railway line
-
ఇంత మోసమా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు : అమరావతి రైల్వే ప్రాజెక్టు( Amaravati railway line) భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని రాజధాని గ్రామాల ప్రజలు తీవ్ర అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించ రైల్వే లైన్కు భూమి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. భూ సేకరణ కాకుండా సమీకరణ చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. బలవంతంగా భూసేకరణకు సిద్ధమైతే కోర్టును ఆశ్రయించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.అమరావతి రైల్వే లైన్ కోసం గుంటూరు జిల్లాలో 1,753 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.అమరావతి మండలం కర్లపూడి గ్రామంలోనే 232 ఎకరాలు సేకరించనున్నారు. ఇదే గ్రామంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం 153 ఎకరాలు, ఈ7, ఈ8, ఈ9 రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్డు కోసం 900 ఎకరాలు కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే లైన్కు భూమి ఇవ్వాలని, దీనికి కేంద్రం ఇచ్చే ప్యాకేజి సరిపోదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం కోసం ఎక్కడో ఉన్న గన్నవరంలో భూములిచ్చిన వారికి రాజ«దానిలో 1,450 గజాలు ల్యాండ్పూలింగ్ ప్యాకేజి కింద ఇచ్చారని, తమకు మాత్రం ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.పెగ్ మార్కింగ్ ఎలా చేస్తారు?ప్రభుత్వం రైతులతో సమావేశాలు పెట్టినా, వారి అభ్యంతరాలు స్వీకరించకుండానే రైల్వే లైన్ భూసేకరణకు పెగ్మార్కింగ్కు సిద్ధపడుతోంది. ఇలా ఇష్టానుసారం పెగ్ మార్కింగ్కు షెడ్యూల్ ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అమరావతి తహసీల్దార్తో జరిగిన సమావేశంలో కర్లపూడి రైతులు ఇదే విషయాన్ని చెప్పారు. పోలీసు బందోబస్తుతో పెగ్మార్కింగ్కు రావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.రాజధాని పరిసర ప్రాంతాల్లోని కంతేరు, కొప్పురావూరు, తాడికొండ, మోతడక గ్రామాల రైతులు రైల్వే లైన్ భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామసభల్లో తీర్మానాలు కూడా చేశారు. రైల్వేలైన్ వల్ల పక్కన ఉన్న భూముల ధరలు కూడా పడిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల పక్కనే 500 మీటర్ల వరకూ భూమిని సేకరించి, రైల్వే లైన్కు రెండువైపులా సర్వీస్రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇంత అన్యాయమా?ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భూముల ప్రభుత్వ విలువ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని, పరిసర ప్రాంతాల్లో మాత్రం పెంచలేదు. ఇదేమి అన్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల రైల్వే లైన్ భూ సేకరణలో తాము తీవ్రంగా నష్టపోతామని చెబుతునానరు. తమ గ్రామంలో భూమి ప్రభుత్వ విలువ రూ. 16 లక్షలు ఉంటే దాన్ని కేవలం రూ. 4 లక్షలు పెంచి రూ. 20 లక్షలు చేశారని, మిగిలిన చోట్ల అసలు పెంచలేదని కర్లపూడి రైతులు చెబుతున్నారు.బహిరంగ మార్కెట్లో తమ భూముల ఎకరా దాదాపు రూ. 4 కోట్లు ఉండగా, ఇప్పుడు రైల్వే నుంచి రూ. 50 లక్షలు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రైల్వే ప్యాకేజికి అదనంగా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చే ప్యాకేజిలో 33 శాతం అంటే 410 గజాల స్థలం ఇప్పిస్తామని మంత్రి నారాయణ ఇటీవల రైతులకు సర్దిచెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 650 గజాల వరకు ఇప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే దీనికి కూడా రైతులు అంగీకరించడంలేదు. పూర్తిగా పూలింగ్ ప్యాకేజి ఇవ్వాలని కోరుతున్నారు.రాజధాని రైతులకు ఇచ్చినట్లుగా ఫారం.9.14 ఇవ్వాలని, అందులో ఎంత భూమి ఇస్తారు, ఇళ్ల స్థలం ఎంత, వాణిజ్య స్థలం ఎంత? కౌలు ఎన్ని సంవత్సరాలు ఇస్తారన్న విషయాలను స్పష్టం చేయకుండా భూములు ఇచ్చేది లేదని వారు చెబుతున్నారు. అసలు రైల్వే లైన్ అలైన్మెంటే తప్పు అని రైతులు అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ చేసిన గ్రామాల నుంచి కాకుండా బయట నుంచి రైల్వే లైన్ వెళ్లడం వల్ల 4 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని వాదిస్తున్నారు. గతంలో ఇచ్చిన మాస్టర్ ప్లాన్ను కదపకుండా బయట నుంచి అలైన్మెంట్ ఇచ్చామని మంత్రి నారాయణ చెబుతున్నారు. -
కోల్ కారిడార్కు లైన్క్లియర్!
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ ప్రతిపాదనలకే పరిమితమైన కోల్ కారిడార్ ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ఇటీవల అందిన డీపీఆర్ను పరిశీలించిన రైల్వే బోర్డు, దీనిని సాధ్యమయ్యే ప్రాజెక్టుగా తేల్చటంతో తుది ఆమోదం లభించే కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ(సీసీఈఏ)కి చేరింది. ఇక్కడ ఆమోదం లభిస్తే.. కేంద్ర బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించే అవకాశం ఉంది. 207.80 కి.మీ. నిడివితో ఉండే ఈ కారిడార్ నిర్మాణానికి రూ.3997 కోట్లు ఖర్చవుతుందని డీపీఆర్లో పొందుపరిచారు. 1999లో తొలుత ఈ లైన్కు ప్రతిపాదించగా, తిరిగి 2013లో మరోసారి రూ.1112 కోట్ల నిర్మాణ అంచనాతో ప్రతిపాదనను పునరుద్ధరించారు. చివరకు గతేడాది అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రైళ్ల ట్రాఫిక్ సాంద్రత 140 శాతంగా ఉండటంతో.... ప్రస్తుతం రామగుండం నుంచి మణుగూరుకు వరంగల్–మహబూబాబాద్–డోర్నకల్–కారేపల్లి–పాండురంగాపురం మీదుగా రైల్వేలైన్ ఉంది. ఈ మార్గంలో మణుగూరు వెళ్లాలంటే 287 కి.మీ. ప్రయాణించాలి. ఈ మార్గంలో డోర్నకల్ జంక్షన్ వరకు విజయవాడ, విశాఖపట్నం మార్గం కావటంతో ప్రయాణికుల రైళ్లు అధికంగా తిరుగుతాయి. రామగుండం నుంచి బొగ్గులోడుతో గూడ్సు రైళ్లు అధికంగా తిరుగుతాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల ట్రాఫిక్ సాంద్రత 140 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో రామగుండం–మణుగూరు మధ్య నేరుగా ప్రత్యామ్నాయ రైలు మార్గం అవసరమని నిర్ణయించారు. కొత్త మార్గంలో ప్రయాణిస్తే 80 కి.మీ. నిడివి తగ్గుతుంది. దీంతో సమయంతోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. అన్నింటికి మించి రైలు ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గి ఇటు ప్రయాణికుల రైళ్లు, అటు సరుకు రవాణా రైళ్లు వేగంగా గమ్యం చేరతాయి. కోల్మైన్ టూ పవర్ప్లాంట్స్.. రామగుండం నుంచి పెద్ద ఎత్తున బొగ్గు వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా అవుతుంది. ప్రస్తుతం సరైన రైలు మార్గం లేక రోడ్డు ద్వారా తరలిస్తున్నారు. రోడ్లు పాడవటంతోపాటు ఖర్చు కూడా అధికంగా ఉంటోంది. రైల్వేలైన్ అందుబాటులో ఉంటే..మణుగూరులో ఉన్న భద్రాద్రి పవర్ప్లాంట్కు బొగ్గు తరలింపు సులభవుతుంది. దీంతోపాటు కాకతీయ, పాల్వంచ పవర్ప్లాంట్లకు దగ్గరి దారి అవుతుంది. ఇక కొత్తగూడెం నుంచి ఒడిశాలోని మల్కన్గిరికి కొత్తలైన్ నిర్మిస్తోంది. అక్కడి పారిశ్రామిక వాడతో ఈ కొత్త మార్గం అనుసంధానం కానుంది. వెరసి పారిశ్రామిక పురోగతికి కూడా ఇది దోహదం చేయనుంది. పర్యాటక ప్రాంతాల అనుసంధానం.. పర్యాటకులు అధికంగా వచ్చే ప్రాంతాలతో కొత్త మార్గం నిర్మించనున్నారు. కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోట గుళ్లు, లక్నవరం, బొగత జలపాతం ప్రాంతాల మీదుగా సాగుతుంది. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు ఇది ఎంతో వీలుగా ఉంటుంది. పర్యాటకంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ అటవీ ప్రాంతాలు కావటంతో సరైన రవాణా వ్యవస్థ లేదు. లక్షల మంది వచ్చే మేడారం జాతర సందర్భంలో భక్తులు ఆ ప్రాంతానికి చేరేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైలుమార్గం అందుబాటులోకి వస్తే, ప్రత్యేక రైళ్లు నడపటం ద్వారా లక్షల మందిని సులభంగా తరలించే వీలు కలుగుతుంది. గిరిజిన ప్రాంత ప్రయాణికులకు.. గిరిజన ప్రాంతాలకు సరైన రైలు మార్గం లేదన్న వెలితి కూడా దీనితో తీరుతుంది. రాఘవాపురం, మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి లాంటి ప్రాంతాలవాసులకు ఈ రైలు మార్గం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కొత్త మార్గంలో దాదాపు 13 వరకు స్టేషన్లు ఉండే అవకాశముంది. ఉత్తర భారత్ వైపు వెళ్లే రైళ్లను ఎక్కువగా నడిపేందుకు ఇది ప్రత్యామ్నాయ లింకు మార్గంగా ఉపయోగపడుతుంది. ఢిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాల ప్రయాణ సమయాన్ని ఇది తగ్గిస్తుంది. రైటప్: కొత్తగా నిర్మించే రైల్వే లైన్ మార్గం ఇలా.. -
కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్.. రైల్వే మంత్రి కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ క్రమంలో కడప-పెండ్లిమర్రి సెక్షన్ మధ్య లైన్ పూర్తి అయినట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు రూ. 359 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చారు.పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కడప-బెంగళూరు కొత్త రైల్వే లైన్పై వైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక జవాబు ఇచ్చారు. ఈ క్రమంలో మంత్రి అశ్విని వైష్ణవ్.. ఈ రైల్వే లైన్ కోసం రూ.2706 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పటివరకు రూ.359 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. కడప-పెండ్లిమర్రి సెక్షన్ మధ్య లైన్ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కొత్త లైన్ కోసం సర్వే కోసం ఆమోదం తెలిపాం. ముద్దనూరు-పులివెందుల-ముదిగుబ్బ-శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం మీదుగా కడప నుంచి ఈ లైన్ వెళ్తుంది అని స్పష్టం చేశారు. -
భూములిచ్చేందుకు వ్యతిరేకం... సమీకరణకైతే సిద్ధం
తాడికొండ: అమరావతిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నంబూరు–ఎర్రుపాలెం రైల్వేలైన్కు భూములిచ్చేందుకు తామంతా వ్యతిరేకమని, సమీకరణకైతే సిద్ధమని రైతులు స్పష్టం చేశారు. తాడికొండలో ఆదివారం గ్రామసభ నిర్వహించి ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. సర్పంచ్ తోకల సరోజినీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం రైల్వేలైన్ పేరుతో తాము సాగుచేసుకుంటున్న భూములను తీసుకుంటే ఒప్పుకోమన్నారు. తమకు జీవనాధారమైన భూములను కోల్పోతే కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రభుత్వం స్పందించి అమరావతికి సంబంధించిన ఏ ప్రాజెక్టు చేపట్టినా భూ సేకరణ ద్వారా కాకుండా భూ సమీకరణ ద్వారా తీసుకొని రాజధాని రైతులకు వర్తింపజేసిన ప్రయోజనాలే తమకూ కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకెళ్లామని, వారు సానుకూలంగా స్పందించలేదని, భూములు కోల్పోతున్న రైతులంతా గ్రామసభ ఏర్పాటు చేసి మాకుమ్మడి తీర్మానంతో పాటు వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకిస్తున్నట్లు అంగీకార పత్రాలను సంతకాలు చేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో అంతా కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. -
అమరావతి రైల్వే లైన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం.. నంబూరు నుంచి అమరావతి మీదుగా ఎర్రుపాలెం వరకు 57 కిలోమీటర్ల మేర నిర్మాణం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అమరావతి రైల్వేలైన్కు కేంద్రం ఆమోదం..
-
అమరావతి రైల్వేలైన్కు కేంద్రం ఆమోదం
సాక్షి, ఢిల్లీ: అమరావతి రైల్వే లైన్కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కృష్ణానదిపై 3.2 కిమీ మేర రైల్వే వంతెన నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. రూ. 2,245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్ నిర్మాణం జరగనుంది. రాజధాని అమరావతికి హైదరాబాద్, చైన్నె, కోల్కోత్తాకు అనుసంధానిస్తూ కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేయనున్నారు.ఐదేళ్లలో రైల్వే లైన్ పూర్తిచేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో రెండు నూతన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 6798 కోట్ల రూపాయలతో రైల్వే లైన్ల నిర్మాణం చేయనుంది. నర్కతీయ గంజ్-రాక్సౌల్-సీతా మరి-దర్భంగా-సీతా మరి-ముజఫర్పూర్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ చేపట్టనున్నారు.ఇదీ చదవండి: బాబుపై కేసుల సంగతి ఇక అంతేనా? -
తెలంగాణలో కొత్త లైన్, ఉప్పల్ స్టేషన్.. రైల్వే మంత్రికి బండి సంజయ్ లేఖ
సాక్షి, ఢిల్లీ: కరీంనగర్–హసన్పర్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్..రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి బండి సంజయ్ లేఖ ఇచ్చారు.ఈ సందర్భంగా బండి సంజయ్ లేఖలో..‘కరీంనగర్ నుండి హసన్పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లైన్కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుంది. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు. రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్లో ఉందని, తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, కరీంనగర్–వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఆర్దిక వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ను అప్ గ్రేడ్ చేయాలని, జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో లేఖ అందజేశారు. ఉప్పల్ స్టేషన్ అప్ గ్రేడ్లో భాగంగా ప్లాట్ ఫాం, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని, కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలని కోరారు. ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపర్చాలని, పార్కింగ్ను విస్తరించాలన్నారు. అలాగే, సోలార్ ప్యానల్స్ను కూడా అమర్చాలని, టిక్కెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో మేలు కలిగించే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: ఎందుకీ హైడ్రామాలు.. బండి సంజయ్ ఫైర్ -
కొత్త రైలు.. కొండ కోనల్లో హొయలు
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఒడిశాలోని మల్కనగిరి నుంచి భద్రాచలం సమీపంలోని పాండురంగాపురం వరకు సుమారు 173 కిలోమీటర్ల కొత్త రైల్వే లైను ఇటీవల మంజూరైంది. ఈ లైనుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ప్లాన్లో భాగంగా ఈ రైల్వేలైను నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఒడిశాలోని మల్కనగిరి నుంచి ఆంధ్రాలోని విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా తెలంగాణలోని పాండురంగాపురం వరకు కొత్త లైను నిర్మించనున్నారు. లైను నిర్మాణంలో భాగంగా 213 వంతెనలు నిర్మించనున్నారు. వీటిలో 48 పెద్ద వంతెనలు, 165 చిన్న వంతెనలున్నాయి. ముంపు మాటేంటి? విలీన మండలాల్లో ప్రతిపాదించిన రైల్వేలైను పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవనుంది. చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరుగట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో నిర్మించనున్న స్టేషన్లు సైతం ముంపునకు గురయ్యే అవకాశముంది. దీంతోపాటు శబరినదిపై నిర్మించే వంతెన సైతం ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్వే చేసిన మార్గం గుండా కాకుండా ముంపునకు గురికాని మార్గంలో లైను నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. లైనుతో పాటు స్టేషన్లు ముంపు పరిస్థితిపై రైల్వే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని స్థానికులు వేచి చూస్తున్నారు. విలీన మండలాల మీదుగా.. మల్కనగిరి నుంచి భద్రాచలం వరకు నిర్మించనున్న రైల్వేలైను విలీన మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక గుండా సాగనుంది. దీనిలో భాగంగా ఒడిశాలోని మల్కనగిరి, కోవాసిగూడ, బదలి, రాజన్గూడ, మహరాజ్పల్లి, లూనిమన్గూడలో, ఆంధ్రాలోని అల్లూరి జిల్లా చింతూరు మండలం కన్నాపురం, కూనవరం మండలం కూటూరు గట్టు, పల్లూరు, ఎటపాక మండలం నందిగామలో స్టేషన్లు నిర్మించనున్నారు. అనంతరం నందిగామ నుంచి తెలంగాణలోని భద్రాచలం అక్కడి నుంచి పాండురంగాపురం వరకు ఈ రైల్వేలైను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో సర్వే పనులు పూర్తి చేశారు. దీనిలో భాగంగా కూనవరం మండలం జగ్గవరం వద్ద మహరాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ నుంచి వచి్చన ప్రత్యేక బృందాలు 50 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి మట్టి శాంపిల్స్ పంపారు. కాగా ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించేందుకు శబరి నదిపై ఒడిశాలోని మోటు, చింతూరు మండలం వీరాపురం నడుమ వంతెన నిర్మించాల్సి ఉంది. -
తాండూరు–జహీరాబాద్ రైల్వేలైన్ ‘సర్వే’ షురూ
సాక్షి, హైదరాబాద్: సిమెంటు పరిశ్రమల క్లస్టర్గా ఉన్న తాండూరు నుంచి జహీరాబాద్ వరకు 70 కి.మీ నిడివితో కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రతిపాదించిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు దాని సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించింది. సికింద్రాబాద్– వాడి మార్గంలో ఉన్న తాండూరు, సికింద్రాబాద్ నుంచి బీదర్ మార్గంలో ఉన్న జహీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. సిమెంటు, నాపరాయి, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కూడా భారీగానే ఉంటుంది. వెరసి ఇటు ప్రయాణికులకు, అటు సరుకు రవాణాకు ఈ కొత్త మార్గం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం రైల్లో రెట్టింపు దూరం.. తాండూరు–జహీరాబాద్ మధ్య దూరం (రోడ్డు మార్గం) 54 కి.మీ మాత్రమే. అదే రైలులో వెళ్లాలంటే 104 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వికారాబాద్ మీదుగా వెళ్లాల్సి రావటమే దీనికి కారణం. జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు తాండూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం చాలామంది వస్తుంటారు. రైలులో చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఎక్కువగా రోడ్డు మార్గానే వెళ్తారు. ఇక ముంబై వైపు వెళ్లేవారు ముంబై జాతీయ రహదారి మీద ఉన్న జహీరాబాద్కు వెళ్లి రోడ్డు మార్గాన వెళ్లే వాహనాలను ఆశ్రయిస్తారు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణికుల రద్దీ బాగానే ఉంటోంది.ఇక తాండూరు చుట్టుపక్కల ఉన్న సిమెంటు పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమల నుంచి రైళ్ల ద్వారా సరుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటుంది. బీదర్ మార్గంలో సరుకు వెళ్లాలంటే వికారాబాద్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రూ.1,400 కోట్ల అంచనా వ్యయంతో తాండూరు నుంచి నేరుగా జహీరాబాద్కు కొత్త రైల్వే లైన్ను గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించింది. గతేడాది చివరలో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైంది. దీంతో మూడు రోజుల క్రితం ఆ పనులు మొదలయ్యాయి. ఈ లైన్ పూర్తయింతే గంట సేపట్లో రైళ్లు గమ్యం చేరతాయి. జహీరాబాద్ నుంచి వాడీకి ఇది దగ్గరి దారిగా మారుతుంది. అటు వాడీ మార్గంలో, ఇటు సికింద్రాబాద్ మార్గంలో ఒకేసారి రైళ్లు ప్రయాణించేందుకు ఇది ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది. -
పని పూర్తి చేసే సంస్కృతి మాది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శంకుస్థాపన చేస్తే ఆ పనిని కచ్చితంగా పూర్తి చేయాలనే సంస్కృతిని తమ ప్రభుత్వం పాటిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కీలకమని.. ఉత్పత్తి, సరఫరా నిరంతరాయంగా ఉంటే పరిశ్రమల వృద్ధికి ఆలంబన అవుతుందని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్ను ప్రస్తుతం ప్రారంభించుకున్నామని, త్వరలో రెండో యూనిట్ సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్లో అధిక భాగం తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. ధర్మాబాద్– మనోహరాబాద్– మహబూబ్నగర్– కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణతో రైళ్ల సరాసరి వేగం, రాష్ట్రంలో కనెక్టివిటీ మరింత పెరుగుతాయని చెప్పారు. మనోహరాబాద్– సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్తో పరిశ్రమలు, వ్యాపారానికి తోడ్పాటు అందుతుందన్నారు. ఇక ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాల నాణ్యత కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తీసుకొచ్చామని.. తెలంగాణలోని 20 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వివరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలంగాణలో 50 పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అరి్వంద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పసుపు రైతుల సన్మానం పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో పసుపు రైతులు నిజామాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. పసుపు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేక దండ వేసి, పసుపు మొక్కలను అందించారు. మోదీ ఆ మొక్కలను పైకెత్తి ప్రదర్శించారు. తెలుగులో ప్రారంభించి.. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులారా..’అని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ.. మోదీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి భరతమాత వేషధారణలో వచ్చిన విషయాన్ని చూసి.. ‘‘ఓ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చింది. ఆ చిన్నారికి నా తరఫున అభినందనలు..’’అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. ప్రధాని మోదీ నిజామాబాద్లోని సభా స్థలిలో విడిగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై సభను ఉద్దేశిస్తూ రాజకీయ ప్రసంగం చేశారు. తొలి వేదికపై ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలివీ.. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్లో 800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 20 జిల్లా ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్లకు శంకుస్థాపన. ∙మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు సర్వీస్కు పచ్చజెండా.. ధర్మాబాద్ – మనోహరాబాద్ – మహబూబ్నగర్ – కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పనుల ప్రారంభం -
అద్భుతంగా రూపుదిద్దుకున్న ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్
సాక్షి ప్రతినిధి కడప: రాయలసీమ–కోస్తా జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ పెరిగేందుకు అరుదైన రైల్వే మార్గం..ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద టన్నెల్ ఏర్పాటు చేసి దీనిని నిర్మించారు. న్యూ ఆస్ట్రేలియన్ టన్నెల్ మెథడ్తో సాంకేతిక పనులు పూర్తి చేశారు. వెలుగొండ అడవుల్లో 7.560 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ను ఈ మార్గం కోసం ఏర్పాటు చేశారు. దీంతో ఓబులవారిపల్లె–కృష్ణపట్నం మార్గంలో గూడ్స్ రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అద్భుతమైన ఈ లైన్లో ప్రయాణికుల కోసం రైళ్లు నడిపితే విజయవాడ, విశాఖపట్నం తదితర కోస్తా జిల్లాలకు కనెక్టివిటీ బాగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రకృతి అందాల నడుమ కాశ్మీర్ తరహాలో ఏర్పాటు చేసిన ఈ మార్గం గుండా ప్రయాణం మరుపురాని అనుభూతినిస్తుంది. ఎగుమతుల కోసం.. ఈ రైలు మార్గాన్ని ఎస్ఆర్ఎస్పీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు నుంచి పలు రకాలైన ఖనిజాలను ఎగుమతి చేసేందుకు ఏర్పాటు చేశారు. ఏపీఎండీసీ పరిధిలో మంగంపేట నుంచి బైరెటీస్, బళ్లారి నుంచి ఐరన్ ఓర్ కూడా ఇదే మార్గంలో వెళుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో నూతనంగా ఈ మార్గంలో 35 కిలోమీటర్లు, నెల్లూరుజిల్లాలో 58 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఈ నడుమ ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో మంగంపేట, నేతివారిపల్లె, చెర్లోపల్లె రైల్వేస్టేషన్లుండగా..నెల్లూరు జిల్లాలో ఎనిమిది స్టేషన్ల ద్వారా గూడ్స్ రైళ్లు కృష్ణపట్నం చేరుకుంటున్నాయి. రూ.470 కోట్లతో టన్నెల్.. ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వే లైన్ ఏర్పాటుకు 7.56 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటు చేశారు. న్యూ ఆస్ట్రేలియన్ టన్నెల్ మెథడ్తో సాంకేతికపనులు చేపట్టారు. స్కాట్లాండ్ మిషనరీతో నిర్మించారు. పెనుశిల అభయారణ్యం కొండల్లో ఈ నిర్మాణం జరిగింది. 2006లో అప్పటి రైల్వేశాఖ మంత్రి నితీశ్కుమార్ రైల్వేలైన్కు పచ్చ జెండా ఊపారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చొరవ కారణంగా సకాలంలో భూసేకరణ, పర్యావరణ అనుమతులు లభించాయి. రూ.1646 కోట్లతో ఈమార్గం రూపుదిద్దుకుంది. రెండు గుహల మధ్య పచ్చని లోగిళ్లలో రైల్వే లైన్ వెళుతుంది. చుట్టూ కొండలు, పెనుశిల అభయారణ్యం మధ్యన టన్నెల్లో రైల్వే ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రైల్వే మార్గాన్ని ఉప రాష్ట్రపతి హోదాలో 2019 సెప్టెంబర్, 1వ తేదీన ఎం.వెంకయ్యనాయుడు జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి కృష్ణపట్నం పోర్టుకు గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగుతున్నాయి. కనెక్టివిటీకి సులువు కడప–విజయవాడ మధ్య రైల్వే రాకపోకలు చాలా అరుదుగా ఉన్నాయి. కడప నుంచి తిరుమల ఎక్స్ప్రెస్(కడప–విశాఖపట్నం).. యర్రగుంట్ల, ప్రొద్దుటూరుల నుంచి ధర్మవరం–విజయవాడ రైళ్ల ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంది. లేకపోతే తిరుపతి, రేణిగుంటల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే నేరుగా కడప నుంచి విజయవాడకు ప్రత్యేకించి రైళ్లు లేవు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి నిత్యం వేలాది మంది విజయవాడకు వెళ్తున్నారు. ప్రత్యేకించి అక్కడి ప్రాంతాల్లోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ఇక్కడి విద్యార్థులు దాదాపు 20వేల మంది వరకు విద్యను అభ్యసిస్తున్నారు. పేరెంట్స్ రాకపోకలు సాగించేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. కడప, రాజంపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ వెళ్లేందుకు ఈ మార్గం సులభతరంగా ఉంటుందని రైల్వే నిపుణులు వివరిస్తున్నారు. ఎంతో ఉపయోగకరం ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వే మార్గం గుండా రైళ్ల రాకపోకలు నిర్వహిస్తే ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు ఎంతో ఉపయోగకరం. రైల్వే బోర్డు దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాం. – తల్లం భరత్కుమార్రెడ్డి, రైల్వే బోర్డు మెంబర్ పంట ఉత్పత్తులు రవాణా చేసుకోవచ్చు ఈ రైలు మార్గం గుండా రాక పోకలు నిర్వహిస్తే ప్రయాణికులకు వెసులుబాటు లభి స్తుంది. నిత్యం వేలాది మంది విజయవాడకు ప్రయాణాలు సాగిస్తున్నారు. పంట ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవడానికి ఉపయో గకరమే. – శంకర్రెడ్డి, నాగవరం, చిట్వేలి -
బెంగళూరు–వాడీ లైన్ల అనుసంధానం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం మంజూరైన రైల్వే ప్రాజెక్టు ఎట్టకేలకు జాతికి అంకితం కాబోతోంది. ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంత సరిహద్దు వరకు పనులు పూర్తి కావడంతో సమాంతరంగా ఉన్న రెండు ప్రధాన రైలు మార్గాల అనుసంధానానికి అవకాశం ఏర్పడింది. మహబూబ్నగర్–కర్ణాటకలోని మునీరాబాద్ మధ్య 243 కి.మీ. మేర జరుగుతున్న రైల్వే లైన్ పనుల్లో భాగంగా దేవరకద్ర–కృష్ణా స్టేషన్ల అనుసంధానంతో ఈ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో పూర్తయింది. ఇది ఇటు సికింద్రాబాద్ (మహబూబ్నగర్)–బెంగళూరు లైను, అటు సికింద్రాబాద్–వాడీ–ముంబై లైన్లను అనుసంధానిస్తుంది. బెంగళూరు లైన్లో దేవరకద్ర నుంచి మొదలయ్యే ఈ ప్రాజెక్టు, వాడీ మార్గంలోని కృష్ణా స్టేషన్ వద్ద తెలంగాణ పరిధిలో ముగుస్తుంది. ఇక్కడి వరకు పనులు పూర్తి కావడంతో ఈ అనుసంధాన లైన్ను ఇప్పుడు ప్రధాని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి బెంగళూరు సహా కొన్ని ఇతర ప్రాంతాలకు వాడీ మీదుగా రైళ్లు తిరుగుతున్నాయి. దీని బదులు ఆ రైళ్లు ఇకపై దేవరకద్ర మీదుగా బెంగళూరుకు చేరుకోవచ్చు. దీనివల్ల రైల్వేకు దూరాభారం తగ్గుతుంది. సరుకు రవాణా రైళ్లకూ ఇది దగ్గరి దారి కానుంది. అలాగే జక్టేర్, మరికల్, మక్తల్, మాగనూరు లాంటి ప్రాంతాలకు రైల్వే సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది. ప్రధాని చేతులమీదుగా కాచిగూడ–సిద్దిపేట డెమూ ప్రారంభం? మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు రైల్వేలైన్ సిద్ధమై రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆమోదముద్ర కూడా రావడంతో రైళ్లను నడిపేందుకు అవకాశం కలిగింది. ఇందులో భాగంగా కాచిగూడ–సిద్దిపేట మధ్య రోజువారీ నడిచేలా డెమూ సర్వీసును ప్రారంభించాలని రైల్వే శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించే రెండు రోజుల్లో ఏదో ఒక రోజు డెమూ రైలు సర్విసును ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం–రైల్వే శాఖ సంయుక్తంగా చేపట్టాయి. ప్రధాని చేతుల మీదుగా రైలును ప్రారంభించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించనుందో చూడాల్సి ఉంది. ఇక ముద్ఖేడ్–డోన్ మార్గంలో డబ్లింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రెండు లైన్లు వినియోగానికి సిద్ధమైన నేపథ్యంలో ఆ పనులను కూడా ప్రధాని జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు: మహబూబ్నగర్–మునీరాబాద్ మంజూరు: 1997–98 నిడివి: 243 కి.మీ. ప్రాజెక్టు వ్యయం: రూ. 3,473 కోట్లు తెలంగాణ పరిధి: 66 కి.మీ. వ్యయం: రూ.943 కోట్లు విద్యుదీకరణ: పూర్తి -
యువర్ అటెన్షన్ ప్లీజ్.. ‘పెద్దపల్లి బైపాస్’కు
సాక్షి ప్రతినిధి,కరీంనగర్: ఎన్నో దశాబ్దాలుగా కరీంనగర్ నుంచి హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు రైలులో వెళ్లాలన్న పాత కరీంనగర్ వాసుల కల త్వరలో సాకారం కానుంది. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్–కాజీపేట–బల్లార్షా సెక్షన్ను పెద్దపల్లి–కరీంనగర్–ముంబై సెక్షన్ లైన్తో కలపనుంది. ఇటీవల పెద్దపల్లి–కరీంనగర్ మార్గాన్ని డబ్లింగ్ లైన్గా అప్గ్రేడ్ చేసేందుకు ముందుకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా.. కాజీపేట–బల్లార్షా, కరీంనగర్–పెద్దపల్లి లైన్లను కలపడం ద్వారా ఈ సెక్షన్లోని రైల్వే ప్రయాణంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. భూమి ఇచ్చేందుకు రైతుల అంగీకారం పెద్దపల్లి జిల్లాలోని చీకురాయి–పెద్దబొంకూరు గ్రామాల మధ్య పెద్దపల్లి బైపాస్ పేరుతో కొత్త రైల్వేస్టేషన్ నిర్మించతలపెట్టారు. ఇందుకోసం ఇటీవల రెండు గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. దాదాపు 20 ఎకరాల వరకు భూమిని ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. వారికి పరిహారం ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. రైల్వేస్టేషన్ నిర్మాణంలో భాగంగా ముందుగా ఎలక్ట్రిక్ లైన్ నిర్మించేందుకు ఇటీవల టెండర్లు పిలిచింది. త్వరలోనే స్టేషన్ నిర్మాణం కోసం టెండర్లు పిలవనుంది. చీకురాయి–పెద్దబొంకూరుల మధ్య పాయింట్ను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. ఇది కాజీపేట–బల్లార్షా లైన్తో కరీంనగర్–పెద్దపల్లి లైన్ కలిసే ప్రాంతం. ఇంతకాలం ఒక రైలు కరీంనగర్ మీదుగా కాజీపేట/సికింద్రాబాద్ వైపు వెళ్లాలంటే ముందు పెద్దపల్లి జంక్షన్ చేరాలి. అక్కడ బోగీల ముందు ఉన్న ఇంజిన్ విడిపించుకొని, ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి కాజీపేట వైపు ఉన్న బోగీలను లింక్ చేసుకొని వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పెద్దపల్లి బైపాస్ రైల్వేస్టేషన్ పూర్తయితే కాజీపేట వైపు వెళ్లే రైళ్లన్నీ కొత్త స్టేషన్ మీదుగా ఎలాంటి ఇంజిన్ మార్పులు అవసరం లేకుండా సాఫీగా సాగిపోతాయి. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్వాసులకు కాజీపేట/వరంగల్/సికింద్రాబాద్ వైపు ప్రయాణం మరింత సులువు కానుంది. గణనీయంగా పెరిగిన ఫ్రీక్వెన్సీ కరోనాకు ముందు ఇది కేవలం సింగిల్ లైన్ మార్గం. నిజామాబాద్ వరకు కనెక్టివిటీ ఉండటం, ఈ మార్గాన్ని వందే భారత్ వంటి రైళ్లు సైతం నడిచేలా ఇటీవల 100 కి.మీ. వేగం తట్టుకునేలా ట్రాక్ సామర్థ్యం పెంచారు. గతంలో ఖాజీపేట–బల్లార్షా సెక్షన్లోని రైళ్లు సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్ర వెళ్లేవి. దీనివల్ల చాలా ఇంధనం, సమయం వృథా అయ్యేవి. ఈ మార్గం పూర్తి కావడంతో కరోనా కాలంలో పెద్దపల్లి–నిజామాబాద్ రూట్కు డిమాండ్ బాగా పెరిగింది. ప్రతీరోజు గ్రానైట్, బొగ్గు, బాయిల్డ్ రైస్, వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే రైళ్ల ఫ్రీక్వెన్సీ గతంలో ఎన్నడూ లేనంతగా గణనీయంగా పెరిగింది. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే జోన్లో సరుకు రవాణా రైళ్ల ద్వారా అత్యధికంగా ఆదాయం తీసుకువచ్చే రైల్వే మార్గాల్లో పెద్దపల్లి–నిజామాబాద్ ఒకటిగా ఆవిర్భవించింది. చెప్పుకోదగ్గ రైళ్లేవీ లేవు కానీ, ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లు మాత్రం చెప్పుకోదగ్గవి ఏమీలేవు. ఢిల్లీ, కోల్కతా, విశాఖపట్టణం, వారణాసి, బెంగళూరు, చైన్నె, తిరువనంతపురం నగరాలకు రైళ్లు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మార్గంలో కేవలం రెండు పుష్పుల్ (డెమూ, మెమూ) ఎక్స్ప్రెస్ రైళ్లు, కాజీపేట నుంచి దాదర్ ముంబై వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్, తిరుపతి నుంచి కరీంనగర్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ మార్గంలో కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ లాంటి ఎక్కువ జనాభా కలిగిన పట్టణాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో డబ్లింగ్ పూర్తయితే ఇటు ముంబై వైపు, అటు సికింద్రాబాద్ వైపు రైళ్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు అటల్ మిషన్ ఫర్ రిజునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్ (ఏఎంఆర్యూటీ) పథకం కింద ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్కు రూ.26.6 కోట్లు, రామగుండంకు రూ.26.50 కోట్లు, పెద్దపల్లికి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. అయితే, ఈ పనులను రెండు దఫాల్లో చేపట్టనున్న కేంద్రం.. తొలిదశలో కరీంనగర్, రామగుండం స్టేషన్లను అభివృద్ధి చేసి, మరికొన్ని నెలల్లోనే పెద్దపల్లిలోనూ పనులు ప్రారంభించనుంది. ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉపయుక్తం చీకురాయి వద్ద రైల్వేస్టేషన్ నిర్మించతలపెట్టడం అభినందనీయం. రెండు మార్గాలు కలిసేచోట స్టేషన్ నిర్మించడం వల్ల మా ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ఒక్క పెద్దపల్లి ప్రజలకే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. – మేకల శ్రీనివాస్, చీకురాయి -
రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్సిగ్నల్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పీఎం గతిశక్తిలో భాగంగా రైళ్ల రాకపోకలను క్రమబద్ధికరించడంతోపాటు రద్దీని తగ్గించడం కోసం గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్– డోన్ మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు సహా దేశంలో ఏడు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు పనులకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ఏడు ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.32,512.39 కోట్ల అంచనాకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్– డోన్ (కర్నూలు జిల్లా) రైల్వే లైన్ల డబ్లింగ్ ప్రాజెక్టులకు మొత్తం రూ.7,539.32 కోట్లు కేటాయించింది. ఇందులో గుంటూరు – బీబీనగర్ మధ్య 239 కి.మీ. రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు రూ.2,853.23 కోట్లు, ముద్ఖేడ్ – డోన్ మధ్య 417.88 కి.మీ. మేర డబ్లింగ్ పనులకు రూ.4,686.09 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే ఈ లైన్లలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంతోపాటు గూడ్స్ రైళ్ల ద్వారా సరుకు రవాణా మరింత ఊపందుకుంటుంది. దీంతో ఆ పరిధిలో పారిశ్రామిక, వ్యవసాయోత్పత్తుల వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది. కర్నూలు జిల్లా నుంచి సరుకు రవాణాకు మరింత సౌలభ్యం ముద్ఖేడ్ – డోన్ రైల్వే లైన్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాను తెలంగాణలోని పలు జిల్లాలు, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాతో మరింతగా అనుసంధానిస్తుంది. దీంతో ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న బలార్షా– ఖాజీపేట– సికింద్రాబాద్ మార్గం, కాజీపేట– విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా ఈ మార్గంలో బొగ్గు, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తుల రవాణాకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఖుర్దా రోడ్–విజయనగరం మధ్య మూడో లైన్ కాగా భద్రక్–విజయనగరం సెక్షన్లోని ఖుర్దా రోడ్–విజయనగరం మధ్య 363 కిలోమీటర్ల మేర మూడో లైన్ నిర్మాణానికి రూ.5,618 కోట్లకు కేంద్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని భద్రక్, జాజ్పూర్, ఖుర్దా, కటక్, గంజాం జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మూడో లైన్ పనులు జరగనున్నాయి. గుంటూరు, పల్నాడు జిల్లాలకు ప్రయోజనం గుంటూరు – బీబీనగర్ మధ్య రైల్వే లైన్ గుంటూరు, పల్నాడు ప్రాంతాలను అటు ఒడిశా, ఇటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలతో అనుసంధానిస్తుంది. అంతేకాకుండా గుంటూరు– సికింద్రాబాద్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గాన్ని కూడా అందుబాటులోకి తెస్తుంది. ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న గుంటూరు–విజయవాడ–కాజీపేట– సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ ప్రయాణ దూరంతో గుంటూరు– సికింద్రాబాద్ లైన్ అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఈ ప్రాంతం గుండా ఇనుము, సిమెంట్, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తుల రవాణాకు మరింత సౌలభ్యం ఏర్పడుతుంది. -
రెండోలైన్కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని రెండు ప్రధాన రూట్లతో రైల్వే ప్రాజెక్టులకు లైన్క్లియర్ అయ్యింది. ముద్ఖేడ్–మేడ్చల్–మహబూబ్నగర్–డోన్, గుంటూరు–బీబీనగర్ సెక్షన్ల మధ్య రెండో రైల్వేలైన్ చేపట్టేందుకు మార్గం సుగమమైంది. వాస్తవానికి ఈ రెండు రైల్వే రూట్లలో ప్రాజెక్టులు ఎన్నో ఏళ్ల క్రితమై మంజూరై, సర్వేలు కూడా చేశారు. కానీ ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏడు ప్రాజెక్టులకు మొత్తం రూ.32,512.39 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సమాచారప్రసార శాఖ మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్లు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, గుజరాత్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్వర్క్ల అభివృద్ధి మరింత జరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా మారే ముద్ఖేడ్– డోన్, గుంటూరు– బీబీనగర్ ప్రాజెక్టులను రూ. 7,539 కోట్ల నిధులతో చేపట్టనున్నారు. వచ్చే బడ్జెట్లో వీటికి నిధులు మంజూరు చేస్తారు. ► సికింద్రాబాద్ టు డోన్, సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ వరకు డబ్లింగ్ పనులు రెండు భాగాలుగా కొనసాగుతాయి. ► సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ రూట్ను ఒక్కసారి పరిశీలిస్తే...సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ రెండోదశ కింద రెండో లైన్ పూర్తయింది. ఇప్పుడు మేడ్చల్ నుంచి ముద్ఖేడ్ వరకు వయా నిజామాబాద్ మీదుగా డబ్లింగ్ పనులు చేయాల్సి ఉంటుంది. ► ఇక సికింద్రాబాద్ టు డోన్ రూట్లో ఇప్పటికే మహబూబ్నగర్ వరకు డబ్లింగ్ పూర్తయింది. ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి డోన్ వరకు రెండో రైల్వేలైన్ పనులు చేపడతారు. ► సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ రూట్లో ప్రస్తుతం సింగిల్ రూట్ ఉన్న కారణంగా లైన్ సామర్థ్య వినియోగం 167 శాతానికి చేరుకుంది. ట్రాఫిక్ అధికంగా ఉండటం, సామర్థ్యానికి మించి రైళ్లు తిరుగుతుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. డిమాండ్ దృష్ట్యా కొత్త రైళ్లు నడపటం సాధ్యం కావటం లేదు. దీంతో డబ్లింగ్ అనివార్యమైంది. మూడేళ్ల క్రితమే ప్రాజెక్టు మంజూరు చేసినా, నిధుల విడుదలకు ఇప్పుడు మార్గం సుగమమైంది. ► ముద్ఖేడ్ ఆవల మన్మాడ్ వరకు వెళ్లి ప్రధాన ట్రంక్ లైన్తో కలుస్తుంది. ముద్ఖేడ్ తర్వాత పర్బణి–మన్మాడ్ మధ్య డబ్లింగ్ పూర్తి కాగా, ఇప్పుడు ఈ పనులు మొదలవుతున్నాయి. ఇది పూర్తయితే, అటు బెంగుళూరు నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి అనుసంధానం అయ్యే ప్రధాన ప్రత్యా మ్నాయ మార్గంగా మారుతుంది. అప్పుడు బెంగుళూరు–హైదరాబాద్–ముంబై ప్రధాన నగరాల మధ్య ప్రయాణికుల రైళ్ల సంఖ్య పెరగటంతోపాటు వాటి వేగం పెరుగుతుంది. ట్రంక్ లైన్తో పోలిస్తే దూరం తగ్గి ప్రయాణ సమయం తగ్గుతుంది. ► బల్హర్షా–కాజీపేట–సికింద్రాబాద్, కాజీపేట –విజయవాడ సెక్షన్ల మధ్య కూడా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. బల్హర్షా–రామగుండం–సికింద్రాబాద్–వాడి– గుంతకల్ సెక్షన్లకు బొగ్గు, స్టీల్ రవాణాకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది. ► హైదరాబాద్ నుంచి వరంగల్ రైల్వే రూట్లో బీబీనగర్కు డబ్లింగ్ ఉంది. ఇక్కడి నుంచి గుంటూరు మీదుగా తెనాలి వద్ద ప్రధాన లైన్ను కలిసే ప్రత్యామ్నాయమార్గంగా బీబీనగర్–గుంటూరు మధ్య రెండో లైన్ నిర్మా ణానికి రంగం సిద్ధమైంది. ఎట్టకేలకు ఇప్పుడు కేంద్రం కనికరం చూపి దానికి నిధులు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, హైదరాబాద్– విజయవాడ ప్రధాన లైన్పై ఒత్తిడి బాగా తగ్గుతుంది. ప్రస్తుతం ట్రంక్లైన్ సామర్థ్యానికి మించి 137 శాతం వినియోగంలో ఉంది. ఫలితంగా కొత్త రైళ్లు నడిపేందుకు కష్టంగా మారింది. ౖòప్రధాన ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించే కీలక ప్రాజెక్టు ఇప్పుడు ఎట్టకేలకు సాకారం కాబోతోంది. గుంటూరు–బీబీనగర్ సెక్షన్ లైన్ సామర్థ్య వినియోగం 148 శాతంగా ఉంది. రెండో లైన్నిర్మాణంతో ఆ సమస్య పరిష్కారమై కొత్త రైళ్లు ఆ మార్గంలో మళ్లించేందుకు అవకాశం ఉంటుంది. కొన్నేళ్లలో ఈ మార్గంలో కొత్తగా సిమెంటు కార్మాగారాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గూడ్స్ రైళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ రూట్లో ఉన్న ప్రధానమైనవి ► ఇనుము–ఉక్కు: చిట్యాల– నార్కట్పల్లి . ► సిమెంట్ ప్లాంట్లు: విష్ణుపురం, నడికుడి, తుమ్మలచెరువు, జాన్పహాడ్, మేళ్లచెరువు, మఠంపల్లి, జగ్గయ్యపేట, రామాపురం ► థర్మల్ పవర్ ప్లాంట్: విష్ణుపురం సమీపంలో 4000 ఎంవీ థర్మల్ ప్లాంట్ (అందుబాటులోకి రావాలి) ► ఆహార ధాన్యాలు: నాగిరెడ్డిపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ ఎఫ్సీఐలు ► ఇండ్రస్టియల్ క్లస్టర్: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విష్ణుపురం, నార్కట్పల్లి ► గిడ్డంగులు: హైదరాబాద్ చుట్టూ 100కి పైగా వేర్ హౌస్లు – గుంటూరు చుట్టూ 50కి పైగా కోల్డ్ స్టోరేజీలు ఈ రూట్లో ఉన్న ప్రధానమైనవి ► బొగ్గు: రామగుండం, మంచిర్యాల, మందమర్రి ► ఆర్థిక కారిడార్లు: రాయచూరు–దేవరకద్ర, కర్నూలు –పీలేరు, కొడంగల్–మహబూబ్నగర్, అబ్దుల్లాపూర్మెట్–చిట్యాల, సంగారెడ్డి–హైదరాబాద్, ముత్తంగి–మంచిరేవుల ► థర్మల్ పవర్ ప్లాంట్లు: పర్లి వద్ద మహా జెన్కో కర్ణాటకలోని రాయచూర్, యెర్మరస్లో కేపీసీసీ, ఆంధ్రప్రదేశ్లోని ముద్దనూరు వద్ద ఏపీజెన్కో ► ఆహార ధాన్యాల తరలింపు ప్రాంతాలు: ముద్ఖేడ్, బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, జడ్చర్ల, మహబూబ్నగర్, కర్నూలు ► ఇండ్రస్టియల్ క్లస్టర్: హైదరాబాద్, నిజామాబాద్, నాందేడ్ , మెదక్, కర్నూలు, గద్వాల, ఇటిక్యాల, గుండ్లపోచంపల్లి, బహదూర్పల్లి ► గిడ్డంగులు–శీతల గిడ్డంగులు: నిజామాబాద్, బోధన్ , సారంగాపూర్ , బండమల్లారం , మహబూబ్నగర్, గద్వాల ఖోర్దా రోడ్ –విజయ నగరం రూట్లో.. భద్రక్–విజయనగరం సెక్షన్లోని ఖోర్దా రోడ్–విజయనగరం రూట్లో ఒడిశాలోని భద్రక్, జజ్పూర్, ఖోర్దా, కటక్, గంజాం జిల్లాలో 184 కి.మీ, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలోని 201 కి.మీ మేర మూడోలేన్ పనులు జరుగుతాయి. దీనికి రూ.5618.26 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడే ముద్ఖేడ్ –మేడ్చల్, మహబూబ్నగర్ –డోన్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్లకు ఎంపీ అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. డబుల్ రైల్వేలైన్ పూర్తయితే నిజామాబాద్ నుంచి ముంబై, పూణె, షిరిడీలతో పాటు నిజామాబాద్ నుంచి బెంగళూరుల మధ్య రైల్వే కనెక్టివిటీ పెరగి, ప్రయాణ మార్గం సులభతరం అవుతుందన్నారు. -
గ్రాండ్ ట్రంక్ రైల్వేలైన్పై ఒత్తిడి, వేగంగా మూడో లైన్ పనులు, కొన్ని రైళ్లు రద్దు!
హైదరాబాద్: ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపే ప్రధాన మార్గంలో మూడోలైన్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో వివిధ మార్గాల్లో నడిచే రైళ్ల రాకపోకల్లో జాప్యం చోటుచేసుకొంటోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగించే మార్గాల్లో గూడూరు– బల్లార్ష గ్రాండ్ ట్రంక్ రైల్వేలైన్ అత్యంత కీలకమైనది. ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో పట్టాలపై ఒత్తిడి కారణంగా రైళ్ల రాకపోకల్లో జాప్యం నెలకొంటోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు దక్షిణమధ్య రైల్వే గూడూరు– బల్లార్ష మధ్య మూడు దశలుగా మూడోలైన్ నిర్మాణ పనులను చేపట్టింది. కాజీపేట్–బల్లార్ష, విజయవాడ–గూడూరు మధ్య పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో సికింద్రాబాద్, కాజీపేట్ల మీదుగా నడిచే రైళ్లలో కొన్నింటిని అధికారులు నిలిపివేశారు. ముఖ్యంగా రద్దీ లేని వేళల్లో కొన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ట్రాక్ నిర్వహణ పనుల దృష్ట్యా ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడింది. మరికొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. మూడోలైన్ పరిష్కారంగా.. దక్షిణమధ్య రైల్వే పరిధిలో సుమారు 6,800 ట్రాక్ కిలోమీటర్ల పరిధిలో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 800 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. వీటిలో 300 వరకు గూడ్స్ రైళ్లు ఉన్నాయి.అలాగే వివిధ జోన్ల నుంచి దక్షిణమధ్య రైల్వే జోన్మీదుగా పెద్ద సంఖ్యలో రైళ్లు నడుస్తాయి. దీంతో ట్రాక్లపై ఒత్తిడి పెరుగుతోంది. సకాలంలో సిగ్నళ్లు లభించకపోవడంతో వివిధ రూట్లలో రైళ్లు ముందుకు కదలలేని పరిస్థితి. ఉదాహరణకు కాజీపేట్ మీదుగా నగరానికి చేరుకొనే రైళ్లకు సిగ్నల్ లభించకపోవడంతో చర్లపల్లి వద్ద నిలిపివేస్తున్నారు. కాజీపేట్ మీదుగా వెళ్లే రైళ్లకు సైతం గూడూరు, బల్లార్ష మధ్యలో బ్రేకులు పడుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు మూడోలైన్ నిర్మాణ పనులను చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. మూడోలైన్ అందుబాటులోకి వస్తే రైళ్ల సగటు వేగం బాగా పెరగనుంది. ట్రాక్ల పటిష్టతకు చర్యలు.. మరోవైపు ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అప్రమత్తమైంది. వర్షాకాలం దృష్ట్యా కూడా ట్రాక్లలో ఎలాంటి లోపాలు లేకుండా నివారించేందుకు ట్రాక్ల పటిష్టతకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు వివిధ డివిజనల్ మేనేజర్లతో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఇటీవల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వర్షాల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉన్న రైల్వేలైన్లు, వంతెనలు, సొరంగాలు, తదితర మార్గాల నిర్వహణపైన దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అనూహ్యమైన అవాంతరాలు ఏర్పడితే తొలగించేందుకు అత్యవసర పరికరాలను అన్ని చోట్ల అందుబాటులో ఉంచాలని చెప్నారు. ఇసుక, బండరాళ్లు,పైపులు నిల్వ ఉంచాలని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న వంతెనల వద్ద 24 గంటల పాటు నిఘాను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాక్లపైకి వరదనీరు వచ్చి చేరకుండా ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకొనేందుకు కూడా యంత్రాంగం అప్రమత్తమైంది. -
తెలంగాణలో రీజనల్ రింగ్రోడ్డు వెంట ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు... ఇంకా ఇతర అప్డేట్స్
-
‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’
‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’ అనే డైలాగ్ ప్రయాణికులు చెప్పుకునేలా.. సరికొత్త ఆధునిక రైల్వే లైన్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా శంషాబాద్, విశాఖ నుంచి విజయవాడ మీదుగా కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు మార్గాలు రానున్నాయి. ఈ రెండు మార్గాలకు సంబంధించిన పీఈటీఎస్ సర్వే నిర్వహించేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. సాక్షి, విశాఖపట్నం : రైళ్ల వేగంలో మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే వందేభారత్ రైళ్లతో కొత్త శకానికి నాంది పలికిన భారతీయ రైల్వే శాఖ.. ఇప్పడు అంతకు మించి అన్నట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్ని కలుపుతూ అత్యాధునిక సెమీ హై స్పీడ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ల సామర్థ్యం 110 నుంచి గరిష్టంగా 150 కిలోమీటర్లు. ముఖ్య నగరాల్ని కలుపుతూ గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా సెమీ హైస్పీడ్ రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. మూడు రాజధానుల్ని అనుసంధానం చేస్తూ.. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి కానున్నాయి. తాజాగా వస్తున్న రైల్వే లైన్లు కూడా ఈ మూడు రాజధానుల్ని అనుసంధానిస్తున్నట్లుగానే డిజైన్ చేశారు. అదేవిధంగా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కీలకంగా ఉన్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో ఈ లైన్లు అనుసంధానం కానున్నాయి. అంటే.. శంషాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్ వరకూ ఈ సెమీ హైస్పీడ్ రైలు మార్గాలు రానున్నాయి. మొత్తం 942 కిలోమీటర్ల మేర.. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేలా ట్రాక్లు నిర్మించనున్నారు. 5 గంటల్లో విశాఖ టూ హైదరాబాద్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవాలంటే 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. కానీ.. ఈ సెమీ హైస్పీడ్ ట్రాక్ నిర్మాణం పూర్తయితే.. 4 నుంచి 5 గంటల్లో విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లు గరిష్ట వేగం 160 కిలోమీటర్లు అయినా.. ప్రస్తుతం 80 నుంచి 120 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. భవిష్యత్తులో వందేభారత్ రైళ్లను అప్గ్రేడ్ చేస్తున్నారు. వందేభారత్లోనూ స్లీపర్ కోచ్లు రాబోతున్నాయి. కొత్తగా రాబోతున్న ఈ ట్రైన్లు గంటకు 200 కి.మీ వేగంతో దూసుకెళ్లేలా తయారు కాబోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్గాల్లో ఎక్కువ శాతం ఈ ట్రైన్లు నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. అందుకే.. ఈ సెమీ హైస్పీడ్ కారిడార్స్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. పీఈటీఎస్కు టెండర్లు ఈ రెండు కారిడార్లకు సంబంధించి ప్రిలిమినరీ ఇంజినీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే(పీఈటీఎస్)కు రైల్వే బోర్డు టెండర్లు ఖరారు చేసింది. సింగిల్ పాకెట్లో ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. రూ.2.70 కోట్లతో నిర్వహించనున్న ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సదరు సర్వే సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది చివరి నాటికి సర్వే పూర్తయిన వెంటనే.. ఈ సెమీ హై స్పీడ్ కారిడార్ పనులకు సంబంధించిన ప్రాథమిక అంచనా వ్యయాన్ని నిర్ధారిస్తూ.. డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. డీపీఆర్ పూర్తయిన వెంటనే పనులకు టెండర్లు పిలవాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ కారిడార్ పనులు పూర్తయితే.. ఏపీ తెలంగాణ మధ్య రవాణా మరింత సులభతరం, వేగవంతం కానుందని వాల్తేరు డివిజన్ అధికారులు భావిస్తున్నారు. విశాఖను అనుసంధానం చేస్తూ జరుగుతున్న ఈ కారిడార్కు రైల్వే శాఖ ప్రాధాన్యమివ్వడం శుభపరిణామంగా చెబుతున్నారు. -
సూపర్ఫాస్ట్ రైల్వే లైన్లకు పచ్చ జెండా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మరో కీలక రైల్వే ప్రాజెక్టుకు బీజం పడింది. ఇరు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం – విజయవాడ – తెలంగాణలోని శంషాబాద్ మధ్య మొదటిది, విశాఖపట్నం – విజయవాడ – కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ.. దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా 220 కేఎంపీహెచ్ వేగంతో ప్రయాణించేలా) రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు. ఈ సూపర్ఫాస్ట్ రైల్వేలైన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది. -
కాకినాడ సెజ్కు ప్రత్యేక రైల్వేలైన్.. దక్షిణ మధ్య రైల్వే గ్రీన్సిగ్నల్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దాదాపు పదేళ్లపాటు పడకేసిన కాకినాడ ఎస్ఈజడ్లో పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి. కాకినాడ తీరంలో తొండంగి వద్ద నిర్మాణంలో ఉన్న కాకినాడ గేట్వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్)ను మెయిన్ రైల్వేలైన్తో అనుసందానించే ప్రక్రియ ఎట్టకేలకు పట్టాలెక్కుతోంది. ఇందుకోసం కేజీపీఎల్ నుంచి అన్నవరం వరకు 15 కిలోమీటర్లు మేర ప్రత్యేక రైల్వేలైన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే కూడా ఇందుకు పచ్చజెండా ఊపింది. ప్రత్యేక రైల్వేలైన్తో పాటు దశాబ్దాల కాలంగా సత్యదేవుని భక్తుల కలగా మిగిలిన అన్నవరం రైల్వేస్టేషన్ ఆధునీకరణను కూడా చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు రూ.300 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం రైల్వే పనులను కేజీపీఎల్ సొంతంగా చేపడుతోంది. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు నిజానికి.. చంద్రబాబు హయాంలో మౌలిక సదుపాయాల కల్పనను అటకెక్కించేశారు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో బహుళ జాతి కంపెనీలు, ఎగుమతి, దిగుమతి ఆధారిత పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇలా వస్తున్న పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఇస్తోంది. మరోవైపు.. కేజీపీఎల్కు ప్రత్యేక రైల్వేలైన్ కోసం 90 ఎకరాల భూసేకరణకు రైతులతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా.. విజయవాడ–విశాఖపట్నం మధ్య అన్నవరం రైల్వేస్టేషన్ నుండి కేజీపీఎల్ వరకు 15 కిలోమీటర్ల మేర సరుకు రవాణా కోసం ప్రత్యేక రైల్వేట్రాక్ నిర్మించనున్నారు. ఇక ప్రాజెక్టులో భాగంగా అన్నవరం రైల్వేస్టేషన్, ప్లాట్ఫారమ్లతో పాటు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు దక్షిణ మధ్య రైల్వే నుంచి ఇప్పటికే అన్ని రకాల అనుమతులు వచ్చాయి. వచ్చేనెలలో పనులు మొదలు కానున్నాయి. ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మాణంతో కాకినాడ గేట్వే పోర్టుకు ప్రతిరోజు 16వేల టన్నుల సామర్థ్యం కలిగిన బొగ్గు, ఎరువులతో పాటు కంటైనర్లలో ఆయిల్, ఎల్ఎన్జీ రవాణా కానుంది. తొలిదశలో నాలుగు గూడ్స్ రైళ్లను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. చదవండి: ‘జగన్బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’ ఈ రైల్వేలైన్ కేఎస్ఈజెడ్లో ఏర్పాటవుతున్న కేజీపీఎల్, బల్్కడ్రగ్ పార్కు, అరబిందో పెన్సిలిన్ జీ, దివీస్ తదితర పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుంది. వీటిపై కేఎస్ఈజెడ్ ప్రాజెక్టు హెడ్ గరుడ సీతారామయ్య స్పందిస్తూ.. రైల్వేస్టేషన్, రైల్వేట్రాక్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి అనుమతులు కూడా లభించాయన్నారు. -
కరీంనగర్ వాసులకు శుభవార్త.. 2025లో రైలు వస్తోంది!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే ప్రాజెక్టు తుదిదశకు వచ్చింది. మరో రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యాన్ని విధించుకుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే చాలా వేగంగా పనులు చేపడుతోంది. 2025 మార్చి వరకు ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రాజెక్టు స్వరూపం, ఖర్చు, పూర్తి చేసే తేదీ తదితరాలను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ను కలుపుతూ రూపొందించిన మనోహరాబాద్ (మేడ్చల్)– కొత్తపల్లి (కరీంనగర్) రైల్వే ప్రాజెక్టు ఇది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అధిక ఖర్చు, వయబిలిటీ ఉండదన్న కారణాలతో పక్కనపెట్టిన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వినతితో 2016లో దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. ప్రస్తుతం గజ్వేల్ వరకు ట్రయల్ రన్ నడుస్తోంది. ప్రభుత్వం వేములవాడ, కొండగట్టుకు మాస్టర్ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తుండటంతో ఈ మార్గంలో ఆధ్యాత్మిక పర్యాటకం ఊపందుకోనుంది. ఏడాది చివరలో సిద్దిపేట, దుద్దెడలకు.. ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం మనోహరాబాద్–గజ్వేల్ మధ్య 32 కి.మీ మేర ట్రాక్ పూర్తయి ట్రయల్రన్ నడుస్తోంది. గజ్వేల్ నుంచి కొడకండ్ల వరకు కొత్తగా నిర్మించిన 12.5 కిలోమీటర్ల మార్గం కూడా పూర్తయి ట్రయల్రన్కు సిద్ధంగా ఉంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో కొడగండ్ల–దుద్దెడను ఆగస్టులో, దుద్దెడ–సిద్దిపేటను డిసెంబరులో, సిద్దిపేట సిరిసిల్ల వచ్చే ఏడాది మార్చిలో, సిరిసిల్ల– కొత్తపల్లి 2025 మార్చిలో పూర్తి చేయనున్నారు. ఇప్పటివరకు పనులన్నీ అనుకున్న విధంగా గడువులోనే జరుగుతుండటం గమనార్హం. మాస్టర్ప్లాన్లతో పెరిగిన డిమాండ్..! ఈ ప్రాజెక్టు పూర్తయితే.. రాష్ట్రంలో పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు ఒకే రైల్వేలైను పరిధిలో దర్శించుకునే వీలు కలుగుతుంది. ఈ మార్గంలో కొమురవెల్లి, కొండపోచమ్మ, నాచారం లక్ష్మీ నర్సింహాస్వామి, నాంపల్లి, వేములవాడ పుణ్యక్షేత్రాలు వస్తాయి. కొ త్తపల్లి స్టేషన్ అందుబాటులోకి వస్తే.. అక్కడ నుంచి కరీంనగర్ స్టేషన్ నుంచి కొండగట్టు (నూకపల్లి–మల్యాల)స్టేషన్కు కలపవచ్చు. ఇటీవల బడ్జెట్లో వేములవాడ మాస్టర్ ప్లాన్ కోసం రూ.50 కోట్లు, కొండగట్టుకు రూ.600 కోట్లు ప్రకటించడంతో ఈ రెండు పుణ్యక్షేత్రాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ రెండు ఆలయాల అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ ప్రాధాన్యం పెరిగింది. ఇదే విషయాన్ని దక్షిణమధ్య రైల్వే కూడా గు ర్తించింది. అందుకే, ఈ రైల్వేలైన్ను త్వరగా పూర్తి చేసే పట్టుదలతో ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ధీమాగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 46 శాతం మేర ప్రాజెక్టు పూర్తయింది. షిరిడీ, ముంబై, బెంగళూరులకు రైళ్లు..! కొత్తపల్లి– మనోరాబాద్ రైల్వేలైన్ హైదరాబాద్ డివిజన్లో ఉంది. అదే ఖాజీపేట–బల్లార్షా మార్గం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ రెండు మార్గాలకు కొత్తపల్లి జంక్షన్లా మారనుంది. ఉత్తరభారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఇది ముఖద్వారంగా అవతరించనుంది. ఈ మార్గం పూర్తయితే ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ వాసులకు షిరిడీ, ముంబై, షిరిడీ, బెంగళూరులకు రైళ్లు నడపొచ్చని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. చదవండి లాభాల గాడిద పాలు.. రోజూ లీటరున్నర వరకు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే! -
తెలంగాణలో మరో కొత్త రైల్వే మార్గం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చింది. మహబూబ్నగర్– కర్ణాటకలోని మునీరాబాద్ మధ్య నిర్మిస్తున్న కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే మార్గానికి సంబంధించి తెలంగాణ భూభాగంలో పనులు పూర్తి చేయటంతోపాటు ఒకవైపు కాచిగూడ–కర్నూలు మార్గాన్ని, మరోవైపు సికింద్రాబాద్–వాడీ మార్గాన్ని అనుసంధానించింది. దీంతో ఈ రెండు మార్గాలకు ఇదో కొత్త ప్రత్యామ్నాయ మార్గంగా అవతరించింది. ఈ మార్గాన్ని ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే దాని మీదుగా తొలుత సరుకు రవాణా రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇంకా ఈ మార్గాన్ని విద్యుదీకరించలేదు. సెపె్టంబర్ నాటికి ఆ పనులు కూడా పూర్తవుతాయి. అప్పటి వరకు గూడ్సు రైళ్లనే తిప్పాలని అధికారులు నిర్ణయించారు. ఇది దేవరకద్ర– జక్లెయిర్– మక్తల్– మాగనూరు–కృష్ణా మీదుగా నిర్మితమైంది. ఇప్పుడు కర్నూలు మార్గంలో బెంగుళూరు వైపు, వాడీ మార్గంలో వెళ్లే గూడ్సు రైళ్లను ఈ మార్గం మీదుగా మళ్లించటం ద్వారా, వాటి ప్రయాణ సమయం తగ్గటమే కాకుండా, ప్రధాన మార్గాల్లో ఓవర్ ట్రాఫిక్తో ప్యాసింజర్ రైళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించినట్టవుతుంది. దీంతో ఈ కొత్త మార్గానికి ప్రాధాన్యం ఏర్పడింది. రూ.943 కోట్లతో నిర్మాణం..: మహబూబ్నగర్–మునీరాబాద్ మార్గాన్ని రూ.3543 కోట్ల అంచనాతో ప్రారంభించారు. ఇందులో తెలంగాణ పరిధిలో దేవరకద్ర నుంచి కర్ణాటక సరిహద్దులోని కృష్ణా మధ్య 66 కి.మీ. నిడివి ఉంటుంది. తెలంగాణ పరిధిలోని ఈ దూరాన్ని రూ.943 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఆ పనులు ఇప్పుడు పూర్తి చేశారు. దేవరకద్ర–జక్లెయిర్ మధ్య 28.3 కి.మీ. దూరాన్ని 2017 మార్చిలో, జక్లెయిర్–మక్తల్ మధ్య 11.5 కి.మీ. దూరాన్ని 2020లో, మక్తల్–మాగనూరు మధ్య ఉన్న 13.3 కి.మీ. నిడివిని 2022 మార్చిలో పూర్తి చేశారు. మాగనూరు–కృష్ణా మధ్య 12.7 కి.మీ. నిడివిని ఇప్పుడు పూర్తి చేశారు. దీంతో తెలంగాణ పరిధిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 66 కి.మీ. మొత్తం పని పూర్తయింది. దేవరకద్ర వద్ద ఇది కర్నూలు లైన్తో, కృష్ణా దాటాక వాడి లైన్తో అనుసంధానమైంది. దీంతో ఇటు కర్నూలు మీదుగా వెళ్లాల్సిన రైళ్లు, అటు వాడీ మీదుగా వెళ్లాల్సిన రైళ్లను ఈ మార్గం మీదగా నడిపించేందుకు వీలు కలిగింది. హైదరాబాద్ నుంచి రాయచూర్, గుంతకల్, బళ్లారి, హుబ్లీ, గోవా తదితర ప్రాంతాలకు ఈ మార్గం మీదుగా తక్కువ సమయంలో వెళ్లే వీలుంటుంది. బెంగళూరుకు కూడా ఇది ప్రత్యామ్నాయ లైన్గా ఉండనుంది. ఆయా ప్రాంతాల్లోని విద్యుదుత్పత్తి, సిమెంటు తదితర పరిశ్రమలకు సరుకు రవాణా చేసే రైళ్లకు ఇది ముఖ్య మార్గంగా మారుతోంది. దీంతో ఈ మార్గంలో వెంటనే గూడ్సు రైళ్లను నడిపేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కీలక మార్గాన్ని పూర్తి చేయటంలో శ్రమించిన అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ అభినందించారు. -
AP: కొప్పర్తికి రైల్వే లైన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న కొప్పర్తిలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లను అనుసంధానిస్తూ కొత్తగా రైల్వే లైన్ నిర్మిస్తోంది. కొప్పర్తికి సమీపంలోని కృష్ణాపురం రైల్వే స్టేషన్ నుంచి కొప్పర్తి వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్ను అనుసంధానిస్తూ రైల్వే సైడింగ్ను అభివృద్ధి చేయనున్నారు. పీఎం గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్ (జీసీటీ) పథకం కింద ఈ రైల్వే సైడింగ్ను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ వీసీ, ఎండీ సృజన తెలిపారు. కొప్పర్తి పారిశ్రామిక పార్కు నుంచి సులభంగా సరుకు ఎగుమతి, దిగుమతి చేసుకునేలా కృష్ణాపురం ప్రధాన లైన్ నుంచి సుమారు మూడు కిలోమీటర్లు ప్రత్యేక లైన్ నిర్మిస్తారు. ఇందుకు రూ.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పారిశ్రామిక పార్కులో నిర్మించే గోడౌన్లను సైడింగ్ లైనుతో అనుసంధానిస్తారు. దీనివల్ల ప్రధాన లైన్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా సరుకు రవాణా చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీస్కు ఏపీఐఐసీ టెండర్లును ఆహ్వానించింది. కొప్పర్తిలో ఈ రైల్వే సైడింగ్తో పాటు రూ.100.18 కోట్లతో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా, రూ.21 కోట్లతో అభివృద్ధిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ కేంద్రానికి త్వరలో సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధంచేసింది. -
లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అద్భుతమైన ప్రకృతి అందాలు, ఎత్తయిన, పచ్చని కొండలు, వీటిని మించి మరపురాని సొరంగ మార్గాల ద్వారా ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం.. మన పక్కనే ఉన్న ఒడిశాలోని కోరాపుట్కు వెళ్తే చాలు.. ఈ అనుభూతులన్నీ మీ సొంతమతాయి. అవేమిటో.. ఈ రూట్ విశేషాలను పర్యాటక ప్రేమికుల కోసం ప్రత్యేకం.. కే–ఆర్ (కోరాపుట్–రాయగడ) రైల్వే లైన్ వాల్తేర్ డివిజన్కు ప్రధానంగా ఆదాయాన్నిచ్చే కిరండూల్, బచేలిలో ఉన్న ఐరన్ ఓర్ రవాణా మార్గానికి ప్రత్యామ్నాయంగా వేరే లైన్ను ఏర్పాటుచేసి ఈ సరకు రవాణాను మరింతగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో 1980లలో కోరాపుట్ – రాయగడ (కే–ఆర్) లైన్ను ప్రారంభించగా.. 1993–92మధ్య ఈ లైన్ పూర్తయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1995 అక్టోబర్ 31న ప్రారంభించారు. కోరాపుట్ నుంచి రాయగడకు మొత్తం 167 కిలోమిటర్ల మేర ఈ లైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మొత్తం 36 సొరంగాలు, 76 ప్రధాన వంతెనలు, 180 అందమైన మలుపులు ఉన్నాయి. అప్పట్లో ప్రధానంగా ఈ మార్గం వైజాగ్ స్టీల్ప్లాంట్, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్లకు అసవరమైన ఐరన్ఓర్ను రవాణాను పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగించేవారు. పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి ఈ మార్గంలో అల్యూమినా పౌడర్ సరఫరా చేసే నాల్కో, ఉత్కళ్ అల్యూమినా, వేదాంత, జేకే పేపర్, ఇంఫా (ఇండియా మెటల్ అండ్ ఫెర్రో అల్లాయ్), హెచ్పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వంటి పరిశ్రమలకు ఎంతో అనుకూలంగా ఈ మార్గం ఉండేది. ప్రస్తుతం ఈ మార్గంలో రెండో లైన్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 2015–16లో రూ.2500 కోట్లు బడ్జెట్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2026నాటికి రెండోలైన్ పూర్తి చేయనున్నారు. పర్యాటక, పుణ్యక్షేత్రాల సమాహారం... ఆంధ్రా, ఒడిశా సదరన్ డివిజన్లో ప్రసిద్ధిచెందిన మజ్జిగైరమ్మ ఆలయం రాయగడ ప్రాంతంలోనే ఉంది రాయగడకు కేవలం 50కి.మీల దూరంలో చిత్రకోన వాటర్ ఫాల్స్ తెరుబలిలో గల ఇంఫా ప్యాక్టరీ వద్ద ప్రసిద్ధి చెందిన లక్ష్మీనారాయణ ఆలయం కోరాపుట్లో రాణి డుడుమ వాటర్ఫాల్స్, జగన్నాథస్వామి ఆలయం గుప్తేశ్వర గుహలు డియోమలి హిల్స్ కూడా కోరాపుట్ ప్రాంతంలోనే ఉన్నాయి. కోరాపుట్లోనే కోలాబ్ రిజర్వాయర్ కూడా ఉంది. గుహల్లో, వంతెనలపై మరపురాని ప్రయాణం ఈ మార్గంలో సొరంగాలలో నుండి రైలు దూసుకుపోతుంటే ఆ అనుభూతులే వేరు. సుమారు 36 చిన్న, పెద్ద సొరంగాలు. ఈ మార్గంలోనే రౌలీ స్టేషన్కు సమీపంలో తూర్పుప్రాంతంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గం ఉంది. దీని పొడవు 1,599 మీటర్లు (1.59 కిలోమిటర్లు). ప్రకృతి సోయగాలు, లోతైన, ఎత్తైన కొండలపై ప్రయాణం. సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో కోరాపుట్ రైల్వే స్టేషన్. అందమైన వంతెనలు ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ మార్గంలో ఉన్నాయి. సాధారణంగా అరకు, బొర్రాగుహలుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు, కానీ ఒకసారి ఈ ప్రాంతాలను సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. వెలుగులోకి తీసుకువచ్చిన వాల్తేర్ డివిజన్ కోరాపుట్–రాయగడ రైల్వే మార్గం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. వాల్తేర్ డివిజన్కు డివిజనల్ రైల్వే మేనేజర్ గా వచ్చిన అనూప్కుమార్ సత్పతి అతి తక్కువ సమయంలో ఈ మార్గంలో పర్యటించి, తనిఖీలు చేసి దీనిని పర్యాటకులకు పరిచయం చేశారు. ఈ మార్గంలో పర్యాటకుల కోసం తొలిసారిగా విస్టాడోమ్ కోచ్ను జతచేశారు. వారానికి మూడుసార్లు నడిచే విశాఖపట్నం–కోరాపుట్ స్పెషల్ ప్యాసింజర్ రైలుకు ఈ విస్టాడోమ్ కోచ్ జతచేస్తున్నారు. (క్లిక్ చేయండి: అడవుల్లోనూ ఆహార పంటలు) 20 ఏళ్ల తరువాత ప్రెస్టూర్... దాదాపు 20 ఏళ్ల తరువాత వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ మార్గంలో శనివారం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో గల ప్రముఖ పాత్రికేయులకు ప్రెస్టూర్ను ఏర్పాటుచేశాం. బహుశా కొద్ది డివిజన్లు మాత్రమే ఇటువంటివి ఏర్పాటు చేస్తాయి. ఈ టూర్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెందిన పర్యాటకరంగ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు పరిచయం చేస్తే బాగుంటుంది. – అనూప్ కుమార్ సత్పతి, డీఆర్ఎం అద్భుతంగా ఉంది మొదటిసారిగా ఈ ప్రాంతాలను సందర్శించా. విస్టాడోమ్కోచ్లో ప్రయాణించడం కూడా మరచిపోలేని అను భూతి. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు తనతో పాటు మార్కెటింగ్ డివిజన్ నుంచి కృష్ణమోహన్, రాజేంద్రరావు, లోకనాథరావు కూడా ఈ టూర్లో పాల్గొన్నారు. – కె హరిత, డివిజనల్ మేనేజర్, ఏపీ టూరిజం -
భద్రాచలం–సత్తుపల్లి బొగ్గు లైన్ రెడీ.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బొగ్గు తరలింపు కోసం ప్రత్యేకంగా నిర్మించిన భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే కారిడార్ను త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 12న ప్రారంభోత్సవం ఉంటుందని, అయితే దీనిని ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ కారిడార్ను సింగరేణి బొగ్గు గనుల సంస్థతో కలిసి రైల్వే నిర్మించింది. 54.10 కి.మీ. నిడివి గల ఈ ప్రాజెక్టును రూ.930 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. ఇందులో సింగరేణి సంస్థ రూ.619 కోట్లు భరించగా, మిగతా మొత్తాన్ని రైల్వే శాఖ వ్యయం చేసింది. జోన్ పరిధిలో గతంలో సిమెంటు ఫ్యాక్టరీలకు సున్నపురాయిని తరలించేందుకు బీబీనగర్–గుంటూరు మధ్య ఉన్న విష్ణుపురం నుంచి ఖాజీపేట–విజయవాడ సెక్షన్ల మధ్య ఉన్న మోటుమర్రి వరకు ఓ సరుకు రవాణా రైల్వే లైనును నిర్మించారు. దాని తర్వాత రెండో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇదే. లారీలకు ప్రత్యామ్నాయంగా.. సింగరేణి సంస్థ సత్తుపల్లి పరిసరాల్లో భారీ సంఖ్యలో ఓపెన్కాస్ట్ల నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. విస్తరించే క్రమంలో ప్రత్యేకంగా రైల్వే లైన్ అవసరమని భావించి రైల్వే శాఖకు ప్రతిపాదించింది. రైల్వేకు ప్రయాణికుల రైళ్ల ద్వారా కంటే సరుకు రవాణా రైళ్ల ద్వారానే ఆదాయం అధికంగా నమోదవుతుంది. దీంతో సింగరేణి సంస్థ ప్రతిపాదనను వెంటనే అంగీకరించిన రైల్వే 2010లో ప్రాజెక్టును మంజూరు చేసింది. అయితే పదేళ్ల తర్వాత కానీ పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా అంచనా వ్యయం రూ.360 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెరిగింది. చదవండి: పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం ప్రస్తుతం పూర్వపు ఖమ్మం జిల్లా పరిధిలోని గనుల నుంచి నిత్యం వేయికి పైగా లారీలతో బొగ్గు వివిధ ప్రాంతాలకు తరలుతోంది. ఇది భారీ ఖర్చుతో కూడుకున్నది. మరోవైపు బొగ్గు లోడు లారీల రాకపోకలతో రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయంటూ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీగా దుమ్ము రేగుతుండటంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. వీటన్నింటికీ రైల్వే మార్గమే పరిష్కారమని తేల్చారు. మొత్తం మూడు స్టేషన్లు ఈ ప్రాజెక్టు కోసం 860 ఎకరాల భూమిని సేకరించారు. ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉంటాయి. సారవరం క్రాసింగ్ స్టేషన్, చంద్రుగొండ క్రాసింగ్ స్టేషన్, పార్థసారథి పురం టెర్మినల్. సత్తుపల్లిలో పెద్దదైన జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్స్కు సంబంధించి సైడింగ్ స్టేషన్ పార్థసారథి పురంలోనే ఉంటుంది. ఈ మార్గంలో 10 మేజర్ బ్రిడ్జిలు, 37 మైనర్ బ్రిడ్జిలు, 40 ఆర్యూబీలు, 7 ఆర్ఓబీలు నిర్మించారు. రోజుకు ఐదారు రేక్ల బొగ్గు తరలింపు రోజుకు ఐదారు రేక్ (ఒక రైలు)ల లోడు తరలించాల్సి ఉంటుందని సింగరేణి సంస్థ ఆదిలోనే రైల్వే దృష్టికి తెచ్చింది. వచ్చే 30 ఏళ్లలో 200 మిలియన్ టన్నుల బొగ్గును ఇక్కడి నుంచి తరలిస్తారని అంచనా. ప్రస్తుతం ఇక్కడినుంచి 7.5 మిలియన్ టన్నుల బొగ్గును లారీల ద్వారా వేరే ప్రాంతాల్లోని రైల్వే సైడింగ్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ రైల్వే లైను ప్రారంభంతో ఆ బాధ తప్పుతుంది. దాంతోపాటు ఏడాదికి మరో 2.5 మిలియన్ టన్నుల బొగ్గును అదనంగా ఇక్కడ లోడ్ చేయనున్నారు. ప్రస్తుతానికి బొగ్గుకే పరిమితం.. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి ఆంధ్రలోని కొవ్వూరుకు ఓ రైల్వే లైన్ను పదేళ్ల కింద మంజూరు చేశారు. ప్రస్తుతం బొగ్గు తరలింపునకు నిర్మించిన మార్గాన్ని దానికి అనుసంధానించి పొడిగిస్తే బాగుటుందనే ప్రతిపాదనలు ఉన్నాయి. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి మరో అదనపు లైను బదులు, సత్తుపల్లి వరకు నిర్మించిన బొగ్గు తరలింపు లైన్ను పొడిగిస్తే ఖర్చు తగ్గుతుందన్నది ఆలోచన. కానీ దీనిని సింగరేణి సంస్థ ఆమోదించాల్సి ఉంది. -
‘పట్టాలు’ తప్పిన ప్రాజెక్టు నష్టం రూ. 2000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అది ఓ కీలక ప్రాజెక్టు.. పూర్తయితే అదనంగా రోజుకు వంద రైళ్లను నడిపేందుకు అవకాశమున్న కారిడార్. ఈ ప్రాజెక్టు విషయంలో రైల్వే జాప్యం చేసింది. ఆ ఆలస్యం ఖరీదు దాదాపు రూ.2 వేల కోట్లు కావడం గమనార్హం. రూ.2,063 కోట్ల వ్యయంతో సిద్ధం కావాల్సిన ప్రాజెక్టును ఇప్పుడు పూర్తి చేసేందుకు రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కానుంది. అంటే మరో ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు సరిపడా ప్రజాధనాన్ని రైల్వే వృథా చేసినట్టవుతోందన్నమాట. కాజీపేట– బల్లార్షా మూడో లైన్ (ట్రిప్లింగ్) ప్రాజెక్టులో ఈ జాప్యం చోటు చేసుకుంది. కీలకమైన అతిరద్దీతో కూడిన లైన్ దక్షిణ భారతాన్ని ఉత్తర భారతంతో జోడించే అతి కీలక రైల్వే లైన్ ఇది. దక్షిణ భారత్ ప్రజలు ఎగువ ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రైల్వే లైన్. అందుకే దీన్ని గ్రాండ్ ట్రంక్ రూట్గా పరిగణిస్తారు. నిత్యం వందల సంఖ్యలో ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుంటాయి. లైన్ ప్రాధాన్యం దృష్ట్యా ఇటీవల ఆ కారిడార్లో రైలు వేగాన్ని గంటకు 130 కి.మీ.కు పెంచారు. ఈ మార్గంలోని మాణిక్ఘర్, రేచిని, ఉప్పల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మందమర్రి, రామగుండం, పెద్దంపేట, సిర్పూర్–కాగజ్నగర్.. ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులు, సిమెంటు పరిశ్రమలు భారీగా ఉన్నాయి. ఎరువుల కర్మాగారం ఉంది. వెరసి వందలాది సరుకు రవాణా రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఇది రైల్వేకు ప్రధాన ఆదాయ వనరుగా, గోల్డెన్ కారిడార్గా వెలుగొందుతోంది. ఒక్క రైలునూ కూడా అదనంగా నడపలేని పరిస్థితి ప్రస్తుతం ఈ మార్గంలో ప్రతిరోజూ 250 రైళ్లు తిరుగుతున్నాయి. అవసరమైన సందర్భాల్లో ప్రత్యేక రైళ్లతో కలిసి 300 రైళ్ల వరకు తిప్పుతున్నారు. ప్రస్తుతం ఆ రూట్లో 130 శాతం రైలు ట్రాఫిక్ రికార్డవుతోంది. దీంతో మరో రైలును కూడా అదనంగా తిప్పే పరిస్థితి లేకుండా పోయింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ, ముంబయి వైపు మరిన్ని రైళ్లు నడపాల్సి ఉన్నా, ఈ మార్గం ఇరుగ్గా మారటంతో నడపలేని దుస్థితి నెలకొంది. అత్యవసరంగా ఓ బొగ్గు రవాణా రైలు ముందుకు సాగాలంటే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నిలిపివేయాల్సి వస్తోంది. మూడో లైన్ ఆవశ్యకతను గుర్తించిన కేంద్రం మూడో లైన్ పూర్తయితే ఆ సమస్య తీరడంతో పాటు అదనంగా మరో 100 రైళ్లను నిత్యం నడిపే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే మూడో లైన్ నిర్మాణం అత్యంత ఆవశ్యకమని గుర్తించిన కేంద్రం 2015–16లో ప్రాజెక్టును మంజూరు చేసింది. దీని నిడివి 202 కి.మీ కాగా అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. ప్రాజెక్టు ప్రారంభం, పనులు రెండూ జాప్యమే.. ఈ ప్రాజెక్టు పనులు సకాలంలో ప్రారంభం కాలేదు. ప్రారంభించాక వేగంగా పనులు చేశారా అంటే.. ఇప్పటికి పూర్తయింది కేవలం 71 కి.మీ (35 శాతం) మాత్రమే. మరో 68 కి.మీ పనులు (33 శాతం) కొనసాగుతున్నాయి. ఇవి 2023 మార్చి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మరో 60 కి.మీ పైగా పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటికే రూ.1,700 కోట్లు ఖర్చయ్యాయి. తాజా పరిస్థితుల్లో మిగతా పనులు పూర్తి కావాలంటే ప్రాజెక్టు వ్యయం రూ.4 వేల కోట్లు దాటుతుందని అంచనా. అంటే ప్రాజెక్టు పనులు ఆలస్యం కావటంతో అంచనా వ్యయం దాదాపు రెట్టింపు అవుతోందన్నమాట. అప్పట్లోనే గుర్తించి ఉంటే.. సరుకు రవాణాలో కీలక మార్గం కావటంతో దాదాపు 12 ఏళ్ల క్రితమే రాఘవాపురం–పెద్దంపేట, మంచిర్యాల–మందమర్రి మధ్య 24 కి.మీ, మంచిర్యాల–పెద్దంపేట మధ్య గోదావరి నదిపై భారీ వంతెన సహా 9 కి.మీ లైన్ మంజూరు చేశారు. ఆ పనులు చేపట్టి దశలవారీగా పూర్తి చేశారు. కానీ కారిడార్ యావత్తు మూడో లైన్ అవసరమన్న విషయాన్ని అప్పుడే గుర్తించి వెంటనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వ్యయం రెట్టింపు అయ్యే పరిస్థితే తలెత్తేది కాదని రైల్వేవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ఎక్కడ ఉందంటే..?
ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ట్రాన్స్-సైబీరియన్. ఇది రష్యాలో ఉంది. దీని పొడవు 9289 కిలో మీటర్లు. ఇది మాస్కోలో మొదలై సీ ఆఫ్ జపాన్ గుండా వ్లాదివోస్టోక్ వరకు విస్తరించింది. ఈ మార్గంలో ఏకంగా 3901 వంతెనలు ఉండటం విశేషం. -
విద్యుత్ వెలుగు.. మార్గం మెరుగు
రాజంపేట: ఇటు వైఎస్సార్, అటు కర్నూలు జిల్లాలకు అనుసంధానంగా నిర్మితమైన ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గంలో విద్యుద్దీకరణ పూర్తి అయింది. ఈ యేడాది మార్చి నుంచి లాంఛనంగా కరెంటు రైలింజన్లతో నడిపిస్తున్నారు. రూ.976 కోట్లతో నంద్యాల–ఎర్రగుంట్ల రైలుమార్గం నిర్మించారు. ఈ మార్గంలో తొలి ప్యాసింజర్ రైలును 2016 ఆగస్టు 20న నడిపించారు. 123 కిలోమీటర్ల మేర.. నంద్యాల –ఎర్రగుంట్ల మధ్య 123 కిలోమీటర్ల మేర రైలుమార్గం విద్యుద్దీకరణ పూర్తి కావడంతో కొత్తరైళ్లను కూడా నడిపించే అవకాశాలున్నాయి. గతంలో డీజిల్ లోకోతో నడిచేవి. ఈ మార్గంలో గూడ్స్రైళ్లు నడుస్తున్నాయి. డీజిల్ ఇంజిన్ల వినియోగాన్ని తగ్గించేందుకు రైల్వేలో విద్యుద్దీకరణకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. గత బడ్జెట్లో ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గం విద్యుద్దీకరణకు రూ.150 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే, నంద్యాలవైపు నుంచి మద్దూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంద్యాల, నొస్సం, ఉప్పలపాడు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల వరకు ట్రాక్షన్ రైలుమార్గంగా కొనసాగింది. 8 కొత్తరైళ్లు నడిచేనా.. నంద్యాల–ఎర్రగుంట్ల రైలుమార్గంలో కొత్తరైళ్లు నడిచేనా అన్న అంశం నేడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ మార్గంలో ధర్మవరం– విజయవాడ ఎక్స్ప్రెస్ రైలు మాత్రమే నడుస్తోంది. ప్రారంభంలో నడిచిన నంద్యాల– కడప డెమో ప్యాసింజర్ను కరోనా సీజన్లో రద్దు చేశారు. తిరిగి ఆ రైలు ఇంతవరకు పట్టాలెక్కలేదు. రైలుమార్గం విద్ద్యుద్దీకరణ కావడం వల్ల కర్నూలు, కడపల మీదుగా ఇటు తిరుపతికి, అటు గుత్తి, గుంతకల్ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు రైళ్లను నడిపించేందుకు (డీజిల్ లోకోలతో పనిలేకుండా) మార్గం సులువైంది. అలాగే కడప నుంచి విజయవాడకు డైలీ రైలును ఈ మార్గం మీదుగా నడిపిస్తే మరింత అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. నంద్యాల– ఎర్రగుంట్ల రైలు మార్గం విద్యుద్దీకరణ నేపథ్యంలో మరిన్ని కొత్త రైళ్లను నడిపేలా రైల్వే అధికారులు చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. (చదవండి: సారూ... పిల్లలతో పని చేయిస్తే ఎలా? ) -
మల్కన్గిరి–భద్రాచలం కొత్త రైల్వే లైన్
సాక్షి, హైదరాబాద్: ఒడిశా–తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం కాబోతోంది. ఒడిశాలోని మల్కన్గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు ఇది ఏర్పాటుకానుంది. రెండు రాష్ట్రాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాలను అనుసంధానిస్తూ ఈ కొత్త లైన్ వేయనున్నారు. గిరిజన ప్రాంతాలకు రవాణా వసతిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణం కానున్నట్టు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. 173.416 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ లైన్ నిర్మాణానికి రూ.2,800 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. నదులు, వాగులు వంకలు ఉన్న నేపథ్యంలో ఈ మార్గంలో ఏకంగా 213 వంతెనలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటిల్లో 48 భారీ వంతెనలు ఉన్నాయి. ఈస్ట్కోస్ట్ రైల్వే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గతేడాది సెప్టెంబర్లో రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. ఇటీవలి బడ్జెట్లో ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) కోసం రూ.3 కోట్లు ప్రతిపాదించారు. ఈ మేరకు మొదలైన సర్వే జూన్ నాటికి పూర్తి కానుంది. సర్వే నివేదికను పరిశీలించి రైల్వే బోర్డు అనుమతి ఇవ్వగానే పనులు ప్రారంభించనున్నారు. తెలంగాణలోకి ఇలా.. ఒడిశాలోని జేపూర్ నుంచి మల్కన్గిరికి గతంలో రైల్వే లైన్ మంజూరు కాగా, ప్రస్తుతం ఆ పనులు సాగుతున్నాయి. దాన్ని మరింత విస్తరించే క్రమంలో, ఈ కొత్త మార్గానికి ఈస్ట్కోస్ట్ రైల్వే ప్రతిపాదనలు రూపొందించింది. కొత్త లైన్ ఒడిశాలోని మల్కన్గిరి, బదలి, కోవాసిగూడ, రాజన్గూడ, మహారాజ్పల్లి, లూనిమన్గూడల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామ, భద్రాచలం వరకు సాగుతుంది. ఇప్పటికే ఉన్న భద్రాచలం – పాండురంగాపురం లైన్తో దీనిని అనుసంధానించనున్నారు. ప్రస్తుతానికి ప్రయాణికుల కోసమే.. రైల్వే కొంతకాలంగా సరుకు రవాణాకు బాగా ప్రాధాన్యం ఇస్తోంది. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ప్రత్యేకంగా సరుకు రవాణా కారిడార్లను కూడా నిర్మిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సింగరేణి కార్పొరేషన్తో కలిసి సంయుక్తంగా భద్రాచలం–సత్తుపల్లి లైన్ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఇది కేవలం బొగ్గు తరలింపును దృష్టిలో పెట్టుకునే నిర్మిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేపట్టబోయే మల్కన్గిరి–భద్రాచలం మార్గాన్ని ప్రస్తుతానికి ప్రయాణికుల రైళ్ల కోసమే అని పేర్కొంటున్నప్పటికీ, భవిష్యత్తులో దీన్ని సరుకు రవాణాకు కూడా వినియోగించే అవకాశం ఉంది. సర్వే వేగవంతం చేయండి: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం మల్కన్గిరి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈస్ట్కోస్ట్ రైల్వే అధికారులు ఆయనకు మల్కన్గిరి–భద్రాచలం లైన్ పురోగతిని మ్యాప్ల సాయంతో వివరించారు. కొత్తలైన్ పనులు వీలైనంత త్వరగా చేపట్టేలా సర్వేలో వేగం పెంచాలని మంత్రి సూచించారు. -
ప్రమాదకర రైల్వే మార్గం.. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే!
అత్యంత సురక్షితమైన ప్రయాణాల్లో రైలు ప్రయాణం ఒకటి. కానీ చెప్పలేనంత థ్రిల్ని అందిస్తూ ఏ మాత్రం తేడా జరిగినా ప్రాణాలు గాల్లో కలిసిపోయే అతి ప్రమాదకరమైన రైల్వే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి అవేంటో చూద్దామా? అర్జెంటీనాలోని సాల్టాలో చిలీ పోల్వోరి రైల్వే లైన్ 13,845 అడుగుల ఎత్తులో మబ్బుల్లో తేలుతూ ఉంటుంది. దీన్ని 1948లో ప్రారంభించారు. ఇది కట్టడానికి 27 ఏళ్లు పట్టింది. 217 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గం మధ్యలో 29 బ్రిడ్జీలు, 21 సొరంగాలుంటాయి. ఈ మొత్తాన్ని దాటడానికి సుమారు 16 గంటలు పడుతుంది. ఈ రైల్లో వెళ్తుంటే.. ప్రయాణికులకు చెప్పలేంత థ్రిల్ కలుగుతుంది. భారత్లో కూడా అలాంటి ప్రమాదకరమైన రైలు మార్గం ఉంది. చెన్నై నుంచి రామేశ్వరం వెళ్లే రైలు మార్గంలో 2.3 కిలోమీటర్ల దూరం సముద్రంపై నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. సముద్రపు ఆటుపోట్లకు, బలమైన గాలులకు ఎదురీదుతున్నట్లుగా ఈ రైలు దూసుకుపోతుంది. ఇది ప్రయాణికులకు ఎంతో ఉద్విగ్న భరితమైన ప్రయాణం. ఈక్వెడార్లోని డెవిల్స్ నోస్ రైలు మార్గం, కొలరాడోలోని జార్జ్ టౌన్ లూప్ రైల్వే మార్గం, ఆస్ట్రేలియాలోని కురండా రైల్వే మార్గం, అలస్కాలోని వైట్ పాస్ – యుకోన్ రైల్వే మార్గం ఇలా.. ప్రమాదకరమైన రైల్వే మార్గాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. -
వచ్చే నెలలో భద్రాచలం– సత్తుపల్లి రైల్వే లైన్ పూర్తి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్–దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా చేపట్టిన 54 కిలోమీటర్ల భద్రాచలం–సత్తుపల్లి రైల్వే లైన్ పనులు వచ్చే నెలాఖరుకు పూర్తయ్యేలా చూడాలని అధికారులను సింగరేణి డైరెక్టర్లు ఎన్.బలరామ్, డి.సత్యనారాయణరావు ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ లైన్ మార్గం పూర్తయితే పర్యావరణ హితంగా బొగ్గు రవాణా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. సత్తుపల్లి వద్ద నిర్మిస్తున్న అతి పెద్ద సీహెచ్పీ నిర్మాణం కూడా మార్చికల్లా పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 68 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా ఉపరితల గనుల్లో రోజూ 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను వెలికి తీయాలని ఓబీ కాంట్రాక్టర్లను డైరెక్టర్లు ఆదేశించారు. -
‘భద్రక్-విజయనగరం’ రైల్వే లైన్కు కేంద్రం మొండిచేయి?
న్యూఢిల్లీ: భద్రక్-విజయనగరం మధ్య 2015-16 రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించిన మూడో రైల్ లైన్ నిర్మాణానికి ఇంకా ఆమోదం పొందలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు శుక్రవారం కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్కు సంబంధించి రూపొందించిన డీపీఆర్ ప్రకారం 385 కిలోమీటర్ల దూరం నిర్మించే ఈ రైలు మార్గం నిర్మాణానికి రూ.3,823 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆమోదానికి నోచుకోకపోవడంతో కాలయాపన వలన ప్రాజెక్ట్ వ్యయం పెరిగే అవకాశమే లేదని చెప్పారు. -
40 ఏళ్ల కల: ఈసారైనా కూ.. చుక్చుక్ వచ్చేనా?
కొడంగల్ : కృష్ణా – వికారాబాద్ రైల్వే లైన్ ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. 40 ఏళ్లుగా ఊరిస్తూ వస్తోంది. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన ఎంపీలు ఈసారైనా పార్లమెంట్లో రైల్వే లైన్ గురించి ప్రస్తావిస్తారన్న ఆశతో స్థానికులు ఉన్నారు. 40 ఏళ్ల క్రితమే సర్వే.. కొడంగల్ మీదుగా రైల్వే లైన్ వేయించాలనే ఉద్దేశంతో 1980–81 సంవత్సరంలో అప్పటి మహబూబ్నగర్ ఎంపీ, రైల్వేశాఖ సహాయ మంత్రి మల్లికార్జున్ సర్వేకు ఆదేశించారు. వికారాబాద్ నుంచి పరిగి, దోమ, సర్జఖాన్పేట, మద్దూరు, నారాయణపేట, ఊట్కూర్, మక్తల్, మాగనూర్ మీదుగా కృష్ణ వరకు రైల్వేలైన్ నిర్మాణానికి సర్వే నిర్వహించారు. అయితే కొడంగల్ ప్రజల డిమాండ్ మేరకు రెండో పర్యాయం మలి సర్వేకు కేంద్రం ఆదేశించింది. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మీదుగా రైల్వే లైన్ వేస్తే ఆదాయం వస్తుందని గణాంకాలను విశ్లేషిస్తూ ఇక్కడి ప్రజలు, అధికారులు కేంద్రానికి నివేదిక పంపించారు. కేంద్ర రైల్వే శాఖా మంత్రి ఆదేశాల మేరకు రెండో సారి సర్వే జరిగింది. కొడంగల్ మీదుగా రైల్వే లైన్ వేస్తే బాగుంటుందని నిపుణులు నివేదిక సమర్పించారు. అనంతరం జరిగిన పరిణామాల వల్ల రాష్ట్ర విభజన, ఆ తర్వాత జిల్లాల విభజన జరిగాయి. కోస్గి, మద్దూరు మండలాలు మహబూబ్నగర్ జిల్లాలోకి వెళ్లాయి. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాలు వికారాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొడంగల్ మీదుగా రైల్వే లైన్ వేస్తే జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించడానికి వీలుగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని విద్యావంతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు. కొడంగల్ మీదుగా.. వికారాబాద్ జిల్లా నుంచి పరిగి, బొంరాస్పేట, కొడంగల్, కోస్గి, మద్దూరు, నారాయణపేట, ఊట్కూర్, మక్తల్, మాగనూర్ మీదుగా కృష్ణ వరకు రైల్వేలైన్ నిర్మిస్తే కొడంగల్ నియోజకవర్గానికి రవాణా సమస్యలు తీరుతాయి. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి సులువుగా ఉంటుంది. అంతేకాకుండా వివిధ రకాల సరుకుల రవాణా ద్వారా రైల్వేశాఖకు ఆదాయం వస్తుంది. మహబూబ్నగర్, చేవెళ్ల ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, రంజిత్రెడ్డి ఈ విషయాన్ని పార్లమెంట్ ప్రస్తావించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది కృష్ణా – వికారాబాద్ రైల్వే లైన్ వల్ల కొడంగల్ నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుంది. రవాణా వ్యవస్థ మె రుగు పడుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటు ంది. ఈ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతిని ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజల సహకారంతో పలుమార్లు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాం. సర్వే చేసి వదిలేశారు. ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించాలి. – అబ్దుల్ హాఖ్, ఉపాధ్యాయుడు, కొడంగల్ -
రాష్ట్రానికి మరో రైల్వే లైను
సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే మరో రైల్వే ప్రాజెక్టు కల సాకారం కానుంది. సగం నిధులు భరించేందుకు ముందుకొస్తే కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రం రెండేళ్ల కిందటే సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న మనోహరాబాద్–పెద్దపల్లి ప్రాజెక్టు ఇలాగే పట్టాలెక్కుతోంది. ఇప్పుడు అదే తరహాలో మరో కీలక ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. పటాన్చెరు–సంగారెడ్డి–జోగిపేట–మెదక్ లైన్కు సంబంధించి తాజాగా దక్షిణ మధ్య రైల్వే రీకనైసెన్స్ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే పూర్తి చేసి రూ.1,764.92 కోట్ల అంచనాతో రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపింది. దీనికి వచ్చే కేంద్ర బడ్జెట్లో చోటు దక్కితే ఫైనల్ లొకేషన్ సర్వేకు అవకాశం దక్కుతుంది. ఎంతో కీలకం.. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పరిశీలిస్తే రైల్వే లైన్లలో మెదక్ జిల్లా వెనుకబడి ఉంది. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడల్లో ఒకటైన పటాన్చెరుతో అనుసంధానిస్తూ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డిని కలుపుకొంటూ మెదక్ వరకు దీన్ని నిర్మిస్తే ఉత్తర–దక్షిణ భారత్లను జోడించే ప్రత్యామ్నాయ రైలు మార్గం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. దీంతో రైల్వే ట్రాఫిక్ కూడా తగ్గనుంది. ఇందుకోసం జోగిపేటకు చెందిన సీనియర్ నేత గంగా జోగినాథ్ రైల్వే లైన్ సాధన సమితి పేరిట ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ప్రధాని మొదలు దక్షిణ మధ్య రైల్వే జీఎం వరకు అందరినీ కలసి విజ్ఞప్తి చేశారు. చివరకు 2018–19 బడ్జెట్లో దీన్ని పరిశీలించేందుకు రైల్వే మంత్రి సమ్మతిస్తూ సర్వేకు ఆదేశించారు. నాటి రైల్వే బడ్జెట్ బ్లూ బుక్లో దీనికి చోటు దక్కింది. ఆమేరకు దక్షిణ మధ్య రైల్వే సర్వే పూర్తి చేసి గత డిసెంబర్ 31న రైల్వే బోర్డుకు ప్రతిపాదించింది. పింక్ బుక్లో చోటు దక్కితేనే.. రైల్వే బడ్జెట్ సమయంలో రెండు పుస్తకాలుంటాయి. ఫైనల్ అయిన ప్రాజెక్టుల వివరాలు పింక్ బుక్లో, తాత్కాలిక ప్రాజెక్టుల వివరాలు బ్లూ బుక్లో ఉంటాయి. పింక్ బుక్లో చోటు దక్కినవి ఆలస్యమైనా ఎప్పటికో అప్పటికి పట్టాలెక్కుతాయి. బ్లూ బుక్లోని ప్రాజెక్టులు రైల్వే బోర్డు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు పటాన్చెరు–మెదక్కు సంబంధించిన 95 కి.మీ. ప్రాజెక్టు బ్లూబుక్లో ఉంది. వచ్చే బడ్జెట్లో అది పింక్ బుక్లోకి మారాల్సి ఉంది. ఖర్చు భరించేందుకు ముందుకొస్తే.. రాష్ట్రప్రభుత్వం 50 శాతం ఖర్చు భరించేందుకు ముందుకొస్తే రైల్వే ముందడుగు వేస్తుంది. అది కూడా సాధ్యం అని భావిస్తేనే పట్టాలెక్కుతుంది. లేదంటే రాష్ట్రప్రభుత్వం మరింత ఖర్చు భరించేందుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు రైల్వేకు సమాచారం ఇస్తే ఫలితం కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రతిపాదిత లైను వట్టినాగులపల్లి – చేరియాల్ – సంగారెడ్డి – కోర్పోల్ – సాయిబాన్పేట – జోగిపేట – చిట్కుల్ – కోర్పాక్ – పొడ్చనపల్లి– ఘన్పూర్ – మెదక్ల మీదుగా కొనసాగుతుంది. -
రైలు మార్గం కోసం 2.2 లక్షల చెట్లు హరి!
సాక్షి, న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదమైన ‘హుబ్బలి–అంకోలి రైల్వే లైన్ ప్రాజెక్ట్’కు కర్నాటక రాష్ట్ర వైల్డ్లైవ్ బోర్డు మార్చి 20వ తేదీన అనుమతిచ్చింది. ప్రజలతోపాటు కొంత మంది బోర్డు సభ్యుల అభ్యంతరాలను కూడా ఖాతరు చేయకుండా అనుమతివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచ హెరిటేజ్ సైట్గా ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తించిన వెస్టర్న్ ఘాట్లో 164.44 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని ఈ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 2.2 లక్షల చెట్లను కొట్టివేయాల్సి వస్తోంది. దీనికోసం మొత్తం 995.64 హెక్టార్ల స్థలం అవసరం కాగా, అందులో 595.64 హెక్టార్లు పూర్తిగా అడవిలోనిదే. 184.6 హెక్టార్లు చిత్తడి నేల కాగా, 190 హెక్టార్లు మాత్రమే బీడు భూమి. వర్షాకాలంలో రవాణా సంబంధాలు తెగిపోతున్న ఉత్తర, హైదరాబాద్–కర్ణాటక ప్రాంతం సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని, ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరగుతాయని బోర్డులో సభ్యుడైన కర్ణాటక అడవుల ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సంజయ్ మోహన్ తెలిపారు. చదవండి: కేంద్ర మంత్రికి సీఎం వైఎస్ జగన్ లేఖ ఇది అందరికి చెప్పే కారణం. అసలు ప్రాజెక్ట్ ఉద్దేశం కర్ణాటకలోని బళ్లారి, హోస్పేట్ నుంచి బొగ్గును రాష్ట్రంలోని అంకోలా, కర్వోర్ ప్రాంతాలకు, గోవాలోని వాస్కో, మడ్గావ్ రేవులకు తరలించేందుకని సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 1.8 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించిన వెస్టర్న్ ఘాట్స్ (పడమటి కనుమలు) 30 శాతంపైగా అన్ని రకాల మొక్కలు, చేపలు, పక్షులతోపాటు పలు జీవరాశులున్నాయి. అందుకని వీటిని జీవ వైవిద్యానికి ప్రతీకలు అంటారు. ఈ కనుమల గుండా 38 నదులు తూర్పునకు ప్రవహిస్తుండగా వాటిలో 27 నదులు అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి, కృష్ణ, మాండవి, కావేరి, జౌరి లాంటి ప్రధాన నదులు పశ్చిమ కనుమల్లోనే పుట్టి ప్రవహిస్తున్నాయి. భారత్ ద్వీపకల్ప రాష్ట్రాల్లో నివసిస్తోన్న దాదాపు 25 కోట్ల మంది ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నవి ఈ నదులే. చదవండి: భారత సైన్యం కీలక నిర్ణయం..! ఈ కనుమల్లో 2,500 రకాల మొక్కలు, జంతువులు, ఉభయచరాలు, క్రిమికీటకాలతో విరాజిల్లుతూ ప్రపంచంలో ప్రముఖ జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందిందని, అభివృద్ధి పేరిట రైల్వే ప్రాజెక్ట్ను చేపట్టినట్లయితే అనేక జాతుల జీవ వైవిధ్యం నశించి పోతాయని బెంగళూరు మహానగర పాలిక అటవీ విభాగానికి చెందిన జీవవైవిధ్య మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు విజయ్ నిశాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ప్రాజెక్ట్ వర్షపాతాన్ని దెబ్బతీయడంతోపాటు వాతావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తుందని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సెంటర్ ఫర్ ఎకాలోజికల్ సైన్స్కు చెందిన శాస్త్రవేత్త టీవీ రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో -
ఘట్కేసర్–మౌలాలి మధ్య ఫోర్లేన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రధాన రవాణా మార్గాల్లో ఒకటిగా ఉన్న ఎంఎంటీఎస్ ప్రాజెక్టు రెండో దశలో కీలక మార్గంలో కొంత భాగం అందుబాటులోకి వచ్చింది. సనత్నగర్–ఘట్కేసర్ మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు నడిపే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు రెండో దశలో పనులను చేర్చారు. ఘట్కేసర్ నుంచి మౌలాలి మీదుగా మౌలాలి హౌసింగ్బోర్డు కాలనీ, ఫిరోజ్గూడ, సుచిత్ర కూడలి, నేరెడ్మెట్ మీదుగా 35 కిలోమీటర్ల మేర ఈ మార్గం కొనసాగుతుంది.కీలకమైన ఘట్కేసర్–మౌలాలి మధ్య తాజా గా డబుల్ లేన్ నిర్మించారు. ఇప్పటికే ఆ మార్గంలో డబుల్ లేన్ ఉండగా, దానికి అదనంగా కొత్తగా రెండు వరసల మార్గం అందుబాటులోకి వచ్చింది. దానికి ఎలిక్ట్రిఫికేషన్, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అనుసంధానం పూర్తి కావటంతో సాధారణ రైళ్లు నడిపేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ పచ్చజెండా ఊపటంతో బుధవారం నుంచి రైళ్లను నడుపుతున్నారు. మౌలాలి నుంచి సనత్నగర్ వరకు ఎంఎంటీఎస్ మార్గం పూర్తి కావాల్సి ఉన్నందున వాటిని నడిపేందుకు ఇంకా సమయం పట్టనుంది. ఎంఎంటీఎస్ రైళ్ల కోసం నిర్మించిన ఈ కొత్త డబుల్లేన్ మీదుగా రైళ్లు దూసుకెళ్లేందుకు కొంతకాలం నిరీక్షించక తప్పని దుస్థితి నెలకొంది. ఘట్కేసర్ నుంచి మౌలాలి వరకు రూపుదిద్దుకున్న కొత్త డబుల్లేన్, అక్కడి నుంచి సనత్నగర్కు మళ్లాల్సి ఉంది. ఆ డైవర్షన్ మౌలాలి హౌసింగ్బోర్డు కాలనీ మీదుగా అమ్ముగూడ మార్గంలో ప్రస్తుతం ఉన్న సింగిల్ లేన్తో అనుసంధానం కావాల్సి ఉంది. సనత్నగర్ మీదుగా సుచిత్ర, రామకృష్ణాపురం, నేరెడ్మెట్ మీదుగా ప్రస్తుతం సాగుతున్న ఆ సింగిల్లేన్ను కేవలం గూడ్సు రైళ్లు నడిపేందుకే పరిమితం చేశారు. దానిని అనుసంధానిస్తూ కొత్తగా డబుల్లేన్ రూపొందించాల్సి ఉంది. కానీ మధ్యలో కొంత భాగం రక్షణ శాఖ స్థలాలున్నాయి. వాటిని స్వాధీనం చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎంతో ఊరట సికింద్రాబాద్–కాజీపేట ప్రధాన మార్గంలో ఉన్న ఘట్కేసర్–మౌలాలి స్టేషన్ల మధ్య అందుబాటులోకి వచ్చిన కొత్త డబుల్ లేన్ ఇప్పుడు రైళ్ల రద్దీతో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఎంతో ఊరటనివ్వబోతోంది. సికింద్రాబాద్, కాజీపేట, నడికుడి (గుంటూరు), సనత్నగర్ (బైపాస్)లను అనుసంధానిస్తుంది. ఈ 12.2 కి.మీ. మేర రెండు వరసలతో ట్రాక్ నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చయింది. -
‘కూత’కు వేళాయె
గజ్వేల్/ మనోహరాబాద్(తూప్రాన్): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక మలుపు. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్న... రైలు కూత మరికొద్ది రోజుల్లో వినబోతున్నారు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పనుల్లో భాగంగా తొలిదశలో గజ్వేల్ పనులు పూర్తయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతానికి దేశ రాజధాని ఢిల్లీ, మరో మహానగరం కలకత్తాకు ఇక సులువైన మార్గం ఏర్పడనుంది. ఇప్పటికే మనోహరాబాద్–నాచారం వరకు ‘ట్రయల్ రన్’ పూర్తి చేసిన అధికారులు తాజాగా శనివారం గజ్వేల్ వరకు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా త్వరలోనే లైన్ను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్గేజ్ లైన్ నిర్మాణం జరుగబోతుండగా... రూ.1160.47కోట్లను వెచి్చస్తున్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో ఈ రైల్వేలైన్ కీలక మలుపుగా మారనుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్లడానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గమే ఆధారం. ఈ రైల్వేలైన్ పూర్తయితే ప్రయాణం ఇక సులువు కానుంది. ఈ లైన్కు కేటాయించిన నిధుల్లో మొదటి విడతగా కేంద్రం రూ.350కోట్లకుపైగా నిధులను విడుదల చేయగా... రెండేళ్లలో ఒకసారి రూ.125 కోట్లను, రూ. 200 కోట్లు, తాజా బడ్జెట్లో మరో రూ.235కోట్లు విడుదల చేయడంతో పనులకు మరింత ఊపు వచి్చంది. మొత్తం ఈ లైన్ కోసం మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల పరిధిలో 2020 ఎకరాల భూసేకరణ ప్రక్రియ పూర్తి కావచి్చంది. ఈ రైల్వేలైన్పై మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని స్టేషన్తో పాటు వర్గల్ మండలం నాచారంగుట్ట, రాయపోల్ మండలం బేగంపేట, గజ్వేల్, గజ్వేల్ మండలం కొడకండ్ల, కొండపాక మండలం దుద్దెడ, సిద్దిపేట, చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది, చిన్న గంగాపూర్, సిరిసిల్ల, వేములవాడ, బోజపల్లి, వెదిరతోపాటు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రైల్వేస్టేషన్లు ఉండబోతున్నాయి. ఇందులో మనోహరాబాద్, కొత్తపల్లి స్టేషన్లు ఇప్పటికే నిర్మితమై ఉండగా కొత్తగా మిగతా 13స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఈ లైన్వల్ల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కలకత్తా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్గా ఆవిర్భవించనున్నది. పెద్దపల్లి గ్రాండ్ట్రంక్లైన్కు ఇప్పటి వరకు సికింద్రాబాద్, ఖాజీపేట మార్గం అనుసంధానంగా ఉండేది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పూర్తైతే ప్రయాణీకులకు దూరభారం తగ్గనుంది. మొత్తానికి ఈలైన్తో సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరనుందని అధికారులు చెబుతున్నారు. పూర్తయిన మనోహరాబాద్–గజ్వేల్ లైన్ పనులు మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 33 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయి. లైన్లపై ఉన్న వంతెన పనులను త్వరలోనే పూర్తి చేసేదిశగా సంబంధిత యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇకపోతే మనోహరాబాద్ దాటిన తర్వాత నాగ్పూర్ జాతీయ రహదారిని ఈ రైల్వేలైన్ దాటేందుకు చేపడుతున్న ఆర్వోబీ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. గజ్వేల్ వద్ద నిర్మిస్తున్న వంతెనతో పాటు ఆర్వోబీ పనులు పూర్తయితే రైలు మార్గం దాదాపు పూర్తయినట్లే. ఈ క్రమంలోనే భద్రతా పరీక్షలు పూర్తి చేసుకొని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్ఎస్) ఆమోదం పొందిన తర్వాత ప్రయాణీకుల రైలును పట్టాలు ఎక్కిస్తారు. ఈ క్రమంలోనే గురువారం మనోహారాబాద్ నుంచి వర్గల్ మండలం నాచారం వరకు సుమారు 12 కిలోమీటర్ల పొడవున ట్రయల్ రన్ చేపట్టారు. గజ్వేల్ వరకు మిగిలిన 21 కిలోమీటర్ల మేర కూడా తాజాగా శనివారం ట్రయల్రన్ చేపట్టడానికి సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై మంత్రి హరీశ్రావు దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్కుమార్యాదవ్తో పలు సందర్భాల్లో సమావేశమై సమీక్షలు జరపడం పనుల వేగానికి దోహదపడింది. ఈ లైన్పై ఏర్పాటు చేయబోతున్న ప్రధాన రైల్వే స్టేషన్లలో నాచారంగుట్ట, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ ముఖ్యమైనవిగా చెబుతుండగా గజ్వేల్ స్టేషన్కోసం పట్టణంలోని జాలిగామ రోడ్డు వైపున జిన్నింగ్మిల్ వెనుక భాగంలోని 20 ఎకరాల విస్తీర్ణంలో పనులు జోరుగా సాగుతున్నాయి. స్టేషన్ భవనం, 3 ప్లాట్ఫాంలు, ఒక మెయిన్ లైన్, 2 లూప్లైన్లు, షెల్టర్లు, రెండు ఫుట్ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం చేపడుతున్నారు. ఈ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 10కోట్ల వరకు వెచి్చస్తున్నారు. ఇదే తరహాలో వర్గల్ మండలం నాచారం వద్ద మరోస్టేషన్ నిర్మాణమవుతోంది. రాయపోల్ మండలం బేగంపేట వద్ద హాల్ట్ స్టేషన్ను త్వరలో నిర్మించనున్నారు. ప్రస్తుతం గజ్వేల్–సిద్దిపేట లైన్ పనులు కూడా జోరుందుకున్నాయి. వ్యాపార, వాణిజ్యానికి బాటలు... గజ్వేల్ వాసులు ఢిల్లీ, కలకత్తా లాంటి మహానగరాలకు వెళ్లాలంటే ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి ఖాజీపేట–పెద్దపల్లి మీదుగా వెళ్లాల్సి ఉండేది. ఇలా వెళ్తే.. సుమారుగా ఇక్కడి నుంచి 20గంటలకుపైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్తో అనుసంధానం చేయడం వల్ల గజ్వేల్ వాసులు నేరుగా పెద్దపల్లికి మీదుగా ఢిల్లీ, కలకత్తా నగరాలకు చేరుకునే అవకాశం కలుగనుంది. సుమారుగా ఐదారుగంటల ప్రయాణ వ్యవధి దీనివల్ల తగ్గనున్నది. ఈ పరిణామం ఈ ప్రాంతంలో వ్యాపార, వాణిజ్యరంగ అభివృద్ధికి ఊతంగా నిలవనున్నది. వ్యాపారస్తులు ముడిసరుకును ఎగుమతి, దిగుమతి చేసుకోవడానికి అతి తక్కువ ఖర్చుతో వెళ్లివచ్చే అవకాశం కలుగనుండడం వల్ల భారీ ప్రయోజనం చేకూరనున్నది. కూరగాయల సాగులో తెలంగాణలోనే ‘వెజ్టబుల్ హబ్’గా ఆవిర్భవించిన గజ్వేల్ నుంచి తాజా కూరగాయలను ఈ రెండు మహానగరాలకు మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు పెరుగనున్నాయి. ఈ పరిణామం కూడా ఇక్కడి కూరగాయల రైతులకు కలిసిరానున్నది. ఇదిలా ఉంటే గజ్వేల్ ప్రాంత రూపురేఖలు మార్చబోతున్న ఈ రైల్వేలైన్పై సర్వత్రా చర్చ సాగుతోంది. లైన్ పూర్తయిన తర్వాత ఒనగూరే ప్రయోజనాలపై అంతా చర్చించుకుంటున్నారు. ఈ అంశంపై ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ప్రత్యేకాధికారి మత్యంరెడ్డి మాట్లాడుతూ సీఎం కృషి వల్ల గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కల సాకారమవుతోందని చెప్పారు. త్వరలోనే లైన్ను ప్రారంభించడానికి రైల్వే శాఖ సిద్ధమవుతోందని వెల్లడించారు. -
మార్చిలో గజ్వేల్కు.. కూ.. చుక్చుక్
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్–గజ్వేల్ మధ్య నడపనున్న రైలు మార్చిలో పట్టాలెక్కబోతోంది. తొలుత పుష్పుల్ ప్యాసింజర్ సేవలను ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసిన రైల్వే, రామాయపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈనెల 20 నుంచి ఆ పనులు మొదలుకానున్నా యి. వాటిని రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకుంది. ఫిబ్రవరి చివరినాటికి ఆ పనులు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్టేషన్లు... ట్రాక్ సిద్ధం సికింద్రాబాద్తో కరీంనగర్ను రైల్వే లైన్ ద్వారా అనుసంధానించే మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజె క్టులో తొలి దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. మనోహరాబాద్ స్టేషన్ నుంచి ఈ కొత్త లైన్ ప్రారం భమైంది. అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్ పట్టణం వరకు పనులు పూర్తి చేయటం ప్రాజెక్టు తొలిదశ. ఇందులో మనోహరాబాద్ వద్ద కొత్త స్టేషన్ భవనం సిద్ధమైంది. ఆ తర్వాత నాచారం, అప్పాయిపల్లి, గజ్వేల్లలో స్టేషన్లు ఉంటా యి. జనవరి నాటికి పనులన్నీ పూర్తవుతాయి. జాతీయ రహదారిని కట్చేసి... ఇక ఈ 32 కిలోమీటర్ల మార్గంలో ఆరు రోడ్ ఓవర్ బ్రిడ్జీలు మూడు రోడ్ అండర్ బ్రిడ్జీ, నాలుగు చోట్ల పెద్ద వంతెన పనులు పూర్తయ్యాయి. ఇక నిజామాబాద్ మీదుగా సాగే 44వ నంబర్ జాతీయ రహదారిని రైల్వే లైన్ క్రాస్ చేసే చోట వంతెన నిర్మించాల్సి ఉంది. జాతీయ రహదారిని కట్ చేసి పని చేపట్టాల్సి ఉన్నందున అనుమతి కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈనెల 20 నుంచి అక్కడ పనులు చేసుకోవచ్చంటూ తాజాగా జాతీయ రహదారుల విభాగం అనుమతించడంతో పనులు చకచకా సాగనున్నాయి. ఫిబ్రవరిలో ట్రయల్ రన్ పూర్తి చేసి మార్చి తొలివారంలో ప్రారంభించనున్నట్లు అధికారులు చెప్పారు. -
డబ్లింగ్ పనుల్లో గ్యాంబ్లింగ్
సాక్షి, ప్రకాశం : గుంటూరు–గుంతకల్లు రైల్వేలైన్ డబ్లింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇటు కాంట్రాక్టర్లు, అటు అధికారులకు పంట పండింది. తూతూమంత్రంగా నాసిరకం పనులు చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నించే పర్యవేక్షకులు లేకపోవడంతో పనులు ఇష్టానుసారం సాగుతున్నాయి. కురిచేడు రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం కోటి రూపాయల ఖర్చుతో 70 మీటర్ల మేర ప్లాట్ఫాం నిర్మించారు. నిర్మాణం జరిగి ఆరు నెలలు కూడా నిండకముందే అది కూలిపోయింది. ప్లాట్ఫాం కూలడంతో దానికి ఏర్పాటు చేసిన బెంచీలు, విద్యుత్ లైట్లు కూడా కూలిపోయాయి. ప్లాట్ఫాం నిర్మాణ దశలోనే కూలిపోయినా అధికారులు కాంట్రాక్టర్లకే వత్తాసు పలకడం గమనార్హం. దీన్నే అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనేందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 108–109 కిలోమీటర్ల మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి కింద బెడ్ కాంక్రీటు వేయకుండా కేవలం సిమెంటు పాలు పోసి మమ అనిపించారు. రైల్వే పనులు ఏ చిన్న పనైనా రూ.కోట్లల్లో ఉండటంతో కాంట్రాక్టర్లకు కల్పవృక్షంగా మారింది. దీంతో రైల్వే అధికారులకు అది వరంగా మారింది. పర్యవేక్షణ కనుమరుగు రైల్వే ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిపై ఆధారపడి వారు ఇచ్చిన మామూళ్లు లెక్క లేసుకుంటూ ఏసీ గదులు దాటి బయటకు రావడం లేదు. క్వాలిటీ అధికారులు సైతం క్షేత్రస్థాయి అధికారులు కనుసన్నల్లో మెలగడం గమనార్హం. రైళ్ల మార్గాన వేలాది మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అంతేకాకుండా ఏదైనా ప్రమాదం సంభవించి ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు వాటిళ్లడంతో పాటు రైల్వే శాఖ అధికారులు కూడా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవేమీ పట్టని రైల్వే ఇంజినీరింగ్ అధికారులు తమ జేబులు నిండితే సరి అనుకుంటూ పచ్చనోట్లు లెక్క లేసుకుంటున్నారేగానీ పనుల నాణ్యతను పరిశీలించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా కేంద్ర రైల్వేశాఖ నిజాయితీపరులైన అధికారులను నియమించి పనుల నాణ్యతను పరిశీలించి, నాణ్యత డొల్లగా ఉన్న పనులపై పర్యవేక్షణ చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
‘దామరచర్ల’కు డబుల్ ట్రాక్ లైన్
సాక్షి, హైదరాబాద్: దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సరఫరా చేయడానికి అనుగుణంగా ఈ మార్గంలోని రైల్వేలైనును డబుల్ ట్రాక్ లైన్గా మార్చాలని జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరా రు. ఇక్కడ 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవ ర్ప్లాంటు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పవర్ప్లాంటుకు సింగరేణి నుండే మొత్తం బొగ్గు ను తీసుకోవాలని నిర్ణయించినందున కొత్తగూడెం నుంచి డోర్నకల్ వరకు; మోటమర్రి నుంచి విష్ణుపురం వరకు 200 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దామరచర్ల ప్లాంట్ నిర్మాణం శరవేగంగా సాగుతున్నదని, డబుల్ లైన్ నిర్మాణం, రైల్వేలైన్ పటిష్టం చేసే పనులు కూడా త్వరితగతిన చేపట్టాలన్నారు. దామరచర్ల, భద్రాద్రి, కేటీపీపీకి బొగ్గు రవాణా చేసేందుకు ప్రస్తుత రైల్వేలైన్లు, భవిష్యత్తులో నిర్మించాల్సిన రైల్వే లైన్లపై ప్రభాకర్రావు విద్యుత్ సౌధలో సోమవారం సమీక్ష నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మేనేజర్ కె.శివప్రసాద్, చీఫ్ మేనేజర్ డి.నాగ్య, జెన్కో డైరెక్టర్లు నర్సింగ్రావు, వెంకటరాజ్యం తదితరులు పాల్గొన్నారు. రోజూ 50 వేల టన్నుల బొగ్గు సరఫరా కావాలి.. ‘‘డోర్నకల్–విజయవాడ లైన్లోని మోటమర్రి నుంచి బీబీనగర్–నడికుడి మార్గంలోని విష్ణుపు రం వరకు 100 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ ఉంది. ఇది రోజుకు 5–6 రేక్స్కు మించి బొగ్గు ను రవాణా చేయలేదు. దామరచర్ల విద్యుత్ ప్లాంట్కు ప్రతిరోజూ 50 వేల టన్నుల బొగ్గు కా వాలి. అంటే ఈ లైనులో 59 బోగీలున్న 14 గూ డ్స్ రైళ్లు ప్రతిరోజూ వచ్చి పోవాలి. ఇంత సామ ర్థ్యం ఇప్పుడున్న లైన్లకు లేదు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం–డొర్నకల్ మార్గంలో 100 కిలోమీటర్లు, మోటమర్రి–విష్ణుపురం మార్గంలో 100 కిలో మీటర్లు, మొత్తం 200 కిలోమీటర్ల మేర డబుల్లైన్ నిర్మించాలి’’అని ప్రభాకర్రావు చెప్పారు. ప్రత్యేక రైలు మార్గమా.. డంపింగ్ యార్డా... ఖాజీపేట– బల్లార్ష మార్గంలోని ఉప్పల్ నుంచి ప్రస్తుతం భూపాలపల్లి పవర్ప్లాంటుకు బొగ్గు సరఫరా అవుతోంది. ఉప్పల్ రైల్వేస్టేషన్లో గూడ్స్ రైళ్లను ఆపి బొగ్గును దిగుమతి చేసి అక్కడ నుంచి లారీల ద్వారా భూపాలపల్లికి తరలిస్తున్నారు. ఈ లైను అత్యంత రద్దీ అయిన చెన్నై– ఢిల్లీమార్గంలోనే ఉంది. ఉప్పల్లో అన్లోడింగ్ వల్ల ఇతర రైళ్లకు ఇబ్బంది కలుగుతున్నదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉప్పల్ నుంచి భూపాలపల్లి వరకు ప్రత్యేక రైలు మార్గం నిర్మించడమో, లేదంటే ఉప్పల్ నుంచి కొద్దిదూరం రైల్వే ట్రాక్ నిర్మించి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని రైల్వే, జెన్కో అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమగ్ర నివేదిక సమర్పించాలని నిశ్చయించారు. -
ఈ‘సారీ’ కూత లేదు
సాక్షి, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా మీదుగా ప్రతిపాదించిన గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం ఎదురుచూస్తున్నజిల్లా ప్రజలకు మరోమారు నిరాశే మిగిలింది. గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా..ఈ బడ్జెట్లోనూ కేంద్ర ప్రభుత్వం కలను కలగానే మిగిల్చింది. తెలంగాణలోని గద్వాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైన్ కోసం నిధులు కేటాయిస్తారని అంతా అనుకున్నామరోమారు మొండిచేయి చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయం లేకపోవడం వల్లనే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. దీంతో నాగర్కర్నూల్ నుంచి కల్వకుర్తి, అచ్చంపేట గుండా మాచర్ల వరకు రైల్వేలైన్ వస్తుందనుకున్న ప్రజల ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. 1980లో రైల్వేలైన్కు బీజం 1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు గద్వాల– మాచర్ల రైల్వేలైన్ వేయడం వల్ల కలిగే లాభాలను వివరి స్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీంతో అప్పట్లో రూ.919 కోట్ల బడ్జెట్తో 184.2 కి .మీ. మేర రైల్వేలైన్ కోసం ప్రతిపాదనలు తయారు చేయారు. ఈ రైల్వేలైన్ వనప ర్తి, నాగర్కర్నూల్, మిర్యాలగూడ మీ దుగా మాచర్ల వరకు చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ వల్ల వ్యాపార పరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అప్పటి నుంచి మరుగున పడిపోయిన ఈ అంశంపై 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డీటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసి కేంద్రానికి అందించారు. దీంతో 2015లో కేంద్రం కంటి తుడుపు చర్యగా కేవలం నల్లగొండ– మాచర్ల వరకు సర్వే నిర్వహించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఇది మినహా ఇప్పటి వరకు ఈ రైల్వేలైన్కు సంబంధించి కేంద్రం తీసుకున్న చొరవ ఏమీ లేదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపైనే ఈ అంశం ఆధారపడి ఉందనేది అందరి వాదన. రైల్వేలైన్ కోసం అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభు త్వం ఒప్పుకుంటే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. భూ సేకరణ, ఇ తర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చెల్లింపులు చేయాలి. ఫలితంగా రాష్ట్ర ప్ర భుత్వం చొరవ తీసుకుంటే తప్ప కేం ద్రం ఒప్పుకునే అవకాశం లేకపోలేదు. మొదటి దశ పూర్తి.. రెండో దశ? ప్రజల డిమాండ్కు అనుగుణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్టాలను కలుపుతూ రాయచూర్ నుంచి మాచర్లకు రైల్వేలైన్ కోసం ప్రతిపాదించారు. దీని వల్ల వ్యాపార పరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా మూడు రాష్ట్రాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. దీంతో 2002లో అప్పటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి హోదాలో దత్తాత్రేయ రాయచూర్– గద్వాల రైల్వేలైన్కు శంకుస్థాపన చేశారు. గత రెండేళ్ల క్రితం డెమో కూడా పూర్తి చేసుకుని రాకపోకలు సైతం ప్రారంభమయ్యాయి. ఇక రెండో దశకు సంబంధించి గద్వాల నుంచి మాచర్ల వరకు రైల్వేలైన్ కోసం 151 నుంచి 154 కిలోమీటర్ల మేర ఉండే ఈ రైల్వే లైన్ కోసం దాదాపు రూ.1,160 కోట్లు అవుతుందని రైల్వేశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. సగం వాటా భరిస్తే కొత్త లైన్లు వేస్తామని కేంద్ర విధించిన నిబంధన మేరకు రాష్ట్రానికి చెందిన నేతలు, ఇక్కడి ఎంపీలు ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు రైల్వేలైన్కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజకీయ నాయకులు రైల్వే లైన్ కోసం మరో ఉద్యమం చేస్తే తప్ప సాధ్యం కాదని ఇక్కడి ప్రజల అభిప్రాయం. ఏదేమైనా గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం ఇంకెన్ని దశాబ్దాలు వేచి చూడాలనేది ఈ ప్రాంత ప్రజల ప్రశ్న. ముఖ్యమంత్రి లేఖ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆమోదం పొందేలోపు రాష్ట్ర Ðముఖ్యమంతి గద్వాల– మాచర్ల రైల్వేలైన్ కోసం లేఖ ఇవ్వాలి. సప్లిమెంటరీ కింద కేంద్ర నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ రైల్వేలైన్ కోసం అయ్యే ఖర్చులో 50 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. కాబట్టి ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒప్పించి సమస్యను పరిష్కరించాలి. -సుధాకర్రెడ్డి, రైల్వే సాధన సమితి జిల్లా చైర్మన్ -
నిర్మల్ పై మనసు పెట్టమ్మా.!
సాక్షి, నిర్మల్: ఈ ప్రాంతవాసుల రవాణా సౌకర్యం మెరుగు పర్చేందుకు ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్లను కలుపుతూ రైల్వేలైన్ నిర్మించాలని ఉమ్మడి జిల్లాకు చెందిన అప్పటి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న, అప్పటి ఎంపీ నగేశ్లు కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల కిందట ఢిల్లీలో అప్పటి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ప్రభును కలిశారు. ఈ రైల్వేలైన్ నిర్మాణంలో సగం వాటా భరిస్తామంటూ సీఎం కేసీఆర్ స్వయంగా ఇచ్చిన లేఖను ఆయనకు అందించారు. రాష్ట్రం సగం ఖర్చుకు ముందుకు రావడంతో కేంద్రం కూడా వెంటనే పచ్చజెండా ఊపింది. దాదాపు రూ.2,720 కోట్లతో నిర్మాణానికి ముందుకు వచ్చింది. కానీ.. ఇప్పటి వరకు రైల్వేశాఖ ఒక్కపని కూడా చేపట్టలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ(మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్) కూడా కుదుర్చుకోలేదు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఏడాది క్రితం సికింద్రాబాద్, నాందేడ్లలో పలుమార్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో రాష్ట్ర ఎంపీలు భేటీ అయ్యారు. ఇందులో ఆర్మూర్ – నిర్మల్ –ఆదిలాబాద్ లైన్ నిర్మాణాన్నీ లేవనెత్తారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటామని అప్పట్లో చెప్పినా.. ఇప్పటికీ ముందడుగు పడలేదు. ఎప్పటి నుంచో ఉంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అగ్రభాగాన ఉన్న ఆదిలాబాద్కు హైదరాబాద్ నుంచి నేరుగా రైల్వేలైన్ నిర్మించాలనే ప్రతిపాదన దశాబ్ధాల క్రితం నుంచి ఉంది. ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే పీవీ నర్సింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. రాష్ట్ర రాజధాని సమీపంలోని పటాన్చెరువు నుంచి ఆదిలాబాద్కు వయా ఆర్మూర్, నిర్మల్ మీదుగా పారిశ్రామిక–వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ రైల్వేలైన్ వేయాలని నిర్ణయించారు. 2009 రైల్వే బడ్జెట్లోనే లైన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ రహదారి వెంట ఈ లైన్ నిర్మించాలన్న ప్రతిపాదనలూ చేశారు. కొన్నేళ్లకు సర్వే కూడా పూర్తిచేశారు. తీరా.. 317 కిలోమీటర్ల దూరభారంగా ఉన్న ఈ లైన్ నిర్మాణానికి రూ.3,771కోట్లు పెట్టడం లాభదాయకం కాదేమో.. అంటూ అప్పట్లో రైల్వేశాఖ చేతులెత్తేసింది. ఆ తర్వాత ఏళ్లు గడిచిపోయాయి. ఈ లైన్నిర్మాణం మూలనపడింది. మళ్లీ రెండున్నరేళ్ల కిందట అప్పటి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జోగు రామన్న, అప్పటి ఎంపీ నగేశ్లు పట్టుబట్టి సీఎం కేసీఆర్ను సగం వాటా భరించేందుకు ఒప్పించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అప్పటి కేంద్రం రైల్వేమంత్రి సురేశ్ప్రభుతోనూ పచ్చజెండా ఊపించారు. ఈసారి పటాన్చెరు నుంచి కాకుండా పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేమార్గంలో ఉన్న ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు 137కి.మీ. రైల్వేలైన్ వేస్తే సరిపోతుందని తేల్చారు. కేంద్రం 2017లో పచ్చజెండా ఊపినా రైల్వేలైన్ పనులు ప్రారంభం కాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత ఈ అంశంపై ఎలాంటి స్పందన కూడా చూపలేదు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్ వచ్చినప్పుడల్లా రైల్వేలైన్ తెరపైకి వస్తూనే ఉంది. ఈఎస్ఐ కూడా.. రైల్వేలైన్తో పాటు జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల కిందటే అప్పటి కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను కలిసి విన్నవించారు. ఈ మేరకు ఆయన నిర్మల్లో ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు భైంసాలో డిస్పెన్సరీ మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం ఈఎస్ఐ అధికారులు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఇక్కడి అధికారులు స్థానిక డీఎంహెచ్వో కార్యాలయ భవనాన్ని చూపించారు. దానిపై ఈఎస్ఐ అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత దత్తాత్రేయ మంత్రి పదవీ నుంచి దిగిపోవడంతో ఫైల్ పెండింగ్లో పడింది. మళ్లీ దీనిపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఢిల్లీకి వెళ్లి కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ను కలిసి ఆస్పత్రి ఏర్పాటుపై వివరించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినా ఇప్పటికీ ఈఎస్ఐ ఆస్పత్రి కోసం ముందడుగు పడలేదు. దీంతో పాటు బాసర్, భైంసాల మీదుగా బోధన్, బాన్సువాడల నుంచి సరిహద్దులో జాతీయ రహదారి నిర్మాణం పెండింగ్లోనే ఉంది. జిల్లాకు రావాల్సిన కేంద్రీయ విద్యాలయం ఇప్పటికీ ఊసు లేదు. ఈసారి ఆదిలాబాద్ నుంచి బీజేపీకే చెందిన ఎంపీ సోయంబాపురావు ఉండటంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈసారైన కేంద్రం జిల్లాపై కరుణించాలని జిల్లావాసులు కోరుతున్నారు. రైల్వేలైన్ కోసం కృషి చేస్తా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు రైల్వేలైన్ నిర్మాణం విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తాను. త్వరలోనే రైల్వేలైన్ నిర్మాణంపై కదలిక తీసుకువచ్చేలా, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేయించడంపైనా కృషిచేస్తాను. దీంతో పాటు ఇతర కేంద్ర పథకాలను తీసుకువచ్చేందుకు నావంతు ప్రయత్నం చేస్తాను. – సోయం బాపురావు, ఎంపీ, ఆదిలాబాద్ -
నిత్యం 1.25 లక్షల టన్నుల బొగ్గు తరలింపు
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి, ఎగుమతులను భారీగా పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే, సింగరేణి బొగ్గు గనుల సంస్థలు నడుంబిగించాయి. సంయుక్త కార్యాచరణకు సిద్ధమయ్యాయి. సింగరేణి గనుల నుంచి దక్షిణ మధ్య రైల్వే నిత్యం లక్ష టన్నుల బొగ్గును వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తోంది. సరుకు రవాణానే రైల్వేకు ఆయువుపట్టు అయినందున బొగ్గు తరలింపుపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారిస్తోంది. బొగ్గు తరలింపురూపంలో దక్షిణ మధ్య రైల్వే భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఇప్పుడు నిత్యం జరుగుతున్న లక్ష టన్నుల రవాణాను మరో 25 వేల టన్నుల మేర పెంచాలని భావిస్తోంది. సత్తుపల్లిలో గనిని ప్రారంభించనున్నందున అక్కడికి ప్రత్యేక రైల్వే లైన్ను నిర్మిస్తున్నారు. భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు 53 కి.మీ. మేర నిర్మితమయ్యే ఈ లైన్ను దక్షిణ మధ్య రైల్వే–సింగరేణి సంస్థలు సంయుక్తంగా చేపడుతున్నాయి. ఇందుకు అవసరమయ్యే 340 హెక్టార్ల భూమి సేకరణకు గాను రూ.95 కోట్లను రైల్వే శాఖ భరిస్తోంది. లైన్ నిర్మాణానికి అవసరమయ్యే రూ.600 కోట్లను సింగరేణి భరిస్తోంది. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ఈ పనులు వచ్చే సంవత్సరం పూర్తికానున్నాయి. ఆ వెంటనే కొత్త గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి, సరఫరాను ఈ రెండు సంస్థలు ప్రారంభించనున్నాయి. దీంతో బొగ్గు సరఫరాలో నిత్యం అదనంగా 25 వేల టన్నుల సామర్థ్యం కలుగుందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇది అటు సింగరేణి, ఇటు రైల్వే పురోగతికి కొత్త బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక నుంచి 3 గంటల్లోనే లోడింగ్.... ప్రస్తుతం సింగరేణి గనుల నుంచి నిత్యం దాదాపు 20 నుంచి 25 వరకు సరుకు రవాణా రైళ్లు బొగ్గును తరలిస్తున్నాయి. కానీ, పాత పద్ధతుల్లో బొగ్గు లోడింగ్ జరుగుతుండటంతో ఈ సామర్థ్యాన్ని పెంచటం సాధ్యం కావటం లేదు. ఒక్కో రేక్ (రైలు) బొగ్గు లోడింగ్కు 12 నుంచి 18 గంటల సమయం పడుతోంది. వ్యాగన్లను నిలిపి అక్కడి నుంచి ఇంజిన్ వెళ్లిపోతుంది. లోడింగ్ తర్వాత మరో ఇంజిన్ కోసం చూడాల్సిన పరిస్థితి ఉం టోంది. దీంతో వేగంగా లోడింగ్ జరిగేలా తాజాగా 2 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. జూలై ఒకటి నుంచి ఇది అమలులోకి రానుంది. దీని ప్రకారం ఇంజిన్తో కూడిన రేక్ రాగానే వెంటనే లోడ్ చేసి పంపించాలి. ఇంజిన్ను మరో చోటికి పంపి, లోడింగ్ తర్వాత మరో ఇంజిన్ కోసం ఎదురు చూసే పనిలేకుండా, రేక్ రాగానే కేవలం 3 గంటల్లో లోడింగ్ పూర్తి చేసి పంపాలనేది ఒప్పంద సారాంశం. దీనివల్ల బొగ్గు రవాణా మరింత పెరిగి రెండు సంస్థలకు లాభం జరుగుతుందని అధికారులు చెబుతున్నా రు. శుక్రవారం రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ శివప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్ ప్రసాద్, సింగరేణి కాలరీస్ కం పెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జె.ఆల్విన్ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. -
అండర్పాస్లతో తీరనున్న అవస్థలు
సాక్షి, రామన్నపేట: మండల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే మార్గంలో రైల్వేలైన్ కింద నిర్మిస్తున్న అండర్పాస్ బ్రిడ్జిలతో ప్రయాణికుల అవస్థలు తీరనున్నాయి. ఇప్పటికే బోగారం, సిరిపురం, ఇంద్రపాలనగరం గ్రామాలకు వెళ్లేదారిలో అండర్పాస్ల నిర్మాణం పూర్తయింది. రామన్నపేట శివారులో చేపట్టిన అండర్పాస్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. తప్పనున్న నిరీక్షణ రామన్నపేట మండలం మీదుగా సికింద్రాబాద్–నడికుడి రైలుమార్గం ఉంది. మండలంలో రామన్నపేట–సిరిపురం, బోగారం–సిరిపురం, ఇంద్రపాలనగరం–సిరిపురం, ఇంద్రపాలనగరం–వెల్లంకి, రామన్నపేట–కొమ్మాయిగూడెం గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో రైల్వే ట్రాక్ ఉంది. ఈ మార్గంలో సూపర్ఫాస్ట్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు పదుల సంఖ్యలో నడుస్తుంటాయి. అయితే ఈ క్రమంలో పగటిపూట పదిహేను సార్లకుపైగా గేట్ వేయవలసి వస్తోంది. ఈ మార్గంలో ద్విచ్రక వాహనదారులతో పాటు బస్సులో ప్రయాణించే ప్రయాణికులు గేట్ పడినప్పుడల్లా పది నిమిషాలకుపైగా నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో అత్యవసర పనిమీద వెళ్లేవారు, స్కూలు విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తొలగనున్న ఇబ్బందులు రైల్వే శాఖ వారు గత ఆర్థిక సంవత్సరంలో మండల పరిధిలోని ఇంద్రపాలనగరం–వెల్లంకి గ్రామాల మధ్య అండర్పాస్ నిర్మించి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బోగారం–సిరిపురం, రామన్నపేట–సిరిపురం గ్రామాల మధ్య అండర్పాస్ల నిర్మాణం చేపట్టారు. బోగారం–సిరిపురం గ్రామాల మధ్య బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. సిరిపురం–రామన్నపేట మధ్య పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ అండర్పాస్లు వినియోగంలోకి వస్తే వాహనదారులు నిరీక్షించే బాధ తప్పుతుంది. రైల్వే శాఖ వారు అండర్పాస్ బ్రిడ్జిల నిర్మాణంతో తమ కష్టాలు తప్పనున్నాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో నీరు నిల్వకుండా చూడాలి అండర్పాస్ నిర్మాణం వల్ల నిరీక్షించే బాధ తప్పింది. ముఖ్యంగా రైతులకు సౌకర్యవంతంగా ఉంది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చేయాలి. రాత్రిపూట ప్రమాదాలు జరుగకుండా లైట్లు ఏర్పాటు చేయాలి. కార్నర్ వద్ద రెడ్లైట్లు ఏర్పాటు చేయాలి. – గోగు హరిప్రసాద్ -
రైలుకు..రెడ్ సిగ్నల్
సాక్షి, తిరువూరు : విజయవాడ నుంచి ఎన్నికవుతున్న పార్లమెంటు సభ్యులు కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి హామీలు ఇస్తున్నా అడుగు ముందుకు కదలట్లేదు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన పదవీకాలంలో ఈ రైలుమార్గం నిర్మిస్తామని పలుమార్లు చేసిన ప్రకటనలు నీటిమూటలుగా మిగిలాయి. 2012–13 కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్లో ఈ రైలుమార్గం నిర్మాణానికి రూ.723 కోట్లు అవసరమని నిర్ధారించినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. తాజా మాజీ ఎంపీ కేశినేని నానీ అసలు ఈ రైలుమార్గం ఊసే పట్టించుకోలేదు. కనీసం ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంటు సభ్యుడైనా కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రయోజనం కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో ప్రయోజనకరమైన కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం విషయంలో పాలకులు నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్నారు. పూర్వపు ఎంపీ చెన్నుపాటి విద్య తొలుత ఈ రైలుమార్గ నిర్మాణాన్ని పార్లమెంటులో ప్రస్తావించారు. అప్పటినుంచి ఏటా బడ్జెట్లో ప్రతిపాదనలు రూపొందించడం నిధుల కేటాయింపు వాయిదా వేయడం పరిపాటైంది. మూడేళ్ల క్రితం ఈ రైలుమార్గం నిర్మాణానికి అవసరమైన సర్వే కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో 2012లో సర్వే పూర్తి చేశారు. 125 కిలోమీటర్ల నిడివి రైలు మార్గం నిర్మించడానికి ఈ సర్వేలో ప్రణాళిక రూపొందించారు. మార్గం సుగమం కొండపల్లి–కొత్తగూడెం రైలు మార్గాన్ని చత్తీస్ఘడ్ వరకు విస్తరిస్తే పలురాష్ట్రాల నడుమ నేరుగా రైల్వే సదుపాయం ఏర్పడుతుంది. ఇప్పటికే భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైలు మార్గానికి కేంద్ర బడ్జెట్లో ఆమోదం తెలిపినందున ఖర్చు తగ్గే అవకాశం ఉంది. చెన్నై, బెంగళూరు తదితర నగరాల నుంచి మధ్యప్రదేశ్కు తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైలుమార్గం అనుకూలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ రైలుమార్గం నిర్మాణంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా భరించాలని నిర్ణయించడంతో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులు రైలుసదుపాయం కోసం గతంలో తిరువూరు ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు విన్నవిస్తున్నారు. దివంగత ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు కేంద్రప్రభుత్వంలో తనకున్న పరిచయాల నేపథ్యంలో కొండపల్లి–కొత్తగూడెం రైలుమార్గం నిర్మించాలని 20 సంవత్సరాల పాటు తీవ్రంగా కృషిచేశారు. ప్రస్తుతం రోడ్డుమార్గంలో రద్దీ విపరీతంగా పెరగడంతో ఇబ్రహీంపట్నం–జైపూర్ జాతీయ రహదారిపై నిత్యం అధికసంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రైలుమార్గం ఏర్పడితే తిరువూరు, మైలవరం నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగం. -
‘తూర్పు’ కల నెరవేరేదెన్నడు..?
సాక్షి, మహబూబ్నగర్: దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న తూర్పు పాలమూరు జిల్లా ప్రజల రైల్వే లైన్ కల కలగానే మిగిలిపోయింది. పదుల సంఖ్యలో పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా గద్వాల–మాచర్ల రైల్వేమార్గం మాత్రం అమలుకు నోచడంలేదు. ఎన్నికలు వస్తున్న ప్రతీసారి పోటీలో ఉండే అభ్యర్థులు రైల్వేలైన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని ప్రకటనలు చేయడం.. గెలిచాక మరిచిపోవడం సర్వసాధారణమైంది. నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న గద్వాల–మాచర్ల రైల్వేలైన్ నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు కలగానే మారిపోయింది. ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా ఉంటోంది. పోటీ చేసే ప్రతి నాయకుడు రైల్వేలైన్ను సాధిస్తామని చెబుతున్నా.. 40 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వనపర్తిలో జరిగిన సభలో ఈ రైల్వేలైన్ గురించి ప్రస్తావించడంతో మరోసారి ఈ అంశం హాట్టాపిక్గా మారింది. ఈ ఎన్నికల్లో గద్వాల–మాచర్ల రైల్వే మార్గం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు ప్రధాన రాజకీయ అస్త్రంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షాలు టీఆర్ఎస్ వైఫల్యం వల్ల రైలుమార్గం ఏర్పాటుకు జాప్యం జరుగుతుందనే ప్రచారం మొదలు పెడుతుండగా, తాతల కాలం నాటి డిమాండ్ నెరవేరకపోవడానికి గత ప్రభుత్వాల పాలకులే కారణమని అధికారపక్షం వాదిస్తోంది. ఈ సారి తమకు అవకాశం కల్పిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కూడా ఇదివరకే చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా అధికార పార్టీ సభ్యులే ఉన్న నేపథ్యంలో గద్వాల–మాచర్ల రైల్వేలైన్కు రాజకీయ చదరంగంలో కీలకంగా మారితే ఎవరూ గెలిచినా రైల్వేలైన్కు అడుగులు పడతాయనే చర్చ కూడా జోరందుకుంది. గతంలో మొదటి సారి జిల్లాల ఏర్పాటులో చోటు దక్కని నారాయణపేటకు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాగా ఏర్పాటు చేసినట్లే.. లోక్సభ ఎన్నికల బాధ్యతలను నిర్వర్తిస్తున్న కేటీఆర్ గద్వాల–మాచర్ల రైల్వేలైన్కు చొరవ తీసుకుంటారని ప్రజలు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు. ఎన్నో ప్రతిపాదనలు గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన గద్వాల–మాచర్ల రైల్వేలైన్ కోసం 1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి డీపీఆర్ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో కేంద్రం గద్వాల–మాచర్ల రైల్వేలైన్ ప్రతిపాదనలను పక్కనబెట్టి, కేవలం నల్లగొండ నుంచి మాచర్ల వరకు సర్వే నిర్వహించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేశారు. కొన్నేళ్ల అనంతరం గద్వాల–మాచర్ల రైల్వేలైన్కు అవకాశం ఉందని, ఇందుకు రూ.1,160 కోట్లు అంచనా వేశారు. 184 కిలోమీటర్ల మేర లైన్ ఏర్పాటుకు రూ.920 కోట్లు అవసరం అవుతాయని ఓ అంచనాకు వచ్చారు. రెండు విడతలుగా ఉన్న ఈ పథకంలో మొదటి విడత 2002లో రాయచూర్–గద్వాల రైల్వేలైన్ పనుల పూర్తి చేసుకున్నాయి. రెండో దశలో ఉన్న గద్వాల–మాచర్ల రైల్వేలైన్కు ఇంకా మోక్షం కలగడం లేదు. నీతిఅయోగ్, లా కమిషన్ సైతం ఈ రైల్వేలైన్కు అంగీకారం తెలిపినా అడుగు ముందుకు పడటంలేదు. సర్వత్రా ఆసక్తి తూర్పు పాలమూరు జిల్లాల గుండా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాçష్ట్రాలను కలిపే మాచర్ల లైన్ ఏర్పాటుపై ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మార్గం ద్వారా మూడు రాష్ట్రాలకు రాకపోకలు మెరుగుపడతాయి. కొత్త రైల్వేలైన్ల ఏర్పాటుకు సగం వాటా భరిస్తే రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం విధించిన నిబంధనకు అనుగుణంగా ఒప్పందం అమల్లోకి వస్తే గద్వాల–మాచర్ల రైల్వేలైన్కు మోక్షం కలుగుతుందని నాగర్కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా భరించాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే సన్నద్ధం కావాల్సి ఉందని ఎంపీ ఎల్లయ్య వాదిస్తున్నారు. భూ సేకరణ, ఇతర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ రైల్వేలైన్ ద్వారా ప్రజలకు రవాణా చౌకగా అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య రంగాలు మెరుగుపడటమే కాకుండా పరిశ్రమల ఏర్పాటుకు పునాదులు పడతాయి. కేటీఆర్ ప్రకటనతో.. ఈనెల 9వ తేదీన వనపర్తిలో జరిగిన టీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో హాజరైన కేటీఆర్ అనూహ్యంగా నాగర్కర్నూల్లో టీఆర్ఎస్ గెలిస్తే రైలు వస్తుందని ప్రకటన చేశారు. మొదటి నుంచి టీఆర్ఎస్ జెండా నాగర్కరన్నూల్లో ఎగరడం లేదని, ఈసారి టీఆర్ఎస్ జెండా ఎగిరితే కచ్చితంగా రైలు మార్గం తీసుకొస్తామని హామీ ఇవ్వడంతో నాగర్కర్నూల్ పార్లమెంట్ జిల్లాల వ్యాప్తంగా ఇదే హాట్టాపిక్గా మారింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ రైల్వే లైన్ మార్గంపై చర్చ మొదలైంది. ఈ అంశంపై ఇన్నాళ్లూ నోరు మెదపని టీఆర్ఎస్ పార్టీ తొలిసారి రైలుమార్గంపై మాట్లాడటం ప్రజల్లో ఆశలు రెకేత్తిస్తోంది. ఈ అంశంపై ఇన్నాళ్లు జిల్లా ప్రజాప్రతినిధులు సైతం అంటిముట్టన్నట్లుగా స్పందిస్తూ వచ్చారు. నాగర్కర్నూల్ ఎంపీగా ఉన్న నంది ఎల్లయ్య మాత్రం సీఎం కేసీఆర్ రైల్వేలైన్కు అమోదం తెలిపితే కూత కూస్తుందని అనేక సార్లు పత్రికల ద్వారా చెబుతూ వస్తున్నారు. వాస్తవానికి అధికార పార్టీ నుంచి ఇంతవరకు ఎవరూ, ఏనాడూ ఈ అంశంపై ప్రకటనలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న తరుణంలో కేటీఆర్ హామీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల ఆశలు తీర్చాలి చాలా కాలంగా గద్వాల–మాచర్ల రైల్వేమార్గం ఏర్పాటు అవుతుందని వింటున్నాం. కానీ ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు. సీఎం కేసీఆర్ ఒక్క నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిని మూడు జిల్లాలు చేసినట్లే అదే స్ఫూర్తితో గద్వాల–మాచర్ల రైల్వేలైన్ను ఏర్పాటు చేయాలి. – విజయ్కుమార్, వనపర్తి వాసి సీఎం స్పందిస్తే రైలొస్తది గద్వాల– మాచర్ల రైల్వేలైన్ ఏర్పాటుకు నావంతుగా ఎంతో కృషి చేసినా. సంయుక్త ఒప్పందానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు రావడం లేదు. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అపాయింట్మెంట్ సైతం ఇవ్వడం లేదు. నేను స్వయంగా చాలా సార్లు లెటర్లు రాసినా స్పందించలేదు. జిల్లాలోని ప్రజాప్రతినిధులను తీసుకెళ్లినా పట్టించుకోలేదు. కేసీఆర్ ఒప్పుకుంటే రైలు తప్పకుండా వస్తుంది. – నంది ఎల్లయ్య, ఎంపీ, నాగర్కర్నూల్ -
మార్చికి గజ్వేల్కు ట్రయల్ రైలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్తపల్లి– మనోహరాబాద్ రైలు మార్గం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మార్చి ఆఖరు నాటికి గజ్వేల్కు ట్రయల్ రన్ పూర్తి చేసి తీరుతామన్న పట్టుదలతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పనిచేస్తున్నారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికపుడు రైల్వే అధికారులు, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతుండటంతో పనులు ఊపందుకున్నాయి. ఈ మార్గం పూర్తయితే.. దశాబ్దకాలంగా రైలు కూత వినాలన్న కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్వాసుల కల నెరవేరనుంది. నేపథ్యమేంటి? 2006–07లో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నపుడే ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ, అప్పటి నుంచి ఈ పనుల్లో పురోగతి పెద్దగా లేకపోయింది. 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 151 కిలోమీటర్ల దూరంతో వేసే ఈ మార్గం అంచనా వ్యయం రూ.1,160 కోట్లతో పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం, భారతీయ రైల్వే బాగా సహకరిస్తున్నాయి. ‘ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్’విభాగం ద్వారా ప్రధాని ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండటం విశేషం. 2017–18లో రూ.350 కోట్లు, 2018–19లో రూ.250 కోట్లు కేటాయించడం గమనార్హం. ఈ ప్రాజెక్టును 4 దశలుగా విడగొట్టి పనులు చేస్తుండటంతో అవి పరుగులు పెడుతున్నాయి. పెరగనున్న ఉపాధి అవకాశాలు ఈ రైల్వేలైను సాకారమైతే ఉత్తర తెలంగాణను హైదరాబాద్తో అనుసంధానం చేయడం సుగమమవుతుంది. ముఖ్యంగా కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్వాసులకు రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉన్న ఆయా ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. ముఖ్యంగా కరీంనగర్ నుంచి గ్రానైట్, పత్తి, మొక్కజొన్న, వరి తదితర ఎగుమతులు, సిరిసిల్ల నుంచి వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆధారంగా ఈ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు వచ్చి, ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఆర్థికాభివృద్ధి జరుగుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. పైగా ఈ మార్గంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీశ్రావు, సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఈ రైల్వేమార్గం 5 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయావకాశాలను మెరుగుపరిచింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది. -
మెదక్..కూ..చుక్ చుక్!
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా రైలు కూత వినాలన్న మెదక్ వాసుల స్వప్నం త్వరలోనే సాకారం కానుంది. మరో 3 నెలల్లో మెదక్ వాసులకు తొలిరైలు కూత వినిపించనుంది. అక్కన్నపేట–మెదక్ పట్టణాలను కలుపుతూ నిర్మిస్తోన్న రైల్వే లైను పనులు దాదాపు పూర్తయ్యాయి. 2019 మార్చి చివరి నాటికి మిగిలిన పనులు పూర్తిచేసి, ట్రయల్ రన్ నిర్వహించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పట్టుదలగా ఉన్నారు. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ వేసిన ఈ లైన్ మార్గం ద్వారా మెదక్ నుంచి రాజధానికి కనెక్టివిటీ పెరగనుంది. ఈ ప్రాంతంలో రవాణా మెరుగుపడి, మెదక్ పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 7 దశాబ్దాల తర్వాత మెదక్ పట్టణ వాసుల కల నెరవేరుతుండటం గమనార్హం. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చొరవతో ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయగలిగామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్కుమార్ తెలిపారు. ఇదీ ప్రాజెక్టు నేపథ్యం.. రాజధాని హైదరాబాద్తో మెదక్ను రైలుమార్గం ద్వారా కలపాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. పొరుగునే ఉన్నప్పటికీ మెదక్ వాసులు భాగ్యనగరానికి రావాలంటే రోడ్డు మార్గమే దిక్కు. అందుకే, ఈ ప్రాంతాభివృద్ధికి కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలు 2012–13లో 17.2 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రైల్వే లైన్ ప్రాజెక్టును చేపట్టాయి. తొలుత రూ.117.72 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించాయి. ఇందులో తెలంగాణ 50 శాతం, కేంద్రం 50 శాతం ఖర్చును భరించాయి. ఇందుకోసం కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి భారతీయ రైల్వేకు అప్పగించింది. తర్వాత అక్కన్నపేట–మెదక్ రైల్వే మార్గానికి 2014–15 నుంచి 2018–19 వరకు రూ.169 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగితే.. ఒక్క 2018–19లోనే రూ.122.27కోట్లు కేటాయించారు. ఈ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా లక్ష్మాపూర్, షమ్నాపూర్, మెదక్ల్లో మొత్తం 3 నూతన రైల్వే స్టేషన్లు, 3 మేజర్ వంతెనలు, 1 ఆర్వోబీ, 35 మైనర్ బ్రిడ్జీలు, 15 ఆర్యూబీలను నిర్మించారు. -
‘కరీంనగర్–కాజీపేట కొత్త రైల్వే లైన్ వేయండి’
సాక్షి, న్యూఢిలీ: హుజూరాబాద్ మీదుగా కరీంనగర్–కాజీపేట మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ లైన్కు అయ్యే వ్యయాన్ని డిసెంబర్లో ప్రవేశపెట్టనున్న సప్లిమెంటరీ బడ్జెట్లో కేటాయించాలని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో మంత్రిని కలిసిన వినోద్, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులు, వాటికి నిధుల కేటాయింపు, కొన్ని స్టేషన్లలో రైళ్లకు హాల్ట్ ప్రతిపాదనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ముంబై–నిజామాబాద్ మధ్య నడుస్తున్న లోక్మాన్య తిలక్ రైలును కరీంనగర్ వరకు పొడిగించాలని కోరారు. కరీంనగర్– తిరుపతి మధ్య వారానికి రెండు రోజులు నడుపుతున్న రైలును ప్రతిరోజూ నడపాలన్నా రు. దానాపూర్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–నాగ్పూర్ ఎక్స్ప్రెస్లకు జమ్మికుంటలో, సికింద్రాబాద్– కాగజ్నగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు ఉప్పల్ స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని కోరారు. -
తుని-కొత్తవలస రైల్వే లైన్ ప్రాజెక్ట్ రద్దు
న్యూఢిల్లీ : తుని-కొత్తవలస బ్రాడ్గేజ్ రైల్వే ప్రాజెక్టుకు రైల్వే బోర్డు మంగళం పాడేసింది. ఈ ప్రాజెక్ట్ ఎంతమాత్రం గిట్టుబాటు కాదని రైల్వే బోర్డు అభిప్రాయపడినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహెయిన్ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, తుని-కొత్తవలస ఇప్పటికే విద్యుద్దీకరణ చేసిన డబుల్ లైన్తో అనుసంధానం అయింది. అయినప్పటికీ తుని-కొత్తవలస వయా నర్సీపట్నం, మాడుగుల మధ్య 155.34 కి.మీ దూరం సింగిల్ లైన్ రైల్ మార్గం నిర్మాణం కోసం సర్వే నిర్వహించినట్లు చెప్పారు. ఈ రైల్ మార్గం నిర్మాణానికి సుమారు 3771.21 కోట్లు ఖర్చు అవుతుందని తేలింది. ప్రస్తుతం తుని-కొత్తవలస మధ్య ఉన్న డబుల్ లైన్ వినియోగ సామర్ధ్యం 46 నుంచి 122 శాతం ఉండగా, తుని-కొత్తవలస మధ్య ప్రతిపాదించిన కొత్త రైల్వే మార్గంలో అతి తక్కువ ట్రాఫిక్ కారణంగా పెట్టుబడులపై రాబడి పూర్తిగా నెగెటివ్లో ఉన్నట్లు సర్వే వివరాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత రైల్వే బోర్డు అభిప్రాయపడింది. అందుకే ఈ కొత్త రైల్వే లైన్ ఆర్ధికంగా గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతో ప్రాజెక్టును రద్దు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. ధాన్యం సేకరణ విషయంలో ఏపీ రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా తమ దృష్టికి రాలేదని ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ శుక్రవారం రాజ్యసభలో చెప్పారు. ఏపీలో ప్రభుత్వ ధాన్యసేకరణ కేంద్రాలంలో ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా రబీ సీజన్లో ధాన్యం రైతులను మిల్లర్లు, దళారీలు పీల్చుకు తింటున్న విషయం వాస్తవమేనా? అంటూ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ ధాన్యం సేకరణలో తేమ పరిమితులు, ఇంకా ఇతరత్రా నిబంధనలను పాటించకపోవడం వల్ల రాష్ట్ర రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు ఏవీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాలేదని చెప్పారు. ధాన్యం సేకరణకు సంబంధించినంత వరకు ఏపీ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్(డీసీపీ) రాష్ట్ర జాబితాలో ఉంది. అందువలన రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అవుతుంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద సంబంధిత రాష్ట్రం అవసరాలు తీరిన తర్వాత మిగిలిన కస్టమ్ మిల్డ్ రైస్(సీఎంఆర్)ను ఇతర రాష్ట్రాల వినియోగం కోసం సెంట్రల్ పూల్లోని ఎఫ్సీఐకి పంపించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరిస్తుంది. ధాన్యం సేకరించిన 48 గంటల్లోగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా కనీస మద్ధతు ధర ప్రకారం సొమ్ము చెల్లింపు జరుగుతుందని మంత్రి వివరించారు. -
కోల్కతాలో బాంబు పేలుడు
పశ్చిమబెంగాల్ : కోల్కతాలో బాంబు పేలుడు సోమవారం కలకలం రేపింది. కోల్కతాలోని కంటోన్మెంట్ రైల్వే లైన్ ఏరియాలో జరిగిన బాంబు పేలుడుతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలంలో మరో 10 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క సారిగా బాంబు పేలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా బాంబు పేలుడుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎదురుచూపులే !
సాక్షి, కొత్తగూడెం : సింగరేణి గనులు భారీగా విస్తరించి ఉన్న భద్రాద్రి జిల్లా నుంచి బొగ్గు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వే రోజూ రూ.2 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. ఏడాదికి రూ.700 కోట్లకు పైమాటే. అయితే జిల్లా వాసులకు అందించే సేవలు మాత్రం అంతంతగానే ఉన్నాయి. దీంతో మరిన్ని రైల్వే సేవల కోసం జిల్లా వాసులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఎలాంటి రైల్వే లైన్లు వేయకుండానే మంచి సేవలు అందించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా రైల్వే శాఖ తగిన చర్యలు చేపట్టడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరుల్లో బొగ్గు గనులు, పాల్వంచలో కేటీపీఎస్, అశ్వాపురంలో కేంద్ర అణుశక్తి విభాగానికి చెందిన భారజల కర్మాగారం, సారపాకలో ఐటీసీ పేపర్ బోర్డు, అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాల, పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక మణుగూరు వద్ద కొత్తగా భద్రాద్రి థర్మల్ వపర్ స్టేషన్ నిర్మాణంలో ఉంది. అదనంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం, ఆ సమీపంలోనే పర్ణశాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాగా ఆవిర్భవించకముందు నుంచే కొత్తగూడెంలో సింగరేణి కేంద్ర కార్యాలయం ఉంది. జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లోనూ అత్యంత ప్రాధాన్యమైన పారిశ్రామిక, వ్యవసాయ, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల వారు పెద్ద సంఖ్యలో ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు అన్ని జిల్లాల కంటే దూరంగా ఉన్న జిల్లా కూడా భద్రాద్రే కా>వడం గమనార్హం. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన రైలు రవాణాకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. పొడిగింపునకు అవకాశమున్నా పట్టింపు లేదు.. ప్రస్తుతం ఉన్న లైన్ల ద్వారా కొత్తగా మరిన్ని రైళ్లు నడిపే అవకాశం ఉన్నప్పటికీ ఆ శాఖ పట్టించుకోవడం లేదు. అనేక సంవత్సరాలుగా జిల్లా వాసులు కోరుతున్నప్పటికీ సంబంధిత అధికారుల్లో నిర్లక్ష్యం వీడడం లేదు. ప్రస్తుతం జిల్లా నుంచి ఏడు రైళ్లు నడుస్తున్నాయి. మణుగూరు నుంచి హైదరాబాద్కు మూడు, మణుగూరు నుంచి కాజీపేటకు ఒకటి, కొత్తగూడెం నుంచి డోర్నకల్కు ఒకటి, కొత్తగూడెం నుంచి సిర్పూర్ కాగజ్నగర్కు ఒక ప్యాసింజర్, కొత్తగూడెం నుంచి విజయవాడ వరకు మరో ప్యాసింజరు రైలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ సుమారు 5 వేల మంది ప్రయాణిస్తున్నారు. వివిధ బస్సు సర్వీసుల ద్వారా రోజుకు సుమారు 30 వేల మంది ప్రయాణిస్తున్నారు. దీంతో కొత్తగూడెం నుంచి విజయవాడ వరకు నడుస్తున్న రైలును ఎగువన తిరుపతి వరకు, దిగువన మణుగూరు వరకు పొడిగించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. కనీసం వారానికి రెండుసార్లైనా తిరుపతికి రైలు నడపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అలాగే హైదరాబాద్కు ఉన్న రద్దీ నేపథ్యంలో ఉదయం పూట ప్రత్యేకంగా ఒక ‘ఇంటర్సిటీ’ రైలు సర్వీసు నడపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. మణుగూరు నుంచి ఖమ్మం వరకు ‘పుష్పుల్’ రైలు కావాలనే డిమాండ్ ఉంది. కాగా కొత్తగూడెం నుంచి బల్హార్షా, పుణే మీదుగా ముంబయ్ వరకు రైలు నడిపే అవకాశం ఉంది. అయితే ఇందుకు ప్రయాణికుల నుంచి వినతులు వస్తే పరిశీలించే అవకాశం ఉందని రైల్వే వర్గాల సమాచారం. కొత్త లైన్ల ప్రతిపాదన జాడే లేదు.. ప్రస్తుతం ఉన్న లైన్లపై రైళ్ల పొడిగింపు సంగతి ఇలా ఉంటే.. కొత్త లైన్ల ప్రతిపాదనల జాడే లేకుండా పోయింది. కొత్తగూడెం నుంచి కొవ్వూరు లైన్కు 1965లో ప్రతిపాదనలు చేసినప్పటికీ ముందుకు సాగడం లేదు. దీని కోసం కొత్తగూడేనికి చెందిన కొదమసింహం పాండురంగాచార్యులు ఆధ్వర్యంలో సుదీర్ఘ ఉద్యమాలు సైతం జరిగాయి. అయితే కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు మాత్రం రూ.704 కోట్ల అంచనా వ్యయంలో రూ.600 కోట్లు భరించేందుకు సింగరేణి సంస్థ ముందుకు రావడంతో ఆ ప్రక్రియ మొదలైంది. ఇక 2004 నుంచి ప్రతిపాదనల్లో ఉన్న మణుగూరు – రామగుండం లైను సైతం ఊసే లేదు. 1984 నుంచి ఊరిస్తూ వస్తున్న 15.5 కిలోమీటర్ల పాండురంగాపురం – సారపాక లైను విషయంలోనూ రైల్వే శాఖ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. -
నడిరోడ్డుపై రైలు..పోలీస్ వాహనం ఢీ
-
నడిరోడ్డుపై రైలు.. అడ్డొచ్చిన పోలీస్ వాహనం
ఎప్పుడైనా నడిరోడ్డుపై రైలు రావడం చూశారా. దానికి ఎదురుగా పోలీస్ వాహనం. సాధారణం ఏం జరుగుతుంది? రైలు ఢీకొంటే ఏమౌతుంది? ఏదైనా తుక్కుతుక్కుగా మారాల్సిందే. పట్టాలపై వెళ్లాల్సిన రైలు నడి రోడ్డులోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందనే అనుమానం పక్కన పెడితే మధ్యప్రదేశ్లో ఈ సన్నివేశం సర్వసాధారణం. మధ్యప్రదేశ్లోని గౌషీపుర, రతినగర్ జిల్లాల మధ్య గ్వాలియర్ లైట్ రైలు నడుస్తోంది. ప్రపంచంలోనే వీధుల్లో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు కూడా ఇదే. ఈ రైలు ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ను అదుపు చేయడానికి మూడు ప్రదేశాల్లో గేట్లు మూసేస్తారు. అయితే ఒకరోజు ఇది వీధుల్లో ప్రయాణిస్తుండగా ఎదురుగా పోలీస్ వాహనం వచ్చింది. రెప్పపాటులో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు ఇంజన్ ముందు భాగం, పోలీస్ వాహనం వెనుక భాగాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరీకీ ఏమీకాలేదు. కాసేపు రెండిటిని నిలిపేసి నిదానంగా వెనక్కి నడిపి బయటకు తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
‘లైన్’ క్లియర్..
సాక్షిప్రతినిధి, ఖమ్మం : భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయించడంతో మందకొడిగా సాగుతున్న భూసేకరణ పనులు ఇక వేగవంతం కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు రైల్వే శాఖ పరంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తమ ఎంపీల ద్వారా విన్నవించుకున్నప్పటికీ.. ఈ ఒక్క ప్రాజెక్టుకు మాత్రమే నిధులు కేటాయించింది. కేంద్ర బడ్జెట్లో రైల్వే లైన్ భూసేకరణకు రూ.120కోట్లు కేటాయించిన నేపథ్యంలో పనులు ఊపందుకోనున్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజ్మీరా సీతారాంనాయక్ అనేక ప్రతిపాదనలు ఇచ్చారు. అయితే రైల్వే లైన్కు మినహా ఏ ఒక్కదానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దశాబ్ద కాలంగా ఇటు కొత్తగూడెం, అటు సత్తుపల్లివాసులను రైల్వే లైన్ ఊరిస్తోంది. సింగరేణి సంస్థ లైన్ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చినా.. సర్వే పనులు ఆలస్యం కావడంతో పనులు పట్టాలెక్కని పరిస్థితి. గతంలో మంజూరు చేసిన రైల్వే లైన్ ప్రాజెక్ట్లో ఈ లైన్ ఉండటంతో కేంద్రం బడ్జెట్లో రూ.120కోట్లు మంజూరు చేసింది. సుమారు 53 కిలోమీటర్లు ఉండే మార్గంలో పెద్ద ఎత్తున భూములు సేకరించాల్సి ఉంది. అయితే కొత్త భూసేకరణ విధానం ప్రకారం ఆ నిధులు ఏ మేరకు సరిపోతాయనే అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉన్న నిధులతోనే భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. భూసేకరణ పూర్తయి.. పరిహారం చెల్లించే ప్రక్రియ కొలిక్కి వస్తే తప్ప నిర్మాణ పనులు ప్రారంభమయ్యే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2010–11 బడ్జెట్లో కేంద్ర రైల్వే శాఖ రైలు మార్గం నిర్మాణానికి అనుమతిచ్చింది. సుమారు రూ.337.50కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సర్వే పనులు పూర్తి చేశారు. సత్తుపల్లి వరకు 53.25 కిలోమీటర్ల మేరకు ఎలక్ట్రికల్ లైన్లతో లైన్ నిర్మాణం జరగాల్సి ఉంది. భూసేకరణ కోసం రైల్వే శాఖ రూ.19.04కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా.. సింగరేణి సంస్థ రైల్వేకు రూ.318.64కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. 2012, ఆగస్టులో సర్వే నిమిత్తం రూ.6.38కోట్లను రైల్వే శాఖకు సింగరేణి చెల్లించింది. లైన్ నిర్మాణం పూర్తయితే సింగరేణి సంస్థ ప్రతీ ఏడాది 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్లపాటు బొగ్గును రైలు మార్గంలో రవాణా చేసేందుకు రైల్వే శాఖతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే లైన్ నిర్మాణం భూసేకరణ కోసం కేంద్రం రూ.120కోట్లు కేటాయించింది. దీంతో పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. కాలయాపనతో పెరిగిన అంచనా వ్యయం తొలుత రూ.360కోట్లతో భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని భావించారు. అయితే కాలయాపన కావడంతో ప్రాజెక్టు వ్యయం రెండింతలు పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాణ వ్యయం తగ్గించుకునేందుకు 2015లో సింగరేణి సంస్థ రీ సర్వే కోసం రైట్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సర్వే చేసిన రైట్స్ సంస్థ రూ.792కోట్ల అంచనాతో రూపొందించిన ప్రణాళికకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. భూసేకరణ, సర్వే, అటవీ శాఖ అనుమతుల కోసం సింగరేణి రూ.80కోట్ల నిధులు విడుదల చేసింది. రైలు మార్గానికి సర్వే పూర్తి కావడంతో భూసేకరణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఐదు స్టేషన్లు.. పెనుబల్లి జంక్షన్ ఈ మార్గంలో ఐదు స్టేషన్లతో పెనుబల్లి జంక్షన్గా ఏర్పాటు చేస్తున్నారు. 3.4 కిలోమీటర్ వద్ద సీతంపేట స్టేషన్, 22.8 కిలోమీటర్ వద్ద భావన్నపాలెం, 39.25 కిలోమీటర్ వద్ద చండ్రుగొండ స్టేషన్, 44 కిలోమీటర్ వద్ద పెనుబల్లి జంక్షన్, 53.2 కిలోమీటర్ వద్ద సత్తుపల్లి రోడ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే భూసార పరీక్షలు పూర్తి చేశారు. రైలు మార్గంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులపై వంతెనల నిర్మాణం కోసం నీటిపారుదల శాఖ అధికారులతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సత్తుపల్లి రోడ్ రైల్వేస్టేషన్ను కొత్త లంకపల్లి శివాలయం వెనుక ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఓపెన్కాస్టుకు వెళ్లే విధంగా లైన్ వేస్తున్నారు. కొత్త లంకపల్లి రాష్ట్రీయ రహదారిపై రైలు కోసం ఓవర్ బ్రిడ్జి కట్టేందుకు ప్రతిపాదనలు చేశారు. -
సర్కారు సగమిస్తేనే..!
ఎనిమిది దశాబ్దాల కలకు.. ‘బంగారు తెలంగాణ’లోనూ మోక్షం కలగడం లేదు. బోధన్–బీదర్ రైల్వే లైన్ పొడిగింపు అడుగు ముందుకు పడట్లేదు. 1938లో నిజాం హయాంలో ప్రతిపాదించిన ఈ రైల్వే మార్గం.. ఇప్పటికీ పట్టాలెక్కలేదు. 2014లో సర్వే పూర్తయినా నిధుల కేటాయింపు లేక ‘లైన్ క్లియర్’ కావట్లేదు. ఈ ‘మార్గం’ సుగమం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే, కేంద్రం కూడా ఆ మేరకు నిధులు ఇవ్వనుంది. అయితే, ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా..? దశాబ్దాల కల సాకారమవుతుందా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. బాన్సువాడ: అసంపూర్తిగా ఉన్న బోధన్ రైల్వే లైన్ను బీదర్ వరకు పొడిగిస్తే వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ఆయా ప్రాంతాలకు రవాణా వసతులు పెరిగి అభివృద్ధి బాట పట్టే అవకాశముంది. అయితే, సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఆయా ప్రాంతాలకు ఇప్పట్లో ‘రైలు బండి’ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చట్లేదు. 201లో రూ.1,029 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ ప్రాజెక్టు.. జాప్యం కారణంగా ప్రస్తుత అంచనా వ్యయం రెట్టింపయింది. అయితే, మారిన నిబంధనల ప్రకారం ఈ రైల్వే లైన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాల్సి ఉంది. ఈ లైన్ ప్రస్తుతం పట్టాలెక్కాలంటే సుమారు రూ.2 వేల కోట్ల వ్యయం కానుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం కేటాయిస్తే, కేంద్రం సగం కేటాయించనుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించని కారణంగా ఈ ‘మార్గానికి’ మోక్షం కలగట్లేదు. ఎనిమిది దశాబ్దాల కల.. బోధన్–బీదర్ రైల్వే లైన్ను పొడిగించేందుకు 1938లోనే నిజాం సర్కార్ హయాంలో ప్రతిపాదనలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన రైల్వే లైన్ నిర్మాణం కలగానే మారింది. బోధన్–బాన్సువాడ–బీదర్ ప్రాంత ప్రజల కోరిక మేరకు 2010లో అప్పటి రైల్వే మంత్రి మమతాబెనర్జీ ఈ మార్గానికి ‘లైన్ క్లీయర్’ చేశారు. దశాబ్దాల కల అయిన బోధన్–బీదర్ రైల్వే లైన్కు సర్వే కోసం పచ్చజెండా ఊపిన మమతా బెనర్జీ.. ఆదిలాబాద్–పటాన్చెరు మధ్య కొత్తగా మరో రైల్వే లైన్ కోసం సర్వే చేసేందుకు పచ్చ జెండా ఊపారు. దీంతో ఈ ప్రాంతం మీదుగా ఒకేసారి రెండు రైల్వే లైన్ల కోసం సర్వే చేయించేందుకు అనుమతి లభించడంతో అందరూ ఎంతో సంబర పడ్డారు. కానీ ఈ ప్రతిపాదనలు పట్టాలెక్కకుండానే కనుమరుగయ్యాయి. 2014లో సర్వే పూర్తి! 2010లో రైల్వే బడ్జెట్లో రెండు లైన్లకు లభించిన సర్వే అనుమతుల దృష్ట్యా సర్వే అయితే పూర్తి చేశారు. 138 కిలోమీటర్ల బోధన్–బీదర్ రైల్వే లైన్ కోసం 2011 ఏప్రిల్లో ప్రారంభమైన సర్వే 2014లో పూర్తయింది. బోధన్ నుంచి రుద్రూర్, వర్ని, నస్రుల్లాబాద్, బాన్సువాడ, పిట్లం మీదుగా నారాయణఖేడ్, బీదర్ వరకు వారు సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం మార్గమధ్యలో భారీ వంతెనలు లేవని తేలింది. కేవలం రూ.1,029 వ్యయంతో లైన్ వేయవచ్చని అధికారులు తేల్చారు. బాన్సువాడ–బోధన్ ప్రధాన రోడ్డుకు ఆవలి వైపు సుమారు 3 కిలోమీటర్ల వ్యత్యాసంలో సర్వే నిర్వహించి, హద్దు రాళ్లను పాతారు. ఈ మేరకు హద్దు రాళ్లు ఆయా పంట పొలాలు, అడవుల్లో ఇప్పటికీ ఉన్నాయి. దశల వారీగా నిర్వహించిన ఈ సర్వేలో మార్గ మధ్యలో వచ్చే నదులపై వంతెనలు, ఎత్తుపల్లాలు ఇతర అన్ని రకాల భౌగోళిక పరిస్థితులపై అంచనా వేసి రైల్వే శాఖ ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. నిధుల కేటాయింపుపై సందిగ్ధత 2014లో సర్వే పూర్తవడంతో ఏటా రైల్వే బడ్జెట్లో ఎంతో కొంత నిధులు మంజూరవుతాయని అంతా భావించారు. కానీ ఇప్పటివరకు మూడు బడ్జెట్లు పూర్తయినా పైసా కూడా మంజూరు కాలేదు. తెలంగాణలోని కొన్ని కొత్త మార్గాల్లో మెండుగా నిధులు కేటాయించిన కేంద్రం.. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బోధన్–బీదర్ రైల్వే లైన్కు మొండి చేయి చూపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే ఈ లైన్ పట్టాలెక్కే అవకాశముంది. ఈ మార్గంలో సర్వే పూర్తయినందున రాష్ట్రప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే, మరో 50శాతం కేంద్రం కేటాయించనుంది. సుమారు రూ.2వేల కోట్ల అంచనా వ్యయం కాగా, ఇందులో 50శాతం నిధులను రాష్ట్రం కేటాయిస్తేనే కేంద్రం తన వాటా 50 శాతం నిధులు మంజూరు చేయనుం దని అధికారులు చెబుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైంది. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో రూపా యి కూడా కేటాయించలేదు. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా నిధులు కేటాయిం చాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. 50 శాతం నిధులిస్తే.. బోధన్–బీదర్ రైలు మార్గానికి సర్వే పూర్త యింది. రూ.2వేల కోట్ల తో ఈ ప్రాజెక్టు చేపట్టా ల్సి ఉంది. మారిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయిస్తే 50 శాతం నిధులను కేంద్రం మంజూరు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపుపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది. – బీబీ పాటిల్, జహీరాబాద్ ఎంపీ ♦ బోధన్–బీదర్ రైల్వేలైన్ ప్రతిపాదించింది 1938 నిజాం హయాంలో ♦ రైల్వే లైన్ పొడవు 138 కిలో మీటర్లు (తెలంగాణలో 90 కి.మీ., మహారాష్ట్ర, కర్ణాటకలో 48 కి.మీ.) ♦ లబ్ధి పొందే జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, బీదర్ ♦ సర్వే పూర్తయినది 2014లో ♦ అప్పట్లో అంచనా వ్యయం రూ.1,029 కోట్లు ♦ ప్రస్తుత అంచనా రూ.2 వేల కోట్లు -
ఫార్మాకు ప్రత్యేక రైల్వే లైన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఫార్మాసిటీకి ప్రత్యేక రైల్వేలైన్ వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు ఔషధరంగ దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో సరుకు రవాణాకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని ప్రాజెక్టు సమగ్ర నివేదికలో పొందుపరిచింది. వారం రోజుల క్రితం యాచారం మండ లం మేడిపల్లిలో ‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ’పై ప్రజాభిప్రాయసేకరణ జరిపిన సర్కారు.. ఇందులో ఈపీటీఆర్ఐ రూపొందించిన పర్యావరణ ప్రభావం, అంచనా(ఈఐఏ) నివేదికను బహిర్గతం చేసింది. ఈ క్రమంలోనే షాద్నగర్ నుంచి ప్రత్యేక రైల్వేలైన్ను ప్రస్తావించింది. సికింద్రాబాద్ నుంచి కర్నూలు మీదుగా డోన్ వెళ్లే బ్రాడ్గేజ్ రైల్వేలైన్ను అనుసంధానం చేస్తూ ఫార్మాసిటీకి రైలు మార్గాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఔషధనగరికి దక్షిణం వైపు ఉత్తర–దక్షిణ దిశలో 33కి.మీ. (షాద్నగర్ చేరువలో)దూరంలో ఈ లైన్ను కలిపితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ రైలు మార్గాన్ని ప్రయాణికుల అవసరాలకు కాకుండా సరుకు రవాణాకే వినియోగించుకోవాలని ప్రతిపాదించింది. తద్వారా వివిధ పరిశ్రమలు తయారుచేసే ఉత్పత్తులను సులువుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేయవచ్చని అంచనా వేసింది. మరోవైపు ప్రాజెక్టుకు నలు దిశలా రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రీజినల్ రింగ్రోడ్డు సహా ప్రస్తుత ఔటర్రింగ్ రోడ్డు నుంచి ఫార్మాసిటీని కలుపుతూ ప్రత్యేక మార్గాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కందుకూరు– యాచారం మీదుగా నాగార్జునసాగర్ హైవేను లింకు చేస్తూ రోడ్డు విస్తరణ పనులను ఆర్అండ్బీ చేపట్టింది. మరోవైపు రావిర్యాల దగ్గర ఔటర్ ఎగ్జిట్ 13 నుంచి కూడా ఒక రహదారిని ప్రతిపాదించింది. శ్రీశైలం జాతీయ రహదారి–సాగర్ హైవేను అనుసంధానిస్తూ మరికొన్ని రోడ్లను నిర్మించనున్నట్టు ఈఐఏ నివేదికలో స్పష్టం చేసింది. జిల్లాను రెండో జోన్లో కొనసాగించాలి దోమ(పరిగి): వెనుకబడిన వికారాబాద్ జిల్లాను (పాత జోనల్) రెండో జోన్లోనే కొనసాగించాలని పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతయ్యగౌడ్, దోమ మండల అధ్యక్షుడు గిరమోని గోపాల్ అన్నారు. జిల్లాను పూర్వ రంగారెడ్డి జిల్లాలో కలపి రెండో జోన్లో కొనసాగించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పునర్విభజనలో భాగంగా జిల్లాను 1వ జోన్లో కలపడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అంగీకరించేది లేదని ప్రభుత్వం భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని రెండో జోన్లోనే కలపాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ముందు ముందు ఉపాధ్యయ సంఘాల తరుపున నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పురందాస్, రాష్ట్ర కార్యదర్శి హరిలాల్, జైపాల్రెడ్డి పాల్గొన్నారు. -
కర్నూలు-మంత్రాలయం లైన్ రీసర్వే చేపట్టండి
- అమరావతి సమావేశంలో రైల్వే జీఎం వినోద్కుమార్ను కోరిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్సిటీ): కర్నూలు- మంత్రాలయం రైల్వే లైన్ నిర్మాణానికి రీసర్వే నిర్వహించాలని ఎంపీ బుట్టా రేణుక కోరారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ మంగళవారం అమరావతిలో నిర్వహించిన సమావేశానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ కర్నూలు రైల్వే స్టేషన్ను మాడరన్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాలని జీఎంను కోరారు. కర్నూలు, మద్దికెర, కోసిగి స్టేషన్లలో అదనపు రిజర్వేషన్ కౌంటర్లు, ఆదోని క్రాంతినగర్ వద్ద రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జీ, వెంకట్రాది ఎక్స్ప్రెస్కు రద్దీ దృష్ట్యా అదనపు రైలు ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు- అమరావతి లైన్ నిర్మాణంతో పాటు కొత్త ట్రైన్స్ నడపాలన్నారు. బుట్టా రేణుక ప్రతిపాదనలపై జీఎం వినోద్కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించినట్లు మంగళవారం ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. -
పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ ప్రారంభం
-
పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ ప్రారంభం
హైదరాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు శనివారం ప్రారంభించారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్లోని హైటెక్సిటీ రైల్వేస్టేషన్ నుంచి రిమోట్ లింక్ ద్వారా రైల్వే లైన్ ను స్టార్ట్ చేశారు. మహబూబ్ నగర్ - సికింద్రాబాద్ రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు కూడా సురేశ్ ప్రభు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీఆర్ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డి. శ్రీనివాస్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రైల్వే లైన్ ను ప్రారంభించిన తర్వాత నిజామాబాద్లో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. మంగళ, గురువారాలు మినహా అన్ని రోజులు ఈ రైలు నడుస్తుంది. ఆ రెండు రోజులు నిజామాబాద్ స్టేషన్లోనే రైలును నిలిపివేస్తారు. నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు పదమూడు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. -
మాచర్ల–నల్గొండ రైల్వే లైను కుదరదు :కేంద్రం
న్యూఢిల్లీః మాచర్ల–నల్గొండ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేమని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బుధవారం సమాధానం ఇచ్చారు. ఈ రైల్వేలైనును 1997–98 బడ్జెట్లో రూ. 125 కోట్ల అంచనా వ్యయంతో చేర్చారని, ప్రస్తుతం దీని అంచనా వ్యయం రూ. 815 కోట్లు అని తెలిపారు. సర్వే తుది దశలో ప్రజా ప్రతినిధులు ఈ మార్గాన్ని మార్చాలని సూచించారని, ఇదే సందర్భంలో దీనిపై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జరిపిన యోగ్యత అధ్యయనం ఈ ప్రాజెక్టులో ఆర్థిక యోగ్యత లేదని తేల్చిందని వివరించారు. స్పెషల్పర్పస్ వెహికిల్ విధానంలో గానీ, పీపీపీ విధానంలో గానీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని తేల్చారు. ప్రజల్లో ఈ డిమాండ్ ఉన్నప్పటికీ నిధుల కొరత, ఇతరత్రా కారణాల వల్ల ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని, కానీ ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయలేదని వివరించారు. -
కరీంనగర్–కాజీపేట రైల్వే లైన్పై సర్వే చేయాలి
లోక్సభలో కేంద్రాన్ని కోరిన ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వస్తు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా కాజీపేట–కరీంనగర్ రైల్వే మార్గానికి సర్వే చేయాలని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్కుమార్ కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్సభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కాజీపేట నుంచి హసన్పర్తి రోడ్, ఎల్లాపూర్, హుజురాబాద్, శంకరపట్నం, మానకొండూరుల మీదుగా కరీంనగర్కు రైల్వే లైను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉందని పేర్కొన్నారు. ఈ 70 కి.మీ.లను అనుసంధానించడం ద్వారా కరీంనగర్, వరంగల్ ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వే లైన్ ద్వారా కరీంనగర్.. రైల్వే సేవలు పొందుతోందని తెలిపారు. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారని, కాజీపేట్–కరీంనగర్ లింకును కూడా పూర్తిచేస్తే దక్షిణాది నుంచి వచ్చే రైళ్లను ఈ మార్గం ద్వారా మహారాష్ట్ర, గుజరాత్ తదితర పశ్చిమ ప్రాంతాలకు మళ్లించవచ్చని పేర్కొన్నారు. -
సికింద్రాబాద్–కరీంనగర్ రైల్వే లైన్కు శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్–కరీంనగర్ రైల్వేలైన్ పనులు త్వరలో ప్రారంభంకాబోతున్నాయి. ఈ లైను ప్రారంభమయ్యే మనోహరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మధ్య 32 కిలోమీటర్ల తొలి దశ పనులకు రైల్వే శాఖ టెండర్లు పిలిచి నిర్మాణ సంస్థను ఖరారు చేసింది. మరో 15 రోజుల్లోనే ఇక్కడ పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ రైల్వే లైన్కు సంబంధించి ఇప్పటికే పాత మెదక్ జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తి కాగా.. పాత కరీంనగర్ జిల్లా పరిధిలో కసరత్తు సాగుతోంది. ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం ప్రాజెక్టుకు రూ.350 కోట్లు కేటాయించడం గమనార్హం. ఉమ్మడి భాగస్వామ్యం కాబట్టి రాష్ట్రం కూడా దానికి నిధులు మంజూరు చేయాల్సి ఉంది. కోర్టు కేసుల రూపంలో అవాంతరం ప్రాజెక్టు పరిధిలో మెరుగైన పరిహారం కో రుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారు కేసులను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆ దిశ గా సానుకూల పురోగతి ఉన్నట్టు రైల్వేకు సమాచారం అందడంతో చర్యలు చేపట్టింది. ఇప్పుడు కొందరు నేతలు తమ భూములకు ఒక్కసారిగా ధర పెంచుకునేందుకు ఈ రైల్వే లైన్ను అవకా శంగా మలుచుకున్నారు. రైల్వేలైన్ తమ భూ ములకు చేరువగా నిర్మించేలా అలైన్మెంట్లో మార్పుచేర్పుల కోసం పైరవీలు ప్రారంభిం చినట్టు తెలిసింది. మార్గంలో స్వల్పంగా మార్పుచేర్పులు చేయటం ద్వారా తమ భూములకు చేరువగా రైల్వే లైన్ నిర్మాణం జరిగేలా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు రైల్వే శాఖపై కొందరు నేతలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అనువుగా లేని భూములను కూడా ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
కోటిపల్లి రైల్వేలైన్పై పరిశీలన
నరసాపురం : నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్స్థల అన్వేషణ కోసం సోమవారం రెవెన్యూ, రైల్వేశాఖ అధికారులు పట్టణంలో పరిశీలన చేశారు. నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్ ఎలైన్మెంట్ ప్రకారం నరసాపురం పట్టణం నుంచి కాకుండా, చిట్టవరం గ్రామం వద్ద నుంచి వేయాల్సి ఉంది. ఈ లైన్ బహుళ ప్రయోజనకారిగా ఉండాలంటే, నరసాపురం పట్టణం మీదుగానే వేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో నరసాపురం పట్టణం నుంచి రైల్వేలైన్ వేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, రైల్వేశాఖ డెప్యూటీ చీఫ్ ఇంజనీర్ కె.సూర్యనారాయణ, ఆర్అండ్బీ ఎస్ఈ ఎం.వి.నిర్మల, నరసాపురం సబ్కలెక్టర్ సుమిత్కుమార్గాంధీ పర్యటించారు. రైల్వేస్టేçÙన్, పొననపల్లి, మాధవాయిపాలెం ఫెర్రీ ప్రాంతాలను పరిశీలించారు. రూట్మ్యాప్ను క్షణ్ణంగా అధ్యయనం చేశారు. అనంతరం సబ్కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సాధ్యమైనంత వరకూ నరసాపురం పట్టణం నుంచే, ప్రాజెక్ట్ ఉండేలా యత్నిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ ఈ విషయంలో ప్రత్యేకశ్రద్ధ చూపిస్తున్నట్టు వివరించారు. -
రైల్వేలైన్ టెండర్లు వేగవంతం చేయాలి
కోనసీమ రైల్వే సాధన సమితి వినతి అమలాపురం : కోనసీమ రైల్వేలైన్లో భాగంగా నిర్మించాల్సిన గౌతమీ రైల్వేబ్రిడ్జి టెండర్ల ప్రక్రియకు ఎటువంటి సాంకేతిక ఇబ్బంది రాకుండా, రైల్వే శాఖ త్వరితగతిన చేపట్టేలా చూడాలని కోనసీమ రైల్వే సాధన సమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబును ఆదివారం కలిసిన సమితి ప్రతినిధులు ఓ వినతిపత్రం సమర్పించారు. ఈ రైల్వేలైన్ టెండర్లు రద్దు కావడం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. వంతెన నిర్మాణానికి త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తయ్యేలా తనవంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. 2017లోగా అమలాపురం వరకూ తొలిదశ రైల్వేలైన్నిర్మాణం పూర్తవుతోందని చెప్పారు. ఆయనను కలిసిన వారిలో సమితి కన్వీనర్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, ప్రతినిధులు డాక్టర్ రాఘవేంద్రరావు, కుడుపూడి సూర్యనారాయణరావు, సప్పా నాగేశ్వరరావు, ఉప్పుగంటి భాస్కరరావు, ఆర్వీ నాయుడు, వంకాయల రాజా, దొమ్మేటి సత్యనారాయణ ఉన్నారు. -
రైల్వే లైన్లో గృహాలు నిర్మిస్తే చర్యలు
రాపూరు: రాపూరు: కృష్ణపట్నం-ఓబులాపురం రైల్వేలైన్ మార్గంలో నూతనంగా గృహాలు నిర్మిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. వెలుగోనులో రైల్వేలైన్ వెళ్లే మార్గంలోని గృహాలను గురువారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గతంలో వెలుగోనులో సర్వే చేసి రైల్వే లైన్ కోసం సేకరించిన భూములు, అందులోని నిర్మాణాలకు పరిహారం అందంచడం జరిగిందన్నారు. కొన్ని గృహాల యజమానులు అధికారులు సక్రమంగా సర్వే చేయలేదని ఫిర్యాదు చేయడంతో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో సుమారు 10 గృహాలకు నష్టపరిహారం అందించాల్సి ఉందన్నారు. మరోసారి సర్వే చేసి అర్హులందరికి నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. నివాస స్థలాలను కోల్పోయే వారికి ప్రభుత్వ భూమి కేటాయిస్తామన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ సగం పోయే గృహాల మొత్తానికి పరిహారం అందజేయాలని కోరారు. అలాగే రైల్వే లైన్లో పోగా గ్రామంలో మిగిలిన రెండు మూడు ఇళ్లకు పరిహారం అందజేసి నివేశన స్థలాలు కేటాయించాలని విన్నవించారు. వెలుగోను నుంచి తూమాయి గ్రామానికి గతంలో రోడ్డు మార్గం ఉండేదని రైల్వే అధికారులు రైల్వే కట్టతో రోడ్డు మూసుకుపోయే అవకాశం ఉందని ప్రత్యామ్నాయంగా రోడ్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట రైల్వే వికాస్ నిఘం లిమిటేడ్ జీఎం సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ నిర్మలానందబాబా, సర్వేయర్ రాజా, సర్పంచ్ మనోహర్రెడ్డి, రైల్వే కాంట్రాక్టర్ అశోక్ ఉన్నారు. -
భూసేకరణ సర్వేను అడ్డుకున్న రైతులు
గజ్వేల్(మెదక్ జిల్లా): గజ్వేల్ మండలం కొడకండ్లలో జరుగుతున్న రైల్వేలైను భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్తో వాగ్వివాదానికి దిగారు. అలైన్మెంట్ మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత అలైన్మెంట్ ప్రకారమే రైల్వేలైను నిర్మించాలని డిమాండ్ చేశారు. క్తొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైను కోసం అధికారులు ఈ సర్వే చేస్తున్నారు. -
'ఓపెన్' విస్తరించెన్
సిరులు కురిపించనున్న నల్ల బంగారం విస్తరిస్తున్న సత్తుపల్లి ఓపెన్ కాస్టు ప్రారంభానికి మూడు ‘ఓపెన్’లు సిద్ధం రెండేళ్లలో పూర్తికానున్న రైల్వే లైన్ ఓపెన్ కాస్టు విస్తరిస్తోంది.. ఖమ్మం జిల్లాకు సిరులు కురిపించనుంది.. రాష్ట్రానికే తలమానికంగా నిలవనుంది.. ఇన్నాళ్లు కొత్తగూడెం పరిధిలోనే ఉన్న గనులు జిల్లా విస్తరణలో భాగంగా ‘భద్రాద్రి’ వైపు వెళ్లగా.. సత్తుపల్లిలోని ఏకైక ఓపెన్ కాస్టు గని సిరుల గనిగా తయారవుతోంది.. ఏడాదిలోగా మూడు ఓపెన్ కాస్టులు ప్రారంభానికి సిద్ధం కానుండగా.. ఏడాదికి 15 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ.. రాష్ట్రంలోనే మొదటి స్థానానికి చేరుకోనుంది. రానున్న రెండేళ్లలో రైల్వే లైన్ తోపాటు కార్మికులకు ఉపాధి.. సింగరేణి జీఎం కార్యాలయం కూడా వచ్చే అవకాశం ఉంది.. దీనికోసం ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. సత్తుపల్లి: సత్తుపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్టు బొగ్గు గనులు రాష్ట్రంలోనే తలమానికంగా నిలవనున్నాయి. జిల్లా పునర్విభజనలో భాగంగా ముఖ్యమైన పరిశ్రమలన్నీ భద్రాద్రి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. సత్తుపల్లిలోని ఓపెన్ కాస్టు గనులు ఖమ్మం జిల్లా జేవీఆర్ఓసీ ప్రారంభమైంది. అప్పటి నుంచి బొగ్గు ఉత్పత్తిలో 116 శాతం సాధించి.. మంచి ఫలితాలు ఇచ్చింది. ఏడాదికి 45 లక్షల టన్నుల ఉత్పత్తితో ఓపెన్ కాస్టు నడుస్తోంది. గనిలో ప్రస్తుతం 450 మంది కార్మికులు పని చేస్తున్నారు. అతిపెద్ద గని ఓసీ–2.. జేవీఆర్ ఓసీ–2కు స్టేజీ–1 క్లియరెన్స్ వచ్చింది. 776 హెక్టార్ల అటవీ భూమి స్వాధీనం చేసుకునేందుకు అంగీకారం కుదిరింది. స్టేజీ–2 క్లియరెన్స్ కోసం హెక్టార్కు రూ.8లక్షల చొప్పున సింగరేణి యాజమాన్యం డిపాజిట్ చేసింది. దీనికి మూడు, నాలుగు నెలల్లో క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. 239 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో జేవీఆర్ ఓపెన్ కాస్టు–2 ఫిబ్రవరి 2017లో ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 29 ఏళ్ల కాలపరిమితి ఉన్న ఓసీ–2లో ఏడాదికి పది మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద గనిగా ఓపెన్ కాస్టు అవతరించనుంది. కిష్టారం ఓపెస్ కాస్టు 21.61 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో కిష్టారం ఓపెన్ కాస్టును 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే భూముల సర్వే పూర్తయింది. భూ సేకరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. భూసేకరణ, అనుమతులను వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా కిష్టారం ఓపెన్ కాస్టుకు ప్రాజెక్టు ఆఫీసర్ను నియమించారు. ఓపెన్ కాస్టు కాలపరిమితి 13 ఏళ్లు. ఏడాదికి రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జేవీఆర్ ఓపెన్ కాస్టు.. 17 ఏళ్ల కాలపరిమితితో జేవీఆర్ ఓపెన్ కాస్ట్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 47 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా.. 2019–20 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న జేవీఆర్ ఓసీ–1 విస్తరణకు అనుబంధంగా ఓసీ–3 అవతరించనుంది. వేంసూరు రోడ్ను తొలగిస్తూ పక్కనున్న తోటల్లోకి ఓసీ–3 వచ్చే అవకాశం ఉంది. ఏడాదికి మూడు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. పెరగనున్న ఉద్యోగుల సంఖ్య వచ్చే మూడేళ్లలో మరో మూడు ఓపెన్ కాస్టు ప్రారంభం కానుండటంతో ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. ప్రస్తుతం 450 మంది కార్మికులు జేవీఆర్ ఓపెన్ కాస్టులో పని చేస్తున్నారు. వీటి విస్తరణతో రెండు మూడు రెట్లు ఉద్యోగులు పెరగటంతోపాటు కార్మికులు, యాజమాన్య అవసరాల కోసం సింగరేణి జీఎం కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు జిల్లాలకే పరిమితమైన బొగ్గు ఉత్పత్తి పునర్విభజనతో ఏడు జిల్లాలకు విస్తరించినట్లయింది. వేగవంతం కానున్న రైల్వే లైన్ పనులు బొగ్గు ఉత్పత్తిలో రాష్ట్రంలోనే మొదటి స్థానానికి చేరుకోనున్న సత్తుపల్లి రైల్వే లైన్ పనులు వేగవంతం కానున్నాయి. దీనికోసం రూ.600కోట్ల నిధులు మంజూరయ్యాయి. కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు రైల్వే లైన్ వేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే సర్వే పూర్తికాగా.. భూ సేకరణ చేయాల్సి ఉంది. ఏడాదికి 15 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుండటంతో రోడ్డు రవాణా కష్టంగా మారనుంది. ఇప్పటికే 300 టిప్పర్లతో కొత్తగూడెంకు రవాణా చేస్తున్న లారీలతో రోడ్లు రద్దీగా మారాయి. టిప్పర్లతో బొగ్గు రవాణా చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు. -
భూసేకరణ వేగవంతం
రైల్వేలైన్ నిర్మాణానికి సర్వే పనులు ముమ్మరం సుమోటోగా విరాసత్ల స్వీకరణ పౌరసరఫరాలపై సీసీ కెమెరాలతో నిఘా కేజీబీవీల్లో డిజిటల్ తరగతులు సామాజిక చైతన్యం కోసం కృషి మౌలిక సౌకర్యాల కల్పనకు కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం వివాహం అయ్యాక ఉద్యోగం వచ్చింది జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా సిరిసిల్ల : జిల్లాలో వారసత్వపు భూముల పేరు మార్పిడి (విరాసత్)ను సుమోటగా స్వీకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని, రైల్వేలైన్ కోసం భూసేకరణను వేగవంతం చేస్తామని జిల్లా జారుుంట్ కలెక్టర్(జేసీ) షేక్ యూస్మిన్బాషా తెలిపారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తామన్నారు. జేసీగా బాధ్యతలు స్వీకరించిన ఆమె శుక్రవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. సర్వే పనులు ముమ్మరం.. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే శంకుస్థాపన చేశారు. సిద్దిపేట జిల్లా వరకు భూసేకరణ పూర్తరుుంది. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో రైల్వేలైన్ నిర్మాణం కోసం జిల్లా పరిధిలో సర్వే, భూసేకరణ చేపట్టాల్సి ఉంది. మధ్యమానేరు జలాశయం, సిరిసిల్ల ఔటర్ రింగురోడ్డు, వేములవాడ ఆలయ అభివృద్ధికి సైతం భూములు సేకరించాల్సి ఉంది. కలెక్టరేట్ కోసం.. కలెక్టరేట్ నిర్మాణం కోసం అనువైన స్థలం ఎంపిక చేస్తాం. కలెక్టర్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సూచన మేరకు అన్ని హంగులతో భవనం నిర్మిస్తాం. ఇందుకోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. మా ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సేకరణపై పరిశీలన చేస్తాం. సుమోటోగా విరాసత్లు.. తండ్రి, తల్లి పేరిట ఉన్న భూములను వారి వారసులు మార్పిడి చేసుకునే పనిని సుమోటగా స్వీకరించి ఆ ప్రక్రియ పూర్తి చేస్తాం. రికార్డులు లేకే చాలా సమస్యలు తలెత్తుతున్నారుు. ఈవిధానాన్ని సమూలంగా మార్చేందుకు క్షేత్రస్తాయిలోనే విరాసత్లు చేస్తాం. ఆన్లైన్లోనూ లోపాలు లేకుండా రికార్డులు సరిచేస్తాం. వీటితోపాటు 2016 పహణిలు మ్యాన్యువల్ రికార్డులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. వీఆర్వోలకు శిక్షణ.. జిల్లాలోని విలేజీ రెవెన్యూ అధికారుల(వీఆర్వోల)కు రెవెన్యూ రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇప్పిస్తాం. రిటైర్డు తహసీల్దార్లు, వీఆర్వోలతో మెలకువలు నేర్పించేందుకు కలెక్టర్ సూచనల ద్వారా చర్యలు తీసుకుంటాం. తద్వారా వారిలో వృత్తి నైపుణ్యం పెంచుతాం. పౌరసరఫరాలపై కెమెరాలతో నిఘా.. పౌరసరఫరాల గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సరుకులు పక్కదారి పట్టకుండా నిఘా పెంచుతాం. తూకంలో వ్యత్యాసం వస్తోందని ఫిర్యాదులు అందాయి. తూకం కచ్చితంగా వేసి రేషన్ డీలర్లు, పాఠశాలలు, వసతి గృహాలకు బియ్యం అందిస్తాం. ఇందుకోసం గోదాముల వద్దే వేరుుంగ్ మిషన్లు ఏర్పాటు చేస్తాం. ఆర్డీవో ద్వారా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను నియమిస్తాం. కేజీబీవీ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు.. జిల్లాలోని కేజీబీవీ స్కూళ్లలో డిజిటల్ తరగతులు ప్రవేశపెడుతాం. సీఎస్ఆర్లో భాగంగా కార్పొరేట్ కంపెనీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. సామాజిక అంశాలపై దృష్టిసారించి ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. మూస విధానంలో కాకుండా కొత్తతరహాలో పాలన అందిస్తాం వివాహమయ్యూక ఉద్యోగంలో చేరా.. మా సొంత ఊరు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి. మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం. మా నాన్న ఆర్మీలో పని చేయడంతో కేంద్రీయ విద్యాలయంలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ అగ్రికల్చర్ చదివా. మా ఆయన షేక్ ఇమామ్ హుస్సేన్ వ్యాపారం చేస్తారు. మాకు పాప, బాబు. వివాహం అయ్యాక నాకు ఉద్యోగం వచ్చింది. 2009లో గ్రూప్-1 ద్వారా డెప్యూటీ కలెక్టర్గా విధుల్లో చేరా. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ఆర్డీవోగా, సంగారెడ్డిలో సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీస్గా పని చేశా. అక్కడి నుంచి జేసీగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీపై వచ్చా. -
రైల్వే లైన్కు భూ సేకరణ వేగవంతం
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(పొగతోట): నడికుడి–శ్రీకాళహస్తి్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబం«ధించిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో 146 కిలోమీటర్ల రైల్వే లైన్కు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. రాపూరు మండలంలో భూసేకరణలో జాప్యం జరుగుతుందని రెవెన్యూ అధికారులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు డివిజన్లో భూ సేకరణకు సంబంధించి పట్టా భూముల ప్రాథమిక ప్రకటన, ప్రభుత్వ భూముల అలినేషన్ ప్రతిపాదనలు వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, కావలి ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య, ఎంవీ రమణ, నరసింహన్ పాల్గొన్నారు. రైతు బజార్ల ఏర్పాటుకు భూములు గుర్తించండి జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో మార్కెట్ యార్డులు, రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ భూములు గుర్తించాలని జాయింట్ కలెక్టర్ ఏ. మహమ్మద్ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసి మాట్లాడారు. వెంకటగిరి గురుకుల పాఠశాల, కోవూరు ప్రాంతాల్లో రైతు బజారు ఏర్పాటుకు స్థలం సేకరించాలని అధికారులను ఆదేశించారు. -
అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు షురూ
మెదక్: దశాబ్దాల ఎదురు చూపుల అనంతరం.. మెదక్ ప్రాంత ప్రజల కల నెరవేర బోతుంది. అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సొంత జిల్లా ఏర్పాటవుతున్న తరుణంలోనే రైల్వేలైన్ పనులు ప్రారంభం కావడంతో ఈ ప్రాంతవాసుల ఆనందాలకు అవధుల్లేవు. ఇందుకు సంబంధించిన పనులను మంత్రి హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి గత జూలైలో పాతూర్ గ్రామ శివారులో ప్రారంభించారు. రైల్వేలైన్ ఏర్పాటు పూర్తయితే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. గతమంతా హామీలకే పరిమితం మెదక్కు రైల్వేలైన్ కావాలనేది ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాంతంనుంచి ఎంపీగా గెలుపొందారు. నాటి నుంచి మెదక్ ప్రాంత ప్రజలు రైల్వేలైన్కోసం పరితపించారు. నాటి నుంచి మెదక్కు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలంతా రైల్వేలైన్ ఏర్పాటు కోసం ఎన్నో హమీలు చేశారు. ఈ ప్రాంతానికి రైల్వేలైన్ ఏర్పాటు చేయాలంటూ ఎన్నో ఉద్యమాలు కూడా జరిగాయి. ఇదే ప్రధాన డిమాండ్తో రైల్వేసాధన సమితి ఎన్నో పోరాటాలు చేసింది. యేటా రైల్వే బడ్జెట్ సమయంలో ఈ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురు చూడటంతోనే సరిపెట్టారు. కాగా 2007లో అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో నిర్మాణానికయ్యేఖర్చులో 50 శాతం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది. దీంతో 2010 రైల్వే బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం, కేంద్రం కలిసి చేపట్టే కాస్ట్ షేరింగ్ ప్రాజెక్టు పనుల్లో దీనికి చోటు దక్కింది. అనంతరం మళ్లీ పనులు ముందుకు సాగలేదు. అనంతరం 2013 బడ్జెట్లో ఆమోదం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రసమితి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి చొరవతో భూసేకరణకు అవసరమైన నిధులతోపాటు పలువిడతల్లో నిర్మాణ పనులకోసం రాష్ట్రవాట నిధులను ముందుగానే మంజూరు చేయించారు. దీంతో పనుల ప్రారంభానికి మార్గం సుగమమైంది. రైతులకు పరిహారాన్ని వెంటనే చెల్లించడంతో వారు భూములను రైల్వే, రెవెన్యూ శాఖలకు అప్పగించారు. మెదక్ నుంచి అక్కన్నపేట వరకు 17.2 కిలో మీటర్ల దూరం నిర్మాణానికి రూ. 114.27 కోట్లు అవసరమవుతాయని అంచనావేశారు. ప్లానింగ్ కమిషన్కు ప్రతిపాదనలు పంపారు. కాబోయే జిల్లాకు ప్రయోజనాలు ఇప్పటి వరకు రెవెన్యూ డివిజన్గా ఉన్న మెదక్ మరో నెలలో జిల్లా కేంద్రం కాబోతుంది. దీంతో రైల్వేసదుపాయంతో ఎన్నోప్రయోజనాలు కలుగుతాయి. విద్యా, వ్యవసాయ, వ్యాపార, పర్యాటకరంగాల అభివృద్ధితోపాటు, చౌకగా రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు మెరుగైన రవాణ అందుబాటులోకి వస్తుంది. స్టేషన్లు ఇవే.. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పొడువు 17.2 కిలోమీటర్లు రామాయంపేట మండలం లక్ష్మాపూర్, మెదక్ మండలం శమ్నాపూర్తోపాటు మెదక్ పట్టణంలో రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. మెదక్ స్టేషన్లో 3 లైన్లు ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకోసం ఒక ప్లాట్ఫారం, రవాణకోసం మరొకటి ఏర్పాటు చేసి ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. రెండేళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తాం అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండేళ్లలో పనులు పూర్తిచేయించి మెదక్ ప్రజలకు రైల్వేకూత వినిపిస్తాం. ఇందుకోసం రాష్ట్ర వాటా నుంచి ముందుగానే నిధులు మంజూరు చేయించాం. అవసరమైతే మరిన్ని నిధులు కూడా మంజూరు చేయిస్తాం. ఈ ప్రాంత ప్రజలకు, కాబోయే మెదక్ జిల్లాకు ఇది వరం లాంటింది. ప్రత్యేక జిల్లా, రైల్వేలైన్ కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్కు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. - డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి -
వాటా కోసమే దాడులు
♦ రైల్వే ఉన్నతాధికారుల విచారణలో నిర్ధారణ ♦ 25 శాతం పర్సంటేజీ కోసం కోడెల ‘పెదబాబు’ పట్టు సాక్షి, అమరావతి : నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనుల్లో 25 శాతం పర్సంటేజీ కోసమే స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు ‘పెదబాబు’ దాడులు జరుపుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. పర్సంటేజీల పర్వానికి సంబంధించి ఉన్నత స్థాయిలో పంచాయితీ జరిగినా కోడెల కుమారుడు పెడచెవిన పెట్టి వరుస దాడులకు తెగబడుతున్న సంగతి తెల్సిందే. తాను అడిగిన వాటా ఇవ్వకుండా పనులు సాగిస్తుండటంపై పెదబాబు అనుచరులు రైల్వే అధికారులు, కూలీలపై రెండో మారు దాడులకు తెగబడ్డారని రైల్వే ఉన్నతాధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. రైల్వే శాఖ ఈ దాడి ఘటనను సీరియస్గా తీసుకోవడంతో స్పీకర్ కుమారుడికి చిక్కులు తప్పవని తెలుస్తోంది. రైల్వే కూలీలు, సిబ్బందిపై దాడులు జరిగిన తర్వాత రైల్వే ఉన్నతాధికారులు ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనుల దాడుల ఘటనను రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం విజయవాడకు వచ్చిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన ఘటనపై క్షేత్ర స్థాయికి వెళ్లి విచారించాలని రైల్వే జీఎంను మంత్రి సురేశ్ ప్రభు ఆదేశించినట్లు సమాచారం. -
చుక్..చుక్ బండి.. వచ్చిందండి!
– నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభం – నంద్యాల – కడప ప్యాసింజర్ రైలు పరుగులు – నాలుగు దశాబ్దాల కల సాకారం – రైలుకు పెండేకంటి పేరు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి నంద్యాల: నాలుగు దశాబ్దాల కల సాకారమైంది. కలల బండి పట్టాలెక్కింది. కూ.. చుక్..చుక్ మంటూ నంద్యాల – కడప ప్యాసింజర్ రైలు పరుగులు పరుగులెత్తింది. ఎంతో కాలంగా ఎదురు చూసిన ప్రజలు ఆనందంగా స్వాగతం పలికారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ను మంగళవారం విజయవాడ నుంచి వీడియో రిమోట్ లింక్ద్వారా ప్రారంభించారు. వెంటనే ఎంపీ ఎస్పీవైరెడ్డి, ఎమ్మెల్యేలు, రైల్వే అధికారులు జెండా ఊపడంతో డెమో రైలు కడపకు పరుగులు తీసింది. ఈ సందర్భంగా నంద్యాల రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నంద్యాల నుంచి తిరుపతికి రైలును ఏర్పాటు చేయాలని ఎంపీ ఎస్పీవైరెడ్డి కోరారు. తిరుపతికి వెల్లాలంటే రూ.350కి పైగా బస్ చార్జీలను చెల్లించాలని, కాని తక్కువ ధరకు భక్తులు తిరుపతికి వెళ్లి రావచ్చని చెప్పారు. ఈ రైల్వే లైన్కు శ్రీకారం చుట్టిన పెండేకంటి వెంకటసుబ్బయ్యకు ఆయన నివాళులు అర్పించారు. నంద్యాల–కడప రైలు పెండేకంటి ప్యాసింజర్ రైలుగా నామకరణం చేయాలని ప్రజా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. – నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మాట్లాడుతూ రైల్వే లైన్ పూర్తి కావడంతో రవాణా సౌకర్యాలు మెరుగు పడి, అభివద్ధి జరుగుతుందన్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్న స్థలాల్లో నివాసం ఉన్న పేదలకు ఏడాదిలోగా ప్రత్యామ్నాయం చూపిస్తామని రైల్వే అధికారులు వారిని తొలగించవద్దని కోరారు. – ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మధ్య రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. – పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి మాట్లాడుతూ పాణ్యంలో రైల్వే రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలన్నారు. పాణ్యం రైల్వే బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతుండటంతో చుట్టుపక్కల వ్యాపారులు షాపులను మూసుకొని ఉపయోగించకున్నా షాప్రూంలకు అద్దెలు చెల్లిస్తూ నష్టపోతున్నారని చెప్పారు. జిందాల్ ఫ్యాక్టరీ రైల్వే స్టేషన్లో లోడింగ్, అన్లోడింగ్ చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, దూరంగా తరలించాలని కోరారు. – బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి మాట్లాడుతూ సంజామల రైల్వే స్టేషన్కు పెండేకంటి పేరు పెట్టాలని కోరారు. – నూనెపల్లె దళిత వాడ వద్ద ఉన్న రైల్వే స్థలాల్లో నివాసం ఉన్న పేదలపై దయచూపాలని కౌన్సిలర్ అనిల్ అమతరాజ్ రైల్వే అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. – కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం విజయ్శర్మ, పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
16న నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ప్రారంభం
నంద్యాల: నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ను ఈనెల 16వ తేదీన ప్రారంభించడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. రైల్వే డీఆర్ఎం విజయశర్మ సోమవారం రైల్వే స్టేషన్ను సందర్శించారు. నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే పనుల గురించి సమీక్షించారు. 16వ తేదీన ఈ రైల్వే లైన్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారని చెప్పారు. రైల్వే సలహా మండలి సభ్యుడు ఊకొట్టు వాసు ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సంజామల రైల్వే స్టేషన్కు కేంద్ర మాజీ మంత్రి పెండేకంటి వెంకటసుబ్బయ్య పేరు పెట్టాలని కోరారు. అలాగే పుష్కర యాత్రల కోసం పూరి–గుంటూరు, రాయిఘడ్–కష్ణకెనాల్ జంక్షన్ రైలును నంద్యాల వరకు పొడిగించాలన్నారు. నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ను పుష్కరాల సందర్భంగా ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభించాలని కోరారు. -
రన్వే మీద రైల్వే లైన్..
ఇది గ్రాఫిక్ చిత్రం కాదు.. అసలైనదే.. న్యూజిలాండ్లోని గిస్బార్న్ ఎయిర్పోర్టులో నిజంగానే ఇలా రైళ్లు వెళ్లివస్తుంటాయి. ఈ చిన్నస్థాయి ఎయిర్పోర్టు 160 హెక్టార్ల పరిధిలో ఉంది. ఇందులో ప్రధాన రన్వేతోపాటు మూడు చిన్న రన్వేలు ఉన్నాయి. ప్రధాన రన్వేకు మధ్యలో నుంచి ఈ రైల్వే లైను ఉంది. దీని వల్ల రైలు వచ్చినప్పుడు.. గేటు వద్ద మనమెలా ఆగుతామో.. అక్కడ విమానాలు కూడా ఆగుతాయట. లేదా విమానమే ముందు వెళ్లేటట్లుంటే.. రైలును ఆపుతారట. ఈ రెండింటినీ బాలెన్స్ చేయడంతోనే ఎయిర్పోర్టు సిబ్బందికి రోజంతా సరిపోతుందట. -
రైల్వే లైన్ను పొడిగించాలి
సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి జగిత్యాల రూరల్: నూతనంగా ఏర్పాటుచేస్తున్న మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ను జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు పొడిగించాలని సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి కోరారు. ఈ మేరకు తానురాసిన లేఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు గురువారం పంపించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం మనోహరాబాద్–సిద్దిపేట–సిరిసిల్ల–కొత్తపల్లికి రైల్వేలైన్ మంజూరు చేసిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర రాజధాని నుంచి కరీంనగర్ వరకు రైల్వేలైన్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ప్రతిపాదించిన మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ను మనోహరబాద్, గజ్వేల్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్పేట, మంచిర్యాల వరకు కొనసాగిస్తే చాలా ఉపయోగం ఉంటుందన్నారు. దీంతో ఉత్తర భారతదేశాన్ని కలిపే రైలుకు ప్రత్యామ్నాయ రైల్వేలైన్ ఏర్పాటు చేసినట్లవుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలుగా మారనున్న జగిత్యాల, మంచిర్యాల రైల్వేలైన్తో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 7న మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్కు శంకుస్థాపన చేస్తున్నందున ముఖ్యమంత్రి చొరవ తీసుకుని రైల్వేలైన్ జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు పొడిగించేలా చూడాలని కోరారు. నిజామాబాద్ ఎంపీ కవిత, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్కు లేఖలు పంపినట్లు పేర్కొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, మండల ఉపాధ్యక్షుడు గంగం మహేశ్ పాల్గొన్నారు. -
2న నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభం
– హాజరు కానున్న రైల్వే మంత్రి, ముఖ్యమంత్రి నంద్యాల: నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే లైన్ను ఆగస్టు 2న ప్రారంభించాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవానికి రైల్వే మంత్రి సురేష్ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. మంత్రి సురేష్ప్రభును రైల్వే జనరల్మేనేజర్ రవీంద్రగుప్త బుధవారం ఢిల్లీలో కలిశాక ప్రారంభోత్సవ తేదీని నిర్ణయించారు. అయితే అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. -
మెదక్ దశ తిరిగినట్లే
రైల్వేరాకతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరబోతుంది అభివృద్ధికోసం స్థానిక ఎమ్మెల్యే కృషి అమోఘం భావోద్వేగానికి గురైన డిప్యూటిస్పీకర్ మల్లన్న సాగర్తో మెదక్ జిల్లా సస్యశ్యామలం అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్-టీడీపీలు రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు మెదక్: మెదక్ దశ తిరిగింది. ఓ వైపు జిల్లాకేంద్రం, మరోవైపు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేలైన్ ఏర్పాటు, మెదక్లో మినీట్యాంకు బండ్ నిర్మాణం, రూ.50కోట్లతో పట్టణానికి మిషన్ భగీరథ పథకం అమలుతో మెదక్ దశ తిరిగినట్లేనని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. శనివారం మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ పనులకు ఆయన మెదక్ మండల పరిధిలోని పాతూర్ గ్రామశివారులో డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత ఆరు దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీల హయాంలో తెలంగాణను పూర్తిగా భ్రష్టుపట్టించారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావించాక కోట్లాది రూపాయలతో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికోసం డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి కృషి అమోఘమన్నారు. మెదక్ రైల్వేలైన్కోసం ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా పోరాటాలు చేశారని, వారి కల నేడు మన ప్రత్యేక తీర్చుకోవడం మా అదృష్టమని తెలిపారు. రైల్వేలైన్కోసం ఇప్పటికే రైతుల వద్ద భూమి సేకరించి వారికి పరిహారం అందించడం జరిగిందన్నారు. ఈ నిధులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించిందన్నారు. రైల్వేలైన్ల కోసం రూ.120కోట్లు ఖర్చు అవుతుండగా అందులో సగం రూ.60కోట్లను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. రెండేళ్లలో రైల్వేలైన్ పూర్తి అవుతుందన్నారు. రూ.47కోట్లతో మెదక్ పట్టణంలో 4లైన్ల రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మించి అక్కడి నుండి సింగూర్ ద్వారా ఘనపురం ప్రాజెక్ట్ ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మెదక్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మెదక్ అభివృద్ధికోసం స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి రూ.100కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. మినీట్యాంకు బ్యాండ్, ఘనపురం ఆనకట్ట, మెదక్-చేగుంట, మెదక్-రామాయంపేట 4లైన్ల రోడ్లు, మెదక్ పట్టణంలో మిషన్ భగీరథ పథకం, ప్రస్తుతం రైల్వేలైన్కోసం 280 ఎకరాలు సేకరించి రైతులకు పరిహారం ఇచ్చామన్నారు. అలాగే ఖిల్లాపై హరితహోటల్ నిర్మించి పర్యాటకుల కోసం ప్రత్యేక వసతి కల్పించడం జరిగిందన్నారు. అంతేకాకుండా హైదరాబాద్నుండి నర్సాపూర్, మెదక్-బోధన్ వరకు జాతీయ రహదారిని మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరందించేందుకు పైప్లైన్లు వేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ఒక్క మెదక్ నియోజకవర్గంలోనే రూ.500కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. డిసెంబర్లోగా గోదావరి జలాలను తరలించి ఇంటింటికి తాగునీరందిస్తామన్నారు. నిజాం పాలనలో నిర్మించిన చెరువు కుంటలకు ఆంధ్రా పాలకులు పూర్తిగా విస్మరించారని, మిషన్ కాకతీయ పథకం ద్వారా మెదక్ నియోజకవర్గంలో రెండు విడుతల్లో 236చెరువుల మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. ఘనపురం ప్రాజెక్ట్కు రూ.100కోట్లు కేటాయించామని, సిమెంట్లైన్ పనులు కొనసాగుతున్నాయన్నారు. దీంతో చివరాయకట్టుకు సాగునీరందుతుందన్నారు. మహిళా రెసిడెన్సియల్ డిగ్రీ కళాశాలకు రూ.30కోట్లు, రైతు బజార్కోసం రూ.3కోట్లు, ముస్లిం మైనార్టీ రెసిడెన్సియల్స్కూల్కు త్వరలోనే నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎదిగినకొద్ది ఒదగాలన్న సామెత సీఎం కేసీఆర్ మాకు పదే పదే బోధిస్తున్నాడని, ప్రజలకు సేవచేసే భాగ్యం లభిస్తుందున తాము అదృష్టవంతులమని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావు కృషి వల్ల మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్కోసం 280 ఎకరాల భూమి సేకరించి వారికి రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉందంటూ భావోద్వేగానికి గురైన డిప్యూటీస్పీకర్ ఆనంద భాష్పాలు రాల్చారు. ఒకప్పుడు తెలంగాణకోసం ఉద్యమాలు చేస్తూనే మరోపక్క రైల్వేలైన్ కోసం పోరాటాలు చేశామన్నారు. బంగారు తెలంగాణకు బాటలు వేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులందరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, డీసీసీబి చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, మున్సిపల్చైర్మన్ మల్లికార్జున్గౌడ్, వైస్చైర్మన్ రాగి అశోక్, ఆర్డీఓ మెంచు నగేష్, తహశీల్దార్ అమీనొద్దీన్, ఎంపీడీఓ రాంబాబు, ఎంపీపీ లక్ష్మికిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఆయా అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
మెదక్ దశ తిరిగినట్లే: మంత్రి హరీశ్ రావు
మెదక్: మెదక్ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేలైన్ ఏర్పాటు, మినీట్యాంకు బండ్ నిర్మాణం, రూ.50కోట్లతో పట్టణానికి మిషన్ భగీరథ పథకం అమలుతో మెదక్ దశ తిరిగినట్లేనని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ పనులకు ఆయన మెదక్ మండలం పాతూర్లో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ రైల్వేలైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ పూర్తి చేసి, పరిహారంలో సగం భరించిందని తెలిపారు. రెండేళ్లలో రైల్వేలైన్ పూర్తి అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పాల్గొన్నారు. -
పట్టాలెక్కనున్న సీఎం కలల ప్రాజెక్టు
- సికింద్రాబాద్-కరీంనగర్ రైల్వే లైను పనులు ఈ ఏడాదే మొదలు - ద.మ.రైల్వే జీఎం- సీఎస్ భేటీలో కీలక నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సికింద్రాబాద్-కరీంనగర్ (మనోహరాబాద్-కొత్తపల్లి) రైల్వే లైన్ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కే దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణలో కీలకమైన కరీంనగర్, సిద్దిపేటను రాజధాని నగరంతో రైల్వే లైను ద్వారా అనుసంధానించే ఈ ప్రాజెక్టు కోసం చాలాకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇది సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు. బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఇందుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు ఉచితంగా అందజేయనుంది. భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించి ఈ ఏడాదే పూర్తి చేయనున్నట్టు రైల్వే జీఎంకు రాజీవ్శర్మ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు రూ.1,160కోట్ల ప్రాథమికఅంచనాను రైల్వే శాఖ ఖరారు చేసింది. దీంతో ఈ ఏడాదే పనులకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు రైల్వే జీఎం తెలిపారు. కొత్త టెర్మినళ్లకు త్వరలో స్థల సేకరణ చర్లపల్లి, నాగులపల్లిలో నిర్మించబోయే ఆధునిక టెర్మినళ్లకు కూడా త్వరలో స్థల సేకరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. కొత్తగా నిర్మిస్తున్న కరీంనగర్-నిజామాబాద్ ైరె ల్వే మార్గంలో 3 చోట్ల తాత్కాలిక లెవల్ క్రాసింగ్స్కు అవకాశం కల్పించాలని సమావేశంలో నిర్ణయిం చారు. అక్కన్నపేట-మెదక్ రైల్వే లైను రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని జీఎం గుప్త తెలిపారు. మటంపల్లి-జన్పహాడ్ లైనులో మిగిలిన 20 కిలోమీటర్ల పనులు ఈ సంవత్సరమే పూర్తయ్యేలా చూడాలని రాజీవ్శర్మ జీఎం రవీంద్రగుప్తాకు సూచించారు. ఎంఎంటీఎస్-2కు సంబంధించి చెర్లపల్లి-మౌలాలీ-ఘట్కేసర్ సెక్షన్ పనులకు గాను ఐదెకరాల స్థలం కావాలని జీఎం రవీంద్రగుప్త కోరగా దాన్ని గుర్తించి కేటాయించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను రాజీవ్శర్మ ఆదేశించారు. -
బాలుర వసతి భవనానికి రైల్వేలైన్ గండం
రూ.3కోట్లతో నిర్మాణం ప్రారంభానికి నోచుకోని వైనం రైల్వేలైన్ నిర్మాణంలో తొలగనున్న భవనం వృథాకానున్న కోట్ల రూపాయల ధనం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని బాలుర వసతిగృహాలను ఒకే భవనంలోకి తీసుకువచ్చేందుకు ఆ భవనాన్ని నిర్మించారు. కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన ఈ భవనాన్ని ఇంకా ప్రారంభించలేదు. నూతన రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా తొలగించనున్న భవనంపైప్రత్యేక కథనం. ఆత్మకూరురూరల్: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ఒకే నీడకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం 2013లో రూ.3కోట్లతో సమీకృత బాలుర వసతిగృహ భవనాన్ని మంజూరు చేసింది. అప్పట్లో మంత్రి రామనారాయణరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకొన్న ఈ భవన నిర్మాణం ఏడాది క్రితం పూర్తయింది. ప్రభుత్వం మారడం..సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు మరిచిపోవడంతో వసతి భవనం నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. వసతి భవనానికి రైల్వేలైన్ గండం కోట్ల రూపాయలతో నిర్మించిన వసతి భవనానికి నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ గండం నెలకొంది. ఆత్మకూరులోని బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లే రైల్వేలైన్ వసతి భవనాన్ని తాకనుంది. రైల్వేలైన్ నిర్మాణానికి భవనాన్ని తొలగించక తప్పదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గతంలో మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ వసతి భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. అప్పట్లో ఆత్మకూరు తహశీల్దార్ రైల్వేలైన్ నిర్మాణంలో నూతన భవనాన్ని తొలగించక తప్పదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాలని ఆదేశించారు. ఈ మేరకు తహశీల్దార్ సమాచారాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రైల్వేలైన్ రూట్ మ్యాప్ పూర్తయిందని, వసతి భవనం మీదుగా కాకుండా రైల్వేలైన్ను మారిస్తే రైల్వేస్టేషన్ ఆత్మకూరు పట్టణానికి దూరమవుతుందని తెలిపారు. ఈ రైల్వేలైన్ను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. రైల్వేలైన్ నిర్మాణానికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా, కేంద్రం రైల్వేలైన్ నిర్మిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు చూపిన మార్గంలోనే రైల్వేలైన్ నిర్మాణం చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అధికారులు వసతి భవనాన్ని విస్మరించి స్థలం కేటాయించడంతో రైల్వేలైన్ నిర్మాణానికి కోట్లతో నిర్మించిన భవనాన్ని తొలగించక తప్పని పరిస్థితి నెలకొంది. కాగా ఈ విషయమై తహశీల్దార్ బీకే వెంకటేశులును సంప్రదించగా ప్రస్తుత రైల్వేలైన్ నిర్మాణం డిజైన్ ప్రకారం హాస్టల్ భవనం తొలగించక తప్పదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కలెక్టర్తో పాటు రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. -
కరుణించు ప్రభు!
♦ కృష్ణా- వికారాబాద్ రైల్వేలైన్పై ఆశ ♦ శివార్లకు ఎంఎంటీఎస్ వచ్చేనా? ♦ శంషాబాద్లో ఎయిర్కార్గోకు మోక్షం లభించేనా? ♦ నేటి రైల్వేబడ్జెట్పై జిల్లావాసుల గంపెడాశ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వికారాబాద్- కృష్ణా బ్రాడ్గేజ్ రైల్వేలైన్ కేంద్రం కరుణ కోసం నిరీక్షిస్తోంది. నాలుగేళ్ల క్రితం సర్వే పూర్తిచేసుకున్న ఈ లైను పట్టాలెక్కేందుకు నిధులు విదిల్చకపోతారా? అని ఆశగా చూస్తోంది. 121.70 కిలోమీటర్ల ప్రతిపాదిత ఈ రైలు మార్గానికి రూ.787.80 కోట్లు అవసరమని రైల్వేశాఖ అంచనా వేసింది. అదేసమయంలో సరుకు రవాణాకు ఈలైను అంతగా ఉపయోగపడదని, ప్రయాణికుల నిష్పత్తి కూడా నిర్ధేశితశాతం నమోదు కావడం అసాధ్యమని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా భారంగా మారే ఈ ప్రాజెక్టును చేపట్టడం సాధ్యపడదని స్పష్టం చేసింది. సగటున 14శాతం రేట్ ఆఫ్ రిటర్న్(ఆర్ఓఆర్) ఉన్నవాటికే ప్రాధాన్యమిస్తామని, ఈ మార్గంలో కేవలం 6.9 శాతం మాత్రమే వచ్చే వీలుందని రైల్వే ఇంజినీరింగ్ శాఖ తేల్చిచెప్పింది. ఈ ప్రాంత సామాజిక అవసరాల దృష్ట్యా నిర్మాణ వ్యయంలో సగం వాటాను రాష్ర్ట సర్కారు భరిస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత ఉమ్మడి ప్రభుత్వం భూసేకరణ సహా ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం వెచ్చించేందుకు ముందుకొచ్చింది. అందులో భూసేకరణకు రూ.3,683 కోట్లను కూడా విడుదల చే సేందుకు అంగీకరించింది. అయినప్పటికీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైల్వేబోర్డు ఈ లైన్ నిర్మాణానికి ఆసక్తి చూపడంలేదు. 2019 నాటికి ఈ మార్గాన్ని అందుబాటులోకి తెస్తామని నాలుగేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి సురేశ్ప్రభు పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లో కృష్ణా- వికారాబాద్ రైల్వేలైనుకు పచ్చజెండా ఊపుతారో లేదో వేచి చూడాల్సిందే! రైల్వేమంత్రి సురేశ్‘ప్రభు’ రైలుబండిపై జిల్లా ప్రజానీకం గంపెడాశలు పెట్టుకుంది. గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లో ‘రైలు కూత’ వినిపించకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తోంది. పెండింగ్ ప్రాజెక్టులకు లైన్క్లియర్, కొత్త మార్గాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తుందా? లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. శంషాబాద్ విమానాశ్రయం ఎయిర్కార్గో హబ్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమం లో సరుకు రవాణాకు అనువుగా రైల్వేలైన్లను విస్తరించాలని భావించినా.. ఇప్పటికీ అతీగతిలేకుండా పోయింది. ఎయిర్పోర్టు నుంచి నేరుగా విజయవాడకు ప్రత్యేక రైల్వేలైన్ను నిర్మించాలని గతంలో జీఎంఆర్ సంస్థ ప్రతిపాదించిన ఫైలు అటకెక్కింది. వికారాబాద్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్ఓబీ) నిర్మించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. రాజ్కోట్, గరీబ్థ్ ్రతదితర ఎక్స్ప్రెస్ రైళ్లను ఇక్కడ ఆపాలనే డిమాండ్ ఉంది.ఆదర్శ స్టేషన్ల నిర్మాణంలోనూ రైల్వేశాఖ అంతులేని జాప్యం చేస్తోంది. అరకొర నిధుల కేటాయింపులతో నిర్మాణ పనులను ఏళ్ల తరబడి సాగదీస్తోంది. 2011-12లో ప్రకటించిన పనులు కూడా ఇప్పటికీ పూర్తికాలేదు. వికారాబాద్, శంకర్పల్లి, మల్కాజ్గిరి, శేరిలింగంపల్లి ఆదర్శ స్టేషన్లు అధికారుల నిర్లక్ష్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ రైలుబండి.. రాలేదండీ! ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్) రైళ్లను శివారు ప్రాంతాలకు పొడగించాలని 2006లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా రెండో దశ విస్తరణ పనులకు రూ.324 కోట్లను కేటాయించింది. ఈ నిధుల్లో మూడోవంతు నిధులను రైల్వేశాఖ భరిస్తుండగా, మిగతా నిధులను రాష్ర్టం వ్యయం చేస్తోంది. ఈ నిధులతో శివారు ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో రెండో, మూడు లైన్ ను కొత్తగా వేయాలని ప్రతిపాదించారు. రెండో దశ కింద సికింద్రాబాద్ -మేడ్చల్ (28కి.మీ), ఫలక్నుమా -శంషాబాద్ (20కి.మీ), సికింద్రాబాద్- ఘట్కేసర్ (19కి.మీ), అలాగే మౌలాలి -సనత్నగర్ (21కి.మీ), మౌలాలి -కాచిగూడ(10కి.మీ), తెల్లాపూర్ -పటాన్చెరు (8కి.మీ) రూట్లలో ఎంఎంటీఎస్ను విస్తరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా సిగ్నలింగ్, విద్యుద్ధీకరణ, స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కొత్త ప్రాంతాలకు ఎంఎంటీఎస్ రైళ్లను పొడగించాలనే ఉద్ధేశంతో విడుదల చేసిన నిధులు మూలుగుతున్నా.. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడంలేదు. ఇప్పటివరకు కనీస భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. -
కరుణించు.. ప్రభూ!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిల్లాకు కొత్త రైల్వే లైన్ ఏ ఒక్కటీ రాలేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో రైల్వే మార్గం నిడివి కేవలం 135 కిలో మీటర్లే. అందుకే కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ సాధనకు కోనసీమ యువత ఉద్యమబాట పట్టారు. కాకినాడ-పిఠాపురం రైల్వే లైన్ కోసం డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏటా రూ.వెయ్యి కోట్ల వరకూ దక్షిణ మధ్య రైల్వేకు ఆదాయాన్ని సమకూర్చుతున్నా రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచెయ్యి మిగులుతోంది. ఈ ఖర్చులో సగం భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఆయా ప్రాజెక్టులను ముందుగా చేపడతామని రైల్వే శాఖ గతంలోనే ప్రకటించినా ఇప్పటివరకూ ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారైనా కలల ప్రాజెక్టులు సాకారం అవుతాయో లేదోనని ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరో కొద్ది గంటల్లో ఆ విషయం ఏమిటనేదీ తేలిపోతుంది! ఉన్న రైళ్లు మరింత సౌకర్యం కావాలంటే... జిల్లాలో రాజమండ్రి తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న నగరం కాకినాడే అయినా రైలు సౌకర్యంలో వెనుకంజలోనే ఉంది. ఇప్పటికే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కొన్ని రైళ్లను కొన్ని మార్పులు చేస్తే మరింత సౌకర్యవంతంగా ఉంటాయని ప్రయాణికులు కోరుతున్నారు. కాకినాడ నుంచి ముంబైకి వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ను బుధ, శనివారాల్లో మాత్రమే వెళ్తోంది. దీన్ని మంగళ, శుక్రవారాలకు మార్చితే కాకినాడ నుంచి సికింద్రాబాద్కు ప్రతిరోజూ అదీ ఉదయం పూట రైలు సౌకర్యం లభిస్తుంది. వారానికి మూడు రోజులు తిరుగుతున్న కాకినాడ-షిర్డీ ఎక్స్ప్రెస్ను రోజువారీ తిప్పాలనే డిమాండు ఉంది. కాకినాడ నుంచి సికింద్రాబాద్కు వారానికి మూడ్రోజులు తిరుగుతున్న కోకనాడ ఏసీ ఎక్స్ప్రెస్ను ప్రతిరోజూ తిప్పితే ఉపయోగకరంగా ఉంటుంది. పశ్చిమభారత రాష్ట్రాలకు వెళ్లడానికి కాకినాడ నుంచి వారానికి ఒకరోజు మాత్రమే ఉన్న ఏకైక రైలు భావనగర్ ఎక్స్ప్రెస్ను వారంలో రెండు లేదా మూడు సార్లు తిప్పితే జిల్లాలో ఉన్న మార్వాడీలు, పర్యాటకులకు ప్రయాణ వెసులుబాటు లభిస్తుంది. కాకినాడ నుంచి చెన్నైకు వెళ్లే సర్కారు ఎక్స్ప్రెస్ను పుదుచ్ఛేరి వరకూ పొడిగించాలనే డిమాండు కూడా ఎప్పటినుంచో ఉంది. అన్నవరంలో గరీబ్థ్,్ర కోణార్క్ ఎక్స్ప్రెస్లకు కూడా హాల్ట్ కల్పించాలి. కాకినాడ-విశాఖపట్నం, కాకినాడ-విజయవాడ ఫాస్ట్ పాసింజర్ రైళ్లు, శేషాద్రి, సర్కారు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు వేయాలనే డిమాండు ఉంది. అలాగే కోల్కతా, న్యూఢిల్లీ (వయా విశాఖపట్నం, వారణాసి), జోథ్పూర్ ప్రాంతాలకు కాకినాడ నుంచి కొత్తగా రైళ్లు వేయాలని దీర్ఘకాలంగా డిమాండు వినిపిస్తోంది. ఇక హాల్ట్ల విషయానికొస్తే సామర్లకోట, పిఠాపురం, అనపర్తి, అన్నవరం తదితర ముఖ్య పట్టణాల స్టేషన్లలో కొన్ని ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇస్తే రైలు సౌకర్యం మరింత మందికి అందుబాటులోకి వస్తుంది. సౌత్కోస్టల్ రైల్వే జోన్ వస్తే... యానాం-ఎదుర్లంక వంతెన పూర్తయ్యిన తర్వాత కోనసీమ స్వరూపమే మారిపోయింది. అలా రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా సౌత్కోస్టల్ రైల్వే జోన్ అత్యవసరం. ఈ బడ్జెట్లోనైనా ప్రకటించాలనే డిమాండు అన్ని వర్గాల నుంచి ఇప్పటికే రైల్వే శాఖకు వినిపించారు. ఇది సాకారమైతే చాలా పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుంది. తీర ప్రాంతం వెంబడి పోర్టులను అనుసంధానిస్తూ రైల్వేలైను వేస్తే వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అలాగే కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైను వేస్తే హైదరాబాద్, వరంగల్ వైపు ప్రయాణసమయం తగ్గుతుంది. - వైడీ రామారావు, అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా-కోకనాడ ప్రయాణికుల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా... కోనసీమను కలిపే సుమారు 60 కిలోమీటర్ల కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను ప్రాజెక్టు గత 15 ఏళ్లుగా పెండింగ్లోనే ఉంది. రూ.345 కోట్ల అంచనా వ్యయంతో 2002, నవంబరు 16న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ అమలాపురంలో పునాదిరాయి వేశారు. ముక్తేశ్వరం నుంచి అమలాపురం వరకూ లైన్కు దాదాపు 85 ఎకరాల భూమిని రైల్వే శాఖ సేకరించింది. అమలాపురం సమీప భట్నవిల్లిలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి 2005లో అప్పటి రైల్వే సహాయ మంత్రి తంగవేలు శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకూ దీనికి కేటాయించింది రూ.70 కోట్లు మాత్రమే. ఈ లైనులో గౌతమి, వైనతేయ, వశిష్ట నదులపై భారీ రైలు వంతెనలు, కాలువలపై 15 పెద్దవి, 150 వరకూ చిన్నచిన్న వంతెనలు నిర్మించాల్సి ఉంది. దీనివల్ల కిలోమీటరుకు రూ.50 కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా. ఆమోదముద్ర పడి ఆగిపోయిన ప్రాజెక్టుల్లో కాకినాడ-పిఠాపురం లైన్ మరొకటి. ఏటా బడ్జెట్లో కొంతమొత్తంలో రైల్వేశాఖ కేటాయిస్తూ వస్తోంది తప్ప పూర్తిస్థాయి కేటాయింపులు లేవు. ఇప్పుడు దీన్ని పూర్తి చేయాలంటే సుమారు రూ.200 కోట్ల వరకూ నిధులు అవసరం. ఈ లైన్ సాకారమైతే కాకినాడకు హౌరా-చెన్నై రైల్వే మార్గంతో అనుసంధానం ఏర్పడుతుంది. దీన్నే ప్రస్తుతం విస్తరణ జరుగుతున్న 216 నంబరు జాతీయ రహదారికి సమాంతరంగా నిర్మించాలనే సూచనలు వస్తున్నాయి. ఇది మరింత ఉపయోగకరం కావాలంటే ఈలైన్ను పిఠాపురం దగ్గర గాకుండా కాకినాడ నుంచి తీరం వెంబడి ఎస్ఈజడ్ మీదుగా అన్నవరం వద్ద అనుసంధానం చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
రూ.141 కోట్లు విడుదల చేయండి
పెద్దపెల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ పూర్తి చేయండిరైల్వే మంత్రికి నిజామాబాద్ ఎంపీ కవిత విజ్ఞప్తి రాయికల్ :పెద్దపెల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ కోసం రానున్న రైల్వే బడ్జెట్లో రూ.141 కోట్లను విడుదల చేయాలని నిజామాబా ద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర రైల్వేశా ఖ మంత్రి సురేష్ప్రభును కోరారు. ఈ మే రకు ఆమె బుధవారం ఢిల్లీలో కేంద్ర మం త్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో గత బడ్జెట్లో కేటారుుంచిన నిధులను పూర్తిస్థారుులో విడుదల చేయూలని విన్నవించారు. 1993లో ప్రారంభమైన పెద్దపెల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ పనుల్లో జాప్యం జరుగుతోందని, త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ లైన్ పూర్తయితే నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్, వరంగల్ జిల్లా వాసులతో పాటు పొరుగు రాష్ట్రాలై న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వాసులకు ప్ర యాణ భారం తగ్గుతుందన్నారు. పసుపు రైతులు, వ్యాపారులకు ఎంతో దోహదపడుతుందన్నారు. తన విన్నపంపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కవిత ఫోన్లో సాక్షికి తెలిపారు. -
'రైల్వే లైనుకు సహకరించండి'
జైపూర్: రైలుమార్గం ఏర్పాటుకు సహకరించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్మోహన్ ను రైతులు కోరారు. జిల్లాలోని జైపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఆయన బుధవారం రైతులతో సమావేశమయ్యారు. రైతులకు సక్రమంగా పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. జైపూర్లో జెన్కో విద్యుత్ ప్లాంటు నిర్మిస్తోంది. ఈ ప్లాంటుకు మంచిర్యాల సమీపంలోని గనుల నుంచి బొగ్గును సరఫరా చేయాల్సి ఉంది. దీనికి గాను రైలు మార్గం నిర్మాణానికి రైతుల నుంచి భూములు సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం బాధిత రైతులతో సమావేశమయ్యారు. -
కోటిపల్లి - నర్సాపురం రైల్వేలైన్ కల తీరేనా..?
-
పట్టాలు తప్పిన గూడ్స్.. తప్పిన ప్రమాదం
-
పట్టాలు తప్పిన గూడ్స్.. తప్పిన ప్రమాదం
రాజమండ్రి: కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాకినాడ నుంచి ఔరంగాబాద్కు గూడ్స్ వెళ్తుండగా రాజమండ్రి -కోవూరు మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజమండ్రి మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. -
ప్రమాదాలకు ‘గేట్లు’ వేయరా?
కర్నూలు(రాజ్విహార్) : రైల్వే లైనుపై రోడ్డు క్రాసింగ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. పలు చోట్ల గేట్లను ఏర్పాటు చేయకపోవడం, మరికొన్ని చోట్ల కాపాలాదారులను నియమించకపోవడం వంటి కారణాలు ప్రయాణికులకు శాపంగా మారాయి. ప్రయాణికులకు భద్రత దృష్ట్యా రైల్వే శాఖ వీటిపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో జిల్లా వాసులు భయాందోళన మధ్య కాలం గడుపుతున్నారు. రోడ్డు లెవెల్ క్రాసింగ్ల వద్ద ప్రమాదాల నివారణకు రైల్వే గేటు తొలి మెట్టు లాంటిది. కాని వీటిని ఏర్పాటు చేయడంలో రైల్వేశాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గేటు లేక, కాపలాదారుడు కరువై రైలు వస్తుందన్న విషయాన్ని తెలుసుకోకుండా పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పొతున్నారు. మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. అయినా పాలకుల్లో స్పందన కరువైంది. గతంలో ఏడాదిన్నర పాటు కర్నూలుకు చెందిన ఎంపీ కోట్ల సూర్యప్రకాష్రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినా ఈ సమస్యకు పరిష్కారం అభించలేదు. కర్నూలులోని గుత్తి రోడ్డు, కృష్ణానగర్లతోపాటు జిల్లాలోని మరిన్ని చోట్ల ఈ సమస్యలను పరిష్కరిస్తాని హామీ ఇచ్చారు. పలుచోట్ల రోడ్ ఓవర్ బ్రిడ్జీ (ఆర్ఓబీ), రోడ్ అండర్ బ్రిడ్జీ (ఆర్యూబీ)ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినా ఫలితం లేదు. గతేడాది జూలై 24వ తేదీన మెదక్ జిల్లాలోని మూసాయిపేట వద్ద పట్టాలు దాటుతున్న స్కూలు బస్సును రైలు ఢీకొనడంతో 15 మంది విద్యార్థులు చనిపోయిన దుర్ఘటన సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. దీంతో హడావిడి చేసిన రైల్వే శాఖ రైల్వే లైన్లపై రోడ్డు క్రాసింగ్లు లేకుండా చూస్తామని ప్రకటించింది. కాని ఏడు నెలలు గడిచినా ఆ హామీ ఇప్పటివరకు నెరవేర్చకపోవడం గమనార్హం. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే -రోడ్డు క్రాసింగ్ వద్ద గతంలో జరిగిన ప్రమాదాల్లో 17 మంది అమాయక ప్రజలు చనిపోయారు. వందల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. ప్రయాణికులు, ప్రజల భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో ఆందోళనలు తప్పడం లేదు. ఇంకెంత కాలం ఈ సమస్యతో గడపాలో అర్థం కాని పరిస్థితి. కొన్ని దుర్ఘటనలు కోసిగి మండలం ఐరన్గల్లు గ్రామం వద్ద 2005 మే 18వ తేదీన పట్టాలు దాటుతున్న ఆటోను రైలు ఢీ కొనడంతో ఐదుగురు వ్యవసాయ కూలీలు చనిపోయారు. అక్కడ గేటు, కాపలాదారుడు లేకపోవడంతో వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీల ఆటోను రైలు ఢీకొంది. అయితే, ఇప్పటికీ ఇక్కడ గేటును ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. కల్లూరు మండలం చెల్ల మల్లాపురం గ్రామం వద్ద 2012 మార్చి 31వ తేదీన పట్టాలు దాటుతున్న ఆటోను రైలు ఢీ కొని ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అక్కడ పట్టాల వద్ద గేటు, కాపలాదారుడు లేని కారణంగా వివాహ వేడుకలకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామానికి చెందిన డ్రమ్స్ వాయిద్యకారులు చనిపోయారు. నంద్యాల పరిధిలో కాపలాలేని గేట్లు అనేకం ఉన్నాయి. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో రెండేళ్ల క్రితం వృద్ధురాలు మృతిచెందగా, నాలుగు నెలల క్రితం కోవెలకుంట్లకు చెందిన హుసేన్ బాష మృతి చెందినట్లు జీఆర్పీ అధికారులు చెబుతున్నారు. మేతకు వెళ్లిన పశువులు, ఎద్దులు మృతి చెందగా వాటిని రక్షించబోయి పశువుల కాపర్లు గాయపడిన సందర్భాలున్నాయి. 2009లో బేతంచెర్లలో జరిగిన చెన్నకేశవ స్వామి తిరునాలతో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్లేందుకు గేటు దాటుతున్న హనుమాన్ నగర్ బాలికను రైలు ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందింది. డోన్ మండలం బి. రామదుర్గం వద్ద రైండేళ్ల క్రితం రెల్వే ట్రాక్కు గేటు లేని కారణంగా పట్టాలు దాటుతున్న ఆర్టీసీ డోన్ డిపో బస్సును రైలు ఢీకొంది. ఫలితంగా డ్రైవర్ జంగాల రాముతోపాటు బట్టల వ్యాపారి ఈశ్వరయ్య చనిపోయారు. వెల్దుర్తి మండలం గుంటపల్లి వద్ద ఏడేళ్ల కిత్రం పట్టాలు దాటుతూ ఇద్దరు చనిపోగా సూదెపల్లె వద్ద ఐదేళ్ల క్రితం పట్టాలు దాటుతూ మరొకరు చనిపోయారు. జిల్లాలోని అనేక చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో గేట్లు లేని కారణంగా వందల సంఖ్యలో మూగజీవాలు (బర్రెలు, ఎద్దులు, గొర్రెలు తదితర) మృత్యువాత పడ్డాయి. -
ఓబులవారిపల్లె-కృష్ణపట్నం టన్నెల్ పనులకు బ్రేక్
రాజంపేట: ఓబులవారిపల్లె- కృష్ణపట్నం మార్గం రైల్వేలైన్కు సంబంధించిన టన్నెల్ నిర్మాణ పనులు ఆది నుంచి అడ్డంకులతో ముందుకు సాగడంలేదు. ఈ మార్గంలో టన్నెల్ నిర్మించేందుకు 2007లో చెన్నై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్) టెండర్లు పిలిచింది. అప్పట్లో ముంబయికి చెందిన దీపికా నిర్మాణ సంస్థ ఈ పనులను దక్కించుకుని పనులు మొదలుపెట్టింది. ఈ మార్గంలోని వెలుగొండ అడవుల్లో కొండను తవ్వినప్పుడు వచ్చిన మట్టి, ఎర్త్ పనులకు సంబంధించిన విషయంలో ఆర్వీఎన్ ఎల్తో కాంట్రాక్టు సంస్థకు విభేదాలు పొడసూపాయి. దీనికితోడు టెండర్లు పిలిచినప్పటి రేట్లతో తాము పనులు కొనసాగిస్తే నష్టపోతామని అందువల్ల ఈ పనులను చేయలేమని సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఆర్వీఎన్ఎల్ గత ఏడాది చివర్లో ఈ పనులకు తిరిగి టెండర్లు నిర్వహించింది. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీకి సంబంధించిన హెచ్ఈడబ్ల్యు నిర్మాణ సంస్థ టెండర్లు దక్కించుకుంది. కృష్ణపట్నం - ఓబులవారిపల్లె రైలుమార్గంలో ఏడు కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం కావాల్సి ఉంది. ఈ దశలో తొలుత టెండర్లు దక్కించుకుని ఆ తర్వాత పనులు నిలిపేసిన దీపికా సంస్థ ఆర్వీఎన్ఎల్ నుంచి తమకు కోట్లాది రూపాయల డబ్బు రావాల్సి ఉందని కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ పనులను దక్కించుకున్న హెచ్ఈడ బ్ల్యు సంస్థ పనులు మొదలుపెట్టేందుకు వీలు లేకుండా పోయింది. టన్నెల్ వ్యవహారం కోర్టులో ఉన్నందున పనులకు బ్రేక్ పడిందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టులో కేసు పరిష్కారం కావడంతో పాటు ఈ మార్గంలో పనులకు పూర్తిస్థాయిలో నిధులు విడుదలైతే తప్ప టన్నెల్ పనులు ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈనెల 23న రైల్వేశాఖమంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టనున్న బడ్జెట్లోనైనా అధిక నిధులు కేటాయిస్తారేమోననే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇతర పనులు ముమ్మరంగా.. ఇదిలా ఉండగా ఈ మార్గంలో ఉన్న మొత్తం మూడు రీచ్లలో జర గాల్సిన మిగతా పనులను ఆర్వీఎన్ఎల్ వేగవంతంగా చేపడుతోంది. నెల్లూరు జిల్లా పరిధిలోని ఎర్త్వర్క్ పనులు పూర్తయ్యాయి. ఓబులవారిపల్లె రైల్వేస్టేషన్ నుంచి నేతివారిపల్లె వరకు రైలు పట్టాలు వేసేందుకు అవసరమైన ఎర్త్ వర్క్ పనులను 17 కిలోమీటర్ల మేర పూర్తి చేశారు. 38 చిన్న వంతెనలు, 8 పెద్ద వంతెనలు పూర్తి కానున్నాయి. పెరిగిన అంచనా వ్యయం.. కృష్ణపట్నం రైల్వేలైను 2005-06లో మంజూరైనప్పుడు రూ.930 కోట్ల అంచనాతో రైల్వే నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం అంచనా వ్యయం భారీగా పెరిగిపోయింది. టన్నెల్ నిర్మాణ వ్యయం కూడా రూ.400 కోట్లు దాటిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఓబులవారిపల్లె - కృష్ణపట్నం మార్గంలో టన్నెల్ నిర్మాణ పనులకు మోక్షం లభించేదెప్పుడు అనే చర్చ జరుగుతోంది. -
రైల్వేట్రాక్ల పక్కనే.. ఇళ్ళు..!
-
మియాపూర్ నుంచి జహీరాబాద్కు రైల్వేలైన్
* రూ.450 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు * సంగారెడ్డి నుంచి నాందేడ్ అకోల వరకు నాలుగు లేన్ల రోడ్డు * జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ వెల్లడి సదాశివపేట: మియాపూర్ నుంచి సంగారెడ్డి వయా సదాశివపేట మీదుగా జహీరాబాద్ వరకు రైల్వే లైన్ వేసేందుకు రూ. 450 కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆదివారం సదాశివపేట పట్టణంలోని ఐబీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మూడు గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలను అభివృద్ధి చేయనున్నట్లు బీబీ పాటిల్ వెల్లడించారు. అందులో భాగంగానే ఇప్పటికే నిజామాబాద్ జిల్లాజుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కవలాస్ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని, రెండవ విడతగా మెదక్ జిల్లాలోని జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఝరాసంగం గ్రామాన్ని దత్తత తీసుకుని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. సంగారెడ్డి నుంచి నాందేడ్, అకోలా వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని ఎంపీ తెలిపారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
విన్నపాలు వినవలే..
సీఎంకు వినతుల వెల్లువ సిద్దిపేట అర్బన్: సీఎం హోదాలో తొలిసారి బుధవారం సిద్దిపేటకు విచ్చేసిన కేసీఆర్కు వివిధ వర్గాలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. ఎంఐఎం పట్టణ అధ్యక్షులు అబ్దుల్ బషీర్ ఆధ్వర్యంలో మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు త్వరగా అమలు చేయాలని, అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, కొండపాక మండలం బందారం దర్గా దారిని బీటీ రోడ్డుగా మార్చాలని, ముస్లింలకు కబ్రస్థాన్ కోసం 5 ఎకరాల భూమిని కేటాయించాలని, హజ్హౌస్ నిర్మాణం కోసం 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు అసెంబ్లీ ప్రాంగణంలోలాగా సిద్దిపేట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో గాంధీ విగ్రహం పక్కన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజిరెడ్డి, భుజంగరావు, జిల్లా అధ్యక్షులు సడిమెల యాదగిరిల ఆధ్వర్యంలో ఉద్యోగుల సంక్షేమం కోసం పదవ పీఆర్సీని అమలు చేయడంతో పాటు, హెల్త్ కార్డుల పంపిణీ సత్వరమే చేపట్టాలని కోరారు. 63 శాతం ఫిట్ మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని, సీనియర్ ఉపాధ్యాయుల, ఉద్యోగుల సర్వీసులను పరిగణలోకి తీసుకుని వెయిటేజ్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఆయుష్ పారా మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు యాదగిరి ఆధ్వర్యంలో ఉద్యోగులు సీఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. పారా మెడికల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని, ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధి కోదాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎంకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఎస్సీ, ఎస్టీ దళిత గిరిజనుల వ్యవసాయ భూముల అభివృద్ధి కోసం ఇందిర జలప్రభకు 10 నుంచి 5 ఎకరాలకు అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నోడల్ ఏజెన్సీ ద్వారా దళిత గిరిజనుల వాడల్లో అభివృద్ధి పథకం కాంట్రాక్టు విధానం రద్దు చేసి దళిత, గిరిజన యువకులకు పని చేసుకునే విధానం అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నోడల్ ఏజెన్సీ ద్వారా 1990 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న రుణాలను రద్దు చేయాలని, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు మంజూరు చేసిన నిధులను బ్యాంకు అనుబంధం పెట్టకుండా నిరుద్యోగ వాటా ద్వారా రూ. 2 లక్షల రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో పెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
సిద్దిపేట ‘వజ్రపు‘ తునక
‘సిద్దిపేట బిడ్డగా మూడు హామీలిచ్చా.. ఒకటి జిల్లా కేంద్రం.. ఇది త్వరలో సిద్ధిస్తుంది. మరొకటి సిద్దిపేటకు రైల్వేలైన్. దీని కోసం వంద శాతం కృషి చేస్తున్నాం. ఇక మిగిలింది సాగునీరు. మంత్రి హరీష్ చొరవతో సాగునీరును సాధిస్తే ముచ్చటైన మూడు హామీల అమలుతో సిద్దిపేట వజ్రపు తునకగా మారుతుంది.’ - సీఎం హోదాలో సొంతగడ్డ సిద్దిపేట అభివృద్ధిపై కేసీఆర్ వ్యాఖ్యలు సిద్దిపేట అర్బన్/జోన్: సిద్దిపేట తాగునీటి పథకం గురించి వివిధ శాఖల రాష్ర్ట అధికారులు, మంత్రులకు వివరించేందుకు తన సొంతగడ్డ సిద్దిపేటకు వచ్చిన సీఎం కేసీఆర్, తన పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక ఎన్జీఓ భవన్ స్వర్ణోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్న నానుడిని తానూ నమ్ముతానన్నారు. సిద్దిపేట ప్రాంత అభివృద్ధికి తన మదిలో ముచ్చటైన మూడు హామీలున్నాయన్నారు. అందులో మొదటిది సిద్దిపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడమన్నది కాగా, త్వరలో వంద శాతం సిద్దిపేట జిల్లా కావడం ఖాయమని స్పష్టం చేశారు. అదే విధంగా రెండవ హామీ సిద్దిపేటకు రైల్వే లైన్ హామీ అనీ, దీనిపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తమవంతు వాటా చెల్లింపునకు సుముఖత వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసిందన్నారు. త్వరలో ఈ రైల్వే కల సాకారం కానుందన్నారు. ఇక మిగిలింది పాతికేళ్లుగా సిద్దిపేటకు సాగునీరు సమస్య ప్రధానంగా ఉందన్నారు. సాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, తడ్కపల్లి శివారులో 30 టీఎంసీలతో భారీ రిజర్వాయర్ను నిర్మించి 145 గ్రామాలకు సాగునీరును అందిస్తామన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు సిద్దిపేట నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండడంతో సాగునీటి బాధ్యత ఆయనపైనే ఉందన్నారు. దీనికి ప్రభుత్వ పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. మూడు కలలు నిజమైతే సిద్దిపేట వజ్రపు తునకగా మారుతుందన్నారు. ఈ నేల చైతన్యానికి ప్రతీక సిద్దిపేట ప్రాంతం కలలకు, ఉద్యమానికి, చైతన్యానికి, మేధావులకు నిలయమన్నారు. సిద్దిపేటలోని తాగునీటి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ వాటర్ గ్రిడ్ నిర్వాహణకు శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్య అధికారులతో సిద్దిపేటను సందర్శించినట్లు తెలిపారు. సిద్దిపేటలోని ఎన్జీఓ భవన్ పలు సామాజిక సేవ కార్యక్రమాలకు నిలయంగా మారిందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆదర్శ వివాహం ఇదే భవనంలో జరగడం తనకు నేటి కీ గుర్తుందన్నారు. ఈ ఎన్జీఓ భవన్ ఎందరో మేధావులను, విద్యావేత్తలను, అణిముత్యాలను అందించిందన్నారు. సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువును అభివృద్ధి చేసి జిల్లాకే తలమానికమైన పర్యటక కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు. త్వరలో జరగనున్న అనంతసాగర్ సరస్వతీ ఉత్సవాలకు తాను హాజరవుతానన్నారు. అనంతరం ఎన్జీఓ భవన్ అభివృద్ధికి రూ. 50 లక్షలను కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్దిపేట డివిజన్లో పుట్టి పెరిగి ఈ ప్రాంత ఖ్యాతిని దశదిశలా చాటి, వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 26 మంది ప్రముఖులను ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించారు. అనంతరం సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు చెందిన పలువురికి ముఖ్యమంత్రి ఆసరా పథకం కింద పింఛన్లు పంపిణీ చేశారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తా బుధవారం సాయంత్రం స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. సిద్దిపేట బార్ అసోసియేషన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అభినందనీయమన్నారు. న్యాయవాదుల కోరిక మేరకు సిద్దిపేట బార్ అసోసియేషన్కు కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే కాకుండా సిద్దిపేట పట్టణంలో న్యాయవాదుల కాలనీ కోసం రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేస్తామన్నారు. బార్ అసోసియేషన్లోని సభ్యులందరికీ స్థలాలు పంపిణీ జరిగేలా చొరవ చూపుతానన్నారు. అంతకు ముందు రూ. 6.80 కోట్ల నిధులతో కోమటిచెరువు కట్టపై చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. హరీష్పై ప్రసంశల జల్లు... సిద్దిపేట పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆధ్యాంతం తన మేనళ్లుడు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావును ప్రసంశలతో ముంచెత్తారు. కోమటి చెరువు కట్టను పరిశీలిస్తున్న క్రమంలో కట్ట అభివృద్ధికి హరీష్ చూపిన చొరవను కొనియాడారు. డైనమిక్ లీడర్గా వివిధ శాఖల నుంచి నిధులను తీసుకొచ్చి చెరువును అందంగా తీర్చిదిద్దాలనుకోవడం అభినందనీయమన్నారు. చెరువుకట్ట డిజైన్ను ఆసక్తికరంగా ఉందని కట్టను వెడల్పు చేసి మరింత సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రికి సూచించారు. అదేవిధంగా సిద్దిపేట ఎన్జీఓ భవన్లో మాట్లాడుతున్న సమయంలో సిద్దిపేటలో ఆణిముత్యాలు పుష్కలమంటూ అందులో హరీష్ కూడా ఒకరన్నారు. అదే విధంగా బార్ అసోసియేషన్ సమావేశంలో న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందించగా, వాటిపై బుల్లెట్లాంటి హరీష్ ప్రత్యేక దృష్టిసారిస్తాడని చమత్కరించారు.సీఎం వెంట డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహ్మద్ అలీ, మంత్రులు హరీష్రావు, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, సోలిపేట రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్, చింత ప్రభాకర్, ఎమ్మెల్సీలు సుధాకర్రెడ్డి, ఫారూక్ హుస్సేన్, టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి రవీందర్రెడ్డి, ఐఏఎస్ అధికారులు స్మిత సబర్వాల్, జిల్లా కలెక్టర్ రాహుల్బొజ్జ, జేసీ శరత్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, సిద్దిపేట కమిషనర్ రమణాచారి, సిద్దిపేట తహశీల్దార్ ఎన్వై గిరి, నాయకులు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్రెడ్డి, చిన్న, షఫీకూర్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
రైలు కూత పెట్టేదెన్నడు?
మోర్తాడ్ : ‘ నీవు ఎక్కాల్సిన రైలు.. జీవిత కాలం లేటు’ అన్న ఓ సినీ కవి మాటలు నిజామాబాద్, పెద్దపల్లిల మధ్య ప్రయాణం చేయాలనుకునే వారికి అచ్చంగా సరిపోతాయి. నిజామాబాద్ ప్రాంతంలో పూర్తి కావల్సిన రైల్వే ట్రాక్ నిర్మాణానికిఅవసరం అయిన భూమి సేకరణ సక్రమంగా జరుగక పోవడంతో రైలు కూతకు ఇంకా మోక్షం లభించడం లేదు.నిజామాబాద్, పెద్దపల్లిల మధ్య 177.49 కిలోమీటర్ల పొడవునా రైల్వే నిర్మాణానికి నిజాం ప్రభువు కాలంలోనే ప్రతిపాదనలు జరిగాయి. 1993-94లో ఈ రైల్వే లైన్కు మోక్షం లభించింది. కాగా ప్రతి బడ్జెట్లో తక్కువగా నిధులు కేటాయించడంతో ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దపల్లి, జగిత్యాల్ మధ్యన రైలు ప్రయాణం జరుగుతోంది. మోర్తాడ్ వరకుట్రాక్ పూర్తి కాగా స్టేషన్ నిర్మాణం కూడా పూర్తయ్యింది. దీంతో మోర్తాడ్ నుంచి మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల్ల మీదుగా పెద్దపల్లి వరకు ప్యాసింజర్ రైలును నడపాలని గత మార్చిలోనే అధికారులు ప్రతిపాదనలు చేశారు. మోర్తాడ్, లక్కోర వరకు జగిత్యాల్ నుంచి రైలింజన్ ట్రయల్న్న్రు పూర్తి చేశారు. చిన్న చిన్న లోపాలు తలెత్తగా వాటిని సరిదిద్దారు. రైల్వే సేఫ్టీ బృందం తనిఖీలను నిర్వహించి సర్టిఫై చేస్తే జగిత్యాల్, మోర్తాడ్ల మధ్య ప్యాసింజర్ రైలును నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 28 కిలో మీటర్ల రైల్వే లైన్ పూర్తి అయితే... నిజామాబాద్, పెద్దపల్లిల మధ్య రైల్వే ట్రాక్ నిర్మాణం మొత్తం 177.49 కిలో మీటర్లు. ఇప్పటివరకు 149.49 కిలో మీటర్ల ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. అక్కడక్కడ వంతెనల నిర్మాణ పనులు కొంత పెండింగ్లో ఉన్నాయి. నిజామాబాద్ పరిసరాల్లో 28 కిలో మీటర్ల పరిధిలో ట్రాక్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ఇంకా పూర్తి కావడం లేదు. రూ. 200 కోట్ల నిధులు ఉంటే రైల్వే లైన్ నిర్మాణం, స్టేషన్ల పనులు, వంతెనల పనులు పూర్తి చేయవచ్చని ఉన్నతాధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో రూ. 35 కోట్లు కేటాయించింది. అవసరం ఉన్న నిధుల్లో కనీసం సగం కేటాయించినా పనులు ఒక కొలిక్కి వచ్చేవి. నిధుల కేటాయింపులో మొదటి నుంచి నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. నిధుల కేటాయింపు విషయంలో ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుక రావడం లేదని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో హడావుడి... సాధారణ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న అప్పటి నాయకుల ఒత్తిడితో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొంత హడావుడి చేశారు. మార్చి 29న జగిత్యాల్ నుంచి మోర్తాడ్, లక్కోర వరకు రైలింజన్ ట్రయల్న్ నిర్వహించారు. త్వరలోనే సేఫ్టీ బృందంతో తనిఖీలు పూర్తి చేయించి ప్యాసింజర్ రైలును నడుపుతామని ప్రకటించారు. అప్పటి అధికార పార్టీ నాయకులు ఒత్తిడి మేరకు రైల్వే అధికారులు హడావుడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సేఫ్టీ బృందం తనిఖీలను నిర్వహించక పోవడాన్ని పరిశీలిస్తే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే ట్రయల్న్ ్రఒక ఎత్తుగడ అని స్పష్టం అవుతోంది. చివరకు ఎన్నికల ఫలితాలు కూడా అప్పటి నాయకులకు ప్రతికూలంగానే వచ్చాయి. కాగా ఇప్పటి ప్రజాప్రతినిధులు స్పందించి తనిఖీలను పూర్తి చేయించి ప్యాసింజర్ రైలును ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. -
సిద్దిపేట రైల్వే లైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సిద్దిపేట జోన్: మూడు దశాబ్దాల సిద్దిపేట వాసుల రైల్వే లైన్ ఆశలు మళ్లీ చిగురించాయి. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైను నిర్మాణానికి రైల్వేబోర్డు అనుమతి మంజూరు చేయడంతో సిద్దిపేట ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నిబంధనలతో రైల్వే బోర్డు నూతన మార్గానికి ఆమోదముద్ర వేయడం, సీఎం కేసీఆర్ కూడా సిద్దిపేట బిడ్డే కావడంతో ఈ సారి సిద్దిపేట రైల్వే లైనుకు తప్పకుండా మోక్షం కలుగుతుందని ఇక్కడి వారు భావిస్తున్నారు. మూడు దశాబ్దాల కల కరీంనగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న సిద్దిపేట వ్యాపార, వాణిజ్యపరంగా దినదినాభివృద్ధి చెందుతోంది. సరిగ్గా 3 దశాబ్దాల క్రితం అప్పటి పాలకులు ఎన్నికల హామీగా సిద్దిపేటకు రైల్వే మార్గం అనే నినాదాన్ని తెరమీదకు తెచ్చారు. ఒక దశలో దివంగత నేత ఇందిరాగాంధీ హయాంలోనే రైల్వే మార్గం కోసం తొలి అడుగు పడింది. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఇదే హామీని పాలకులు వినిపిస్తున్నారు. 1999లో 154 కిలోమీటర్ల మేర రైల్వే లైన్కు ప్రతిపాదనలు రూపొందించారు. కానీ తదుపరి చర్యలు కొనసాగలేదు. ఇదే సమయంలో కేంద్ర కార్మిక శాఖా మంత్రి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ 2006లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో ప్రాజెక్టు రూపకల్పనలో సఫలీకృతం అయ్యారు. అప్పట్లోనే కేంద్రం కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ కోసం రూ.40 కోట్లను రైల్వే బడ్జెట్లో కేటాయించి, రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నిబంధనలు విధించింది. అప్పుడు రాష్ట్రంలో ఉన్న సర్కార్ కేంద్ర నిబంధనలన్నీ ఒప్పుకున్నప్పటికీ తదుపరి చర్యలు తీసుకోలేదు. అయితే తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టగానే కొత్తపల్లి- మనోహరాబాద్ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ప్రాజెక్టు వ్యయం రూ. 935 కోట్లలో మూడవ వంతు భారం భరించడంతోపాటు రైల్వేలైన్ కోసం అయ్యే భూసేకరణకు ముందుకు వచ్చారు. అంతేకాకుండా కేంద్రం విధించిన నిబంధన మేరకు 5 సంవత్సరాల పాటు నష్టాన్ని భరించడానికి అంగీకారం తెలిపారు. దీంతో రైల్వే బోర్డు కొత్తపల్లి-మనోహరాబాద్ మార్గానికి అనుమతిని ఇచ్చింది. వ్యాపార, వాణిజ్య పురోగతి ఇప్పటికే కేవలం రహదారి మార్గాల ద్వారా రవాణ వ్యవస్థను వినియోగించుకుని దినదినాభివృద్ధి చెందుతున్న సిద్దిపేట భవిష్యత్లో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైను ద్వారా సికింద్రాబాద్, మేడ్చల్, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి వరకు సిద్దిపేటతో అనుసంధానం పెరగనుంది. వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటలో రైల్వే లైన్ ఆధారంగా భవిష్యత్లో రాక్ పాయింట్ ఏర్పాటు చేసే అవకాశం మెండుగా ఉంది. దీంతో వ్యాపారస్తులకు మేలు జరుగుతుంది. అదేవిధంగా సిద్దిపేట నుంచే నేరుగా సుదూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. అన్ని రంగాల్లో సిద్దిపేట అగ్రగామిగా నిలిచే అవకాశం పుష్కలంగా ఉందన్న వాదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
కలల లైన్కు పచ్చజెండా
కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతించిన రైల్వే బోర్డు యాన్యుటీ పద్ధతిలో ఐదేళ్ల నష్టాలనూ భరించాల్సిందే సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లా ప్రజల దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర రాజధానితో అనుసంధానించే రైల్వే లైన్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. కరీంనగర్ నుంచి సిద్దిపేట మీదుగా సికింద్రాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర రైల్వే బోర్డు కార్యనిర్వాహక సంచాలకుడు అంజుమ్ పర్వేజ్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో దాదాపు 149 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. దాదాపు పదేళ్ల కింద కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఒత్తిడి మేరకు రైల్వే శాఖ ఈ లైన్ సర్వేకు సమ్మతించగా.. ఇప్పుడు తెలంగాణ సీఎం హోదాలో ఆయన ప్రయత్నం ఫలించి పనులు ప్రారంభించేందుకు రైల్వే సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 925 కోట్లు అవసరమవుతాయని తాజా అంచనా. మనోహరాబాద్ లైన్తో లింకు సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్కు ఈ రైల్వేలైన్ నిర్మించనున్నారు. అయితే హైదరాబాద్ శివారులోని బొల్లారంలో రక్షణ శాఖ భూములుండటంతో... ఈ లైన్ను నేరుగా సికింద్రాబాద్ స్టేషన్తో అనుసంధానం చేయడం సాధ్యం కాలేదు. దీంతో సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వేలైన్కు మనోహరాబాద్ వద్ద అనుసంధానిస్తారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ దాటిన తరువాత మనోహరాబాద్ వస్తుంది. అక్కడి నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్తో పాటు దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి మండలాల నుంచి కరీంనగర్ శివారులోని కొత్తపల్లికి ఈ రైల్వేలైన్ చేరుకుంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు నేరుగా వేములవాడ పుణ్యక్షేత్రానికి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. మూడు షరతులకు ఓకే అన్నాకే.. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కేందుకు రైల్వే శాఖ అంత సులభంగా అంగీకరించలేదు. నష్టాలను బూచిగా చూపి షరతుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపింది. వాటి ప్రకారం.. నిర్మాణ వ్యయంలో మూడోవంతు (33 శాతం) భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత లెక్కన దాదాపు రూ. 308 కోట్లను రాష్ట్రం భరించాలి. ఇక భూసేకరణ భారం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. దీనికితోడు ఐదేళ్లదాకా ఏవైనా నష్టాలు వస్తే.. వాటిని రాష్ట్రప్రభుత్వమే భరించాలనే (యాన్యుటీ విధానం) షరతు కూడా ఉంది. వీటన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో... రైల్వే లైన్కు ఆమోదం వచ్చింది. కేసీఆర్ ప్రతిపాదన ఇదీ... ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలల ప్రాజెక్టు ఇదని, 2004లో ఆయన కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు దీనికి ప్రతిపాదన చేశారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలచారి, తేజావత్ రాంచంద్రు, ఎంపీ వినోద్కుమార్ బుధవారం వెల్లడించారు. 2006-07 బడ్జెట్లోనే సర్వేకోసం దీన్ని పొందుపరిచారని, దక్షిణ మధ్య రైల్వే సమగ్ర అంచనా నివేదికను తయారు చేసి రైల్వే బోర్డుకు ఇచ్చిందని వారు చెప్పారు. ‘‘సాధారణంగా రేట్ ఆఫ్ రిటర్న్ (ఆర్ఓఆర్) 14 శాతం ఉంటే గానీ కొత్త రైల్వేలైన్ మంజూరు చేయరు. ఈ లైన్ ఆర్ఓఆర్ 2.64 శాతం మాత్రమే ఉండడంతో.. కేంద్రం పలు షరతులు పెట్టింది. టీఆర్ఎస్ 2006లో యూపీఏ నుంచి వైదొలిగింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులో కదలిక లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. మేం ముగ్గురం తరచుగా రైల్వే బోర్డు అధికారులను కలసి ఒత్తిడి తెచ్చాం. దాంతో పాటు షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో దీనికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. వెనకబడిన ప్రాంతంలో కొత్త రైల్వే లైను రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రైలు మార్గం ద్వారా భవిష్యత్లో సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా ఢిల్లీకి రైలు సౌకర్యం ఏర్పడే అవకాశముంది.’’ అని వారు పేర్కొన్నారు. -
అరుణాచల్కు చేరువలో చైనా మరో రైల్వేలైన్
బీజింగ్: టిబెట్ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్కు చేరువలోని భారతీయ సరిహద్దుకు సమీపంలో కొత్తగా ఒక రైలు మార్గాన్ని చైనా నిర్మించబోతోంది. వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ఈ రైలుమార్గం నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల నివేదిక ఇప్పటికే ఆమోదం పొందినట్టు చైనా అధికారిక వార్తా సంస్థ ‘జిన్హువా’ తెలిపింది. టిబెట్లోని లాసా ప్రాంతాన్ని, ఎన్ రుుంగ్చీ ప్రాంతంతో అనుసంధానం చేస్తూ ఈ రైలుమార్గం నిర్మాణాన్ని ప్రతిపాదించినట్టు ‘జిన్హువా’ పేర్కొంది. 402కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నిర్మాణానికి రూ. 6వేలకోట్లకు పైగా వ్యయవువుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తిచేయుడానికి ఏడేళ్లు పడుతుందని భావిస్తున్నారు. చైనా సరిహద్దు వెంబడి ఉన్న అరుణాచల్లోని వివిధ ప్రాంతాల మీదుగా రహదారి వ్యవస్థను మెరుగుపరచాలని భారత్ సంకల్పించిన నేపథ్యంలో చైనా ఈ కొత్త రైల్వే నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఇది, ఎత్తైన టిబెట్ పీఠభూమి ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న రెండవ రైలువూర్గం అవుతుంది. ఇప్పటికే క్వింగాయ్ ప్రావిన్స్లోని జినింగ్నుంచి టిబెట్ ప్రావిన్స్ రాజధాని అయిన లాసా వరకు నిర్మించిన రైలుమార్గం 2006నుంచి వినియోగంలో ఉంటోంది. -
విజయ్ మాల్యా అశ్వశాల మీదుగా రైల్వేలైను!
అపర కుబేరుడు విజయ్ మాల్యాకు రోజులు బాగున్నట్లు లేవు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభం తర్వాత ఆయనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాల్యాకు చెందిన చరిత్రాత్మక కునిగల్ అశ్వశాల మీదుగా హసన్ - బెంగళూరు రైల్వేలైను పడబోతోంది. వీలైనంత వరకు దీన్ని తప్పిస్తామని, ప్రత్యామ్నాయమార్గం చూస్తామని దక్షిణ రైల్వే హామీ ఇచ్చినా, కుదరలేదు. మొత్తం 425 ఎకరాల సువిశాల స్థలంలో ఉన్న ఈ అశ్వశాలలోంచి దాదాపు 1.05 కిలోమీటర్ల పొడవున రైల్వేలైను వెళ్తుంది. ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలైపోయాయి. కునిగల్ సమీపంలో 300 మంది రైతులకు చెందిన 70 ఎకరాల భూమి లోంచి రైల్వేలైను వెళ్లడానికి వీల్లేదని కర్ణాటక హైకోర్టు గట్టిగా చెప్పడంతో దక్షిణ రైల్వేకు మాల్యా అశ్వశాల తప్ప మరో మార్గం ఏదీ దొరకలేదు. అయితే.. రైళ్లు తమ అశ్వశాల మీదుగా వెళ్లడం వల్ల గుర్రాలు ఆ శబ్దాన్ని భరించలేవని, ప్రధానంగా గర్భంతో ఉన్న ఆడ గుర్రాలకు ఇది పెద్ద సమస్య అవుతుందని యునైటెడ్ రేసింగ్ అండ్ బ్లడ్స్టాక్ బ్రీడర్స్ లిమిటెడ్ (యూఆర్బీబీ) మేనేజింగ్ డైరెక్టర్ జైన్ మిర్జా తెలిపారు. కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్లు దాదాపు 35 వరకు ఉన్నాయని, వాటన్నింటినీ రైల్వే లైను కోసం త్యాగం చేయాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికే చెట్లు నరకడం మొదలైపోయిందని మీర్జా అన్నారు. వాటిలో కొన్ని గంధపుచెట్లు కూడా ఉన్నాయి. గుర్రాల పునరుత్పత్తికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు దక్షిణ రైల్వే ఇంజనీర్లు మూడు అండర్పాస్లు ఏర్పాటుచేశారు. -
పట్టాలెక్కని హామీలు
కొత్తగూడెం : దక్షిణ భారత అయోధ్య అయిన భద్రాద్రి.. సిరులతల్లి సింగరేణి.. రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్తో దేశంలోనే పేరెన్నిక కలిగిన ఖమ్మం జిల్లాకు రైల్వే శాఖ మొండిచేయి చూపుతోంది. బ్రిటిష్ అధికారులు వేసిన లైన్లు మినహా కొత్త పట్టాలు మాత్రం ముందుకు సాగడం లేదు. జిల్లా వాణిజ్య, వ్యాపార, పర్యాటక రంగాలపై ప్రభావం చూపే రవాణా వ్యవస్థను మెరుగు పరచడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో నాలుగు దశాబ్దాలుగా పెండింగ్లోనే ఉన్న కొవ్వూరు, సత్తుపల్లి - కొత్తగూడెం, పాండురంగాపురం - సారపాక లైన్లు ముందుకు సాగడం లేదు. సింగరేణి బొగ్గు సరఫరాపైనే జిల్లా నుంచి రైల్వే శాఖకు ప్రతి ఏటా రూ.600 కోట్ల ఆదాయం లభిస్తోంది. దీంతోపాటు పర్యావరణశాఖ విధించిన నిబంధనలను అనుసరించి రైల్వేల ద్వారానే బొగ్గు రవాణా చేయాలి. ఈ నేపథ్యంలో సత్తుపల్లి - కొత్తగూడేనికి కొత్త మార్గం ఏర్పాటు చేసేందుకు సింగరేణి సంస్థ ముందుకొచ్చినప్పటికీ భూ సేకరణ సమస్యగా మారింది. సర్వేకే పరిమితమవుతున్న కొవ్వూరు.. భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు వరకు రైల్వేలైన్ నిర్మించాలనే ప్రతిపాదనలు ఐదు దశాబ్దాలుగా సర్వేలకే పరిమితమవుతున్నా యి. ఈ లైన్ నిర్మిస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లేందుకు 149 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీంతోపాటు జిల్లాలో ఉత్పత్తి అయ్యే బొగ్గును విశాఖపట్నం తది తర ప్రాంతాలకు రవాణా చేయడం సులభమవుతుంది. సుమారు 100 గిరిజన గ్రామాలకు రైలు సౌకర్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం పారిశ్రామిక ప్రగతి మందగించిన కొత్తగూడెం ప్రాంతంలో ఈ రైల్వేలైన్ నిర్మాణంతో ఆర్థికంగా ఊరట కలుగుతుం ది. కొవ్వూరు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని 1969 నుంచి ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2012లో ఈ లైన్ను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రెండింతలైన సత్తుపల్లి లైన్ వ్యయం.. సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీ, కిష్టాపురం ఓసీపీల ద్వారా ఉత్పత్తి చేసే బొగ్గును ప్రతి ఏటా 2 మిలియన్ టన్నుల మేర సరఫరా చేసుకునేందుకు కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 60 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు సింగరేణి ముందుకొచ్చింది. ఫైనల్ సర్వే పూర్తి చేసేందుకు గాను ఏడాదిన్నర క్రితమే రూ.6 కోట్లు రైల్వే శాఖకు అందించగా,సర్వే పనులు కూడా పూర్తయ్యాయి. అయితే రెండేళ్ల క్రితం రూ.337.5 కోట్ల మేరకు అంచనా వేసినప్పటికీ నిర్మాణంలో జాప్యం జరగడంతో ఆ వ్యయం రెండింతలకు పైగానే పెరిగింది. ప్రస్తుతం ఈ లైన్ పూర్తి చేసేందుకు సుమారు రూ.800 కోట్లు అవరసమని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు అండగా నిలబడితే సత్తుపల్లి లైన్ త్వరితగతిన పూర్తయ్యే అవకాశాలున్నాయి. పెండింగ్లోనే ప్రాజెక్టులు.. ప్రధాన లైన్లతోపాటు అనేక లైన్లు కూడా జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉంటున్నాయి. భద్రాచలం పుణ్యక్షేత్రానికి రైలు మార్గం విస్తరించేందుకు పాండురంగాపురం నుంచి సారపాక వరకు ఏర్పాటు చేయతలపెట్టిన లైన్ కేవలం కాగితాలకే పరిమితమైంది. దీంతోపాటు సింగరేణి సంస్థ త్వరలో ఏర్పాటు చేయనున్న కోల్ కారిడార్లో బాగంగా మణుగూరు - రామగుండం లైన్, సత్తుపల్లి లైన్ పూర్తయితే దానిని అనుసందానం చేసుకుని కొండపల్లి నుంచి కొత్తగూడెం వరకు రైల్వే లైన్ను విస్తరించే అవకాశాలున్నాయి. మరి ఈ లైన్ల ఏర్పాటుకు ఈ సారైనా కేంద్రం కరుణిస్తుందా.. లేదా అని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
‘పెద్దపల్లి’ రైల్వేలైన్ పూర్తి చేయండి
రైల్వే మంత్రి సదానంద్గౌడకు ఎంపీ కవిత వినతి ఖలీల్వాడి : నిజామాబాద్ జిల్లాకు అధిక మేలు చేసే రైల్వేలైన్ను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వేమంత్రి సదానంద్గౌడను ఎంపీ కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఢిల్లీలో సోమవారం మంత్రికి వినతిపత్రం అందించారు. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ రైల్వేలైన్కు 1993 -94లోనే బడ్జెట్లో మంజూరైందని, కానీ ఇప్పటి వరకు పూర్తి కాలేదని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో మంజూరు చేయబడిన 177.46 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్లో కేవలం 28 కిలోమీటర్లు పెండింగ్ ఉండడం వల్ల జిల్లా ప్రజలకు సేవలందించకుండా నిరూపయోగంగా ఉందన్నారు. ప్రతిపాదిత కొత్త లైన్లలో మొదటి ప్రా దాన్యతగా ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ రై ల్వేలైన్లను చేపట్టాలని కోరారు. 2011లోనే సర్వే పనులు పూర్తిచేసి *700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినప్పటికీ రైల్వేబడ్జెట్లో కేటాయించకపోవడం బాధాకరమన్నా రు. తెలంగాణ జిల్లాలను మధ్య భారతదేశం తో అనుసంధానించే ఈ రైల్వేలైన్కు తగు కేటాయింపులు జరిపి పనులు ప్రారంభించాలని కో రారు. పెద్దపల్లి-ఆర్మూర్, నిజామాబాద్ రైల్వేలైన్, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ లైను పూర్తయితే ఆర్మూర్ రైల్వే జంక్షన్ కావడంతో పాటు ఇక్కడి పంటలకు దేశ వ్యాప్త మార్కెట్తో అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు. సికింద్రాబాద్-నిజామాబాద్-ముథ్కేడ్ రూట్లలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. గ త ప్రభుత్వాల ఆలసత్వం వల్ల ఒక్క చెప్పుకోదగ్గ పని కూడా జిల్లాలో పూర్తి కాలేదన్నారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. జిల్లాలో హెవీ వెహికిల్ నిర్మాణ యూనిట్ ఏర్పాటు చేయండి జిల్లాలో హెవీ వెహికిల్ నిర్మాణ యూనిట్ను ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి అరుణ్జైట్లీని ఎంపీ కోరారు. దీంతో నిజామాబాద్, ఆ దిలాబాద్, కరీంనగర్ జిల్లాతో పాటు జిల్లాకు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న యువకులు ఉపాధి అవకాశాలు మెరుగుపడాతాయన్నారు. మెదక్జిల్లా ఎద్దుమైలారంలోని ఓడిఎఫ్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ఆపాలని మంత్రిని కోరారు. త్వరలోనే అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
సికింద్రాబాద్ టు కరీంనగర్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి కరీంనగర్కు సిద్దిపేట మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దాదాపు పదేళ్ల క్రితం ఈ లైన్ కోసం కేంద్రమంత్రి హోదాలో కె.చంద్రశేఖర్రావు రైల్వే శాఖను కోరారు. ఆయన ఒత్తిడితో అప్పట్లో అధికారులు కూడా దానిపై దృష్టి సారించారు. కానీ ఆ తర్వాత ఈ ప్రతిపాదన అటకెక్కింది. మళ్లీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ దీనిపై దృష్టి సారిస్తున్నారు. వచ్చే రైల్వే బడ్జెట్లో రాష్ట్రప్రభుత్వం తరఫున అందజేసే ప్రతిపాదనల్లో దీన్ని మొదటి అంశంగా పేర్కొనబోతున్నారు. తెలంగాణలో రాజధాని నగరంతో రైల్వే అనుసంధానం లేని కీలక పట్టణం కరీంనగరే. హైదరాబాద్ నుంచి కరీంనగర్కు సిద్దిపేట మీదుగా ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రైల్వే లైన్ లేకపోవటంతో అంతా రోడ్డు మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్-కరీంనగర్ మధ్య నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్యే దాదాపు 20 వేల వరకు ఉంది. ఇతర వాహనాల్లో వెళ్లేవారి సంఖ్య దాదాపు ఇంతే ఉంటుందని సమాచారం. ఆర్టీసీ నిత్యం 200 ట్రిప్పులేయాల్సి వస్తోంది. దీంతో ఈ రెండు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న రాజీవ్ హైవే కిక్కిరిసిపోయి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. రైల్వే లైన్పై ఎప్పటికప్పుడు డిమాండ్ వస్తున్నా రైల్వే శాఖ మాత్రం పట్టించుకోవటం లేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా ఉండగా 2011-12 బడ్జెట్లో ఈ లైన్ ప్రస్తావన తెచ్చారు. సర్వే చేసే కొత్త లైన్ల జాబితాలో దీన్ని చేర్చారు. కానీ నిధులు మాత్రం కేటాయించకపోవటంతో ప్రస్తుతం అది పెండింగ్ పనుల జాబితాలో కూడా లేదు. మనోహరాబాద్ స్టేషన్తో అనుసంధానం... ఈ రైలుమార్గాన్ని పెద్దపల్లి-మనోహరాబాద్గా పేర్కొంటూ త్వరలో రాష్ట్రప్రభుత్వం రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ శివారు ప్రాంతం రక్షణశాఖ (కంటోన్మెంట్) పరిధిలో ఉండటంతో అక్కడ రైల్వే లైన్ నిర్మాణం దాదాపు అసాధ్యం. ఇదే కారణంతో గతంలో రైల్వే శాఖ దీన్ని పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఘట్కేసర్ గాని భువనగిరితోగాని అనుసంధానం చేయాలనే ఆలోచనలూ వచ్చాయి. అయితే సిద్దిపేట మీదుగా నిర్మితం అవుతూ నేరుగా సికింద్రాబాద్కు చేరేలా ఉండాలంటే నగర శివారు వరకు కొత్త లైన్ నిర్మించి అక్కడి నుంచి మేడ్చల్ మీదుగా మనోహరాబాద్ స్టేషన్ వద్ద ప్రస్తుతం ఉన్న లైన్తో అనుసంధానించాలని ప్రతిపాదనలో పేర్కొననున్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో త్వరలోనే రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అప్పటికల్లా ప్రతిపాదనలు పూర్తి చేసి ఈ బడ్జెట్లోనే సర్వేకు నిధులు ప్రకటించేలా ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. త్వరలో కేసీఆర్తో భేటీ : ఎంపీ వినోద్కుమార్ ‘‘పెద్దపల్లి-మనోహరాబాద్-సికింద్రాబాద్ రైల్వే లైన్ నిర్మాణం అవశ్యం. ప్రజల దశాబ్దాల కల త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్నాం. దీనిపై ఈ వారంపది రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయి ప్రతిపాదనలు సిద్ధం చేసి, రాష్ట్రప్రభుత్వం తరఫున అధికారికంగా పంపుతాం. దాని ఆధారంగా మేం ఢిల్లీలో రైల్వేశాఖపై ఒత్తిడి చేస్తాం’’ -
రూ. 93,000 కోట్ల ఆస్ట్రేలియా ప్రాజెక్ట్ అదానీ చేతికి...
బొగ్గు గని అభివృద్ధి, రైల్వే లైన్ ఏర్పాటు మెల్బోర్న్: భారత్లో విద్యుత్ నుంచి పోర్ట్ల వరకూ బిజినెస్లు కలిగిన అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో 15.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 93,000 కోట్లు) విలువైన ప్రాజెక్ట్ను దక్కించుకుంది. క్వీన్స్లాండ్లోని కార్మిచేల్ బొగ్గు గని నిర్వహణతోపాటు, గలీలీ బేసిన్లో రైల్వే లైను నిర్మాణానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ను పొందింది. ఇది ప్రపంచంలోని ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. కార్మిచేల్ మైనింగ్ ద్వారా విద్యుత్ తయారీకి వినియోగించే బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి 60 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనికి అనుబంధంగా 189 కిలోమీటర్లమేర రైల్వే లైనును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. -
నేడే ఓట్ల పండుగ
బీడీ కార్మికులు... నేత కార్మికులు... గల్ఫ్ బాధితుల కన్నీటి వెతలు... సింగరేణి కార్మికుల సమస్యలు... మెట్ట ప్రాంత రైతుల కష్టాలు... కడగండ్లు... ఈ ఎన్నికల్లో ఎంతమేరకు ప్రభావితం చేస్తాయి..? పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ఎవరికి నష్టం చేస్తాయి..? ప్రారంభోత్సవానికి నోచుకోని ఎల్లంపల్లి భారీ నీటి పారుదల ప్రాజెక్టు.. పనులు మొదలు పెట్టని ప్రాణహిత-చేవెళ్ల, మధ్యలోనే ఆగిన మధ్య మానేరు, అర్ధంతరంగా ఆగిన వరద కాలువ, సుదూరంగా ఆగిన తోటపల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు... నిర్వాసితుల సమస్యలు.. ఏ పార్టీకి పట్టం కడుతాయి..? ముందుకు సాగని ఇందూరు రైల్వే లైన్, తెరుచుకోని ఎఫ్సీఐ ఎరువుల కర్మాగారం... శిలాఫలకంతోనే ఆగిన నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టు... కరీంనగర్లో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ, ఐటీ పార్కు, కొత్త విద్యుత్తు ప్రాజెక్టులు... జిల్లా ప్రజల ఆశలు.. ఆకాంక్షలు.. ఎవరికి ఓటుబ్యాంకుగా మారుతాయి..? విస్తరణకు నోచుకోని రహదారులు.. కంకర తేలిన మారుమూల రోడ్లు... ఇప్పటికీ గొంతెండుతున్న పల్లెలు... వైద్య సేవలకు నోచుకోని తండాలు... వీటన్నింటిపై రోజుకో చోట అభ్యర్థులను నిగ్గదీసి నిలదీసిన ప్రజలు ఈసారి ఎవరిని అందలమెక్కిస్తారు..? తెలంగా టణ రాష్ట్ర వికాసం.. జన సంక్షేమమే ఎజెండాగా ఊదరగొట్టిన పార్టీల్లో ఏదీ బెటర్..? మీ ఎమ్మెల్యే.. ఎంపీ అభ్యర్థులు ఎలా ఉండాలి...? కొత్త రాష్ట్రం పగ్గాలు ఎవరి చేతిలో పెడుతారు..? ఓటర్లరా... మీరే నిర్ణయించుకోండి. నేడు పోలింగ్. నిరాసక్తత వీడండి. పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లండి... ఓటు మీ చేతిలో వజ్రాయుధం. అదే మీ పాశుపతాస్త్రం. ఆలోచించి ఓటెయ్యండి. ఓటరు రారాజు రోజు వచ్చింది. ఐదేళ్ల తమ భవిష్యత్ను నిర్దేశించుకునే సమ యం ఆసన్నమైంది. నెల రోజుల పాటు ప్రచారాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రలోభాలతో హోరెత్తించిన అభ్యర్థుల తలరాతను నేడు ఓటర్లు రాయనున్నారు. ప్రచారం సాగినన్నాళ్లూ అందరికీ అభయమిచ్చిన ఓట రు దేవుళ్లు తమ నిర్ణయాన్ని నేడు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్సభ స్థానాలకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మంథని రెవెన్యూ డివిజన్లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 168 మంది.. లోక్సభ స్ధానాల్లో 34 మంది బరిలో ఉన్నారు. ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడంతో మహదేవ్పూర్ మండల పరిధిలోని పది గ్రామాల్లో ‘హామ్’ రేడియో వ్యవస్థ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేసినా.. ఓటు ఎవరికి వేశారోనని ఆరా తీసినా కేసు నమోదు చే స్తామని అధికారులు హెచ్చరించారు. పోలింగ్ శాతం పెంపునకు చర్యలు సాధారణ ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ నమోదయ్యేలా జిల్లా యంత్రాంగం ఓటుహక్కుపై విసృ్తత ప్రచారం కల్పిస్తోంది. 2009, ఏప్రిల్ 16న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 60 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కాగా గత నెల 30న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 85 శాతం, ఈ నెల 6, 11 తేదీల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 83 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే స్ఫూర్తితో జమిలీ ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ జరిగేలా ప్రణాళికలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా జరిగింది. దీంతో అధికారులు నేడు 90శాతం పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 28,25,945 మంది ఓటర్లు బుధవారం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 3,419 పోలింగ్ కేంద్రాల్లో 34,569 మంది సిబ్బందిని, 4 వేల మంది చొప్పున పీవోలు, ఏపీవోలు, 15,048 మంది ఇతర పోలింగ్ అధికారులతోపాటు ఇతర సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణకు 428 మంది రూట్ మొబైల్స్ను, 26 బృందాలు స్ట్రైకింగ్, 13 ప్రత్యేక బలగాలను, 30 రోడ్డు ఓపెనింగ్ పార్టీలు, 43 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 62 మోడల్ కోడ్ కండక్ట్ (ఎంసీసీ) బృందాలను నియమించినట్లు వివరించారు. ఓటరుపైనే భారం నోటిఫికేషన్ విడుదలైనప్పటినుంచి అభ్యర్థులంతా ఓటరు బాట పట్టారు. నామినేషన్ వేసిన నుంచి పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తించారు. పదిహేను రోజులపాటు అన్ని పార్టీల అధినేతలు, నాయకులు, అభ్యర్థులు విసృ్తత ప్రచారం నిర్వహించారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అన్ని ఎత్తులు వేశారు. ప్రచారం ముగింపుదశకొచ్చే సరికి మద్యం ఏరులై పారించారు. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారు. కొందరైతే ఆర్థికస్థోమత సహకరించకున్నా గెలుపుపై ఆశతో అప్పులు చేసి మరీ ప్రత్యర్థులకు దీటుగా ప్రచారం నిర్వహించారు. అందరికీ అభయం ఇచ్చిన ఓటరు దేవుడు తన ఆశీస్సులు ఎవరికందిస్తాడోననే ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది. నోటా మీట.. మునుపెన్నడూ లేని విధంగా.. కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా ఈ ఎన్నికల్లో నోటా (తిరస్కరణ) ఓటు ప్రవేశపెట్టింది. బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చక లక్షలాది మంది ఓటుకు దూరంగా ఉంటున్నారు. దీంతో తిరస్కరణ ఓటునూ ఎన్నికల సంఘం అమలు చేసింది. ఈవీఎంలో చివరి వరుస నంబర్ను నోటా కింద అమర్చారు. ఈ బటన్ నొక్కితే సదరు ఓటరు బరిలో ఉన్న అభ్యర్థులందరినీ తిరస్కరిస్తున్నట్లు అందులో ఫీడ్ అవుతుంది. అభ్యర్ధులు నచ్చకపోయినా ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ‘నోటా’ బటన్ నొక్కాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కుతోపాటు బాధ్యతగా భావించి అందరూ ఓటేయాలని కోరారు. ఏర్పాట్లు పూర్తి కరీంనగర్ : సాధారణ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం.వీరబ్రహ్మయ్య చెప్పారు. నగరంలోని శ్రీరాజరాజేశ్వర డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, నీడ, ర్యాంప్లు తదితర మౌలిక అవసరాలు కల్పించినట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ 90 శాతం దాటేలా చర్యలు తీసుకున్నామని, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. మంథనిలో 5 వరకు.. కలెక్టరేట్: మంథని నియోజకవర్గం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉండగా... మంథని నియోజకవర్గానికి మాత్రం ఒక గంట పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. -
ఎన్ని‘కల ’లో?
సిద్దిపేట జోన్, న్యూస్లైన్: ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి.. పార్లమెంట్ సభ్యులు మారుతున్నారు. కానీ సిద్దిపేట ప్రాంతవాసుల చిరకాల స్వప్నం రైల్వేలైన్ మాత్రం ఎన్ని‘కల’గానే మిగులుతుంది. 1967లో ఏర్పడిన సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గానికి ఎందరో మహమహులు ఎంపీలుగా పనిచేసినప్పుటికీ రైల్వేలైన్ సాధించడంలో పాలకులు వైఫల్యం చెందారనే చెప్పవచ్చు. సిద్దిపేటకు రైల్వేలైన్ మంజూరు చేయిస్తామని గుప్పెడు హామీలను కురిపించిన నేతలు ఆ దిశగా ఆశించిన స్థాయిలో కృషి చేయలేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఓటర్లను ఎన్ని‘కల’ల్లో ముంచేస్తున్న అభ్యర్థులు మరోమారు సార్వత్రిక పోరులో రైల్వేలైన్ హామీని తెరమీదకి తెవడం విశేషం. మూడు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికలల్లో రైల్వేలైన్ మీద హామీల వర్షం తప్పడంలేదు. పార్లమెంట్ పునర్విభజన నాటికి సిద్దిపేట నుంచి జి. వెంకటస్వామి, నంది ఎల్లయ్య, విజయరామారావు, మల్యాలరాజయ్య, సర్వే సత్యనారాయణలు ప్రాతిని ద్యం వహించారు. 2009లో పునర్విభజన జరిగినప్పటికీ సిద్దిపేటకు రైల్వేలైన్ మంజూరుకు శాయశక్తుల కృషి చేస్తానన్న సిట్టింగ్ ఎంపీ విజయశాంతి మెదక్లో కొంత మేరకు పనులను ముందుకు తీసుకెళ్లినా సిద్దిపేటపై మాత్రం శీతకన్ను చూపిందన్న విమర్శలున్నాయి. మరోవైపు 2004లో సిద్దిపేట ఉప ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గ ప్రశస్థని ఉటకిస్తూ రైల్వేలైన్ను సాధిస్తామని హామీ ఇచ్చారు. కాలక్రమేనా కేంద్ర మంత్రి వర్గంలో కేసీఆర్కు స్థానం లభించడంతో రెండు దశాబ్దాలుగా నోచుకొని రైల్వేలైన్కు మార్గం లభిస్తుందన్న అశ నియోజకవర్గ ఓటర్లలో బలంగా నెలకొంది. ఈ క్రమంలోనే 1999లో రైల్వే బడ్జెట్లో మనోహరబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కొత్తపల్లి వరకు 154 కిలోమీటర్ల పొడవున మార్గానికి ప్రతిపాదనలు రూపొందించారు. సరిగ్గా ఏడు సంవత్సరాల తర్వాత పలు మార్పుల అనంతరం 2006లో సర్వేకు రైల్వే బడ్జెట్లో అమోదం లభించింది. అందులో భాగంగానే 2006లో సర్వే పనులను కూడా ప్రారంభించారు. ముఖ్యంగా భూ పరీక్షలు,లెవలింగ్లాంటి పనులను పూర్తి చేసి సమగ్ర నివేదికను సంబంధిత కాంట్రాక్ట్ కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 4 సంవత్సరాల క్రితం తాత్కలిక సర్వేకోసం రూ. 40 కోట్లను ప్రకటించిన కేంద్రం ఆ తర్వాత సకాలంలో సర్వే పనులు నిర్వహించక పోవడంతో కేటాయించిన నిధులు వెనక్కి వెళ్లాయి. అప్పట్లోనే కేంద్రం నూతన రైల్వే మార్గ నిర్మాణ విషయంలో మూడు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టింది. రైల్వే నిర్మాణ బడ్జెట్లో మూడో వంతును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, రైల్వే లైన్ కోసం అవసరమయ్యే భూసేకరణకు రాష్ట్రమే బాధ్యత వహించాలని, నూతన రైల్వే మార్గంలో అయిదేళ్ల పాటు సంభవించే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని షరతులు విధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో రైల్వేలైన్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సమయంలో సార్వత్రిక ఎన్నికలు ముందుకు రావడం.. మరోసారి ఆయా పార్టీల అభ్యర్థులు రైల్వేలైన్పై ‘బాస’లు చేస్తుండడంతో సిద్దిపేటలో చర్చానీయంశంగా మారింది. -
కృష్ణ..కృష్ణా
సర్వేల మీద సర్వేలు...ఇదిగో...అదిగో అంటూ గత ముప్ఫైఏళ్లుగా కబుర్లు. వాస్తవం డొల్ల. రైల్వే బడ్జెట్ పెట్టే సమయంలోనూ, ఎన్నికల వేళ అది తాజా కబురు. ఓట్లను కురిపించే తురుపుముక్క. ఆచరణలో మాత్రం ఆమడ దూరం. ఇదీ మూడు దశాబ్దాలుగా కూతపెట్టని ‘కృష్ణ - వికారాబాద్’ లైన్ కథ. కాగితాల్లోనే నలుగుతున్న నిర్మాణం. అంచనాలు పెరుగుతున్నా.. ఆచరణ రూపం దాల్చని వైనం. ఇక్కడి నేతల తీరుకు మచ్చు తునక. కోస్గి, న్యూస్లైన్ : జిల్లాకు రైల్వే పరంగా ప్రతీ బడ్జెట్లోనూ నిరాశే మిగులతోంది. ఎంతమంది నేతలున్నా ఇక్కడి ప్రయాణికుల ఆశలు నెరవేర్చలేకపోతున్నారు. ఇందుకు ప్రబల సాక్ష్యం కృష్ణ-వికారాబాద్ రైల్వే లైన్ నిర్మాణం. దీన్ని కోసం 30 ఏళ్ల కిందట ప్రతిపాదించి ఇప్పటికే అయిదు సార్లు సర్వేలు చేశారు. అంతటితోనే ఇది సమసిపోతోంది. నారాయణపేట డివిజన్ గుండా మక్తల్, ఊట్కూర్, నారాయణపేట, అభాంగాపూర్, మద్దూరు, కోస్గి, సర్జఖాన్పేట, దోమ, పరిగి, వికారాబాద్ వరకు 121.70 కిలోమీటర్ల రైల్వే లైన్ కోసం ప్రతిపాదిస్తూ 2010 సంవత్సరంలో రూ.680కోట్లు అవసరమని హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ ఏరియల్ డాటా సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అప్పటి రైల్వే శాఖామంత్రి మమతాబెనర్జీ రైల్వే బడ్జెట్లో కృష్ణ-వికారాబాద్ రైల్వేలైన్ కోసం పార్లమెంట్లో ప్రస్తావించినప్పటికీ నిధుల కేటాయింపు జరగలేదు. ఎన్నికల హామీగానే... అప్పటి ప్రధాని ఇందిర హయాంలో రైల్వే శాఖ సహాయమంత్రిగా పని చేసిన పాలమూరు పార్లమెంట్ సభ్యుడు మల్లికార్జున్ తొలి సారి సర్వే జరిపించారు. 217 కిలోమీటర్ల సర్వే జరిపి అప్పట్లో రూ.87కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అంతలోనే 1989లో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలు కావడంతో పాలమూరు ఎంపీ స్థానానికి పోటీ పడిన జైపాల్రెడ్డి, మల్లికార్జున్లు ఈ రైల్వే లైన్ను ఎన్నికల హామీగా విసృ్తత ప్రచారం చేశారు. మల్లికార్జున్ ఎంపీగా గెలిచినప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో ప్రయత్నం ఫలించలేదు. అనంతరం పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మల్లికార్జున్ కేంద్ర రక్షణ శాఖమంత్రిగా మారడంతో రైల్వే లైన్ ఊసెత్తేవారు లేకుండాపోయారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండారుదత్తాత్రేయ సైతం ఇచ్చిన హామీ కూడా అలాగే మిగిలిపోయింది. 2010లో ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ.680కోట్లు అవసరమని అంచనా వేసినప్పటికీ కొత్త రైల్వే లైన్లను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్లతో మాత్రమే చేపట్టాలని కేంద్రం నిర్ణయించడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. తాజాగా 2012లో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని నిధుల కేటాయింపే మిగిలిందంటూ ఈ రైల్వేలైన్ వెళ్లే దారిలో సర్వే చేసి రాళ్లను పాతారు. మళ్లీ నిధులు కేటాయించకపోవడంతో నాటి నుంచి నేటి వరకు రైల్వే లైన్ సర్వేలకే పరిమితమైంది. ఈ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కేంద్రమంత్రి జైపాల్రెడ్డి ఈ సారైనా తన సత్తా చూపి ఈ లైన్కు ఆమోదం పొందుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.తాజా రైల్వే బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉంటుందని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఈసారైనా పట్టాలెక్కేనా?
మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ పోటీ చేసిన సమయంలో సంగారెడ్డి మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాటి నుంచి జిల్లా కేంద్రానికి రైల్వేలైన్ ఏర్పాటు నేతల హామీగానే మిగిలింది. రైల్వేలైన్తోపాటు సంగారెడ్డికి ఎంఎంటీఎస్ లైన్ పొడిగింపు హామీలు ఇంత వరకు నెరవేరలేదు. తాజాగా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో పొడిగింపు అంశం తెరపైకి వచ్చింది. మూడు దశాబ్దాలుగా.. జోగిపేట రైల్వే లైన్ కోసం ఈ ప్రాంత వాసులు మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. పటాన్చెరు, సంగారెడ్డి, జోగిపేట, మెదక్, అక్కన్నపేట మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా లాభం లేకుండా పోయింది. 2012లో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ రైల్వే శాఖ సహాయ మంత్రి మునియప్పను కలిసి జోగిపేట రైల్వే లైన్ ఏర్పాటుకు వినతిపత్రం సమర్పించారు. ఆరు నెలల్లో సర్వే చేయిస్తానని హమీ ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి పనులు జరగకపోవడంతో ఈ ప్రాంత వాసులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎంఎంటీఎస్ పనులతో కాస్త ఊరట.. పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన పటాన్చెరుకు రైలు సౌకర్యం కలగానే మిగిలింది. దివంగత నేత మల్లికార్జున్ కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో పటాన్చెరుకు రైల్వే లైను వేయించారు. రెండేళ్ల క్రితం రూ.33 కోట్లతో ఎంఎంటీఎస్ సౌకర్యానికి నిధులు మంజూరయ్యాయి. పనులు కూడా జరుగుతున్నాయి. రైల్వే లైన్కు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియా వరకే ఎంఎంటీఎస్ను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి మీదుగా పాత రైల్వే లైను ఉన్న కారణంగా ఆర్సీపురం వరకే ఎంఎంటీఎస్ను కుదించారు. పటాన్చెరు మీదుగా మెదక్కు రైల్వే లైను వేస్తామని గతంలో బడ్జెట్లో చూపారు. కాని నేటికి ఆ సర్వే పనులు జరగలేదు. మియాపూర్ వరకు ఉన్న మెట్రోను లింగంపల్లి వరకైనా పొడిగించాలని స్థానికుల నుంచి డిమాండ్ ఉంది. మెదక్ లైన్కు ప్రతిపాదిత నిధుల కోసం.. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ ఏర్పాటు కోసం ప్రతిపాదించిన రూ.129.32 కోట్ల నిధులపై మెదక్ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. గత మూడు బడ్జెట్లలో ఆశించిన మేర నిధులు మంజూరు కాలేదు. మూడేళ్లుగా పెండింగ్లోనే.. జహీరాబాద్ రైల్వేస్టేషన్లో గత మూడేళ్లుగా పలు పనులు పెండింగ్లో ఉండిపోయాయి. ముఖ్యంగా రెండో ఫ్లాట్ ఫారం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి తదితర పనుల జాప్యంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే స్టేషన్లో రైళ్ల క్రాసింగ్ సమయంలో రెండో ఫ్లాట్ ఫారం లేకపోవడంతో రైల్లోకి ఎక్కి, దిగే సమయంలో అవస్థలు పడుతున్నారు. బోధన్-బీదర్ మార్గం కోసం.. బోధన్-బీదర్ రైల్వే లైన్ కోసం నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎంపీ షెట్కార్ చొరవతో బోధన్-బీదర్ మార్గంలో కొత్తగా రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి కల్హేర్ మండలం మహదేవుపల్లి మీదుగా లైన్ కోసం రెండేళ్ల క్రితమే సర్వే చేశారు. ఈ లైన్ ఏర్పాటైతే బాన్స్వాడ, జుక్కల్, నారాయణఖేడ్ నియోజక వర్గాల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. సర్వే పూర్తయి నాలుగేళ్లయినా.. సిద్దిపేట నూతన రైల్వేమార్గం కోసం నాలుగేళ్ల క్రితం తాత్కాలిక సర్వే కోసం రూ.40 కోట్లను ప్రకటించిన కేంద్రం ఆ తర్వాత సిద్దిపేట ఊసెత్తక పోవడం గమనార్హం. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో సిద్దిపేట రైల్వేమార్గంపై నీలినీడలు కమ్ముకున్నాయి. భూసేకరణ, రాష్ట్ర వాటాలను చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా రైల్వేలైన్ నిర్మాణం నుంచి ఐదేళ్ల వరకు ఆ మార్గంలో ఎదురయ్యే ఆర్థిక నష్టాలను భరించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో సిద్దిపేట లైన్కు మోక్షం కలగడం లేదు. -
నత్త నడకే
మోర్తాడ్, న్యూస్లైన్: నిజామాబాద్, పెద్దపల్లి రైల్వే లైన్ నిర్మాణ పను లు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన పనులు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గత మార్చిలోగానే మోర్తాడ్ నుంచి జగిత్యాల వరకు ప్యాసింజర్ రైలును నడపాల్సి ఉంది. ఏడా ది సమీపిస్తున్నా దానికి అతీగతీ లేకుండా పోయింది. భూసేకరణలో అంతరాయం, కాంట్రాక్టర్ల అలసత్వం తో నిజామాబాద్ నుంచి మోర్తాడ్ వరకు పనులు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ‘ప్యాసింజర్’ వస్తుందన్నారు మోర్తాడ్ నుంచి జగిత్యాల మీదుగా పెద్దపల్లి, చెన్నూర్ వరకు ప్యాసింజర్ రైలు నడుపుతామని రైల్వే శాఖ ఉ న్నతాధికారులు గతంలో ప్రకటించారు. తొలుత జగి త్యాల, మోర్తాడ్ మధ్య రైలును నడుపుతామని, ఇది సక్సెస్ అయితే వారం రోజులలో చెన్నూర్ వరకు పొడి గిస్తామని అప్పుడు అధికారులు పేర్కొన్నారు. ఇది అమలులోకి రావాలంటే ముందుగా మోర్తాడ్ వరకు రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలి. కానీ, కరీంనగర్ జిల్లా మెట్పల్లి వరకే పనులు జరిగాయి. మెట్పల్లి, మోర్తాడ్ మధ్య పనులలో తీవ్ర జాప్యం జరిగింది. మోర్తాడ్ వద్ద జరుగుతున్న ‘చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనుల ఆలస్యం కూడా దీనిపై ప్రభావం చూపింది. ఈ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. రైల్వే లైన్ వెంట వర్షపు నీరు వెళ్లిపోవడానికి కాలువలు నిర్మించాల్సి ఉంది. మోర్తాడ్కు వెళ్లే దారిలో వంతెన నిర్మాణం పూర్తికాగా, ఇక్క డ పట్టాలు వేసి కంకర పోయాల్సి ఉంది. రైల్వే స్టేషన్ పరిసరాలలో కూడా లైన్ పనులు పూర్తి కావాలి. అంతులేని నిర్లక్ష్యం పనులను సజావుగా సాగించడంలో మొదటి నుంచి కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చూపుతున్నారు. ప్రభుత్వం నిధులు సకాలంలో విడుదల చేసినా పనులు మాత్రం చురుకుగా ముందుకు సాగడం లేదు. ఆలస్యానికి నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వం జరిమానా వసూలు చేస్తున్నా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మోర్తాడ్ రైల్వే స్టేషన్ నుంచి నిజామాబాద్ రూటులో పెద్దవాగు వద్ద వంతెన నిర్మించాల్సి ఉంది. ఈ పనులు గత ఏడాది మొదలైనా ఇప్పటివరకు 50 శాతం కూడా పూర్తి కాలేదు. వంతెనపై ఏర్పాటు చేయాల్సిన ప్లేట్లు సిద్ధమైనా, పిల్లర్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో అవి వృథాగా ఉండిపోయాయి. ప్రజాప్రతినిధులేరీ? రైల్వే పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ప్రజాప్రతినిధులు ముఖం చాటేయడం, అధికారులు కాంట్రాక్టర్ల చెప్పు చేతలలో ఉండటంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో ఈ రైల్వే లైన్ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. -
బహిరంగ చర్చకు సిద్ధమా?
గద్వాలన్యూటౌన్, న్యూస్లైన్: గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధి రికార్డు స్థాయిలో జరిగిందని అధికార పార్టీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఫ్లెక్సీలు, బోర్డులతో ప్రజలను మభ్యపెడుతున్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని మాజీ మంత్రి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డీకే సమరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. గద్వాల మండలంలో ప్రారంభమైన పాదయాత్ర ఆదివారం గద్వాల మండల పరిధిలోని గోనుపాడు గ్రామానికి చేరుకుంది. శెట్టి ఆత్మకూర్, మదనపల్లి, ఈడ్గోనిపల్లి, గుంటిపల్లి, రేకులపల్లి గ్రామాలలో సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో సమరసింహారెడ్డి మాట్లాడారు. గత 20 ఏళ్ల క్రితం జరిగిన అభివృద్ధి తప్ప ఆ తర్వాత జరిగింది శూన్యమన్నారు. జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, రాయచూరు రైల్వే లైన్ల అభివృద్ధికి తన హయాంలోనే కృషి జరిగిందన్నారు. ప్రస్తుతం అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతుందన్నారు. తాను ఓట్ల కోసం పాదయాత్ర చేపట్టలేదని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడంతో పాటు అధికార పార్టీ నాయకుల అవినీతిని వివరించడానికే పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. . ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లత్తీపురం వెంకట్రామిరెడ్డి, గంజిపేట రాములు, పూజారి శ్రీధర్, మస్తాన్, చెన్నయ్య, నాగశంకర్, కలీం, కార్యకర్తలు పాల్గొన్నారు.