వచ్చే నెలలో భద్రాచలం– సత్తుపల్లి రైల్వే లైన్‌ పూర్తి | Bhadrachalam Sattupalli Railway Line By March: SCCL CMD | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో భద్రాచలం– సత్తుపల్లి రైల్వే లైన్‌ పూర్తి

Published Sat, Feb 5 2022 2:42 AM | Last Updated on Sat, Feb 5 2022 2:42 AM

Bhadrachalam Sattupalli Railway Line By March: SCCL CMD - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కాలరీస్‌–దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా చేపట్టిన 54 కిలోమీటర్ల భద్రాచలం–సత్తుపల్లి రైల్వే లైన్‌ పనులు వచ్చే నెలాఖరుకు పూర్తయ్యేలా చూడాలని అధికారులను సింగరేణి డైరెక్టర్లు ఎన్‌.బలరామ్, డి.సత్యనారాయణరావు ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ లైన్‌ మార్గం పూర్తయితే పర్యావరణ హితంగా బొగ్గు రవాణా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.

సత్తుపల్లి వద్ద నిర్మిస్తున్న అతి పెద్ద సీహెచ్‌పీ నిర్మాణం కూడా మార్చికల్లా పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 68 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా ఉపరితల గనుల్లో రోజూ 15 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ను వెలికి తీయాలని ఓబీ కాంట్రాక్టర్లను డైరెక్టర్లు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement