కవిటి: మండలంలోని సీహెచ్ కపాసుకుద్ధి పంచాయతీ వడ్డిపుట్టుగకు చెందిన ఎలుసూరు సోనియా(25) అనే యువతి మంగళవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోనియా మానసిక సమస్యలతో బాధపడుతోంది. కొన్నాళ్లుగా చికిత్సకూడా పొందుతోంది. ఇటీవలే ఆరోగ్యం కుదుటపడటంతో కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం చూశారు. మే నెలలో వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఇంతలో సోనియా ఆత్మహత్యకు పాల్పడడంతో విషాదఛాయలు అలముకున్నాయి. తండ్రి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవిటి ఎస్ఐ వి.రవివర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment