పవన్ కల్యాణ్ గుంటూరు పర్యటన వాయిదా | pawan-kalyan-guntur-tour-postponed | Sakshi
Sakshi News home page

Mar 2 2015 3:59 PM | Updated on Mar 22 2024 11:23 AM

సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గుంటూరు జిల్లా పర్యటన వాయిదా పడింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సోమవారం నుంచి రెండురోజుల పాటు పవన్ పర్యటించాలనుకున్నారు. అయితే ఆ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన పవన్ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. కాగా బడ్జెట్లో ఏపీకి అన్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రాజధాని కోసం రైతులనుంచి పంట భూములను సమీకరించడంపై ట్విట్టర్‌లో పవన్ ఇటీవల తీవ్రంగా స్పందించడం తెలిసిందే. 'ఎంతో నమ్మకంతో ప్రజలు బీజేపీ-టీడీపీ కూటమిని గెలిపించారు. వారు చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా. రైతులు కన్నీరు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది. లేదంటే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపైనే ఉంది' అని పవన్ ట్వీట్ చేయడం విదితమే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement