![Deepti Reddy Will Be The CEO Of We Hub For Another Two Years - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/6/Deepthi-Ravula.jpg.webp?itok=4wI678o5)
సాక్షి, హైదరాబాద్ : ‘వీ హబ్’ సీఈవోగా దీప్తిరెడ్డి రావుల సర్వీసును మరో రెండేళ్లు పొడిగిస్తూ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 జనవరి ఒకటిన వీ హబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన దీప్తి ఈ ఏడాది మార్చి 31వరకు సేవలు అందించారు. మరో మూడేళ్ల పాటు ఒప్పంద కాలాన్ని పొడిగించాల్సిందిగా దీప్తి ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో దీప్తి రెడ్డిని రూ.2 లక్షల నెలసరి వేతనంపై మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (తెలంగాణకే నా సర్వీస్!)
Comments
Please login to add a commentAdd a comment