Jayesh Ranjan
-
‘AI’ అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి.. జయేశ్ రంజన్ పిలుపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ రంగంలో భారత్ వేగంగా పురోగమిస్తోందని తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం వై2కే సమస్య తలెత్తినప్పుడు దాని పరిష్కారానికి దేశీ ఐటీ సంస్థలు, నిపుణులు తోడ్పాటు అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం మళ్లీ వై2కే తరహాలో..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ విభాగాల్లో వస్తున్న అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ డిజిటల్ పరివర్తనపైన నిర్వహించిన ఐటీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా జయేశ్ రంజన్ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, 2022–23లో తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు 31 శాతం వృద్ధి చెందాయని, ఉద్యోగాల కల్పన 16.2 శాతం పెరిగిందని, ఇన్నోవేషన్ ఇండెక్స్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని సీఐఐ తెలంగాణ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్లో జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంద్రం, వివిధ పరిశ్రమలు రూ.70 కోట్ల వ్యయంతో దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ఈ అత్యాధునిక నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ (3డీ ప్రింటింగ్ సెంటర్)ను ఏర్పాటు చేసిన్నట్లు వారు పేర్కొన్నారు. ఓయూ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రంలో ఏరోస్పేస్, డ్రోన్లు, మానవ కృత్రిమ అవయవాలు, ఆటోమొబైల్ పరికరాలు, అన్ని రకాల పరిశ్రమలకు ఉపయోగపడే వస్తువులను తయారుచేస్తారని కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ చెప్పారు. 3డీ ప్రిటింగ్ రూపకర్త ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ 2002 నుంచి 3డీ ప్రింటింగ్ సబ్జెక్టును ఇంజనీరింగ్ విద్యార్థులకు బోధిస్తున్నారు. ఈ సబ్జెక్టుపై అనేక పరిశోధనలు చేసిన ఆయన 2007లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ నుంచి రూ.కోటి ప్రాజెక్టును పొందారు. దీంతో ప్రత్యేకంగా పరికరాలను, యంత్రాలను కొనుగులు చేసి 3డీ సెంటర్ను అభివృద్ధి చేశారు. ఆ విధంగా ఓయూలో అంకురించిన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ నేడు జాతీయస్థాయి ప్రింటింగ్ కేంద్రం స్థాపనకు దోహదపడిందని అధికారులు చెప్పారు. -
జీనోమ్ వ్యాలీలో జుబ్లియెంట్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: స్థానికంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ప్రయోజనం చేకూరేలా హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక వసతుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయంగా పేరొందిన జుబ్లియెంట్ భార్తియా గ్రూప్ ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో జుబ్లియెంట్ భార్తియా వ్యవస్థాపకుడు, కో–చైర్మన్ హరి ఎస్. భార్తియా శనివారం భేటీ అయ్యారు. ఫార్మా, పరిశోధన, విలక్షణ ఔషధాలు, లైఫ్సైన్సెస్, వ్యవసాయ ఉత్పత్తులు సహా అనేక రంగాల్లో ఉన్న తమ గ్రూప్ ఆసియాలో హైదరాబాద్ను అత్యాధునిక వసతుల కేంద్రం ఏర్పాటుకు ఎంపిక చేసుకుందన్నారు. ఇప్పటికే లైఫ్సైన్సెస్ పరిశోధన రాజధానిగా ఉన్న హైదరాబాద్కు జుబ్లియెంట్ రాకతో క్లినికల్ రీసెర్చ్ సంస్థలకు మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో సనోఫీ ‘గ్లోబల్ మెడికల్ హబ్’ అంతర్జాతీయంగా ఆరోగ్య సంరక్షణలో పేరొందిన ‘సనోఫీ’తెలంగాణలో గ్లోబల్ మెడికల్ హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్తో భేటీ సందర్భంగా సనోఫీ గ్రూప్ ఆఫ్ సైట్స్ హెడ్ మాథ్యూ చెరియన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా తాము గ్లోబల్ మెడికల్ హబ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, సనోఫీ మధ్య కుదిరిన భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి పెట్టుబడులు, భాగస్వామ్యాలు పెరుగుతాయని మాథ్యూ చెరియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘2025– ఆ తర్వాత’అనే విజన్లో భాగంగా ఏర్పాటయ్యే గ్లోబల్ మెడికల్ హబ్లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. -
నచ్చిన రంగాల్లో యువత రాణించాలి
వెంగళరావునగర్ (హైదరాబాద్): స్వయంశక్తితో వ్యాపార రంగంలో ఎదగాలనుకునే యువతకు ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ సహకారాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీష్రెడ్డి తెలిపారు. యువత నేటి కాలానికి అనుగుణంగా అన్నిరకాల నైపుణ్యాలను కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతను అందిపుచ్చుకుని యువతీ యువకులు తమలో ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలని, తమకు నచ్చిన రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. యూసుఫ్గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (నిమ్స్మే) శిక్షణ సంస్థలో స్వయంశక్తితో ఎదగాలనుకునే యువతకు శిక్షణలో భాగంగా గురువారం జాతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సతీష్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకున్నట్టైతే.. ప్రభుత్వం బ్యాంకుల తరఫున రుణాలను మంజూరు చేస్తుందని, తద్వారా చిన్న, మధ్యతరహా, భారీ వ్యాపారాలను చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకుని యువత వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బ్యాంకర్లు కూడా యువతలోని నైపుణ్యాన్ని గ్రహించి వారిని నిరుత్సాహ పరచకుండా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆర్థిక చేయూతను అందించి ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ వివేక్, నిమ్స్మే డైరెక్టర్ జనరల్ గ్లోరీ స్వరూప తదితరులు పాల్గొన్నారు. కాగా నిమ్స్మేలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ను సతీష్రెడ్డి ప్రారంభించారు. -
ముగ్గురు ఫ్రెండ్స్తో ఎన్నో కొంటె పనులు చేశా: నాగార్జున
సాక్షి, హైదరాబాద్: 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్తో నాకు చాలా అనుబంధం ఉంది. ఈ స్కూల్ లోకి రాగానే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి' అన్నారు కింగ్ నాగార్జున. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో బుధవారంన ఆడు నాగార్జునతో పాటు తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. 1976లో నేను ఇందులో చదువుకున్నా. ఇష్టమైన సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు. ఆ రోజుల్లో నాతో పాటు చదివిన ముగ్గురు స్నేహితులతో కలిసి ఎన్నో కొంటె పనులు చేశాం. నాతో పాటు చదివిన వారందరు లాయర్లుగా, జడ్జిలుగా , బిజినెస్మెన్స్గా గొప్ప స్థాయిలో ఉన్నారు. స్కూల్లో నాగార్జున పేరుతో ఒక బిల్డింగ్ ఉండడంతో అందరు నా పేరు విషయంలో కన్ఫ్యూజ్ అయ్యేవారు. నా పేరు చెప్పినప్పుడల్లా నాగార్జున నీ పేరా? బిల్డింగ్ పేరా? అని అడిగే వారు. మా ఇల్లు పక్కనే ఉండేది. కొన్ని సార్లు నడుచుకుంటూ, మరికొన్ని సార్లు సైకిల్ మీద వచ్చేవాన్ని. స్కూల్లోకి ఎంటర్ అవగానే ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి అన్నారు. కాగా 1923లో బేగంపేట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది. 2023తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది మొత్తం వంద సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తోంది. నగర్ కమీషనర్ సీవీ ఆనంద్, హీరో నాగార్జున, అడోబ్ సీఈఓ శాంతను నరేన్ పలువురు ప్రముఖులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదివారు. -
నూతన సాంకేతికతతో ఉద్యోగాలేమీ పోవు
సాక్షి, హైదరాబాద్: నూతన సాంకేతికత వినియోగంతో ఉద్యోగాలు తగ్గిపోతాయన్న ఆందోళన అవసరం లేదని నూతన ఉద్యోగాల సృష్టి సాధ్యపడుతుందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్ అన్నారు. సోమవారం తెలంగాణా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో చాట్జీపీటీ, జీపీటీ టూల్స్ అన్న అంశంపై నిర్వహించిన వెబినార్లో ఆయన మాట్లాడారు. జూమ్లో వర్చ్యు వల్ ఆడియన్స్ని ఉద్దేశించి ప్రసంగించారు. చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో విజ్ఞానాన్ని మెరుగుపరచడంలో సరికొత్తదని తెలిపారు. సరదా ప్రయోజనాల కోసం, సరదాగా ప్రశ్నించడం కోసం ఇది ఉపయోగ పడుతుందన్నారు. ఇటీవల తాను అత్యంత ప్రాచుర్యం పొందిన ఐదు తెలుగు సామెతలు అడగ్గా... ఇది తెలుగు, ఇంగ్లీషు రెండింటిలో మాత్రమే కాకుండా వాటి అర్థాలను కూడా ఇచ్చిందని తెలిపారు. విస్తారమైన డేటా నుంచి చాలా వేగంగా శోధించగల సమాచారాన్ని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ‘జయే‹శ్ రంజన్ ఎవరు? అని అడిగితే హెల్త్ సెక్రటరీ అని సమాధానం ఇచ్చింది, కానీ తాను ఎప్పుడూ ఆరోగ్య కార్యదర్శిగా పనిచేయలేదన్నారు.. చాట్ జీపీటీ మరియు జీపీటీ సాధనాలు మానవ జాతికి ఎలా సహాయపడతాయో జయేష్ రంజన్ తెలిపారు. ఈ వెబినార్లో చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్, గ్లోబల్ హెడ్ టెక్నాలజీ అడ్వైజరీ సర్వీసెస్ బాల ప్రసాద్, ఎఫ్టీసీసీఐ ఐసీటీ కమిటీ చైర్మన్ కె. మోహన్ రాయుడు తదితరులు మాట్లాడారు. -
పీపుల్స్ ప్లాజా వేదికగా ‘రాల్–ఇ’
ఖైరతాబాద్ (హైదరాబాద్): దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రికల్ ర్యాలీ ‘రాల్–ఇ’ నగరంలోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఘనంగా ప్రారంభమైంది. వారం పాటు జరిగే ఈ ర్యాలీ ఆదివారం 400 వందలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)లతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. అనంతరం జయేశ్ రంజన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహ నాల వైపు మొగ్గుచూపాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలుదారులకు రాయితీలను ఇస్తుందన్నారు. ఈవీల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు మొదటిసారిగా ఇ–మొబిలిటీ వీక్ను నిర్వహిస్తున్నారన్నారు. ఇందులోభాగంగా పీపుల్స్ ప్లాజా, మియాపూర్, శంషాబాద్, ముంబై హైవే నుంచి అందరూ ఎలక్ట్రిక్ వాహనాలతో రాల్–ఇ ర్యాలీతో హైటెక్స్ వరకు చేరుకుంటారన్నారు. సౌకర్యవంతంగా ఉండటంతోపాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే ఈ ఎలక్ట్రిక్ వాహనాలను కొను గోలు చేయాలని సూచించారు. నగరంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కూడా జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు అడివి శేషు మాట్లాడుతూ.. యువత ఈవీల వైపు దృష్టి సారించాలని చెప్పారు. ఈ సందర్భంగా గ్రావ్టన్ మోటార్స్కు చెందిన షెరాజ్, రాహుల్లు ఎలక్ట్రిక్ వాహనాలతో చేసిన స్టంట్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ర్యాలీలో దర్శకుడు నాగ్ అశ్విన్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
హక్కుల రక్షణకు రచయిత కాపలాదారు కావాలి
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక హక్కుల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణకు రచయితలు, కవులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కాపలాదారుగా వ్యవహరించాలని ప్రముఖ కొంకణి రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో అన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం సాహిత్య సృజన చేసే కవులు, రచయితలను హతమార్చడం పిరికిపందల చర్య అన్నారు. సత్యాన్ని ఎదుర్కోలేకనే కల్బుర్గి, దబోల్కర్, గౌరీలంకేష్ వంటి మేధావులను, రచయితలను హత్య చేశారని ఆరోపించారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ శుక్రవారం విద్యారణ్య స్కూల్లో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కవులు, రచయితలు ప్రజలను చైతన్యం చేశారన్నారు. తనకు రాజ్యాంగం పట్ల పూర్తి నమ్మకం ఉందన్నారు. జీవించే హక్కుతో సహా ప్రాథమిక హక్కులకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు. మనుషులు ఏం తినాలో, ఏం తినకూడదో కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ జేఎన్యూ క్యాంటీన్లో మాంసాహారం వండకూడదని ఒక విద్యార్థి సంఘం హెచ్చరించడం దారుణమన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక ధోరణులను నిరసించాలన్నారు. అలాగే హక్కులను కాపాడుకోవాలని చెప్పారు. రచయితగా తాను సైతం తీవ్రమైన హెచ్చరికలు, ఒత్తిళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. కొంకణి భాష కోసం సుదీర్ఘమైన ఉద్యమం... గోవా ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చిందన్నారు. మౌర్యుల కాలం నుంచి ఒక ఉనికిని కలిగి ఉన్న కొంకణి ప్రాంతం పోర్చుగీసు వారి రాకతో విచ్ఛిన్నమైందన్నారు. మతమార్పిడులు, సాహిత్య, సాంస్కృతిక మార్పిడులు తమ ఉనికిని ప్రమాదంలోకి నెట్టాయన్నారు. కొంకణిభాషకు లిపి లేకుండా పోయిందన్నారు. పోర్చుగీసు దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వలసి వెళ్లారని చెప్పారు. ఈ క్రమంలో కొంకణి మాతృభాషగా కలిగిన వారు ఆయా రాష్ట్రాల్లోని భాషల లిపినే కొంకణి లిపిగా మార్చుకున్నారన్నారు. గోవా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత దేవనాగరి భాషను కొంకణి అధికార భాషగా గుర్తించేందుకు తాము సుదీర్ఘ ఉద్యమం చేపట్టినట్లు గుర్తు చేశారు. గోవాలోని మారుమూల పల్లెటూరుకు చెందిన తాను ప్రజల జీవితాలను, కష్టాలను, బాధలను దగ్గర నుంచి చూడడం వల్ల ప్రజల గాథలనే ఇతివృత్తంగా ఎంచుకుని రచనావ్యాసంగం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వేడుకలు వైవిధ్యం... హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అధ్యక్షత వహించారు. జర్మనీ రాయబార కార్యాలయం ప్రతినిధి స్టీఫెన్ గ్రాబర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్లు అమితాదేశాయ్, ప్రొఫెసర్ విజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న భాషల సాహిత్యాన్ని ఒక వేదికకు తేవడం గొప్ప కార్యక్రమమని వక్తలు కొనియాడారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఒక వైవిధ్యభరితమైన వేడుక అని స్టీఫెన్ చెప్పారు. జర్మనీ భాషాసాహిత్యాలను, కళలను ఈ వేదికపైన ప్రదర్శించే చక్కటి అవకాశం లభించిందన్నారు. అలరించిన సాస్కృతిక ప్రదర్శనలు వేడుకల్లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పుస్తకప్రదర్శన, ఫుడ్ఫర్ థాట్, సేవ్ రాక్ ఫొటో ఎగ్జిబిషన్, స్టోరీ బాక్స్ వంటివి విశేషంగా ఆకట్టుకున్నాయి. -
హైదరాబాద్కు రానున్న బిల్ గేట్స్, సత్య నాదెళ్ల
సాక్షి, హైదరాబాద్ః వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26వ తేదీ వరకు బయో ఏషియా 20వ వార్షిక సదస్సు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రోత్సహించేందు కు కేంద్ర ఎంఎస్ఎంఈ విభాగంతో బయో ఏషి యా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏషియాలో అతిపెద్దదైన లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్ వేదికగా బయో ఏషియా సదస్సును తెలంగాణ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. ఆ సదస్సులో ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయిస్తారు. ఇందులో వైద్య ఉపకరణాలు, ఫార్మా స్యూటికల్స్తో పాటు అనుబంధ పరిశ్రమలకు చెందిన 60 ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్లో జరుగుతున్న ఈ సదస్సులో హెల్త్కేర్, లైఫ్సైన్సెస్ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలతో పాటు స్థానిక సంస్థలు భాగస్వాములుగా ఉంటున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. సదస్సుకు అనేక మంది నోబుల్ బహుమతి విజేతలతో పాటు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, నోవార్టిస్ సీఈఓ వాస్ నర్సింహన్, మెడ్ట్రానిక్స్ సీఈవో జెఫ్ మార్తా వంటి ప్రముఖులు హాజరవుతున్నట్లు బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్ వెల్లడించారు. (క్లిక్ చేయండి: రాయదుర్గం టు శంషాబాద్.. ఏనోట విన్నా అదే చర్చ) -
తెలంగాణలో అమర రాజా బ్యాటరీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్(ఏఆర్బీఎల్) తెలంగాణ లిథియం–అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే పదేళ్లలో వీటిపై రూ. 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో 16 గిగావాట్అవర్ (జీడబ్ల్యూహెచ్) అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ గిగాఫ్యాక్టరీ, 5 జీడబ్ల్యూహెచ్ వరకూ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ‘లిథియం–అయాన్ సెల్ తయారీ రంగానికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. తెలంగాణలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు కావడమనేది.. రాష్ట్రం ఈవీల తయారీ హబ్గా ఎదిగేందుకు, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షను సాధించేందుకు దోహదపడగలదు‘ అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘అమర రాజా ఈ–హబ్ పేరిట అధునాతన పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాం. అని ఈ సందర్భంగా అమర రాజా బ్యాటరీస్ సీఎండీ జయదేవ్ గల్లా ఈ సందర్భంగా తెలిపారు. ఏపీకి కట్టుబడి ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలు తగ్గించుకోవడం లేదని, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని జయదేవ్ చెప్పారు. తిరుపతి, చిత్తూరు సైట్లు గరిష్ట స్థాయికి చేరాయని, కీలకమైన ఉత్తరాది మార్కెట్కు లాజిస్టిక్స్పరంగా వెసులుబాటు ఉండే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. భారత ఉపఖండం పరిస్థితులకు అనువైన లిథియం–అయాన్ బ్యాటరీలపై చాలా కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థలకు లిథియం బ్యాటరీ ప్యాక్లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సంస్థ న్యూ ఎనర్జీ బిజినెస్ ఈడీ విక్రమాదిత్య గౌరినేని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆసియాలోనే అతి పిన్నవయసు డేటా సైంటిస్ట్
అతనో అద్భుతం.. అసాధ్యాలను సుసాధ్యం చేయగల బాలనగధీరుడు. అంతర్జాతీయ స్థాయిలో అసమాన ప్రతిభాపాటవాలను చాటి అబ్బురపరిచిన జ్ఞానయోధుడు.. 15 ఏళ్లకే ఆసియాలోనే అతిపిన్న వయసున్న డేటా సైంటిస్టుగా గుర్తింపు పొందిన శక్తిమాన్.. తెలంగాణ ప్రభుత్వమూ అతని మహత్తర ప్రజ్ఞకు ముగ్ధురాలైంది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే ప్రాజెక్టు రూపకల్పన బాధ్యతను అప్పగించింది. ఈ బృహత్తర ఆవిష్కరణను భుజానికెత్తుకున్న బాలమేధావి ఎవరో కాదు.. పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. స్వస్థలం తెనాలి. తెనాలి: ప్రియ మానస, రాజ్కుమార్ దంపతుల ముద్దుల కొడుకు పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. సిద్ధార్థకు చిన్ననాటి నుంచి కంప్యూటర్ అంటే మక్కువ ఎక్కువ. అతడి ఆసక్తిని గుర్తించిన తండ్రి నాలుగో తరగతినుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ను నేర్పిస్తూ వచ్చారు. నాలుగైదేళ్లు గడిచేసరికి సిద్ధార్థకు కంప్యూటర్పై పట్టు చిక్కింది. అడ్వాన్స్ లెవెల్కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేశాడు. ఉద్యోగం చేస్తానని తండ్రిని కోరాడు. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కంప్యూటర్ సంస్థలో అతడిని చేర్చాలని తీసుకువెళ్లగా బాలుడన్న కారణంతో తిరస్కరించారు. చేసేదిలేక రాజ్కుమార్ ఆన్లైన్ కోర్సులను కొనిచ్చారు. ఆ వీడియోలు చూస్తూ స్వయం అధ్యయనం ప్రారంభించిన సిద్ధార్థ వాటిపై కమాండ్ సాధించాడు. సడలని సంకల్పం ఉద్యోగం చేయడం భారత్లో సాధ్యం కాదని తండ్రి నిరాశపరిచినా సిద్ధార్థ పట్టు సడలలేదు. స్వయంగా రెజ్యూమ్ తయారుచేసుకుని ప్రముఖ కంపెనీలకు పంపాడు. కొన్ని కంపెనీలు ఫోన్లో సంప్రదించాయి. అతడి కంప్యూటర్ పరిజ్ఞానానికి అబ్బురపడినా వయసు తెలిసి మిన్నకున్నాయి. ఈ విషయం మోంటెగ్న్ కంపెనీ సీఈఓ వరకు వెళ్లడంతో ఆయన సిద్ధార్థను స్వయంగా పిలిపించుకుని సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశారు. ‘నీతో వండర్స్ చేయిస్తా’నంటూ ఉద్యోగ ఆఫర్ ఇచ్చారు. చదువుకు ఆటంకం కలగరాదన్న తండ్రి షరతుతో వారంలో మూడురోజుల ఉద్యోగానికి సిద్ధార్థ ఓకే చేశాడు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఏడో తరగతిలోనే ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల జీతంతో చేరాడు. ప్రస్తుతం ఇనిఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్గా నెలకు రూ.45 వేల వేతనం అందుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్లో కృషి చేస్తున్నాడు. చదువుకు ఆటంకం కలగకుండానే.. స్వస్థలం తెనాలి అయినా సిద్ధార్థ కుటుంబం హైదరాబాద్లోనే ఉంటోంది. సిద్ధార్థ హైదరాబాద్లోని శ్రీచైతన్యలో పదోతరగతి చదువుతున్నాడు. వారంలో మూడురోజులు స్కూలుకు వెళ్లే అతను మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో ఉద్యోగానికి వెళ్తాడు. అంతేకాకుండా అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’తరపున అక్కడి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కోడింగ్ క్లాసులనూ నిర్వహిస్తున్నాడు. అందుకే సిద్ధార్థను బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. బృహత్తర బాధ్యత ఈ నేపథ్యంలో సిద్ధార్థకు తెలంగాణ ప్రభుత్వం బృహత్తర బాధ్యతను అప్పగించింది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే కేంద్రప్రభుత్వ రీసెర్చ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని కోరింది. తెలంగాణ ఐటీ మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ స్వయంగా సిద్ధార్థను ఆహ్వానించి ఈ ప్రాజెక్టును అప్పగించారు. సిద్ధార్థ పరిశోధనలు ఫలిస్తే ఆ పరిజ్ఞానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారని అతడి తండ్రి రాజ్కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో ఈ ప్రాజెక్టు రీసెర్చ్ కొనసాగిస్తున్న సిద్ధార్థ.. మరోవైపు కోడింగ్ క్లాసులు చెబుతూ ఉద్యోగం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్పైనా ఫ్రీలాన్సర్గా చేస్తున్నాడు. (క్లిక్: పుష్పపై ‘ఫైర్’.. స్మగ్లర్ వీరప్పన్కే ముచ్చెమటలు పట్టించి..) లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్ల జీవితచరిత్రలు, బిల్గేట్స్ మాటలు, స్టీవ్జాబ్స్ పనితీరు నాకు ఆదర్శం. వారి ప్రేరణతోనే నా కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నా. ప్రపంచ టాప్ ఫైవ్లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో భాగస్వామిని కావాలని ఉంది. మంచి గేమ్ డిజైన్ చేయాలనేది నా లక్ష్యం. ప్రజోపయోగ ప్రాజెక్టులు చేయాలనేది ధ్యేయం. వీలైతే మైక్రోసాఫ్ట్ లాంటి అప్లికేషన్ రూపొందించాలని ఉంది. నా లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా. – పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్, డేటా సైంటిస్టు -
ఆఫీస్ సంస్కృతి మళ్లీ పెరగాలి
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ పరిణామాల నేపథ్యంలో కొనసాగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలికి ఆఫీస్ సంస్కృతిని పునరుద్ధరించుకోవాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఆఫీస్ వర్క్స్పేస్ విభాగంలో అంకుర సంస్థలకు ప్రోత్సాహమందించే ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం హైటెక్ సిటీలోని మై హోమ్ వేదికగా ప్రీమియం సెంటర్ ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ... ఇలాంటి వినూత్న వేదికల వల్ల మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. విభిన్న రీతిలో పౌరాణిక సంప్రదాయ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణం ఉద్యోగులకు మళ్లీ ఆఫీస్లో పనిచేయాలనే ఆతృతను పెంచుతుందన్నారు. మహాభారత సంప్రదాయ ఇతివృత్తంతో రూపొందించిన సాఫ్ట్వేర్ స్పేస్ ఆకట్టుకుందని, ఇలాంటి వేదికలు మరింత విస్తరించాలని జూపల్లి రామేశ్వర్ రావు పేర్కొన్నారు. ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ సీఈవో పాటిబండ్ల సుందరి మాట్లాడుతూ... వ్యాపార రంగంలో వినూత్న ఆలోచనలున్న వారిని మంచి ఎంటర్ప్రైజెస్గా మార్చడానికి అవసరమైన అంతర్గత నిపుణుల బృందం తమవద్ద ఉందన్నారు. నగరంలోనే కాకుండా విజయవాడ, చెన్నై, పూణే, బెంగళూరు, నోయిడా, గుర్గావ్, కోల్కతా, అహ్మదాబాద్, ముంబైలలో కూడా తమ వర్కింగ్ స్పేస్లను ప్రారంభించనున్నామన్నా రు. కార్యక్రమంలో సహ వ్యవస్థాపకులు శ్రీని, ప్రాజె క్ట్స్ వైస్ ప్రెసిడెంట్ శేషు, మణివణ్ణన్ పాల్గొన్నారు. -
అభిమానుల కోసం కొత్త ‘స్పోర్ట్స్ యాప్’
సాక్షి, హైదరాబాద్: అరవై పదాల్లో ఆసక్తికర క్రీడా సమాచారం... ఇదే లక్ష్యంతో కొత్త మొబైల్ అప్లికేషన్ మార్కెట్లోకి వచ్చింది. ‘వాట్స్ ఇన్ ద గేమ్’ పేరుతో రూపొందించిన ఈ యాప్లో భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ సహ భాగస్వామి. సాయిప్రణీత్తో పాటు అనిల్ కుమార్ మామిడాల, ఈజేబీ ప్రమీల కలిసి ఈ యాప్ను తీసుకొచ్చారు. ఇతర స్పోర్ట్స్ యాప్లతో పోలిస్తే ‘వాట్స్ ఇన్ ద గేమ్’ అన్ని రకాల క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, షెడ్యూల్ మొదలు ఫలితాల వరకు సమాచారం అరవై పదాల్లోనే అందుబాటులో ఉంటుదని రూపకర్తలు వెల్లడించారు. ప్రొఫెషనల్గా బ్యాడ్మింటన్ క్రీడాకారుడినే అయినా... ఇతర క్రీడలపై తనకున్న ఆసక్తి, ఒక క్రీడాభిమానిగా అన్ని రకాల సమాచారం తెలుసుకోవాలని కుతూహలం కారణంగా ఇలాంటి యాప్ ఉంటే బాగుంటుందని భావించానని, అందుకే తాను భాగం అయ్యాయని సాయిప్రణీత్ వ్యాఖ్యానించాడు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
రూ. 24 వేల కోట్లు ‘డిస్ప్లే’
సాక్షి, హైదరాబాద్: దేశ చరిత్రలో తొలిసారిగా ‘డిస్ప్లే ఫ్యాబ్’తయారీ రంగంలో రాష్ట్రానికి రూ. 24 వేల కోట్ల భారీ పెట్టుబడి లభించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రముఖ ఆభరణాల ఎగుమతి సంస్థ రాజేశ్ ఎక్స్పోర్ట్స్ తన అనుబంధ సంస్థ ఎలెస్ట్ ద్వారా తెలంగాణలో అడ్వాన్స్డ్ అమోలెడ్ డిస్ప్లేల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సాధించింది. ఆదివారం బెంగళూరులో మంత్రి కె. తారక రామారావుతో జరిగిన సమావేశంలో ఎలెస్ట్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాçహనా ఒప్పందం కుదిరింది. ఎలెస్ట్ తరఫున రాజేశ్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో 6వ తరం అమోలెడ్ డిస్ప్లే ఫ్యాబ్ ఉత్పత్తి కోసం రూ. 24 వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్ల తయారీ కంపెనీలకు అవసరమైన అమోలెడ్ డిస్ప్లేలను ‘ఎలెస్ట్’తయారు చేసి సరఫరా చేయనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ విభాగం డైరెక్టర్ (ఎల్రక్టానిక్స్) సుజయ్ కారంపురి, ఎలెస్ట్ సీఈఓ శ్యామ్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించే అవకాశం: రాజేశ్ మెహతా తెలంగాణలో తాము ఏర్పాటు చేయబోయే డిస్ప్లే ఫ్యాబ్ వల్ల అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్ను ఆకర్షించే అవకాశం ఉందని రాజేశ్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేశ్ మెహతా తెలిపారు. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్లో 3,000 మంది శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. దీంతోపాటు డిస్ప్లే ఫ్యాబ్ భాగస్వాములు, అనుబంధ సంస్థలు, సరఫరాదారుల రూపంలో వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 6వ తరం అమోలెడ్ డిస్ప్లే తయారీ ద్వారా భారత్ నుంచి ఫ్యూచర్ టెక్నాలజీని తమ ఎలెస్ట్ కంపెనీ ప్రపంచానికి అందిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజు: మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి రూ. 24 వేల కోట్ల పెట్టుబడి వచి్చన విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పరిణామాన్ని తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజుగా అభివరి్ణంచారు. దేశ హైటెక్ తయారీ రంగానికి వచి్చన భారీ పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో రానున్న రూ. 24 వేల కోట్ల పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం భారత్ను ప్రపంచ హైటెక్ పరికరాలను తయారు చేస్తున్న దేశాల సరసన నిలుపుతుందన్నారు. ఇప్పటివరకు జపాన్, కొరియా, తైవాన్లకు మాత్రమే సాధ్యమైనది ఇకపై తెలంగాణలో అవుతుందన్నారు. దేశ సెమీ కండక్టర్ మిషన్ ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోకి ఫ్యాబ్ రంగంలో పెట్టుబడులు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నామని వివరించారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డిస్ప్లే ఫ్యాబ్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ ఎకోసిస్టం, అనుబంధ రంగాల్లో వృద్ధికి గణనీయమైన అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ , డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవనుందన్నారు. -
ఒక్కరోజే రూ.3,250 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను ఆహ్వానించడం లక్ష్యంగా సాగిన మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ఆదివారం ముగిసింది. చివరిరోజు అమెరికా లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడంలో కేటీఆర్ విజయం సాధించారు. ప్రముఖ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అడ్వెంట్ ఇంటర్నేషనల్ రూ.1,750 కోట్లు, స్లేబ్యాక్ ఫార్మా రూ. 1,500 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించాయి. అలాగే జీనోమ్ వ్యాలీలో ఫ్లో కెమిస్ట్రీ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా, హైదరాబాద్లోని తమ గ్లోబల్ షేర్డ్ సర్వీస్ సెంటర్లో ఉద్యోగుల సంఖ్యను ఏడాదిలో రెట్టింపు చేస్తామని క్యూరియా గ్లోబల్ వెల్లడించాయి. హైదరాబాద్లోని కంపెనీల్లో అడ్వెంట్ పెట్టుబడులు న్యూయార్క్లోని అడ్వెంట్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ జాన్ మాల్డోనాడోతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఇండియాలోని ఇతర నగరాలతో పాటు హైదరాబాద్లో అడ్వెంట్ కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ ప్రణాళికలపై ఇద్దరూ చర్చించారు. హైదరాబాద్లోని లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆర్ఏ చెమ్ ఫార్మా లిమిటెడ్ , అవ్రా లేబొరేటరీస్లో మెజార్టీ వాటాలు కొనేందుకు రూ. 1,750 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. నగరంలో స్లేబ్యాక్ సీజీఎంపీ ల్యాబ్ న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న స్లేబ్యాక్ ఫార్మా కంపెనీ.. హైదరాబాద్ ఫార్మా రంగంలో రాబోయే మూడేళ్లలో సుమా రు రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. సీజీఎంపీ ల్యాబ్తో పాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభిస్తామని కేటీఆర్తో భేటీ తర్వాత సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో అజయ్సింగ్ ప్రకటించారు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఫార్మాలో స్లేబ్యాక్ రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. హైడ్రాక్సీ ప్రోజెస్టెరాన్ 5 ఎంఎల్ జెనరిక్ ఔషధానికి అనుమతులను పొందడంతో పాటు అమెరికన్ మార్కెట్లో తొలిసారి ప్రవేశపెట్టింది తమ కంపెనీయేనని కేటీఆర్కు సంస్థ సీఈవో వివరించారు. జీనోమ్ వ్యాలీలో యూఎస్పీ ఫ్లో కెమిస్ట్రీ ల్యాబ్ రెండు లక్షల డాలర్ల అదనపు మూలధన పెట్టుబడితో నిరంతర ఔషద తయారీ (ఫ్లో కెమిస్ట్రీ) కేంద్రాన్ని హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా (యూఎస్పీ) ముందుకొచ్చింది. హైదరాబాద్లో 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఫ్లో కెమిస్ట్రీ ల్యాబ్కు సింథటిక్, విశ్లేషణ సామర్థ్యం ఉంటుందని చెప్పింది. ఈ ల్యాబ్లో 50 మంది శాస్త్రవేత్తల బృందం పనిచేస్తుందని తెలిపింది. నిరంతర ఔషధ తయారీ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కునేందుకు అవసరయ్యే కొత్త ప్రక్రియ, సాంకేతికతను ఈ బృందం అభివృద్ధి చేస్తుందని ప్రతినిధులు చెప్పారు. ఏడాదిలో క్యూరియా సర్వీస్ సెంటర్ ఉద్యోగులు రెట్టింపు న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న క్యూరియా గ్లోబల్.. హైదరాబాద్లోని తన కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను మరో 12 నెలల్లో రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. కేటీఆర్తో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ప్రకావ్ పాండియన్ సమావేశం తర్వాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. వివిధ రంగాల్లోని అన్ని క్యూరియా గ్రూపు సంస్థలకు సపోర్ట్ సర్వీస్ అందించడానికి గతేడాది హైదరాబాద్లో గ్లోబల్ షేర్డ్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు పాండియన్ తెలిపారు. సర్వీస్ సెంటర్లో ప్రస్తుతం 115 మంది పనిచేస్తున్నారని, 12 నెలల్లో మరో 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కంపెనీ దేశంలో ఇప్పటికే 27 మిలియన్ డాలర్ల (రూ. 200 కోట్ల)పెట్టుబడి పెట్టింది. -
హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా డిజిటల్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అతి పెద్ద డేటా సెంటర్ రీజియన్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తోంది. దశలవారీగా నిర్మిస్తున్న ఈ సెంటర్లో మొదటి ఫేజ్ 2025 నాటికి అందుబాటులోకి రానుంది. సుమారు రూ. 15,000 కోట్ల పెట్టుబడులతో ఇది ఏర్పాటు అవుతున్నట్లు డేటా సెంటర్ ప్రకటనకు సంబంధించి కంపెనీ సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ‘‘భారత్లో అత్యంత భారీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానం కావడం సంతోషంగా ఉంది. వచ్చే 15 ఏళ్లలో దీనిపై రూ. 15,000 కోట్ల మేర సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. తెలంగాణలోకి వచ్చిన అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్డీఐ) ఇది రెండోది అవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. డేటా సెంటర్ పరోక్షంగా స్థానిక వ్యాపారాల అభివృద్ధికి .. ఐటీ కార్యకలాపాలు, ఫెసిలిటీల మేనేజ్మెంట్, డేటా .. నెట్వర్క్ భద్రత, నెట్వర్క్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగాల కల్పనకు దోహదపడగలదని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హైదరాబాద్లో అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్మన్ తదితరులు పాల్గొన్నారు. భారత్లో నాలుగోది ... మైక్రోసాఫ్ట్కి ఇప్పటికే పుణే, ముంబై, చెన్నైలో మూడు డేటా సెంటర్ రీజియన్లు ఉండగా .. హైదరాబాద్లోని నాలుగోది కానుంది. ఇది కంపెనీలు, స్టార్టప్లు, డెవలపర్లు, ప్రభుత్వ సంస్థలు మొదలైన క్లయింట్లకు క్లౌడ్, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) తదితర సొల్యూషన్స్ అందించనుంది. సాధారణంగా ఇలాంటి డేటా సెంటర్ ఏర్పాటుకు కనీసం 24 నెలలు పడుతుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి చెప్పారు. క్రమంగా ఇన్వెస్ట్ చేస్తూ దీన్ని అతి పెద్ద సెంటర్గా తీర్చిదిద్దనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్లోని మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు.. భారత ఎకానమీకి 9.5 బిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని సమకూర్చాయని అనంత్ మహేశ్వరి వివరించారు. చదవండి: హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటు -
వైద్య ఉపకరణాల తయారీ కేంద్రంగా నగరం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశానికి హైదరాబాద్ వైద్య ఉపకరణాల తయారీ కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. నరాలు, గుండె జబ్బులకు సంబంధించిన అత్యాధునిక వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ సంస్థ సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ ప్రతినిధులు గురువారం మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైద్య ఉపకరణాల పార్కులో 2017 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడులతో పాటు 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించాయన్నారు. 302 ఎకరాల్లో విస్తరించి ఉన్న మెడికల్ డివైజెస్ పార్కులో పెట్టుబడులకు మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటివరకు 50కి పైగా కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వచ్చి తయారీ, పరిశోధన, అభివృద్ధి యూనిట్లు ఏర్పాటు చేశాయన్నారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, తయారీ రంగంలో వైద్య ఉపకరణాల పార్కును బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని కేటీఆర్ అన్నారు. రూ.250 కోట్లతో తాము నెలకొల్పే యూనిట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ ప్రమోటర్, డైరెక్టర్ బదరీ నారాయణ్ వెల్లడించారు. కేటీఆర్తో బదరీ నారాయణ్, విజయగోపాల్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర లైఫ్సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. -
క్యూ కడుతున్న టెక్ కంపెనీలు, హైదరాబాద్ కేంద్రంగా యూకే టెక్ కంపెనీ ప్రారంభం!!
హైదరాబాద్కు జాతీయ అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. యూకే ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాగూల్ డేటా సెంటర్ అండ్ ఈఆర్పీ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కపిల్ టవర్స్లో రెండో కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కాగూల్ డేటా ఇండియా ఆపరేషన్స్ హెడ్ కళ్యాణ్ గుప్తా బ్రహ్మాండ్లపల్లి మాట్లాడుతూ..కాగూల్ సంస్థ 2017లో నగరంలో తన తొలి బ్రాంచ్ ఆఫీస్లో కార్యకలాపాల ప్రారంభించిందని, ఇప్పుడు 2వ డేటా సెంటర్ ను ప్రారంభించినట్లు తెలిపారు. తద్వారా ఈ సంస్థ సేవల్ని మరింత విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 200మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా వారిలో 70శాతం స్థానికులేనని వెల్లడించారు. 2025 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 2,000కి పెంచడంతో పాటు ఇక్కడ సుమారు 5 మిలియన్ డాలర్లు (రూ. 38 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ, నగరంలో కాగూల్ లాంటి పెద్ద సంస్థలతో పాటు మధ్యస్థ, చిన్న కంపెనీలు సైతం హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయని కొనియాడారు. -
దేశానికి పాఠాలు నేర్పే దిశగా..
సాక్షి, హైదరాబాద్: మానవ వనరులు, థింక్ ఫోర్స్ను సరిగ్గా ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతులు కల్పించినప్పుడే భారతదేశ అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న విధానాలను దేశవ్యాప్తంగా విస్తరించాలని, అప్పుడే దేశం గణనీయ పురోగతిని సాధిస్తుందని పేర్కొన్నారు. ‘2030 నాటికి భారతదేశ అభివృద్ధి’అనే అంశంపై ఆదివా రం జరిగిన హార్వర్డ్ ఇండియా సదస్సులో కేటీఆర్ వర్చువల్ విధానంలో మాట్లాడారు. భారతదేశం నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరముందని, ఈ దిశగా ఇన్నోవేషన్ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీహబ్, వీహబ్, అగ్రిహబ్ వంటి ఇంక్యుబేటర్లను మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ‘ఒకప్పుడు బెంగాల్ ఆలోచించినది, తరువాత భారతదేశం ఆలోచిస్తుంది’అనే నాను డి ఉండేది. కానీ, ఈ రోజు తెలంగాణ ఆలోచించి, చేసింది.. రేపు భారతదేశం చేస్తుంది’అనే విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. ‘భారతదేశం మరింత వేగంగా, విప్లవాత్మకంగా ముందుకు పోవాలంటే కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో కాటన్ ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశంగా భారత్ ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ ,శ్రీలంకల కన్నా తక్కువ దుస్తులను ఎందుకు ఉత్పత్తి చేస్తోంది.. ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకునే ధరలకన్నా భారతదేశంలో తయారుచేసే మెడికల్ పరికరాల ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయి.. వియత్నాం, తైవాన్ లాంటి చిన్నదేశాలు తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్నాయి, ఇందులో మనదేశాన్ని అడ్డుకుంటున్న పరిస్థితులు ఏమిటి.. దేశంలోని నదులు నిండా నీళ్లు పారుతున్నప్పటికీ ఎండిపోతున్న బీడు భూములు ఎందుకున్నాయి.. ఇలాంటి ప్రశ్నల గురించి దేశంలోని ప్రభుత్వాలు, మేధావులు, విద్యావేత్తలు ఆలోచించాలి’అని అన్నారు. ఏడేళ్లలో తెలంగాణ మున్ముందుకు... దేశంలోనే అతితక్కువ వయసు గల తెలంగాణ రాష్ట్రం ఏడేళ్లలో అనేక కార్యక్రమాల్లో దేశానికి పాఠాలు నేర్పేదిశగా ముందుకు వెళుతోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, టీఎస్ ఐపాస్, పట్టణ ప్రకృతి వనాల వంటి కార్యక్రమాలను ఇప్పటికే కేంద్రంతోపాటు అనేక రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకొని, తమ తమ రాష్ట్రాల్లో ప్రారంభించాయని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగం ఐటీ, హెల్త్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. కేటీఆర్ ప్రసంగానికి మంచి స్పందన లభించింది. -
బ్రిటిష్ కౌన్సిల్తో తెలంగాణ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యువతకు విద్యారంగంలో విశ్వవ్యాప్తంగా అవకాశాలు కల్పించే లక్ష్యంతో గతంలో ఉన్న భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ ఇంగ్లండ్కు చెందిన బ్రిటిష్ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగుతుంది. ఇందులో భాగంగా తెలంగాణ, యూకేలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల మధ్య సమన్వయం కోసం తెలంగాణ ప్రభుత్వ సంస్థ రిచ్ (రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్), బ్రిటిష్ కౌన్సిల్ సంయుక్తంగా కృషి చేస్తాయి. అంతరిక్షం, రక్షణ, జీవ, ఔషధ, ఆహారం, వ్యవసాయం, ఆంగ్లం, సుస్థిరాభివృద్ధి వంటి రంగాల్లో రిచ్తో పాటు బ్రిటిష్ కౌన్సిల్ నాలెడ్జ్ పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. తెలంగాణ యువతకు అవసరమైన నైపుణ్యాలు, ఉత్తమ విధానాల్లో శిక్షణ కోసం అవసరమయ్యే ఆవిష్కరణలపై యూకే, రిచ్ కలిసి పనిచేస్తాయి. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రిచ్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్, తెలంగాణ, ఏపీ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, దక్షిణ భారత విభాగం బ్రిటిష్ డైరెక్టర్ జనక పుష్పనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
తాళం చెవితో పనిలేదు.. ‘సెల్ఫీ’ కొడితే స్కూటర్ రయ్ రయ్..
సాక్షి, హైదరాబాద్: తాళం చెవితో పనిలేదు.. ఈ–స్కూటర్ వద్దకు వెళ్లి యాప్ను ఆన్చేసి సెల్ఫీ తీస్తే చాలు.. అది స్టార్ట్ అయిపోతుంది. యాప్ ద్వారానే స్కూటర్ నడిపిన తర్వాత పేమెంట్ కూడా చేయొచ్చు. ఈ మేరకు రూపొందించిన ‘హల’మొబిలిటీ యాప్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ప్రయాణం, అద్దె, చార్జింగ్ స్టేషన్లు తదితర సేవలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. పలు విద్యాసంస్థల ఆవరణలో ఒకే సీటు ఉన్న ‘ఈ స్కూటర్’సేవలను ఇప్పటికే ‘హల’అందిస్తోంది. తాజాగా ఆవిష్కరించిన ‘హల’మొబిలిటీ యాప్ సేవలను ఈ నెల నుంచే హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో అందుబాటులోకి తేనున్నారు. ఇక్కడ ‘ఈ స్కూటర్’సేవలను 3 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. స్మార్ట్ బ్యాటరీతో పనిచేసే ఈ–స్కూటర్ల కోసం ట్రిపుల్ ఐటీ ఆవరణలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ వాహనాల్లో బ్లూ టూత్ కనెక్షన్, జీపీఎస్ వంటి టెక్నాలజీ ఉండటంతో మొబైల్ ఫోన్లోని హల మొబిలిట్ యాప్ ద్వారా డిజిటల్ తాళాన్ని తెరిచి ప్రయాణించొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ యాప్ ప్రయాణికుడి సెల్ఫీ, ఆధార్, డ్రైవింగ్ లైసెన్సు వివరాలు క్షణాల్లో సేకరించి ‘ఈ స్కూటర్’పై ప్రయాణానికి అనుమతిస్తుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో పెరుగుతున్న ప్రయాణ అవసరాలను ‘హల’తీరుస్తుందని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రయాణాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యాప్ను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్రెడ్డి వెల్లడించారు. వచ్చే 12 నెలల్లో ఆరు నగరాల్లో ‘హల’యాప్ ద్వారా పనిచేసే 15వేల స్కూటర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇదిలాఉంటే, టి హబ్లోని ‘ల్యాబ్ 32 ప్రాజెక్టు’ కింద ‘హల మొబిలిటీ యాప్’ పురుడుపోసుకున్నట్లు టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్రావు వెల్లడించారు. -
‘ఫ్లో కెమిస్ట్రీ’తో వినూత్న ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల పురోగతిని కొనసాగించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. దీనికోసం ఫార్మా దిగ్గజాలతో కలిసి ఫ్లో కెమిస్ట్రీలో కొత్తగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రం స్థాపన వల్ల ఫార్మారంగంలో బహుళ ప్రయోజనాలతో కూడిన ఆవిష్కరణలు ఊపందుకుంటాయి. ఔషధ రంగ పరిశోధన, అభివృద్ధిలో ఫ్లో కెమిస్ట్రీ సాంకేతికతను చొప్పించడం ద్వారా ఔషధాల తయారీలో కీలకమైన ముడి రసాయనాల (ఆక్టివ్ ఫార్మా ఇంగ్రిడియెంట్స్)ను నిరంతరం తయారు చేసే అవకాశం ఏర్పడుతుంది. సీఓఈ ఏర్పాటుకు ముందుకొచ్చిన కన్సార్టియంతో ప్రభుత్వం గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై జీవీ ప్రసాద్ (డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్), డాక్టర్ సత్యనారాయణ చావా (లారస్ ల్యాబ్స్), శక్తి నాగప్పన్ (లైఫ్ సైన్సెస్ డైరెక్టర్)తోపాటు డాక్టర్ శ్రీనివాస్ ఓరుగంటి (డాక్టర్ రెడ్డీస్ లైఫ్సైన్సెస్ ఇనిస్టిట్యూట్) సంతకాలు చేశారు. హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్సైన్సెస్ ఆవరణలో ఏర్పాటయ్యే ఈ కేంద్రానికి డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్ నుంచి నిధులు, ఇతర సహకారం లభిస్తుంది. సీఓఈలో జరిగే పరిశోధనలకు పేరొందిన శాస్త్రవేత్తలు మార్గదర్శనం చేస్తారు. ఫ్లో కెమిస్ట్రీలో నైపుణ్యం, నిరంతర ఉత్పత్తి ద్వారా లబ్ధిపొందేందుకు ఈ కన్సార్టియంలో మరిన్ని పరిశ్రమలు చేరి లబ్ధిపొందేలా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఉత్పత్తిలో ఆధునిక పద్ధతులు: కేటీఆర్ పరిశోధన, అభివృద్ధి మొదలుకుని ఉత్పత్తిలో ఆధునిక పద్ధతులు అవలంబించడంతోపాటు కాలుష్యరహిత, సుస్థిర విధానాల వైపు దేశీయ ఔషధ తయారీ రంగం మళ్లేందుకు ‘ఫ్లో కెమిస్ట్రీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’పేరిట ఏర్పాటయ్యే హబ్ దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఓఈ ఏర్పాటులో డాక్టర్ రెడ్డీస్, లారస్ ల్యాబ్స్ ఎనలేని సహకారం అందించాయని కితాబునిచ్చారు. లైఫ్సైన్సెస్ రంగంలో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యతను కాపాడుకుంటూనే మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఫ్లో కెమిస్ట్రీ సీఓఈ ఏర్పాటు మైలురాయి వంటిదని, రాష్ట్రంలో ఈ రంగాన్ని 2030 నాటికి వంద బిలియన్ డాలర్ల పరిశ్రమగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని లైఫ్ సైన్సెస్ విభాగం డైరక్టర్ శక్తి నాగప్పన్ అన్నారు. సీఓఈలో తమకు భాగస్వామ్యం కల్పించడం పట్ల రెడ్డీస్ ల్యాబ్స్ కో చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్, లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా హర్షం వ్యక్తం చేశారు. -
రక్షణ రంగ హబ్గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: డజనుకు పైగా డీఆర్డీవో పరిశోధన సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలతో హైదరాబాద్ రక్షణ రంగ హబ్గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. దేశంలోనే తొలి ‘సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం’ఏర్పాటుకు సంబంధించి వీఈఎం(వెమ్) టెక్నాలజీస్ కంపెనీకి, తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది. జహీరాబాద్ సమీపంలోని ఎల్గోయి వద్ద దాదాపు 511 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్ వంటి విమాన, రక్షణ రంగ విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో వేయికి పైగా లఘు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు (ఎస్ఎంఎస్ఈ) ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌళిక వసతులతో పలు ఎంఎస్ఎంఈలు పెద్ద కంపెనీలుగా ఎదిగిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్ని సైద్ధాంతిక విభేదాలున్నా రక్షణ రంగం లేదా పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని, దేశాభివృద్ధికి ఇది కీలకమని స్పష్టం చేశారు. రక్షణ రంగంలో అతి కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మెగాప్రాజెక్టు హోదా కల్పించడమే కాకుండా, అన్ని రకాల సహకారం అందిస్తోందని అన్నారు. క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు అనువుగా ఉన్న ఈ కేంద్రం కోసం వెమ్ టెక్నాలజీస్ రూ.వెయ్యికోట్ల పెట్టుబడి పెట్టనుందని, రెండు వేల కంటే ఎక్కుమందికి ఉపాధి అవకాశం కల్పించనుందని తెలిపారు. వెమ్ టెక్నాలజీస్ కంపెనీ భారతదేశ లాక్హీడ్ మార్టిన్ (అమెరికాలో అతిపెద్ద రక్షణ రంగ తయారీ సంస్థ) అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదని మంత్రి కొనియాడారు. లక్ష కోట్ల రూపాయలకుపైబడే: సతీశ్ రెడ్డి రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ చాలాకాలం కేంద్రంగా ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా వీటికి మరింత ఊతం లభించిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్రెడ్డి తెలిపారు. ఆకాశ్, ఎంఆర్ సామ్ వంటి అనేక క్షిపణులు ప్రస్తుతం హైదరాబాద్లోని వేర్వేరు కేంద్రాల్లో తయారవుతున్నాయని, వీటన్నింటి విలువ లక్ష కోట్ల రూపాయలకుపైబడే ఉంటుందని తెలిపారు. వెమ్ టెక్నాలజీస్ కొత్తగా ఏర్పాటు చేయనున్న సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రంలో ఎగుమతుల కోసం ప్రత్యేక విభాగం ఉండటం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ వీకే సారస్వత్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధవిమానం తయారు చేయడమే లక్ష్యం: వెంకట్ రాజు కూకట్పల్లిలోని ఓ చిన్న ఇంటిలో 1988లో మొదలైన వెమ్ టెక్నాలజీస్ ఈ 33 ఏళ్లలో ‘‘అసిబల్’’పేరుతో సొంతంగా ఓ క్షిపణిని తయారు చేసే స్థాయికి ఎదిగిందని వెమ్ టెక్నాలజీస్ అధ్యక్షుడు వెంకట్ రాజు అన్నారు. భారత్లో 2029 కల్లా ఒక యుద్ధ విమానాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వాషింగ్ మెషీన్ల టైమర్లతో మొదలుపెట్టి.. ఒక క్రమపద్ధతిలో రక్షణ రంగంలోని వేర్వేరు విభాగాలకు చెందిన విడిభాగాలను తయారు చేయడం మొదలుపెట్టామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లో రెండు కేంద్రాలు ఉండగా.. జహీరాబాద్ సమీపంలోని యల్గోయి వద్ద సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. యుద్ధవిమానం తయారీ కోసం ప్రత్యేకంగా ఒక ఇంజనీరింగ్ కేంద్రం అవసరమని, ఐదువేల మంది ఇంజనీర్లతో దీన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టామని ఆయన ‘‘సాక్షి’’కి వివరించారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్ను ఆవిష్కరించిన అజారుద్దీన్,జయేశ్ రంజన్
-
వారు మాకు బ్రాండ్ అంబాసిడర్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించే క్రమంలో ఇప్పటికే పెట్టుబడి పెట్టినవారిని చాలా రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాయని, తెలంగాణ మాత్రం వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా భావిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ‘8వ జాతీయ సదస్సు 2021’లో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ ఏడేళ్ల వ్యవధిలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో 24 శాతం అనగా సుమారు 32 బిలియన్ డాలర్ల మేర ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఆకర్షించామని చెప్పారు. పెట్టుబడులను రాబట్టేందుకు అవసరమైన విధానాలు, మౌలిక వసతులపై మార్గదర్శనం చేసేందుకు నైపుణ్యం కలిగిన యువకుల సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందన్నారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’వేదిక ద్వారా ఈ యువకులు మంచి ఫలితాలు రాబడుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. టీఎస్ఐఐసీ వద్ద రెండు లక్షల ఎకరాల భూమి పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ వద్ద రెండు లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పునరుద్ధరణీయ ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. ప్రభుత్వ ఖర్చుతో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేస్తున్నామని, స్థానికులకు ఎక్కువసంఖ్యలో ఉద్యోగాలు లభించేలా చూస్తున్నామని వివ రించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తు న్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, జీవ ఔషధాలతోపాటు ఫార్మా, బయోటెక్, వైద్య ఉపకరణాలు, రక్షణ, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర, యంత్ర, ఎలక్ట్రానిక్ వాహనాలు, ప్లాస్టిక్, రసాయన, వజ్రాభరణాలు, చిల్లర వర్తకం వంటి రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. సమావేశంలో ఫిక్కి కార్యదర్శి జనరల్ దిలీప్ షెనాయ్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
గోనె సంచుల కొరత తీరేలా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచుల అవసరం భారీగా పెరుగుతోంది. అటు రైతుల నుంచి ధాన్యం సేకరణ, ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీకి ఏటా 27 కోట్లకు పైగా గోనె సంచులు అవసరమవుతున్నాయి. రాష్ట్రంలో జనుము సాగు లేకపోవడం, గోనె సంచుల తయారీ పరిశ్రమలు లేకపోవడంతో వీటి కొనుగోలుకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. పశ్చిమ బెంగాల్లోని జనపనార పరిశ్రమలు తెలంగాణలో 80 శాతానికి పైగా గోనె సంచుల అవసరాలను తీరుస్తున్నాయి. జనుము సాగుకు పేరొందిన పశ్చిమ బెంగాల్, బిహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో జనపనార దిగుబడి తగ్గినా, అక్కడి పరిశ్రమల్లో సమస్యలు ఏర్పడినా ధాన్యం కొనుగోలు సమయంలో తెలంగాణ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జనుము సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు లాభం కలిగేలా చూడటంతో పాటు, రైతులు పండించే జనపనారను కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో జనపనార పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జనపనార పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో ఇటీవల కార్యాచరణ సిద్ధం చేసింది. రూ.887 కోట్లతో మూడు జనపనార పరిశ్రమలు... దేశవ్యాప్తంగా సుమారు 140కి పైగా జనపనార పరిశ్రమలు ఉండగా, తెలంగాణలో ఒక్క పరిశ్రమ కూడా లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా 38 వేలకు పైగా హెక్టార్లలో జనుము పంట సాగవుతుండగా పశ్చిమ బెంగాల్, బిహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనపనార ఉత్పత్తుల రంగంలో స్వయం స్వావలంబన సాధించేందుకు తొలి దశలో జనపనార పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గత నెలలో వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కో జనపనార పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలతో ఇటీవల పరిశ్రమల శాఖ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.887 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ మూడు పరిశ్రమల ద్వారా 10,448 మందికి ప్రత్యక్ష ఉపాధి, రెండింతల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. జనపనార పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి తెలంగాణ జౌళి, దుస్తుల విధానం కింద ప్రోత్సాహకాలు ఇస్తారు. ఆయా యూనిట్లు తయారు చేసే గోనె సంచులను రాష్ట్ర ప్రభుత్వం 20 ఏళ్లపాటు కొనుగోలు చేస్తుంది. తమకు అవసరమైన ముడి జనపనార కోసం రైతులు జనుము సాగు చేసేలా ఈ కంపెనీలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. 15 కోట్ల సంచుల ఉత్పత్తి సామర్థ్ద్యం... రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా ఏర్పడుతున్న మూడు పరిశ్రమలు ఏటా సుమారు 15 కోట్ల గోనె సంచులను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటికి అవసరమైన జనపనారను బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి రవాణా చేసేందుకు అయ్యే మొత్తాన్ని మొదటి ఏడాది వంద శాతం, మరో రెండేళ్లు 50 శాతం, ఆ తర్వాత ఐదేళ్లు 25శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ రూపంలో తిరిగి చెల్లిస్తుంది. అదే విధంగా కంపెనీలు తయారుచేసే గోనె సంచులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల కోసం వంద శాతం తిరిగి కొనుగోలు చేస్తుంది. ‘రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని పదేపదే చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆయా పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కూడా పెంపొందించాలని భావిస్తోంది. అందులో భాగంగానే జనపనార పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని జనపనార కంపెనీలు పెట్టుబడులతో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. – ‘సాక్షి’తో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ -
వర్క్ ఫ్రం హోంపై తెలంగాణ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: దేశంలో కరోనా విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. కరోనా పూర్తిగా తగ్గేవరకు వారు ఇంటి నుంచే పని చేసుకోవచ్చని ఆయా సంస్థలు పలుసార్లు ప్రకటించాయి. ఇప్పట్లో పూర్తి స్థాయిలో కార్యాలయాలను తెరవడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా లేవు. ఉద్యోగుల రక్షణే తమకు ముఖ్యమని అంటున్నాయి. అయితే, వర్క్ ఫ్రం హోం వద్దని, ఉద్యోగులను క్రమంగా కార్యాలయాలకు పిలిపించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆయా కంపెనీలను కోరారు. తాజాగా, ఆయా కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా 100 శాతం మంది ఉద్యోగులు పని చేసేలా చూస్తున్నామని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఐటీ కంపెనీలన్నీ 100 శాతం మంది ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేసేలా చూడాలని ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు సూచించింది. ఈ మేరకు సెప్టెంబరు 1 నుంచే కార్యాలయాల నుంచే ఉద్యోగులతో పనులు చేయించేలా చూడాలని చెప్పింది. ఇందుకు ఐటీ సంస్థలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. అయితే, ప్రభుత్వ సూచన పట్ల పలు ఐటీ సంస్థలు విముఖత వ్యక్తం చేశాయి. వర్క్-ఫ్రం-హోం వల్ల తమ ఉద్యోగులు మరింత మెరుగ్గా పనిచేస్తున్నారని చెప్పాయి. గూగుల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలు కూడా అక్టోబరు వరకు వర్క్-ఫ్రం-హోం ఇస్తామని ఇప్పటికే ప్రకటించాయని పలు కంపెనీల ప్రతినిధులు గుర్తు చేశారు. వర్క్ ఫ్రం హోం వల్ల ఔట్ పుట్ ఎక్కువగా వస్తోందని చెప్పారు. దేశంలో మూడో దశ కరోనా విజృంభణ తప్పదని పలువురు నిపుణులు హెచ్చరించిన అంశాన్ని కూడా ఆయా కంపెనీల ప్రతినిధులు జయేశ్ రంజన్కు గుర్తు చేశారు. దీంతో ఉద్యోగులకు వైరస్ సోకకుండా చర్యలు తీసుకుంటామని, ఐటీ ఉద్యోగులందరి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వ్యాక్సిన్లు వేస్తామని జయేశ్ రంజన్ చెప్పారు. అంతేగాక, ఆయా కంపెనీల వెలుపల కరోనా పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయా ఐటీ కంపెలు తమ ఉద్యోగులను రిస్క్లో పెట్టలేమని తేల్చి చెప్పాయి. దీంతో ఈ అంశంపై ఐటీ శాఖ ఉన్నతాధికారులు, ఐటీ కంపెనీల ప్రతినిధులతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కార్యాలయాల్లో ఉద్యోగులతో విధులు నిర్వహించేలా చేయడం, అందుకు తగ్గ విధివిధానాలను ఖరారు చేయడం వంటి అంశాలపై ఈ కమిటీ నివేదిక అందించనుంది. కొన్ని రోజుల్లో ఈ కమిటీ సమావేశం కానుంది. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడం వల్ల ఐటీ కంపెనీలు, ఆ సంస్థల ఉద్యోగులకు మేలు జరుగుతున్నప్పటికీ వారి మీద పరోక్షంగా ఆధారపడి వ్యాపారాలు చేసుకుంటోన్న వారికి మాత్రం నష్టాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అంటే రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్ట్, ఆతిథ్య రంగాల వంటి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐటీపై ఇతర రంగాలు ఆధారపడడంతో ప్రభుత్వం ఆ సంస్థల ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేసుకోనివ్వాలని భావిస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ ఆగస్టు మొదటి వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
ఆఫీసు నుంచా.. ఇంటి నుంచా..!
సాక్షి, హైదరాబాద్: ఆతిథ్య, రిటైల్ రంగాల తరహాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కూడా సెప్టెంబర్ నుంచి పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. తద్వారా ఐటీ రంగంపై పరోక్షంగా ఆధారపడి న అనేక మందికి తిరిగి ఉపాధి దొరుకుతుందని భావిస్తోంది. కోవిడ్ థర్డ్వేవ్ను కారణంగా చూపుతూ ఐటీ ఉద్యోగు లు ఆఫీసుల నుంచి పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. మరోవైపు బడా ఐటీ కంపెనీలు వారానికి ఐదు రోజుల పని విధానం కాకుండా పరిమిత సంఖ్యలో కార్యాలయాలకు ఉద్యోగులు హాజరయ్యే హైబ్రిడ్ వర్క్ప్లేస్ (కొద్దిరోజులు ఇంటి నుంచి, మరికొద్ది రోజులు ఆఫీసు నుంచి పనిచేయడం) విధానంవైపు మొగ్గు చూపుతున్నాయి. కోవిడ్తో ఉపాధి కోల్పోయిన రవాణా, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ తదితర ఉద్యోగులు మాత్రం ఐటీ ఆఫీసులు తిరిగి కళకళలాడే రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. 10 శాతానికి మించని హాజరు కోవిడ్ మూలంగా ఏడాదిన్నరగా మూతపడిన హైదరాబాద్ ఐటీ కార్యాలయాల్లో సిబ్బంది హాజరు గత జూన్ నాటికి 60శాతానికి చేరుకుంటుందని ఐటీ వర్గాలు అంచనా వేశాయి. అది ఈ ఏడాది చివరి నాటికి 80శాతానికి పైనే ఉంటుందని సర్వే లు వెల్లడించాయి. అయితే గత ఏప్రిల్, మే నెలల్లో కోవిడ్ రెండో దశ విజృంభించడంతో ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల హాజరు పదిశాతంగా నమోద వుతోంది. థర్డ్వేవ్ భయంతోపాటు వ్యాక్సినేషన్ పూర్తి కాకపోవడంతో ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో ఐటీ దిగ్గజ సంస్థలు 20 శాతం మంది ఉద్యోగులు బృందాల వారీగా ఆఫీసు నుంచి పనిచేసేలా ‘హైబ్రిడ్’విధానాన్ని తెరమీదకు తెస్తున్నాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, విప్రో వంటి సంస్థలు వారంలో రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు వచ్చేలా ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నాయి. ఇతరుల సమస్యలనూ అర్థం చేసుకోండి వ్యాక్సినేషన్ వేగం పెరగడంతోపాటు రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వి«ధానంతో ఆ రంగంపై ఆధారపడిన ట్యాక్సీ డ్రైవర్లు, క్యాంటీన్లు, హౌజ్ కీపింగ్, సెక్యూరిటీ, ఇతర సర్వీసు ప్రొవైడింగ్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ రంగం కూడా సెప్టెంబర్ నుంచి పూర్తి సామర్థ్యం తో పనిచేయాలని కోరుకుంటున్నాం. వారిపై ఆధారపడిన ఇతర రంగాల వారి సమస్యలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. – జయేశ్ రంజన్, ముఖ్య కార్యదర్శి, ఐటీ, పరిశ్రమల శాఖ డిసెంబర్ నాటికి మెరుగవుతుంది కోవిడ్ పరిస్థితుల్లోనూ హైదరాబాద్ ఐటీ రంగం మంచి పురోగతి సాధిస్తోంది. రాష్ట్రంలోని 1,500కు పైగా ఐటీ కంపెనీల్లో సుమారు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. 2020–21లో 13 శాతం వృద్ధిరేటుతో 1.45 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. వచ్చే ఏడాది కూడా రెండంకెల వృద్ధిరేటు సాధించడం ఖాయం. ఆఫీసు నుంచే పనిచేయాలని భారతీయ కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తుండగా, దిగ్గజ సంస్థలు హైబ్రిడ్ విధానానికి మొగ్గు చూపుతున్నాయి. అందువల్ల డిసెంబర్ నాటికి ఆఫీసుకొచ్చే ఉద్యోగుల శాతం మెరుగవుతుందని అంచనా వేస్తున్నాం. –భరణికుమార్ ఆరోల్, ప్రెసిడెంట్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ -
ఇంజనీరింగ్ విద్యార్థులకు వీఎల్ఎస్ఐ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా పాఠ్యాంశాల ప్రసారాలు అందించిన టీ–శాట్ ఇక ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ప్రత్యేక శిక్షణా ప్రసారాలను అందుబాటులోకి తేనుంది. టాస్క్, పీవీసీ (ఫోటానిక్స్ వాలి కార్పొరేషన్), వేద ఐఐటీ సంయుక్తంగా వెరీ లార్జ్స్కేల్ ఇంటిగ్రేషన్ (వీఎల్ఎస్ఐ) ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్లపై టీ–శాట్ చానళ్ల ద్వారా ఈనెల 26 నుంచి పాఠాలను బోధించనున్నట్టు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. టీ–శాట్ ద్వారా అందించే ఎక్స్పోజర్ ట్రైనింగ్తో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమల పురోగతి, మెరుగైన నైపుణ్యం, ఉద్యోగాల కల్పన, వివిధ సంస్థల సాంకేతికత తదితర అంశాలపై ప్రసారమయ్యే ప్రత్యేక బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 8:15 గంటల నుంచి నేటి ఉదయం 8:15 గంటల నుంచి 10:30 గంటల వరకు టీ–శాట్ నిపుణ చానల్లో ఈ ప్రత్యేక శిక్షణ ప్రసారాలు ఉంటాయని టీ–శాట్ నెట్వర్క్ చానళ్ల సీఈవో ఆర్.శైలేశ్రెడ్డి తెలిపారు. 15 రోజులపాటు 30 గంటలు ఈ ప్రసారాలు కొనసాగుతాయని, సాయంత్రం 7 గంటల నుంచి 9 వరకు పునఃప్రసారమవుతాయని వెల్లడించారు. టీ–శాట్ నిపుణ చానల్తోపాటు టీశాట్ ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్లోనూ ఈ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. సందేహాల నివృత్తి కోసం 040–23540326, 23540726, టోల్ఫ్రీ నంబర్ 18004254039లను సంప్రదించాలని శైలేశ్రెడ్డి చెప్పారు. -
ఐటీ ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పాలసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో వివిధ కేటగిరీల అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట రంగాల వారీగా (సెక్టోరల్) ప్రత్యేక పాలసీలు విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఐటీ ఎంఎస్ఎంఈ రంగానికి కూడా ప్రత్యేక పాలసీ రూపొందించాలని నిర్ణయించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం ఎగుమతుల్లో జాతీయ స్థాయి కంటే మెరుగైన వృద్ధి రేటు సాధిస్తున్న తెలంగాణ 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1.40 లక్షల కోట్ల ఎగుమతులు సాధి స్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ రంగం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 5.82 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోంది. అయితే రాష్ట్రంలో ఈ రంగానికి వెన్నుదన్నుగా ఉంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎంఎస్ఎంఈ) కరోనా పరిస్థితుల్లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో 1,200కు పైగా ఎంఎస్ఎంఈలు ఉండగా, ఉద్యోగాల కల్పన, ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులు, ప్రభుత్వా నికి ఆదాయం సమకూర్చడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రంలోని ఐటీ ఉద్యోగుల్లో సగానికిపైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల్లోనే పనిచేస్తున్నారు. అయితే ఏడాది క్రితం మొదలైన కరోనా సంక్షోభం ఇంకా కొన సాగుతుండటంతో ఎంఎస్ఎంఈలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దీంతో ప్రత్యేక విధానం ప్రకటించాలని హైసియా, నాస్కామ్ వంటి సంస్థలతో పాటు ఐటీ ఎంఎస్ఎంఈలు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ప్రత్యేక ఐటీ టవర్, ఆఫీస్ స్పేస్ కావాలి ఐటీ ఎంఎస్ఎంఈల కోసం రూపొందించే ప్రత్యేక పాలసీలో చేర్చాల్సిన అంశాలపై హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా), ఇతర ఎంఎస్ఎంఈలు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రత్యేక ఐటీ టవర్ నిర్మించి, అందులో ఒక్కో కంపెనీకి కనీసం 20 మంది కూర్చునేలా ఆఫీసు స్పేస్ను కేటాయించాలని కోరాయి. కంపెనీలు తమ నిర్వహణ వ్యయం తగ్గించుకునేందుకు వీలుగా ఐటీ టవర్లోని కిచెన్, సమావేశ మందిరాలు వంటి వసతులు అందరూ ఉపయోగించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశాయి. తమకు కేటాయించే ఆఫీస్ స్పేస్కు తక్కువ అద్దె చెల్లించేలా సబ్సిడీ ఇవ్వాలని కోరాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటయ్యే ఐటీ ఎగ్జిబిషన్లలో ఎంఎస్ఎంఈలకు స్టాల్స్ కేటాయించడం, ఇతర మౌలిక వసతులు, ప్రోత్సాహకాలతో ‘సెక్టోరల్ పాలసీ’ రూపొందించాలని ఎంఎస్ఎంఈలు కోరుతున్నాయి. సర్కారు చేయూత.. కరోనా మూలంగా రాష్ట్రంలో ఇతర రంగాలు దెబ్బతిన్నా మొత్తంగా ఐటీ రంగం మాత్రం పురోగతి సాధిస్తోంది. 2019–20లో రాష్ట్రంలో 18 శాతం వృద్ధిరేటు సాధించిన ఐటీ రంగం 2020–21లో ఆరు నుంచి ఏడు శాతం మేర వృద్ధి నమోదు చేసే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది చివరిలోనే ప్రత్యేక సలహా కమిటీ ఏర్పాటు చేసింది. హైసియా, నాస్కామ్తో పాటు ఐటీ విభాగం అధికారులు ఈ ప్రత్యేక సలహా కమిటీలో సభ్యులుగా ఉంటారని ఐటీ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ పరంగా చేపడుతున్న ఐటీ ప్రాజెక్టులన్నీ పెద్ద కంపెనీల చేతుల్లోకి వెళ్తుండగా, కరోనా పరిస్థితుల్లో 30 శాతం ప్రాజెక్టులను చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయించింది. కాగా ఎంఎస్ఎంఈలు కన్సార్షియంగా ఏర్పాటై పెద్ద ఐటీ ప్రాజెక్టులను చేపట్టేలా ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందిస్తోంది. సెక్టోరల్ పాలసీతో మరింత మందికి ఉపాధి ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈలు మనుగడ సాధించేలా ప్రత్యేక పాలసీ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. ఎంఎస్ఎంఈలు కూడా తమ సామరŠాధ్యన్ని పెంచుకునేలా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉండాలని కోరుతున్నాం. సెక్టోరల్ పాలసీ ద్వారా ఐటీలో ఎంఎంఎస్ఈ రంగం మరింత మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఐటీ ఉత్పత్తుల్లోనూ మరింత క్రియాశీలంగా పనిచేస్తుంది. - భరణికుమార్ ఆరోల్, అధ్యక్షులు, హైసియా త్వరలో ప్రత్యేక పాలసీ విడుదల ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల రంగంతో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీలోనూ తెలంగాణ రాష్ట్రం అనేక కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేథస్సు (ఏఐ) వంటి వాటిని ప్రోత్సహించేందుకు ‘సెక్టోరల్ పాలసీ’ని ప్రకటించాం. ఐటీ రంగంలో పనిచేస్తున్న ఎంఎస్ఎంఈలు కరోనా సంక్షోభంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో త్వరలో వీటి కోసం కూడా ప్రత్యేక ‘సెక్టోరల్ పాలసీ’ విడుదల చేస్తాం. - జయేశ్ రంజన్, ముఖ్య కార్యదర్శి, ఐటీ పరిశ్రమల శాఖ -
హైదరాబాద్లో త్రీడీ ఉత్పత్తుల తయారీ
సాక్షి, హైదరాబాద్: అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా(ఏఎంఎస్ఐ).. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖతో కలసి హైదరాబాద్లో జాతీయ అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ (ఎన్సీఏఎం)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కంప్యూటర్ ఆధారిత డిజైన్ల ఆధారంగా భారీ స్థాయిలో వాణిజ్య పరంగా త్రీడీ ప్రింటింగ్ ఉత్పత్తులను తయారు చేయడాన్ని అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ (ఏఎం)గా వ్యవహరి స్తున్నారు. హైదరాబాద్లో ఏర్పాటయ్యే ఈ సెంటర్ ద్వారా జాతీయ స్థాయిలో అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ ప్రణాళికను అమలు చేస్తారు. రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగం ఇటీవల అడిటివ్ మాన్యుఫాక్చరింగ్కు సంబంధించి వర్క్షాప్ను కూడా నిర్వహించింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ వర్క్షాప్లో స్టార్టప్లు, శిక్షణ సంస్థలు, అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ సంస్థలు 40కి పైగా పాల్గొన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏఎం పరిశ్రమను తీర్చిదిద్దేందుకు అనుసరించాల్సిన ప్రణాళిక, వ్యూహంపై ఇందులో చర్చించారు. దేశీయంగా ఏఎం పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా దేశీయ మార్కెట్ విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, ఏఎం రంగం అభివృద్ధికి భారత్ను కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఎన్సీఏఎం పనిచేస్తుందని వర్క్ షాప్ అభిప్రాయపడింది. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి తదితరాలకు అవసరమైన మౌలిక వసతులను హైదరాబాద్లో ఎన్సీఏ ఎంలో ఏర్పాటు చేస్తారు. అడిక్టివ్ మాన్యుఫాక్చరింగ్కు సంబంధించి ఆవిష్కరణ, పరిశోధన వసతులు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. చదవండి: కేసీఆర్ వ్యూహం: ఒవైసీ అనూహ్య నిర్ణయం చైన్ కట్ చేయకుంటే జూన్లో మళ్లీ విజృంభణ -
వెయ్యి కోట్లతో ‘మాస్’... జీసీసీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్లో ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిన హైదరాబాద్కు మరో దిగ్గజ సంస్థ రానుంది. అమెరికాకు చెందిన ప్రముఖ జీవిత బీమా, ఆర్థిక సేవల సంస్థ... మసాచుసెట్స్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ (మాస్ మ్యూచువల్) కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ నగరంలో తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కెపబిలిటీ సెంటర్)ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దశల వారీగా ఈ పెట్టుబడులను మాస్ మ్యూచువల్ సంస్థ పెట్టనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ఏర్పాటు నేపథ్యంలో మాస్ మ్యూచువల్ ఇండియా అధిపతి రవి తంగిరాల, సంస్థ కోర్ టెక్నాలజీ విభాగాధిపతి ఆర్థర్ రీల్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్, పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్లతో మాట్లాడారు. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ కోసం మాస్ మ్యూచువల్ సంస్థ ఇప్పటికే నియామకాలను చేపట్టిందని, 300 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుందని కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలను కల్పించనుందన్నారు. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో లక్షా యాభై వేల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుందన్నారు. ఈ సంస్థకు ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ నగరాన్ని తమ పెట్టుబడులకు కేంద్రంగా ఎంచుకున్నాయని, ఈ రోజు 170 సంవత్సరాల చరిత్ర కలిగి, ‘ఫార్చూన్ 500’కంపెనీల్లో ఒకటిగా ఉన్న మాస్ మ్యూచువల్ అమెరికా వెలుపల తమ మొదటి గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని మరోసారి రుజువైందన్నారు. రానున్న కాలంలో నగరంలో కంపెనీ పెద్ద ఎత్తున విస్తరణ చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రికార్డు సమయంలో ప్రపంచస్థాయి కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడంలో రవి తంగిరాల చూపిన చొరవను కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ ది బెస్ట్: రవి తంగిరాల మాస్ మ్యూచువల్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటుకు ప్రపంచంలోని అనేక నగరాలను పరిశీలించామని, హైదరాబాద్లో చక్కటి నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ సానుకూల విధానాలకు ఆకర్షితులై ఈ నగరాన్ని ఎంపిక చేశామని మాస్ మ్యూచువల్ ఇండియా హెడ్ రవి తంగిరాల పేర్కొన్నారు. 1851లో ఏర్పాటైన తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆర్థిక, ఇన్సూరెన్స్ సేవలను అందిస్తోందన్నారు. రానున్న రోజుల్లో తమ కంపెనీ కార్యకలాపాలను, ఇతర రంగాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ద్వారా తమ లక్ష్యాలు, అవసరాలను ఇక్కడ ఉన్న టాలెంట్ పూల్ సహకారంతో అందిపుచ్చుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ కంపెనీ అప్లికేషన్ డెవలప్మెంట్, సపోర్ట్, ఇంజనీరింగ్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా భారీ ఎత్తున తమ కంపెనీ నియామకాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అమెరికాలో తమ కంపెనీలో 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. నగరంలోని నిపుణులైన ఉద్యోగుల ద్వారా తమ ఇన్నోవేషన్ లక్ష్యాలను కచి్చతంగా అందుకుంటామన్న విశ్వాసాన్ని ఆర్థర్ రీల్ వ్యక్తం చేశారు. జీసీసీలు ఏం చేస్తాయి? గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ)లు నిపుణులైన ఉద్యోగులను, అత్యుత్తమ మౌలిక సదుపాయాలను ఒకేచోట కేంద్రీకృతం చేసి తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాయి. బ్యాక్ ఆఫీసు సేవలు, కార్పొరేట్ వ్యాపార మద్దతు కార్యకలాపాలు, కాల్ సెంటర్ల సేవలు ఇక్కడి నుంచి కొనసాగిస్తాయి. అలాగే ఐటీ సేవల విషయానికి వస్తే... యాప్ల అభివృద్ధి, నిర్వహణ, రిమోట్ ఐటీ ఇ్రన్ఫాస్ట్రక్చర్, హెల్ప్ డెస్క్లు ఈ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల నుంచే నిర్వహిస్తారు. ఈ ఏకీకృత సేవల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తాయి. కొన్ని పెద్ద అంతర్జాతీయ కంపెనీలు ఈ జీసీసీలను నూతన అవిష్కరణల కేంద్రాలుగా కూడా ఉపయోగించుకుంటాయి. ఈ సామర్థ్య కేంద్రాల మూలంగా మాతృసంస్థలకు మూడు నుంచి ఐదేళ్ల వ్యవధిలో నిర్వహణ వ్యయంలో సగటున దాదాపు 45 శాతం వరకు ఆదా అవుతుందని అంచనా. -
స్వయం సమృద్ధికి తెలంగాణ విధానాలు స్ఫూర్తి
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడుల ఆకర్షణ మొదలుకుని పరిపాలన, పథకాల అమల్లో తెలంగాణ స్వయం సమృద్ధి సాధన దిశగా పయనిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. తెలంగాణ నుంచి ఇతరులు స్ఫూర్తి పొందాల్సిన అవసరముందన్నారు. యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం శుక్రవారం నిర్వహించిన అమెరికా ఇండియా వర్చువల్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. కరోనా సంక్షోభంలోనే అనేక అవకాశాలున్నాయని, దేశంలోని ప్రగతిశీల రాష్ట్రాలు చేపడుతున్న కార్యక్రమాలు, విధానాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. ప్రపంచ దేశాలతో పోల్చిచూస్తే సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ)లో తెలంగాణకు టాప్ 20లో చోటు దక్కే అవకాశముందని వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఆరేళ్లుగా టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చదువుతూ పనిచేసుకునే రీతిలో డ్యూయల్ డిగ్రీ విధానం తేవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. డిజిటలైజేషన్ ద్వారానే సేవలు.. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటలైజేషన్ ద్వారానే అనేక సేవలు అందుకునే అవకాశముందని కేటీఆర్ అన్నారు. విద్యా రంగంలో డిజిటలైజేషన్ అవసరముందని చెప్పారు. భారత్లో ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని, టీహబ్, వీహబ్, టీ వర్క్స్ వంటి వినూత్న కార్యక్రమాలతో ముందుకు పోవాలన్నారు. నూతన ఐటీ సాంకేతికత కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా ఆరోగ్య, వ్యవసాయ రంగాలను మరింత బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తామని మంత్రి ప్రకటించారు. -
సానుకూల విధానాలతోనే పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోకి పెట్టుబడులు రప్పించేందుకు సానుకూల విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటీవల ఎలక్ట్రానిక్ వాహన పాలసీని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో శనివారం ‘ఇండియా ఎట్ 75’ సదస్సులో ‘స్థానిక, ప్రపంచ స్థాయి నైపుణ్యాలు, ఆవిష్కరణలు, పెట్టుబడుల మేళవింపు– భారత్లో సాంకేతిక పునరుద్ధరణ’అనే అంశంపై కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. కోవిడ్ మహ మ్మారి సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇంటి నుంచి పనిచేయడం, డిజిటల్ సొల్యూషన్ తదితరాలను ఆచరించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో భారత్ ప్రముఖ పాత్ర భారత్లో ప్రపంచంలోనే అత్యధిక సాంకేతిక మానవ వనరులు ఉండటంతో రెండు దశాబ్దాలుగా ప్రముఖపాత్ర పోషిస్తోందని కేటీఆర్ అన్నారు. సాంకేతికంగా మన స్థానాన్ని పటిష్టం చేసేందుకు కోవిడ్ సంక్షోభం సరైన వేదికగా పనిచేస్తుందన్నారు. 28.6 ఏళ్ల సగటు ఆయుర్దాయువు ఉన్న మానవ వనరుల్లో భారత్లో ఎక్కువగా ఉండటం అనుకూలించే అంశమని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సమగ్రాభివృద్ధి ఆవశ్యకతను నొక్కి చెప్తూ వ్యవసాయం, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ రిటైల్, రోబో డెలివరీ రంగాల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. 5జీ సాంకేతికత భారత్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతోపాటు టెక్నాలజీ రంగంలో భారత్ నాయకత్వ స్థాయికి ఎదిగేందుకు దోహదం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు(ఏఐ), బ్లాక్ చెయిన్, డ్రోన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ ఆధారంగా తెలంగాణ అనేక ప్రాజెక్టులు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించా రు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
మరో రెండేళ్లు ‘వీ హబ్‘ సీఈవోగా దీప్తి రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ‘వీ హబ్’ సీఈవోగా దీప్తిరెడ్డి రావుల సర్వీసును మరో రెండేళ్లు పొడిగిస్తూ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 జనవరి ఒకటిన వీ హబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన దీప్తి ఈ ఏడాది మార్చి 31వరకు సేవలు అందించారు. మరో మూడేళ్ల పాటు ఒప్పంద కాలాన్ని పొడిగించాల్సిందిగా దీప్తి ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో దీప్తి రెడ్డిని రూ.2 లక్షల నెలసరి వేతనంపై మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (తెలంగాణకే నా సర్వీస్!) -
తెలంగాణది భిన్నమైన ముద్ర
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ కంపెనీలు మొత్తం భారతదేశాన్ని ఒక యూనిట్గా కాకుండా తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలను భిన్న యూనిట్గా పరిగణించాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. యూఎస్ఐబీసీ ఇన్వెస్ట్మెంట్ వెబ్నార్లో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. స్థూలంగా అన్ని రాష్ట్రాలను కలిపి చూసినప్పుడు, ప్రత్యేకంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు పెట్టుబడి అవకాశాల్లో చాలా తేడా ఉంటుందన్నారు. గత ఆరేళ్లలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో భిన్నంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ తనదైన ముద్ర వేసిందన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలతో రాష్ట్రం వినూత్న పంథాలో పురోగమిస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ విధానం కింద కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అన్ని రకాల అనుమతులిస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ విధానం విజయవంతం అయిందని, అనుమతులు ఇచ్చిన వాటిలో 80 శాతానికి పైగా పరిశ్రమలు కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించిందన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. కరోనా సంక్షోభంలో ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలబడుతుందన్నారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగానికి సంబంధించి అనుకూల వాతావరణం ఉందని, ప్రస్తుతం అమెరికా వంటి అగ్రరాజ్యం సైతం ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేసే కరోనా మందులపై ఆధారపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. అనేక ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత అతి పెద్ద ప్రాంగణాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయన్నారు. దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైస్ పార్క్ తెలంగాణలో ఉందని, ఈ రంగంలోనూ అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయన్నారు. ఇ న్వెస్ట్మెంట్ వెబ్నార్లో పాల్గొన్న అమెరికన్ కంపెనీల అధినేతలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా టీ–ఐపాస్ విధానం, ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న మద్దతుపైన తెలంగాణ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల అధినేతలు ప్రశంసించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని యూఎస్ఐబీసీ అధ్యక్షురాలు నిషా బిశ్వాల్ తెలిపారు. -
ఐటీ ఉద్యోగులకు హోం ఐసోలేషన్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ను కట్టడి చేయ డంలో భాగంగా ఐటీ రంగ పనుల కోసం విదేశాల నుంచి వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇలా వచ్చిన 1,300 మందిని ‘సెల్ఫ్ ఐసోలేషన్’కు (స్వీయ గృహ నిర్బం«ధం) పంపించింది. రెండు రోజుల క్రితం ఇలా గుర్తించిన వారి సంఖ్య 800 వరకు ఉండగా, సోమవారం సాయంత్రానికి 1,300కు చేరింది. ఇలా గుర్తించిన వారిలో ఎన్ఆర్ఐలతో పాటు విదేశీయులు కూడా ఉన్నట్లు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఐటీ రంగ పనులపై రాష్ట్రానికి వచ్చిన వారిని కనీసం 20 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘సాక్షి’కి వెల్లడించారు. వీరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, కరోనా లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లకు తరలించేలా ఏర్పాట్లు చేశామ న్నారు. ఆన్సైట్ పనులు, క్లైంట్ మీటింగ్లు, సదస్సుల కోసం విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు ఇవ్వాల్సిందిగా ఐటీ కంపెనీలను కోరినట్లు రంజన్ తెలిపారు. 70% ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించిన ప్రభుత్వం ఐటీ రంగానికి మినహాయింపు ఇచ్చింది. సుమారు ఐదున్నర లక్షల మంది పనిచేస్తున్న ఈ రంగం కార్యకలాపాలు దెబ్బతినకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐటీలో పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నారు. చిన్న, మధ్య ఐటీ కంపెనీలు ఇంటి నుంచే పని విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. కార్యాలయాల నుంచే తప్పనిసరిగా పనిచేయాల్సిన సిబ్బందిని బృందాలుగా విభజించి, వారంలో కేవలం 2–3 రోజులే అనుమతించాలని ఐటీ సంస్థలు నిర్ణయించాయి. -
మైండ్ స్పేస్ ఖాళీ కాలేదు : సజ్జనార్
సాక్షి, హైదరాబాద్ : మైండ్ స్పేస్లోని మహిళా ఉద్యోగికి కరోనా వైరస్ లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆ టెకీకి కరోనా వైరస్ లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. మైండ్ స్పేస్లో ఓ మహిళకు కరోనా వచ్చిందన్న అనుమానాల నేపథ్యంలో అధికారులు సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీపీ సజ్జనార్తోపాటు, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆరోగ్యశాఖ డైరక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఐటీ కారిడర్ ఖాళీ కాలేదని, వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (చదవండి : తెలంగాణలో మరో రెండు కరోనా కేసులు!) 23 మందికే వర్క్ ఫ్రమ్ హోమ్ : జయేష్ రంజన్ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశంలో విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా సోకిందని తెలిపారు. డీఎస్ఎమ్ ఉద్యోగికి కరోనా వచ్చిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆ టెకీ వైద్య పరీక్షల రిపోర్ట్స్ రావాల్సి ఉందని.. రేపు ఉదయం వరకు రిపోర్ట్ వస్తాయని అన్నారు. మైండ్ స్పేస్ అంతా ఖాళీ అవుంతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రేపటి నుంచి మైండ్ స్పేస్లోని కంపెనీలన్నీ యథాతథంగా నడుస్తాయని చెప్పారు. వైరస్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న మహిళ భర్తకు కంపెనీ ప్రతినిధులు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో మరో రెండు కంపెనీలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం ఇచ్చాయని అన్నారు. అయితే కంపెనీలు ఖాళీ చేయాల్సిన అవరసరం లేదని ప్రభుత్వం తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి ఇచ్చేటప్పుడు ఐటీ, పరిశ్రమల శాఖకు తెలపాలని సూచించారు. తమ అనుమతి లేకుండా కంపెనీలు ఖాళీ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. డీఎస్ఎమ్ కంపెనీ ఒక్కరోజు మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించదన్నారు. కేవలం 23 మందికి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చారని తెలిపారు. సహచర ఉద్యోగులుకు కరోనా సోకిందనేది అవాస్తవం అన్నారు. (చదవండి : ఇక క్షణాల్లో కరోనా వైరస్ను గుర్తించవచ్చు!) ఉద్యోగులను విదేశాలకు పంపొద్దు : శ్రీనివాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంగళవారం 45 మందికి పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా వైరస్ నెగెటివ్గా తేలిందన్నారు. మరో ఇద్దరి రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే కరోనా పాజిటివ్గా తేలిన సికింద్రాబాద్ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. కరోనాకు వ్యాక్సిన్ లేదని.. అయినప్పటికీ కేరళలో వైరస్ సోకిన వారి పరిస్థితి మెరుగైందని గుర్తుచేశారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారికే కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇది గాలి ద్వారా సోకే వైరస్ కాదని తెలిపారు. కేవలం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుందన్నారు. చేతులను నిరంతం సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. వచ్చే రెండు నెలల వరకు ఐటీ ఉద్యోగులను విదేశాలకు పంపొద్దని కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. కరోనా గురించి అనుమానాలు ఉంటే 104కు కాల్ చేయవచ్చని చెప్పారు.(చదవండి : 'కరోనాను ఎమర్జెన్సీగా ప్రకటించండి') -
టీఓఏ అధ్యక్షులుగా జయేశ్ రంజన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) అధ్యక్షులుగా రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఎన్నికయ్యారు. ఆదివారం వెలువరించిన ఎన్నికల ఫలితాల్లో ఆయన ప్రత్యర్థి రంగారావుపై 13 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జయేశ్కు 46 ఓట్లు రాగా, రంగారావుకు 33 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీఓఏ నూతన కార్యవర్గం కొలువుదీరింది. సంఘం ప్రధాన కార్యదర్శిగా జగదీశ్వర్ యాదవ్ గెలుపొందగా... జయేశ్ ప్యానల్ అభ్యర్థి జగన్మోహన్ రావు రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. జగదీశ్వర్ యాదవ్కు 41 ఓట్లు రాగా... జగన్మోహన్ రావుకు 39 ఓట్లు లభించాయి. ఉపాధ్యక్షులుగా మొహమ్మద్ అలీ రఫత్, ప్రేమ్రాజ్, సరళ్ తల్వార్, వేణుగోపాలాచారి ఎన్నికయ్యారు. మహేశ్వర్ కోశాధికారి పదవిలో కొలువుదీరనున్నారు. సంయుక్త కార్యదర్శులుగా మల్లారెడ్డి, నార్మన్ ఐజాక్, ఎం. రామకృష్ణ, సోమేశ్వర్ వ్యవహరించనున్నారు. ఈసీ సభ్యులుగా అబ్బాస్, దత్తాత్రేయ, మహేందర్ రెడ్డి, పురుషోత్తం రావు, కోటేశ్వర రావు, టి. స్వామి, కె. రామకృష్ణ, ఇస్మాయిల్ బేగ్, హంజా బిన్ ఒమర్, ఖాజా ఖాన్ నియమితులయ్యారు. అయితే ఎన్నికలు నిర్వహణ తీరును ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా పోటీచేసిన జగన్మోహన్ రావు తప్పుబట్టారు. నైతికంగా తనదే విజయమని అన్నారు. ఐఓఏ ముందుగా 30 సంఘాలకు ఓటు హక్కు ఇవ్వగా దాన్ని తర్వాత 42 సంఘాలకు పెంచారని, ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారిపై ఐఓసీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. నెల రోజుల్లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించి అందులో తాను జయకేతనం ఎగురువేస్తానని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి ఒక వ్యక్తికి బదులుగా మరో వ్యక్తి ఓటు వేశాడని, ఎన్నికలు కుట్ర పూరితంగా జరిగాయని ఆయన ఆరోపించారు.