అనంతపురం జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. హంద్రినీవా ప్రాజెక్టు పనులపై మంత్రులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి నిలదీయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తిచేసి.. హంద్రినీవా నీటితో హెచ్ఎల్సీ ఆయకట్టును ఎందుకు కాపాడలేకపోయారని ఆయన ప్రశ్నించారు. హంద్రినీవా నీటిపై చంద్రబాబు ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళిక లేదని ఆయన విమర్శించారు. దీంతో ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డితో మంత్రి కామినేని శ్రీనివాస్, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వాగ్వాదానికి దిగారు.
Published Fri, Oct 21 2016 7:27 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement