Uppal: ఆలిని చంపి అదృశ్యమయ్యాడు | Husband Brutally Murdered His Wife In Uppal, More Details Inside | Sakshi
Sakshi News home page

Uppal: ఆలిని చంపి అదృశ్యమయ్యాడు

Jul 13 2024 1:23 PM | Updated on Jul 13 2024 1:49 PM

husband murdered by wife

బాత్రూంలో మృతదేహాన్ని మూటగట్టి పారిపోయిన భర్త 

ఉప్పల్‌: కట్టుకున్న ఇల్లాలిని అనుమానంతో హత్య చేసి పారిపోయిన ఓ భర్త ఉదంతం  ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్‌ ఎలక్షన్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రదీప్‌ బోలా ఆరు నెలల క్రితం నగరానికి వలస వచ్చాడు. 

భార్య మధుస్మిత (24)తో కలిసి వచ్చి ఉప్పల్‌ న్యూ భరత్‌నగర్‌లో అద్దె గదిలో వీరు నివాసముంటున్నారు. వీరికి 10 నెలల కుమారుడు  ఉన్నాడు. ప్రదీప్‌ ఉప్పల్‌ భగాయత్‌లోని కోణార్క్‌ టిఫిన్‌ సెంటర్‌లో మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ప్రదీప్‌ ఉంటున్న ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో  స్థానికులు 100కు డయల్‌ చేసి సమాచారం అందించారు. 

ఉప్పల్‌ పోలీసులు  ఘటన స్థలానికి వచ్చి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూంలో గోనె సంచిలో శవాన్ని కుక్కి  మూటగట్టి ఉంది. అందులోంచి కుళ్లిన దుర్వాసన వస్తోంది. మూటను విప్పి చూడగా నాలుగు రోజుల క్రితం భార్య మధుస్మితను ప్రదీప్‌ హత్య చేసి మూటగట్టి పడేసి.. కుమారుడితో పారి పోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానంతోనే ఆమెను హత్య చేసి పారిపోయి ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement