మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు | Mehdipatnam to Kandawada TS RTC | Sakshi
Sakshi News home page

మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు

Published Tue, Jul 30 2024 10:16 AM | Last Updated on Tue, Jul 30 2024 10:16 AM

Mehdipatnam to Kandawada  TS RTC

సాక్షి, హైదరాబాద్‌: మెహిదీపట్నం నుంచి కందవాడకు బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు మెహిదీపట్నం–కందవాడ (592) రూట్‌లో మూడు ట్రిప్పులు ప్రతిరోజు రాకపోకలు సాగించనున్నాయి. 

ఈ బస్సులు నానల్‌నగర్, లంగర్‌హౌస్, టీకే బ్రిడ్జి, బండ్లగూడ, ఆరెమైసమ్మ, తెలంగాణ పోలీస్‌ అకాడమీ జంక్షన్, గోల్డెన్‌ఫామ్స్, మల్కాపురం, పుల్లుట్ట, కేసారం, చేవెళ్ల మీదుగా కందవాడకు రాకపోకలు సాగిస్తాయి. 

మెహిదీపట్నం నుంచి ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1.30, సాయంత్రం 3.55 గంటలకు బయలుదేరుతాయి. అలాగే కందవాడ నుంచి ఉదయం 9.25 గంటలకు, మధ్యాహ్నం 2.45, సాయంత్రం 5.10 గంటలకు  తిరిగి మెహిదీపట్నంకు  బయలుదేరుతాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement