శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి బలంగా మద్దతిస్తున్న వారిలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి కూడా ఉన్నారు. ఆమెను తక్షణమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను ఆయన బహిరంగంగా డిమాండ్ చేశారు. కానీ ఆయన ఇరవై ఏళ్ల కిందట జయలలిత లక్ష్యంగా పేల్చిన తూటా.. ఇప్పుడు శశికళను కూల్చింది. శశికళ సీఎం కలను కల్లలు చేసి మళ్లీ జైలు పాలు చేసింది.