
సాక్షి, హైదరాబాద్: మెహిదీపట్నం నుంచి కందవాడకు బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు మెహిదీపట్నం–కందవాడ (592) రూట్లో మూడు ట్రిప్పులు ప్రతిరోజు రాకపోకలు సాగించనున్నాయి.
ఈ బస్సులు నానల్నగర్, లంగర్హౌస్, టీకే బ్రిడ్జి, బండ్లగూడ, ఆరెమైసమ్మ, తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, గోల్డెన్ఫామ్స్, మల్కాపురం, పుల్లుట్ట, కేసారం, చేవెళ్ల మీదుగా కందవాడకు రాకపోకలు సాగిస్తాయి.
మెహిదీపట్నం నుంచి ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1.30, సాయంత్రం 3.55 గంటలకు బయలుదేరుతాయి. అలాగే కందవాడ నుంచి ఉదయం 9.25 గంటలకు, మధ్యాహ్నం 2.45, సాయంత్రం 5.10 గంటలకు తిరిగి మెహిదీపట్నంకు బయలుదేరుతాయి.
Comments
Please login to add a commentAdd a comment