమ్మా చేతులపై ఈ వ్యాధి లక్షణాలను గమనించిన ఆమె స్నేహితురాలు ఈ విషయాన్ని తనతో పంచుకుంది. అయితే విచిత్రంగా తనతో పాటు తన కజిన్స్కు కూడా ఇదే తరహా లక్షణాలు ఉన్నట్లు తెలుసుకుంది. దీంతో పెద్దగా ఇబ్బంది లేదని తెలుసుకున్న ఎమ్మా.. అప్పటి నుంచి చర్మం ఉబ్బిన ప్రతిసారి అప్పటికప్పుడు తనకు పెన్సిల్తో తోచిన డ్రాయింగ్ వేస్తూ, పేర్లు రాస్తూ ఆ ఫొటోలు తన స్నేహితులతో పంచుకుంటోంది.(ట్విటర్లో కొత్త జీవిని కనుగొన్న ప్రొఫెసర్) ఈ విషయం గురించి ఎమ్మా మాట్లాడుతూ.. ‘‘నేను పార్టీకి వెళ్లిన సందర్భాల్లో సన్నిహితులను సర్ప్రైజ్ చేయడానికి ఈ ట్రిక్ ఉపయోగిస్తున్నా. నోటితో పలికిన పదాలను ఇలా చర్మంపై ఉండటం చూసి అంతా ఆశ్చర్యపోతారు. వాళ్లు కూడా నాలాగే చర్మంపై డిజైన్స్ వేయాలని ప్రయత్నిస్తారు. కానీ కుదరదు. కొంతమందేమో దీని వల్ల నీకు ఇబ్బంది అనిపించదా అని అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే డెర్మాటోగ్రఫియా వల్ల నాకెప్పుడూ ఇబ్బంది తలెత్తలేదు. అయితే ఒక్కోసారి విపరీతమైన దురద వస్తుంది. అప్పుడు నా పరిస్థితిని చూస్తే నాకు ఏమైపోతుందోనని పక్కనున్న వాళ్లు భయపడిపోతారు. కానీ ఈ డిజార్డర్ నా జీవితంపై ఇంతవరకు ఎలాంటి దుష్ప్రభావం చూపలేదు. డాక్టర్లు కొన్ని మందులు రికమండ్ చేశారు. కానీ వాటి వల్ల ఈ గీతలు, రాతలు రాయలేను కాబట్టి వాటిని వాడటం మానేశా’’అని చెప్పుకొచ్చింది. View this post on Instagram #dermatographia #skinwriting #hi A post shared by Dermatographia (@dermatographia_) on Aug 8, 2017 at 3:29am PDT -
ప్రధానమంత్రి పెళ్లి మూడోసారి వాయిదా
కోపెన్హాగెన్ : పెళ్లి కోసం లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడటం, ఇళ్ల నుంచి పారిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో డెన్మార్క్ ప్రధాని మిట్టే ఫ్రెడ్రిక్సన్ దేశం కోసం మూడోసారి తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఐరోపా సమాఖ్య సదస్సుకు హాజరయ్యేందుకు శనివారం జరగాల్సిన తన వివాహాన్ని మరోసారి వాయిదా వేశారు. గతంలో కోవిడ్-19 విజృంభణ, లాక్డౌన్ల కారణంగా ఆమె వివాహం రెండుసార్లు వాయిదాపడింది. "ఈ అద్భుతమైన వ్యక్తిని మనువాడేందుకు ఎంతగానో వేచి చూస్తున్నా’ అంటూ తన కాబోయే భర్త ‘బో’తో కలిసున్న ఫోటోను ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. త్వరలోనే తాము ఒకటవుతామని స్పష్టం చేశారు. వివాహం విషయంలో అతను కూడా చాలా ఓపికగా వేచిచూస్తున్నారని చెప్పుకొచ్చిన ఆమె ఐరోపా సమాఖ్య సమావేశాలు డెన్మార్క్ ప్రయోజనాలకు అత్యంత కీలకమని చెప్పారు. ‘వేచిచూడటం అంత సులభం కాదు..మేం ఒక్కటి కావాలనుకున్న శనివారమే బ్రసెల్స్లో సమావేశం ఏర్పాటు చేశారు..డెన్మార్క్ ప్రజల ప్రయోజనాలు కాపాడే కర్తవ్యాన్ని నెరవేర్చాల్సి ఉన్నందున వివాహ తేదీలను మార్చుకోవాల్సి వచ్చింద’ని మిట్టే పేర్కొన్నారు. చదవండి : డీఎన్ఏ గీసిన బొమ్మ -
ట్విటర్లో కొత్త జీవిని కనుగొన్న ప్రొఫెసర్
కోపెన్హాగన్ : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ కొత్తరకం జీవి ఫొటో వైరల్ అవుతోంది. ఇది పరాన్న జీవి ఫంగస్లోని కొత్త రకం జీవిగా.. దీని పేరు ‘ట్రోగ్లోమైసెస్’ అని సోఫియా రెబొలైరా అనే జీవ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఓ పత్రికలో పేర్కొన్నారు. కోపెన్హాగన్ యూనివర్శిటీకి చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ డెన్మార్క్లో జీవశాస్త్రవేత్త విభాగంలో అసోసియేట్ ప్రోఫెసర్గా పని చేస్తున్న సోఫియా రెబొలైరా ట్విటర్లో కనుగొన్న ఆ జీవికి ఆ పేరు వచ్చేలా ట్రోగ్లమైసెస్ ట్విట్టరీ అని నామకరణం చేశారు. ఈ ఫొటోను వర్జీనియా టెక్లోని ప్రస్తుతం పీహెచ్డీ విద్యార్థిని కీటక శాస్త్రవేత్త డెరెక్ హెన్నెన్ 2018లో పోస్టు చేసినట్లు ఆమె తెలిపారు. రెబొలైరా ‘దీనిని పరీక్షించి చూస్తే దానిపై కొన్ని చిన్న రంధ్రాలతో కూడిన ఫంగస్ను చూశాను. దాని ఉపరితలంపై శిలీంధ్రాల మాదిరి ఉండటం గమనించాను. అయితే ఇంతవరకు ఈ పరాన్న జీవిని అమెరికన్ మిల్లిపేడ్స్లో ఇంతవరకు చూడలేదు’ అని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రకం ఫంగస్కు సంబంధించిన వివరాలు ఇది వరకు ఎక్కడా నమోదు కాలేదు. దీంతో పారిస్కు చెందిన ఓ నేచురల్ హిస్టరీ మ్యూజియం.. రెబొలైరా కొత్త జీవిని కనుగొన్నట్లు ధ్రువీకరించింది. ట్విటర్లో కనుగొన్న కారణంగా దానికి ట్రోగ్లమైసెస్ ట్విట్టరీ అని పేరుపెట్టారు. ఈ ట్విట్టరీ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘కొద్దిరోజుల కిత్రం బహుపాది మీద ఓ ఫంగీని పోలిన జీవులు ఉండటం చూశాను. అప్పటివరకు ఈ ఫంగి అమెరికన్ బహుపాదుల మీద కనిపించలేద’ని ఆమె చెప్పారు. ఇది ఎలా ఉంటుంది: ట్రోగ్లోమైసెస్ ట్విట్టర్ ట్రోగ్లోమైసెస్ ట్విట్టర్ లాబౌల్బెనియల్స్ అనే ఆర్డర్కు చెందినది. ఇది కీటకాలు, మిల్లిపెడెస్పై దాడి చేసే చిన్న శిలీంధ్రపు పరాన్నజీవులు. ఇవి అతి చిన్న లార్వాలా ఉండి.. పునరుత్పత్తి అవయవాలనైనా హోస్ట్ జీవుల వెలుపల నివసిస్తాయి. లాబౌల్బెనియల్స్ మొట్టమొదట 19వ శతాబ్దం మధ్యలో కనుగొనబడ్డాయి.1890 నుంచి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రోలాండ్ థాక్స్టర్ చేసిన వివరణాత్మక అధ్యయనం పుస్తకంలో వాటి వర్గీకరణ స్థానం గుర్తించబడింది. ఈ శిలీధ్రాలలో సుమారు 1260 జాతులు ఉంటాయని థాక్స్టర్ వివరించారు. -
అది విమానం కిటికీ కాదు.. మరేంటి?!
కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగే వాళ్లను కూడా ఒకచోట స్థిరంగా ఉండేలా చేసింది మహమ్మారి కరోనా. అవును మరి.. ప్రాణాంతక వైరస్ ప్రబలుతుందంటే ఆమాత్రం క్రమశిక్షణ పాటించి తీరాల్సిందే. అందుకే అందరిలాగే నయా ఖన్కన్ కూడా ఇంటికే పరిమితమైంది. డెన్మార్క్కు చెందిన ఆమె.. పైలట్గా పనిచేస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్ ప్రభావం తొలుత రవాణా వ్యవస్థ మీదే పడిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఎల్లప్పుడు విహంగం మాదిరి ఆకాశంలో ఎగిరే నయాకు ఇంట్లోనే ఉండటంతో బాగా బోర్ కొట్టినట్టుంది.(వైరల్ వీడియో.. పాఠశాలలో కరోనా మార్పులు) ఏదైతే అది అయిందనుకుని విమానం ఎక్కేసి ఎంచక్కా కిటికీ పక్కన కూర్చుని బయటి ప్రపంచాన్ని చూస్తూ మైమరచిపోయింది. అదేంటి లాక్డౌన్లో తనెలా విమానం ఎక్కిందని ఆశ్చర్యపోతున్నారా.. అవును.. తను షేర్ చేసిన వీడియో చూడగానే ఎవరికైనా ఈ సందేహం రాకమానదు. అయితే వీడియోను పూర్తిగా చూసిన తర్వాతే అది విమానం కిటీకి కాదు.. వాషింగ్ మెషీన్ డోర్ అనే విషయం అర్థమవుతుంది. లాక్డౌన్ వల్ల తన సోదరి ఇంట్లో చిక్కుకుపోయిన నయా.. ఈ విధంగా కోవిడ్-19 లాక్డౌన్ తెప్పించిన చిరాకును ఫన్నీ వీడియో ద్వారా బయటపెట్టారు. కాగా మార్చి రెండో వారం నుంచి డెన్మార్క్లో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఇక ఇప్పటి వరకు అక్కడ దాదాపు 10 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సమాచారం. (ఈ ఉడుత.. మరో బాబా రాందేవ్) -
థామస్ కప్–ఉబెర్ కప్ టోర్నీ మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మళ్లీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ మెగా ఈవెంట్ డెన్మార్క్ వేదికగా మే 16 నుంచి 24 వరకు జరగాల్సింది. అయి తే కరోనా మహమ్మారి కారణంగా మేలో జరగాల్సిన టోర్నీని వాయిదా వేసి... ఆగస్టు 15 నుంచి 23 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికీ కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడం... ఆగస్టు చివరి వరకు బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ గుమిగూడవద్దని డెన్మార్క్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తమ నిర్ణయాన్ని మార్చుకుంది. ఆగస్టులో బదులుగా థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీ కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరుగుతుందని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. పురుషుల, మహిళల విభాగాల్లో 16 మేటి జట్ల చొప్పున పాల్గొనే ఈ టోర్నీలో రెండు విభాగాల్లోనూ భారత జట్లు అర్హత సాధించాయి. -
కరోనా కామెడీ
మూడ్ గమనించకుండా జోక్ చెయ్యకూడదు. ఆరోగ్యం మీద అసలే జోక్లు వెయ్యకూడదు. చైనా ఇప్పుడు కరోనా కష్టాల్లో ఉంది. కరోనా వైరస్ ప్రబలిపోతుంటే.. అంత పెద్ద ప్రభుత్వం కూడా కిందా మీదా అవుతోంది. ఈ సమయంలో చైనా మీద డెన్మార్క్ జోక్ చేసింది. అయితే జోక్ చేసింది డెన్మార్క్ ప్రభుత్వం కాదు. డెన్మార్క్లోని ‘జిలాండ్స్ పోస్టెన్’ అనే న్యూస్ పేపర్. చైనా.. కరోనా కోరల్లో చిక్కుకుందని చెప్పడానికి ఆ పేపర్ వేసిన కార్టూన్ చైనాను తీవ్రంగా నొప్పించింది. చైనా జాతీయ జెండా ఎర్రగా ఉంటుంది. జెండాకు ఎడమ వైపున పైభాగంలో ఓ పెద్ద నక్షత్రం, దానికి కింద నాలుగు చిన్న నక్షత్రాలు ఉంటాయి. ఆ ఐదు నక్షత్రాల స్థానంలో ఐదు కరోనా క్రిములను గీశాడు కార్టూనిస్టు. అది కోపం తెప్పించింది డెన్మార్క్లోని చైనా కార్యాలయానికి. వెంటనే క్షమాపణ చెప్పాలని ఆ పేపర్ని డిమాండ్ చేసింది. కనీస సానుభూతి కూడా లేకుండా పత్రికా స్వేచ్ఛను ఉపయోగించుకోవడం ఏంటని మండిపడింది. ఆ పత్రిక ఎడిటర్ మాత్రం.. ‘‘మేము ఈ కార్టూన్ని సదుద్దేశంతోనే వేయించాం’’ అంటున్నారు! -
మోదీకి నేను అభిమానిని!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన ఆరాధ్య నేత అని డెన్మార్క్ ప్రధాని ఆండర్స్ రాస్ముసెన్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు ‘రైజినా డైలాగ్’లో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ కూడా పాల్గొన్న ఆ కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం ఇస్తూ.. ప్రపంచవ్యాప్తంగా నియంత పాలకులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య దేశాలు ఒక అంతర్జాతీయ కూటమి కట్టాలని రాస్ముసెన్ కోరారు. ఆ కూటమిలో భారత్ కీలకపాత్ర పోషించాలన్నారు. ‘ఈ కూటమిలో భారత్ పాత్ర కీలకం. ప్రధాని మోదీకి నేను అభిమానిని’ అని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల కీలక నేతలు పాల్గొంటున్న ఈ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఇరాన్– అమెరికాల మధ్య ఉద్రిక్తత, అఫ్గానిస్తాన్లో శాంతి, వాతావరణ మార్పు.. తదితర ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సదస్సులో చర్చిస్తారు. కార్యక్రమంలో న్యూజీలాండ్ పీఎం హెలెన్ క్లార్క్, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయి, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, స్వీడన్ మాజీ పీఎం కార్ల్ బ్లిడ్ పాల్గొన్నారు. -
కొండ అంచులకు చేరిన నీరు
-
అద్భుత దృశ్యం.. గాలిలో చిక్కుకున్న నీరు..!
కోపెన్హాగన్: నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అనే సామెత తెలిసే ఉంటుంది. అయితే, డెన్మార్క్లోని ఫారో ఐలాండ్స్లో మాత్రం దీనికి విరుద్ధమైన సన్నివేశమొకటి వెలుగు చూసింది. సముద్రపు అలల నుంచి నీరు అంతెత్తుతున్న కొండపైకి ప్రవహించింది. గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా పనిచేసిన ఈ దృశ్యాన్ని జాకొబ్సేన్ అనే వ్యక్తి గత సోమవారం కెమెరాలో బంధించాడు. సుడిగాలితో పాటు కొండ అంచులకు చేరుతున్న నీటి ప్రవాహపు వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ విశేషంపై వాతావరణ నిపుణులు మాట్లాడుతూ.. ‘టోర్నడోలు ఏర్పడే క్రమంలో నలువైపులా ఒత్తిడికి గురైన గాలి భూమిపై ఉన్న చెత్త చెదారంతో గొట్టంలా మారి విధ్వంసం సృష్టిస్తుంది. అతి వేగంగా కదులుతూ సుమారు మేఘాలను తాకేటంత ఎత్తులో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. తాజా ఘటన కూడా ఈ కోవలోకి చెందినదే. టోర్నడో మాదిరిగానే ఇక్కడ గాలి గొట్టం ఏర్పడింది. అయితే, దానిలో వస్తువులు, చెత్తా చెదారం బదులు నీరు చేరింది. పక్కనే ఎత్తయిన కొండ ఉండటంతో అదే వేగంతో నీరు పైకి ప్రవహించింది. సాధారణంగా నీటితో ఏర్పడే గాలి గొట్టాలను నీటి చిమ్ములు అంటాం. అవి కాస్త ఎత్తు వరకు కదిలి బలహీనమవుతాయి. ఫారో ఐలాండ్స్లో బయటపడిన నీటి ప్రవాహాం సంఘటన మాత్రం అద్భుతమైందే..!’అని అన్నారు. -
కొత్త సంవత్సరమంటే కొన్ని నమ్మకాలు..
ఎన్నో కలలతో మరెన్నో ఆకాంక్షలతో కొత్త దశాబ్దంలోకి అడుగు పెట్టబోతున్నాం. గ్రాండ్గా న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పబోతున్నాం. కొత్త ఏడాదంటేనే కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం, కొత్త ఉత్తేజం. అంత జోష్లోనూ కొత్త సంవత్సరమంటే కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వివిధ దేశాల ప్రజలు పాటించే ఆ సంప్రదాయాలు ఆసక్తిని రేపుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం. స్పెయిన్ డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మేల్కొని గడియారం ముల్లు సరిగ్గా 12 మీదకి రాగానే స్పెయిన్ దేశస్తులు 12 ద్రాక్షపళ్లు తింటారు. అలా తింటే అదృష్టం కలిసొస్తుందని వారి నమ్మకం. ఈక్వెడార్ ఈక్వెడార్లో డిసెంబర్ 31 రాత్రి ఎవరూ ఇళ్లల్లో ఉండరు. అందరూ రోడ్లపైనే గడుపుతారు. ప్రధాన కూడళ్లలో మంటలు రాజేసి రాజకీయ నాయకుల దిష్టి బొమ్మలను తగుల బెడతారు. ఈ చర్యతో గత ఏడాది కాలంలో జరిగిన చెడు అంతా పోయినట్టుగా భావిస్తారు. ఈ సంప్రదాయం 1895 నుంచి వస్తోంది. గ్రీస్ గ్రీస్లో జనవరి 1న చర్చికి వెళ్లి వచ్చిన వాళ్లందరికీ అక్కడ ఉల్లిపాయలు పంచుతారు. వాటిని తీసుకువచ్చి దండలా తయారు చేసి ఇంటి గుమ్మానికి వేళ్లాడతీస్తారు. ఉల్లిపాయలు అంటే ఆరోగ్యానికి, సంతానం వృద్ధికి, ఆయుఃప్రమాణాలు పెంచడానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే కొత్త సంవత్సరం ఉల్లిపాయల దండ గుమ్మానికి వేళ్లాడదీయడం శుభ పరిణామంగా విశ్వసిస్తారు. చెక్ రిపబ్లిక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా చెక్ రిపబ్లిక్లో యాపిల్ కట్ చేస్తారు. అదీ కొత్త ఏడాది తమ అదృష్టం ఎంతో తెలుసుకోవడం కోసం. యాపిల్ను మధ్యకి కోస్తారు. యాపిల్ మధ్య భాగంలో విత్తనాలు ఉన్న చోట స్టార్ వస్తే కొత్త ఏడాదంతా మంచే జరుగుతుందని, అదే క్రాస్ వస్తే చెడు జరుగుతుందని వారి నమ్మకం. జపాన్ జపాన్లో కొత్త సంవత్సరం అంటే అర్ధరాత్రి గంటల్ని గణగణమని మోగిస్తారు. రాత్రి 12 అవగానే 108 సార్లు గంటలు మోగుతాయి. అలా చేస్తేనే తమ జీవితం ఆనందంగా సాగుతుందని అంటారు. ఇటలీ ఇటలీలో కొత్త సంవత్సరం కాస్త వినూత్నంగా ఉంటుంది. చెత్త సామాను వదిలించుకోవడానికి ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఇంట్లో ఉన్న చెత్త సామానంతటినీ బయట పడేస్తారు. అంటే మనసుల్లో ఉన్న చెడు జ్ఞాపకాల్ని వదిలించుకోవడం అన్నమాట. దక్షిణాఫ్రికావంటి దేశాలూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. చిలీ కొత్త ఏడాది ఉత్సవాల్ని వివిధ దేశాల ప్రజలు చర్చిల్లో జరుపుకుంటే చిలీ వాసులు తమ రూటే సెపరేటు అంటున్నారు. తమకు అత్యంత ప్రియమైన వారి సమాధుల వద్ద ఈ సంబరాలు నిర్వహిస్తారు. సమాధుల్ని పూల తో అలంకరించి, దీపాలు ఉంచుతారు. ఈ లోకంలో లేకపోయినా సరే కొత్త సంవత్సరం ప్రియమైన వారిని తలచుకోవడం కంటే మించినదేదీ ఉండదని చిలీ వాసులు 1995 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. డెన్మార్క్ డెన్మార్క్లో రకరకాల పింగాణి పాత్రలు (క్రాకరీ)ని బద్దలు కొడతారు. ప్లేట్లు, కప్పులు, స్పూన్లు లాంటివన్నీ డిసెంబర్ 31 అర్ధరాత్రే విరగ్గొట్టేస్తారు. అప్పుడే అదృష్టం తమకి కలిసివస్తుందని వారి నమ్మకం. -
ఈ అమ్మాయి ఈ కాలపు మనిషి కాదు...
ఫొటో చూశారుగా.. అమ్మాయి భలే ముద్దుగా ఉంది కదూ. టామ్ జోక్లాండ్ అనే చిత్రకారుడు గీశాడు దీన్ని. అయితే ఏంటి అంటున్నారా? చాలా విశేషాలే ఉన్నాయి ఈ చిత్రం వెనుక. ఈ అమ్మాయి ఈ కాలపు మనిషి కాదు. సుమారు 5,700 ఏళ్ల క్రితం నివసించి ఉండొచ్చని అంచనా. డెన్మార్క్లోని సైల్థోలమ్ అనే ప్రాంతంలో తవ్వకాల్లో లభించిన ఓ బబుల్గమ్ (ఓ చెట్టు బెరడు. బబుల్గమ్లా నమిలేవారట) అవశేషం నుంచి ఈ అమ్మాయి చిత్రాన్ని రూపొందించారు శాస్త్రవేత్తలు. అదెలా అంటే ఈ బబుల్గమ్ అవశేషంలో అమ్మాయి తాలూకు డీఎన్ఏ లభించింది. దీని ఆధారంగా మొత్తం జన్యుక్రమాన్ని పునర్నిర్మించారు. అంతేకాకుండా నమిలిన కారణంగా ఆ అవశేషానికి నోటిలోని బ్యాక్టీరియా, ఆ చెట్టులో ఉండే సూక్ష్మజీవుల ఆనవాళ్లూ కనిపించాయి. వీటన్నింటి ఆధారంగా ఆ డీఎన్ఏ కలిగిన వ్యక్తి మహిళ అని గుర్తించారు. అంతేకాకుండా ఒడ్డూ పొడవు, కనులు, చర్మం రంగు వంటి వాటిని నిర్ధారించారు. ఆ విశేషాలను ఆధారంగా చేసుకుని టామ్ జోక్లాండ్ ఈ చిత్రాన్ని గీశారు. -
స్త్రీల హక్కులు, భద్రతలో డెన్మార్ నం.1
డిసెంబర్ 10 ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’. ఈ సందర్భంగా గత రెండు వారాలుగా ఐక్యరాజ్య సమితి లింగవివక్ష లేని, సమాన అవకాశాలు కలిగిన ప్రపంచమే లక్ష్యంగా విభిన్న కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా నవంబర్ 25ని ‘మహిళలపై హింసావ్యతిరేక దినోత్సవం’గా గుర్తించింది. అప్పటి నుంచి డిసెంబర్ 10 వరకు స్త్రీపురుష సమానత్వాన్ని చాటుతూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్త్రీల హక్కులూ మానవహక్కులుగా గుర్తించమని చెప్పడమే ఈ కార్యక్రమాల ఉద్దేశ్యం. స్త్రీల హక్కులు మానవ హక్కులే స్త్రీల హక్కులు మానవ హక్కుల్లో ఎందుకు భాగం కాదు? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. నిజానికి వారి శారీరక, మానసిక, భౌతిక అవసరాల రీత్యా స్త్రీలకు కొన్ని ప్రత్యేక హక్కులుండాలని ఐక్యరాజ్యసమితి గుర్తించి వాటిని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మలిచింది. అయితే వాటికిప్పటికింకా సమాజంలో ఆమోదముద్ర పడలేదన్నది కాదనలేని సత్యం. ఇప్పటికీ అది చేరుకోవాల్సిన లక్ష్యం. స్త్రీల హక్కులు మానవ హక్కుల్లో భాగమేనని గుర్తించిన దేశాలు బహు తక్కువని 2019 లింగ సమానత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 129 దేశాల్లో జరిపిన అధ్యయనంలో సంపూర్ణంగా లింగ సమానత్వాన్ని సాధించిన దేశాలు లేనేలేవన్న విషయం వెల్లడయ్యింది. అయితే స్త్రీపురుష సమానత్వం కోసం కృషి చేస్తోన్న దేశాల్లో కొంతలో కొంత మెరుగైన ఫలితాలను సాధించడం గమనించాల్సిన విషయం. కొన్ని దేశాల్లో కొంత మెరుగు... 2019లో జరిగిన సర్వే ప్రకారం లింగ సమానత్వం వైపు పురోగమిస్తోన్న టాప్ టెన్ దేశాల్లో డెన్మార్క్ది తొలిస్థానం. ఫిన్లాండ్ ద్వితీయస్థానంలో; స్వీడన్ మూడవ స్థానంలో ఉన్నాయి. నార్వే నాలుగు, నెదర్లాండ్స్ ఐదు, స్లోవేనియా ఆరు, జెర్మనీ ఏడు స్థానాల్లో ఉన్నాయి. కెనడా ఎనిమిదవ స్థానంలో ఉండగా, ఐర్లాండ్ తొమ్మిదవ స్థానాన్ని, ఆస్ట్రేలియా పదో స్థానాన్ని దక్కించుకున్నాయి. సమానత్వంలో టాప్ డెన్మార్క్... స్త్రీల విషయంలో టాప్ వన్ స్థానంలో నిలిచిన డెన్మార్క్ గురించి ఇప్పుడు మిగిలిన దేశాలు దృష్టి పెట్టాయి. డెన్మార్క్లో నాలుగ్గంటలకే సూర్యాస్తమయం అవుతుంది. అంటే డెన్మార్క్లో దీర్ఘరాత్రులుంటాయి. అయితే అక్కడ చీకటి అభద్రతకు చిహ్నం కాదు. ఆ దేశంలో మహిళలు పగలే కాదు రాత్రిళ్ళు కూడా అత్యంత సురక్షితంగా ఉంటారు. స్త్రీ పురుష సమానత్వాన్ని సా«ధించేందుకు ఆ దేశంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు సంక్షేమ రాజ్యంగా కూడా డెన్మార్క్ని పేర్కొంటారు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగావకాశాల్లో స్త్రీపురుష సమానత్వాన్ని విస్తృతంగా ముందుకు తెచ్చింది డెన్మార్క్ ప్రభుత్వం. డెన్మార్క్లో ఉపాధిరంగంలో ఉన్న మహిళలు అత్యధికంగా ఉన్నారు. స్త్రీ అయినా పురుషులు అయినా ఒకే విధమైన వేతన విధానాన్ని అనుసరించారు. ఆర్థిక రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ నిర్ణయాత్మక పాత్రలో మహిళలకూ సమ ప్రాధాన్యముంది. 2014 ఎన్నికల అనంతరం 30 శాతం మంది మంత్రులూ, 37 శాతం మంది పార్టీ నాయకులూ స్త్రీలే ఉన్నారు. వివిధ కంపెనీల్లో బోర్డు మెంబర్లుగా ఉన్న స్త్రీల శాతం పెరిగింది. ఇక్కడ స్త్రీలు 61 ఏళ్ళకు రిటైర్ అయితే, పురుషులకది 63 ఏళ్ళు. పునరుత్పత్తి హక్కులు... వివాహ వయస్సు, పునరుత్పత్తి హక్కుల విషయంలో డెన్మార్క్ ముందుంది. 2012లో ఇక్కడ స్త్రీలు తొలి బిడ్డను కనే వయస్సు 29. 52 వారాల పేరెంటల్ లీవ్ అమలుచేస్తున్నారు. అత్యధిక శాతం తల్లులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. భర్తలకు ఇచ్చే పిల్లల పెంపకానికి సంబంధించిన సెలవుని సైతం పెంచారు. పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత... మహిళా ఉద్యోగుల పిల్లల పెంపకానికి సంబంధించిన విషయాల్లో సైతం డెన్మార్క్ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రభుత్వమే పిల్లల సంరక్షణ బాధ్యతను వహిస్తోంది. వాటి పర్యవేక్షణకు సరిపడే అధికారులను, సిబ్బంది నియామకాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. 2013లో 0–2 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లల్లో 67.9 శాతం మందిని ప్రభుత్వం నిర్వహించే చైల్డ్ కేర్ సెంటర్లలో చేర్పించారు. అదే ఏడాది 3–5 ఏళ్ళ మధ్యవయస్సు పిల్లల్లో 97.2 శాతం మందిని చేర్పించారు. మానవ అక్రమ రవాణానిషేధంపై డెన్మార్క్ ప్రత్యేక దృష్టి సారించింది. –అరుణ అత్తలూరి -
వొజ్నియాకి వీడ్కోలు
పారిస్: ప్రపంచ మాజీ నంబర్వన్, డెన్మార్క్ భామ కరోలైన్ వొజ్నియాకి టెన్నిస్కు వీడ్కోలు పలకనుంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఆటకు గుడ్బై చెబుతానని వొజి్నయాకి ప్రకటించింది. 29 ఏళ్ల వొజి్నయాకి తన కెరీర్లో ఏకైక గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్ను గతేడాది గెల్చుకుంది. 2009, 2014 యూఎస్ ఓపెన్ టోరీ్నలలో రన్నరప్గా నిలిచింది. ‘టెన్నిస్లో నేను కోరుకున్నవన్నీ సాధించాను. నా జీవితంలో ఆట కంటే ఇతర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సమయం వస్తే టెన్నిస్కు వీడ్కోలు పలకాలని అనుకున్నాను’ అని కెరీర్లో 30 సింగిల్స్ టైటిల్స్ గెలిచిన వొజ్నియాకి తెలిపింది. 2005లో 15 ఏళ్ల ప్రాయంలో ప్రొఫెషనల్గా మారిన వొజ్నియాకి 2010లో అక్టోబరులో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంది. ఈ స్థానంలో ఆమె 71 వారాలు కొనసాగింది. వరుసగా 11 ఏళ్లపాటు టాప్–20లో నిలిచిన వొజ్నియాకి గాయాల కారణంగా ఈ ఏడాది కేవలం ఒక టోర్నీలో ఫైనల్కు చేరింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో వొజ్నియాకి 37వ ర్యాంక్లో ఉంది. -
అతడ్ని ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా బోర్ కొట్టదు
డెన్మార్క్ : అన్నెత్, కెన్నెత్ లండ్ల జంట చాలా ప్రత్యేకమైనది! అందుకే మోస్ట్ రొమాంటిక్ జంటగా ప్రపంచ రికార్డు సాధించింది. పెళ్లి చేసుకోవటం, ఏదో కారణం చెప్పి విడిపోవటం సాధారణ జంటల పనైతే.. ఈ జంట మాత్రం ప్రతి సంవత్సరం ఒకరినొకరు పెళ్లి చేసుకుంటూ వార్తల్లోకెక్కింది. వివరాల్లోకి వెళితే.. డెన్మార్క్కు చెందిన అన్నెత్, కెన్నెత్ లండ్ల జంట వెడ్డింగ్ ప్లానింగ్ సైట్ను నడుపుతోంది. అలా వారి చేతుల మీదగా చాలా పెళ్లిళ్లు చేశారు వారు. ‘పరాయి వాళ్లకు పెళ్లిళ్లు చేయటంలో ఏం మజా ఉంటుంది’ అనుకున్నాడో ఏమో! ఓ రోజు కెన్నెత్.. జన్నెత్ దగ్గరకు వెళ్లి ‘‘ మనం ప్రతి సంవత్సరం ఒకరినొకరు పెళ్లి చేసుకుందాం’’ అని అడిగాడు. అతడి మాటలకు ఆమె ఆశ్చర్యపడకపోగా ‘‘ ఈ ఐడియా ఏదో బాగుంది. అలానే చేద్దాం’’ అంటూ తన మద్దతు తెలిపింది. అంతే వెంటనే లాస్ వెగాస్కు వెళ్లిపోయి అక్కడి వెనీషియన్ హోటల్లో ఒకే రోజు నాలుగుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఈ నాలుగు సార్ల పెళ్లి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఆ తర్వాత ఓ పే..ద్ద కారులో ఆ మరుసటి ఏడాది హెలికాఫ్టర్లో స్కై డైవింగ్ చేస్తూ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయంపై జెన్నెత్ లండ్ మాట్లాడుతూ.. ‘‘ కెన్నెత్ను ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా నాకు బోర్ కొట్టదు. మా ప్రేమ అలాంటిది. ముసలివాళ్లమై చనిపోయే వరకు ఇలా పెళ్లి చేసుకుంటూనే ఉంటాం. అది చాలా సరదాగా ఉంటుంద’’ని పేర్కొంది. ఈ జంట మొదటిసారి కలుసుకోవటం కూడా ప్రత్యేకమైనదే. కెన్నెత్ మొదటిసారి జెన్నెత్ను ఆమె మాజీ భర్తతో పెళ్లి జరిగినపుడు చూశాడు. ఆ పెళ్లికి వెడ్డింగ్ ప్లానర్ కూడా అతడే. ఓ సంవత్సరం తర్వాత జెన్నెత్ మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఆ కొద్దినెలలకే 2005లో జెన్నెత్, కెన్నెత్లు వివాహం చేసుకున్నారు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
గ్రీన్లాండ్ను కొనేద్దామా!
వాషింగ్టన్/స్టాక్హోమ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలోనే అదిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్పై కన్నేశారు. ‘డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడం వీలవుతుందా?’ అని ట్రంప్ తన సలహాదారుల అభిప్రాయాన్ని కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అపారమైన సహజవనరులతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం కావడంతో గ్రీన్లాండ్పై ట్రంప్ దృష్టి సారించారు. డెన్మార్క్లో ప్రావిన్స్ అయిన గ్రీన్లాండ్కు స్వయంప్రతిపత్తి ఉంది. 20 లక్షల చదరపు కి.మీ విస్తీర్ణం గల గ్రీన్లాండ్ జనాభా 57వేలు. ఈ ద్వీపంలోని 85 శాతం భూభాగంపై 3 కి.మీ మందంతో మంచుదుప్పటి కప్పుకుంది. ట్రంప్ ప్రతిపాదనపై కొందరు సన్నిహితులు స్పందిస్తూ..‘గ్రీన్లాండ్లోని తూలేలో అమెరికాకు ఇప్పటికే వైమానిక స్థావరం ఉంది. కాబట్టి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం వ్యూహాత్మకమే’ అని తెలిపారు. అయితే అధికారం నుంచి తప్పుకునేలోపు తనపేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసేందుకే ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. 1946లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ గ్రీన్లాండ్ను తమకు అమ్మితే రూ.712.47 కోట్లు ఇస్తామని చెప్పగా, ఈ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది. గ్రీన్లాండ్లో విస్తారమైన హైడ్రోకార్బన్ నిక్షేపాలు, అరుదైన ఖనిజాలు, తీర ప్రాంతంపై అమెరికా అమితాసక్తితో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం వికీలీక్స్ బయటపెట్టింది. మేం అమ్మకానికి లేం: గ్రీన్లాండ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ఖండించింది. ఈ విషయమై గ్రీన్లాండ్ విదేశాంగ శాఖ స్పందిస్తూ..‘అమెరికాతో వ్యాపారానికి మా తలుపులు తెరిచిఉంటాయి. కానీ గ్రీన్లాండ్ అమ్మకానికి మేం సిద్ధంగా లేం. సహజవనరులు, చేపలు, పునరుత్పాదక విద్యుత్, సాహస క్రీడలకు గ్రీన్లాండ్ నెలవు’ అని స్పష్టం చేసింది. గ్రీన్లాండ్ మాజీ ప్రధాని లార్స్ రాముస్సేన్ మాట్లాడుతూ..‘ట్రంప్ ఏప్రిల్ ఫూల్ జోక్ చేస్తున్నారనుకుంటా. కానీ ఇది సీజన్ కాదుగా’ అని వ్యాఖ్యానించారు. మూడుదేశాల వలస పాలనలో.. గ్రీన్లాండ్ను 13వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దంవరకూ నార్వే పాలించింది. 1499లో పోర్చుగీసు వారు ఈ ద్వీపం తమదని ప్రకటించుకున్నారు. 18వ శతాబ్దం ఆరంభంలో గ్రీన్లాండ్ను ఉమ్మడిగా పరిపాలించాలని డెన్మార్క్–నార్వే నిర్ణయించాయి. 1814లో నార్వే–స్వీడన్ విడిపోవడంతో గ్రీన్లాండ్పై అధికారాలు డెన్మార్క్కు దక్కాయి. గ్రీన్లాండ్లో మెజారిటీ ఇన్యుట్ జాతిప్రజలే. వీరంతా గ్రీన్లాండిక్ భాష మాట్లాడుతారు. దీంతో ఈ ప్రాంతంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా కాలనీగా ఉన్న గ్రీన్లాండ్ను డెన్మార్క్ 1953లో విలీనం చేసుకుంది. డానిష్ భాషను తప్పనిసరి చేసింది. దీంతో ఉన్నతవిద్య కోసం పలువురు గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్కు వెళ్లడం ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమైనా గ్రీన్లాండ్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష బయలుదేరింది. దీంతో డెన్మార్క్ 1972లో హోంరూల్ చట్టం తీసుకొచ్చింది. విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, సహజవనరులు మినహా అన్ని అధికారాలను స్థానిక ప్రభుత్వానికి అప్పగించింది. 2008లో జరిగిన రెఫరెండంలో మరిన్ని అధికారాలు కావాలని గ్రీన్లాండర్లు తీర్పునిచ్చారు. దీంతో పోలీస్, న్యాయ వ్యవస్థలు, సహజవనరులు, విమానయానం, సరిహద్దు చట్టాలు చేసే అధికారం గ్రీన్లాండ్కు దక్కాయి. -
శ్రీలంక పేలుళ్లు; ‘కుబేరుడి’ ముగ్గురు పిల్లలు మృతి
కోపెన్హాగ్ : శ్రీలంకలోని వరుస బాంబు పేలుళ్లు ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. ముష్కరుల ఉన్మాద చర్య కారణంగా వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వీరిలో సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు, వారి పిల్లలు కూడా ఉన్నారు. శ్రీలంక టీవీ సెలబ్రిటీ చెఫ్ శాంతా మయదున్నెతో పాటు ఆమె కూతురు నిళంగా కూడా మరణించగా... సెలవులు ఎంజాయ్ చేసేందుకు వచ్చిన డెన్మార్క్ ‘కుబేరుడి’ ముగ్గురు పిల్లలు కూడా మృతి చెందడం పట్ల విచారం వ్యక్తమవుతోంది. డెన్మార్క్లో అత్యంత సంపన్నుడిగా ఖ్యాతిగాంచిన ఆండర్స్ హోల్చ్ పోవల్సన్కు నలుగురు సంతానం. హాలిడే ట్రిప్ కోసం ఈయన ముగ్గురు పిల్లలు శ్రీలంకకు వచ్చారు. కాగా ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లలో వీరు మరణించినట్లు ఆండర్స్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే వారు ఎక్కడ బస చేశారు, వారితో పాటు ఎవరు వెళ్లారన్న విషయాలపై మాత్రం స్పష్టతనివ్వలేదు. కాగా ఫ్యాషన్ ఫర్మ్ ‘బెస్ట్సెల్లర్’ యజమాని అయిన ఆండర్స్.. డెన్మార్క్లోనే అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందారు. ఫ్యాషన్ ప్రియులకు సుపరిచితమైన వెరో మోడా, జాక్ అండ్ జోన్స్ తదితర ప్రసిద్ధ బ్రాండ్లను ఎక్స్పోర్ట్ చేసే ఆండర్స్ కంపెనీ దేశీ ఆన్లైన్ రీటైల్ మార్కెట్లో ప్రధాన స్టాక్హోల్డర్గా ఉంది. అంతేగాక స్కాట్లాండ్లో ఉన్న మొత్తం భూభాగంలో.. ఒకటి కంటే ఎక్కువ శాతం భూములకు ఆండర్స్ యజమాని అని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. ఇక శ్రీలంకలోని ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మంది మరణించగా, 450 మంది గాయాలపాలయ్యారు. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. అయితే ఈ ఘటన కారణంగా లంక పర్యాటకంపై పెద్ద దెబ్బే పడనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెలవుల సీజన్ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడం.. అందులో సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు మృతి చెందడం దురదృష్టకరమని.. వీటి ప్రభావం కచ్చితంగా తమ వ్యాపారిన్ని దెబ్బతీస్తుందని టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
డెన్మార్క్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
కొపెన్ హెగెన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్(టాడ్) ఆధ్వర్యంలో కొపెన్ హెగెన్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటూ అత్యంత వైభవంగా గణేషుని ఉత్సవాలు జరిపి , చివరిరోజు భారీ ర్యాలీగా డానిష్ వీధుల్లో ఊరెంగించి సరస్సులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డాన్యులతో దారిపొడవునా సందడి చేశారు. గణేష్ ఉత్సవాలు భారతీయుల ఐక్యతకు నిదర్శనం అని టీఏడీ అధ్యక్షులు సతీష్ రెడ్డి సామ అన్నారు. వేలంపాటలో గణేష్ లడ్డూ, కలశం, పట్టు వస్త్రం గెలుచుకున్న అశ్విన్కుమార్, రాజు పోరెడ్డి, జయచందర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవాలకు అన్ని విధాలుగా సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాడ్ బోర్డు సభ్యులు సంగమేశ్వర్ పగిల్ల, జయచందర్ రెడ్డి, వెంకటేష్, రాజారెడ్డి, రఘు కలకుంట్ల, ఉపేందర్, జగదీష్, దాము, రంజిత్, కరుణాకర్, రాజు ముచంతుల, వాసు, డేవిడ్ క్రిస్టీన్, నర్మద, ప్రీమియం సభ్యుల సహకారంతో నిర్వహించారు. -
బుర్ఖా, నిఖాబ్ బ్యాన్.. కాదంటే జరిమానా
స్టాక్హోమ్ : డెన్మార్మ్లోని హోర్షొల్మ్ ప్రాంతంలో ఒక షాపింగ్ మాల్ దగ్గర ఇద్దరు స్త్రీలు గొడవ పడుతున్నారు. వారిలో ఒక స్త్రీ, మరో ముస్లిం మహిళ(28) ధరించిన ‘నిఖాబ్’ / ‘హిజాబ్’ (ముఖాన్ని కప్పి ఉంచి వస్త్రం)ను తొలగించే ప్రయత్నం చేస్తోంది. దాంతో ఆ ముస్లిం యువతి ‘నిఖాబ్’ తొలగిపోయింది. ఆమె వెంటనే దాన్ని సవరించుకుంది. ఇంతలో పోలీసులు వెళ్లి ఆ గొడవ సద్దుమణిగేలా చేశారు. అనంతరం ఆ ముస్లిం యువతికి జరిమానా విధించారు. అంతేకాక ఇది తొలిసారి కాబట్టి మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. ‘ఒకటి జరిమానా చెల్లించాలి లేదా నిఖాబ్ ధరించి మీరు బహిరంగ ప్రదేశాలకు రాకుడదు’ అని చెప్పారు. దాంతో ఆ మహిళ రెండో దాన్ని (నిఖాబ్ ధరించి బహిరంగ ప్రదేశాలకు రాకుండా ఉండటం) ఎంచుకుంది. ముస్లిం మహిళ అన్నప్పుడు నిఖాబ్ ధరించడం సాంప్రదాయం కదా. మరి జరిమానా ఎందుకు విధించారు..? ఎందుకంటే చాలా యూరోప్ దేశాలతో పాటు డెన్మార్క్లో కూడా ఈ ఆగస్టు 1 నుంచి ముఖాన్ని కప్పి ఉంచే బుర్ఖా, నిఖాబ్, మాస్క్లు, స్కార్ఫ్లను నిషేధించారు. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు వీటిని ధరించి వస్తే జరిమానా విధిస్తున్నారు. అసలు ముస్లిం మహిళలు అనగానే బుర్ఖా లేదా నిఖాబ్ ధరించిన వారి రూపాలు మన కళ్ల ముందు మెదులుతాయి. ముస్లిం దేశాల్లో వీటిని ధరించకుండా ఆడవారు బయటకు రావడం నిషేధం. కానీ యూరోప్ దేశాల్లో ఇందుకు విరుద్ధమైన నిబంధనలు రూపొందిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు మహిళలు బుర్ఖా లేదా నిఖాబ్ ధరించ కూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేస్తున్నారు. కానీ ముస్లిం మహిళలు ఇందుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. మానవ హక్కుల సంఘం వారు కూడా వీరికి మద్దతిస్తూ, మహిళల హక్కులను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఆఖరి ‘కిక్’ క్రొయేషియాదే
ప్రేక్షకులింకా స్టేడియంలో కుదురుకోనేలేదు...అభిమానులింకా టీవీల ముందు సర్దుకోనేలేదు...ఫటాఫట్... రెండు గోల్స్ పడిపోయాయి!ఆరంభం అదిరిందనుకుంటే... మళ్లీ స్కోరే లేదు!నాకౌట్ మొదటి రోజు రెండు దిగ్గజ జట్లు నిష్క్రమిస్తే...రెండో రోజు రెండు మ్యాచ్లూ పెనాల్టీ షూటౌట్కు దారితీశాయి!ఇందులో క్రొయేషియానే కొట్టేసింది... డెన్మార్క్ ‘అవుటైంది’...! నిజ్ని నవ్గొరొడ్: సాకర్ ప్రపంచకప్ ప్రి క్వార్టర్స్లో మరో రసవత్తర పోరు. ఆదివారం రాత్రి మ్యాచ్లో ఆతిథ్య రష్యా 4–3తో స్పెయిన్పై పెనాల్టీ షూటౌట్లో గెలుపొందగా... అర్ధరాత్రి జరిగిన మ్యాచ్లోనూ ఇదే తరహాలో ఫలితం వచ్చింది. కాకపోతే, మొదటిదాని కంటే ఇంకొంత ఉత్కంఠగా...! ఇందులో డెన్మార్క్ గట్టి పోటీనిచ్చినా, ఆఖరి కిక్ క్రొయేషియాదే. ఆజట్టు 3–2 తేడాతో నెగ్గింది. నిర్ణీత 90 నిమిషాలతో పాటు, అదనపు అరగంట ముగిశాక కూడా రెండు జట్లూ 1–1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. అప్పటికీ తొలి, నాలుగో కిక్లను గోల్ కీపర్లు కాస్పర్ షమిచెల్ (డెన్మార్క్), డానిజెల్ కబాసిక్ (క్రొయేషియా) అడ్డుకోవడంతో స్కోరు 2–2తో నిలిచి ఉద్విగ్నత పతాక స్థాయికి చేరింది. అయిదో కిక్ను జొర్గెన్సన్ నెట్లోకి పంపడంలో విఫలం కాగా, రాక్టిక్ విజయవంతమయ్యాడు. ఒకట్లో ఒకటి... నాలుగులో రెండోది ఆటగాళ్లు గోల్పోస్ట్ల వద్దకు దూసుకురావడంతో వెంటవెంటనే ఇరువైపులా స్కోర్లు నమోదయ్యాయి. మొదటి నిమిషంలోనే దూరం నుంచి వచ్చిన పాస్ను పెనాల్టీ ఏరియాలో అందుకున్న మథియాస్ జొర్గెన్సన్... పెనుగులాట మధ్య గోల్ చేసి డెన్మార్క్ను ఆధిక్యంలో నిలిపాడు. తేరుకున్న క్రొయేషియా 4వ నిమిషంలోనే సమం చేసేసింది. కుడివైపు ప్రాంతంలో బంతిని దొరకబుచ్చుకున్న మారియో మన్డ్జుక్ చిక్కకుండా ముందుకెళ్లి గోల్గా మలిచాడు. క్రొయేషియా కళ్లెం వేసినా... డెన్మార్క్ ఆత్మవిశ్వాసంతో ఆడింది. కానీ, క్రొయేషియా మిడ్ఫీల్డ్ను దాటి డెన్మార్క్ ముందుకు వెళ్లలేకపోయింది. తీవ్ర స్థాయిలో శ్రమించినా ఎవరూ గోల్ చేయలేకపోయారు. దీంతో అదనపు అరగంట అనివార్యమైంది. జొర్గెన్సన్ ఫౌల్తో 116వ నిమిషంలో క్రొయేషియాకు పెనాల్టీ కిక్ దక్కింది. అయితే, మొడ్రిక్ కొట్టిన ఈ షాట్ను షెమిచెల్ నిలువరించాడు. ఇది తప్ప మెరుపులు లేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ను అశ్రయించారు. కీపర్ల ప్రతిభతో ఇందులో నాలుగో కిక్ వరకు హై డ్రామా నడించింది. అయిదో కిక్ను పొరపాటు చేయకుండా రాక్టిక్ నెట్లోకి కొట్టి జట్టుకు గెలుపును కట్టబెట్టాడు. -
20 ఏళ్ల తర్వాత క్రొయేషియా..
నిజ్నీ నోవ్గారోడ్(రష్యా): ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ దశలో దుమ్మురేపిన క్రొయేషియా జట్టు ఊహించినట్లే క్వార్టర్స్కు చేరింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్లో క్రొయేషియా 3-2 తేడాతో డెన్మార్క్ను ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇరు జట్లు నిర్ణీత సమయానికి 1-1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌల్లో క్రొయేషియా మూడు గోల్స్ సాధించగా, డెన్మార్క్ రెండు గోల్స్ మాత్రమే చేసింది. దాంతో క్రొయేషియా మరో నాకౌట్ సమరానికి సిద్ధమైంది. శనివారం ఆతిథ్య రష్యాతో క్రొయేషియా క్వార్టర్స్లో తలపడనుంది. వరల్డ్ కప్లో క్రొయేషియా క్వార్టర్స్కు చేరడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1998లో ఫ్రాన్స్లో జరిగిన వరల్డ్ కప్లో చివరిసారి క్రొయేషియా క్వార్టర్స్కు చేరగా, ఆపై ఇంతకాలానికి మరొకసారి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. నిన్నటి మ్యాచ్లో క్రొయేషియా-డెన్మార్క్లు మొదటి నాలుగు నిమిషాల వ్యవధిలోనే తలో గోల్స్ చేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అనిపించింది. కాగా, ఆపై ఇరు జట్లు అత్యంత రక్షణాత్మకంగా ఆడటంతో అదనపు సమయంలో కూడా గోల్స్ను సాధించలేకపోయాయి. దాంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని తేల్చారు.