'వరకట్నం వేధింపులు' భరించలేక వివాహిత తీవ్ర నిర్ణయం! | Married Woman Extreme Decision | Sakshi
Sakshi News home page

'వరకట్నం వేధింపులు' భరించలేక వివాహిత తీవ్ర నిర్ణయం!

Oct 22 2023 2:41 PM | Updated on Oct 23 2023 3:37 PM

Married Woman  Extreme Decision - Sakshi

సాక్షి, మంచిర్యాల: భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్యాంపటేల్‌ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శ్రావణ్‌పల్లికి చెందిన సరిత (25), జెండావెంకటా పూర్‌కు చెందిన గొడిసెల స్వామి ఆరేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. కొంతకాలంవారి దాంపత్య జీవితం సజావుగా సాగింది.

ఏడాది క్రితం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యను అనుమానించడంతో పాటు వరకట్నం తేవాలని వేధిస్తుండేవాడు. ఇదే క్రమంలో శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరగగా సరిత ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గమనించిన స్వామి వెంటనే ఆటోలో మంచిర్యాలలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి మాలోతు జిత్తు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement