Five From State Police Win Union Home Minister Medal- Sakshi
Sakshi News home page

నేర పరిశోధనలో ప్రతిభకు ‘పతకం’

Aug 13 2021 4:41 AM | Updated on Aug 13 2021 2:33 PM

Talent Award For Five State police Officers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ఐదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోంమంత్రి ప్రతిభా పురస్కారాలు లభించాయి. 2021వ సంవత్సరానికిగానూ నేర పరిశోధనలో అత్యంత ప్రతిభావంతులకు ఏటా ఇచ్చే కేంద్ర హోంమంత్రి ప్రతిభా పురస్కారాలను గురువారం హోంశాఖ ప్రకటించింది. అధికారులను ప్రోత్సహించడానికి 2018 నుంచి ఈ పురస్కారాలు అందిస్తున్నారు.

అవార్డులు లభించిన వారిలో 15 మంది సీబీఐకి చెందినవారు కాగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి 11 మంది చొప్పున, ఉత్తరప్రదేశ్‌ నుంచి 10 మంది, కేరళ, రాజస్తాన్‌ నుంచి 9 మంది చొప్పున, తమిళనాడు నుంచి 8 మంది, బిహార్‌ నుంచి ఏడుగురు, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ పోలీసు శాఖల నుంచి ఆరుగురు చొప్పున, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఐదుగురు ఉన్నారు. పురస్కారాలు లభించినవారిలో 28 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 152 మంది అధికారులకు ఈ పురస్కారాలు లభించాయి.  తెలంగాణ నుంచి ఎంపికైన అధికారులు నాయిని భుజంగరావు(ఏసీపీ), ఎలిగేటి మధుసూదన్‌ (డీఎస్పీ), ఎన్‌.శ్యామ్‌ ప్రసాదరావు (ఏసీపీ), జి.శ్యామ్‌సుందర్‌ (ఏసీపీ), నేనావత్‌ నగేశ్‌(ఎస్‌ఐ) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement