మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
హిరమండలం: బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన భార్య, సమయానికి రాకపోవడంతో మండలంలో ధనుపురం గ్రామ సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేసుకొని గొర్లె కన్నారావు (34) అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరుకు చెందిన కన్నారావు దంపతులు ఊరూరా గాడిద పాలు అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. ధనుపురం స్పైసీ దాబా సమీపంలోని ఖాళీ గదుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్నిరోజులుగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల అతడి భార్య ఆమె చెల్లెలు ఉన్న కవిటి గ్రామానికి వెళ్లింది. ఆదివారం తిరిగి వస్తానని చెప్పి రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కన్నారావు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తల్లి జి.సీతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎండీ యాసిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. మృతుడికి భార్య, ఎనిమిదేళ్ల పాప, ఆరేళ్ల బాబు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment