ట్రిపుల్‌ ఐటీలో 20,178 మంది దరఖాస్తు  | Telangana: Basara IIIT Admission Process | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీలో 20,178 మంది దరఖాస్తు 

Published Tue, Aug 17 2021 3:59 AM | Last Updated on Tue, Aug 17 2021 3:59 AM

Telangana: Basara IIIT Admission Process - Sakshi

భైంసా(ముధోల్‌): నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అధికారులు ఈసారి పాలిసెట్‌ అర్హతతో సీట్లు కేటాయించనున్నారు. ఈ నెల 2న ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, 12 వరకు గడువు ప్రకటించారు. ప్రత్యేక కేటగిరీ కింద ఈ నెల 14 వరకు సడలింపు ఇచ్చారు. దీంతో 20,178 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు లో 19,253 సాధారణ దరఖాస్తులు కాగా, గ్లోబల్‌ కేటగిరీలో 925 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి ఈ నెల 18న జాబితా విడుదల చేయనుంది. గతేడాది 1,500 సీట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ సారి వెయ్యి సీట్లకే పరిమితం చేస్తుందా.. లేదంటే 1,500 సీట్లు కేటాయిస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది. త్వరలో విద్యార్థుల జాబితా ప్రకటిస్తామని ట్రిపుల్‌ ఐటీ ఏవో రాజేశ్వర్‌రావు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement