ప్రాణం తీసిన పల్లిగింజ | 18 Months Boy Dies After Peanut Gets Stuck In Throat In Warangal, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన పల్లిగింజ

Published Mon, Mar 10 2025 10:50 AM | Last Updated on Mon, Mar 10 2025 11:08 AM

Boy Dies After Peanut Gets Stuck in Throat

గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: పల్లిగింజ తిన్న చిన్నారికి అదే యమపాశమైంది.. గొంతులో గింజ ఇరుక్కుని శ్వాస ఆడక  బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన  మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో చోటుచేసుకుంది.  గ్రామానికి చెందిన గుండెల వీరన్న–కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లు,  కుమారుడు అక్షయ్‌  (18 నెలలు) ఉన్నాడు.

 గురువారం ఇంటి ఎదుట పల్లీలు ఆరబెట్టగా ఆడుకుంటున్న అక్షయ్‌  గింజ తిన్నాడు. దీంతో  గింజ గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే  వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. చిన్నారి మృతదేహంమీద పడి తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయ బిడ్డా అంటూ బోరున విలపించారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement