సముద్రంలో యువకుడి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

సముద్రంలో యువకుడి గల్లంతు

Published Fri, Apr 11 2025 12:10 AM | Last Updated on Fri, Apr 11 2025 12:10 AM

సముద్రంలో  యువకుడి గల్లంతు

సముద్రంలో యువకుడి గల్లంతు

ఉలవపాడు: సముద్రంలో యువకుడు గల్లంతైన ఘటన మండల పరిధిలోని కరేడు తీరంలో గురువారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కరేడు చైతన్యనగర్‌కు చెందిన శింగోతు హేమంత్‌ ఇటీవల ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం పరీక్షలు రాశాడు. గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు మిత్రులతో కలిసి తమ కాలనీకి అర కిలోమీటర్‌ దూరంలో ఉన్న సముద్రంలో స్నానానికి వెళ్లాడు. హేమంత్‌ అలల తాకిడికి లోపలికి వెళ్లిపోయాడు. స్నేహితులు గ్రామంలో సమాచారం అందించడంతో అక్కడివారొచ్చి వెతికారు. అయితే ఉపయోగం లేకుండా పోయింది. ఎస్సై అంకమ్మ తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుమారుడు గల్లంతవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement