Subramanian Swamy
-
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యాజ్యం.. కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ
అమరావతి, సాక్షి: తిరుపతి డిప్యూటీ మేయర్ అక్రమ ఎన్నికపై కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ పడింది. ఈ ఎన్నికకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను బుధవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై బీజేపీ ఫైర్బ్రాండ్, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ పిల్ను విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ థాకూర్ బెంచ్.. ఎన్నికపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.Dr Subramaniam @Swamy39 today appeared before the Andhra High Court at Amravati in a PIL challenging the irregularities in the Dy Mayor elections in Tirupati Municipal Corporation, the division bench of the Honble High Court led by Honble Chief Justice Thakur issued notice to the… pic.twitter.com/eiqg91GFpV— Jagdish Shetty (@jagdishshetty) March 12, 2025Today, AP HC issued notice on my PIL seeking investigation in the Tirupati Dy Mayor Elections. Status report by the police department was also directed. Shri Yugandhar Reddy & Ms Palak Bishnoi, Advocates assisted me in the Court.— Subramanian Swamy (@Swamy39) March 12, 2025అలాగే పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు జారీ అయినట్లు సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా జరిగిన ఘటనలను దురదృష్టకరమైన సంఘటనలుగా ఆయన ఇంతకు ముందు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ‘‘చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా’’ అని ఆయన అన్నారు. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే గనుక దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని ఆయన అభిప్రాయడ్డారు. -
వైఎస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: సుబ్రమణ్యస్వామి
-
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీనే: సుబ్రహ్మణ్య స్వామి
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్బ్రాండ్, ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) అంటున్నారు. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు.‘‘తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా. నేను వేసిన పిల్ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది’’ అని మీడియాకు తెలిపారాయన. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారాయన. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయడ్డారు.ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీదేఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్సార్సీపీ(YSRCP)నే ఉంది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష(Principal Opposition) హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైఎస్సార్సీపీకి ఆ హోదా దక్కాల్సిందే అని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉తిరుపతి లడ్డూ అంశం(Tirupati Laddu Controversy) ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు. 👉మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఏపీ కూటమి ప్రభుత్వం (AP Kutami Prabhutvam)లో బీజేపీ భాగమై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీసే అవకాశం లేకపోలేదు. -
చంద్రబాబుపై బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి విమర్శలు
-
ఆ అసత్యాలపై బదులేది బాబూ?
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లడ్డూ విషయంలో అసత్యాలు చెప్పినందుకు అత్యున్నత న్యాయస్థానం మందలించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ఇంతవరకూ సమాధానమే లేదని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. ఈమేరకు తిరుపతి లడ్డూ కల్తీ కేసు విచారణ సందర్భంగా గతేడాది సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ స్వామి ఆదివారం తన ఎక్స్ ఖాతాలో మూడు పోస్టులు చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కోర్టు తీవ్రంగా మందలించిందని, కల్తీ నెయ్యిని వాడారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ‘ఆ అసత్యాలపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదు. ఆయన నిర్లక్ష్యంపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోరు? బాబు ఎప్పడు బీజేపీని వదిలేస్తారు?’ అని ఎక్స్లో స్వామి ప్రశ్నలు సంధించారు.సుప్రీంలో పిల్ దాఖలు చేసిన స్వామి..: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి గతేడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం తెలిసిందే. ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్ధించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్ స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్) వాదనలు వినిపించారు. ఏ నివేదిక ఆధారంగా రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో.. దాన్ని రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను తేల్చాలని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు.దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న కోర్టు..లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ దాఖలైన పిటిషన్పై సెప్టెంబర్ 30న విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తిరుపతి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారంటూ ప్రభుత్వం చేసిన వాదనను నిరూపించేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవంటూ.. ఆ ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన ల్యాబ్ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు.. పరీక్ష కోసం పంపిన నెయ్యిని తిరస్కరించారని, లడ్డూల తయారీకి దాన్ని ఉపయోగించలేదని పేర్కొంది. -
లడ్డూ వివాదంపై సంచలన ట్వీట్..
-
బాబు కొంపముంచిన లోకేష్
-
చంద్రబాబు అబద్ధాల కోరు
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరని, ఆయన అసత్యాలకూ ఓ చరిత్ర ఉందని ప్రముఖ న్యాయవాది, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామి తీవ్రస్థాయిలో ఆరోపించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం హోదాలోని వ్యక్తి ప్రచారం చేయడాన్ని ఖండించారు. చంద్రబాబు దు్రష్పచారాన్ని శ్రీవారి భక్తులెవరూ నమ్మొద్దన్నారు. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం మహా పాపమంటూ చంద్రబాబుకు హితవు పలికారు. తిరుమల లడ్డూ వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్తో కాకుండా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని తాను ‘సుప్రీం’ను ఆశ్రయించినట్లు సుబ్రమణియన్ స్వామి మీడియాకు చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. బాబు మాటలకు, పనులకు పొంతన ఉండదు.. చంద్రబాబును నేను ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నా. ఆయన చేసే పనులకు, చెప్పే మాటలకు పొంతన ఉండదు. గతంలో ఏసుక్రీస్తు ఫొటోలున్నాయని.. కొండపై ఏదో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ అప్పటి సీఎం వైఎస్ జగన్ను టార్గెట్ చేసి ఇలాగే దు్రష్పచారానికి శ్రీకారం చుట్టారు. దీనిపై హైకోర్టుకు ఆధారాలను చూపించలేకపోయారు. నిజానికి.. చాలాఏళ్లుగా టీటీడీలో ఓ విధానం ఉంది.. అంత తేలిగ్గా ఎలా నెయ్యికల్తీ జరుగుతుంది? సిట్తో కాదు.. ‘సుప్రీం’తో విచారణ జరిపించాలి..చంద్రబాబే ఆరోపణలు చేసి ఆయనే తన సిట్తో విచారణ జరిపించడం అనేది సరైంది కాదు. చంద్రబాబు చీప్ట్రిక్స్ అన్నీ బయటకు రావాలంటే ఆయన సిట్తో కాకుండా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలి. ఎందుకంటే.. సిట్ పోలీసులు కేవలం సమాచారం మాత్రమే సేకరిస్తారు.. అదే సుప్రీంకోర్టు అయితే కల్తీ జరిగిందా లేదా అనేది తేలుస్తుంది. అలాగే, ఈ వ్యవహారానికి గల కారణాలు, వెనుక ఎవరున్నారు, ఎందుకు చేశారు అనే విషయాలూ వెలుగులోకి వస్తాయి. అప్పుడు సీబీఐ విచారణ అవసరం ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలా ఇన్ని అబద్ధాలు ఆడుతూ, చీప్ట్రిక్స్కు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు ఉండదు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న అందరినీ జైలుకు పంపే కుట్రలో భాగమే ఈ చిల్లర రాజకీయాలు. -
ఆయన చరిత్ర నాకు తెలుసు సుబ్రహ్మణ్యస్వామి హాట్ కామెంట్స్
-
చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు: సుబ్రహ్మణ్యస్వామి
న్యూఢిల్లీ,సాక్షి : శ్రీవారి లడ్డు వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ వచ్చే శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం రానుంది. ఈ తరుణంలో తిరుమల లడ్డుపై రాజకీయం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుపై సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.సాక్షి టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. గతంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి గతంలో లేనిపోని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు నియమించిన సిట్తో కాకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి. ఈ కేసులో దోషులెవరో తేలాలి. ఈ కేసును తేల్చాల్సింది న్యాయస్థానంలోనే. చంద్రబాబు నియమించిన సిట్తో కాదు. శ్రీవారి భక్తులెవరూ చంద్రబాబు మాటలను నమ్మొద్దు. ఈ అంశంపై సుప్రీంకోర్టు త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. తన రాజకీయ స్వార్థం కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం చంద్రబాబు చేస్తున్న మహా పాపం. శ్రీవారిపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు ఓటమి తప్పదు. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు. కల్తీ జరిగిందా లేదా అనేది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ తేలుస్తుంది’ అని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. -
ప్రసాదం వివాదంపై మరో బిగ్ ట్విస్ట్ .. సుప్రీం కోర్టుకు సుబ్రమణ్య స్వామి
-
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్
-
బాబు వ్యాఖ్యలపై పిటిషన్లు
న్యూఢిల్లీ, సాక్షి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టులో వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలపై దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగానూ సుబ్రహ్మణ్యస్వామి స్వయంగా తెలియజేశారు. తిరుపతి తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. ప్రసాదం కలుషితమైందన్న ఆయన వ్యాఖ్యలు భక్తుల్లో ఆందోళన రేకెత్తించాయి. అందుకే దర్యాప్తునకు ఆదేశించేలా సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను అని పోస్ట్ చేశారాయన.Today I filed a PIL seeking Supreme Court direction to investigate unsubstantiated allegation by CM C.B. Naidu that the Tirupati Tirumala Temple Prasadam were adulterated with meat of animals and other rotten items creating chaos almost bhaktas— Subramanian Swamy (@Swamy39) September 23, 2024 వైవీ సుబ్బారెడ్డి పిటిషన్మరోవైపు వైస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం సుప్రీంలో పిల్ వేశారు. చంద్రబాబు వ్యాఖ్యల సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని ఆయన పిటిషన్లో సుప్రీంను అభ్యర్థించారు. అంతకు ముందు.. తిరుమల లడ్డూ వివాదంపై సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో సీబీఐ లేదంటే ఇతర కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని, దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని ఆయన తన పిటిషన్ ద్వారా కోరారు. -
సీఎం జగన్పై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రశంసలు..
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా హర్డ్ వర్క్ చేస్తున్నారు. సీఎం జగన్కు ప్రజల్లో మంచి క్రెడిబిలిటీ ఉందన్నారు. సీఎం జగన్పై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసలు కురిపించారు. కాగా, సుబ్రహ్మణ్యస్వామి ఈరోజు తిరుమలకు వచ్చారు. ఆంధ్రజ్యోతిపై టీటీడీ 100 కోట్లు పరువునష్టం కేసుకు సంబంధించి కోర్టుకు హాజరయ్యారు. ఇక, ఈ కేసు విచారణను ఈనెల 27వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అనంతరం, సుబ్రహ్మణస్వామి మాట్లాడుతూ ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు గతంలో కాంగ్రెస్తో పొత్తులో భాగంగా సోనియా గాంధీతో కలిశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక జరగాలి. ఎన్నికల కోసం సిద్ధమవ్వాలన్నారు. మరోవైపు, రాష్ట్రంలో సీఎం జగన్ పాలనపై స్పందిస్తూ.. ‘సీఎం జగన్ చాలా హర్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రజల్లో మంచి క్రెడిబిలిటీ ఉంది. మరోసారి అది నిరూపించుకుంటారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా.. విచారణ వాయిదా
సాక్షి, తిరుపతి: బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి శుక్రవారం తిరుపతి జిల్లా కోర్టుకు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్యజ్యోతి ప్రచురించిన అసత్య కథనాలపై టీటీడీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి దినపత్రికపై సుబ్రహ్మణ్యస్వామి వందకోట్ల పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన సుబ్రహ్మణ్య స్వామి.. టీటీడీ జత చేసిన పత్రాలను పరిశీలించారు. అయితే న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు విచారణను కోర్టు ఫిబ్రవరి 5 తేదీకి వాయిదా వేసింది. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. తాను రిజిస్టర్ న్యాయవాది కానందున కేసులు వాదించేందుకు జడ్జి అంగీకరించలేదని తెలిపారు. కేసులో వాదనలు వినిపించేందుకు హైకోర్టు ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు తీసుకు వచ్చానని చెప్పారు. న్యాయవాదుల సమ్మె కారణంగా కేసు వాయిదా పడిందన్నారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు ఆంధ్రజ్యోతి అసత్య వార్తను ప్రచురించారని విమర్శించారు. దీనికి సంబంధించి దేవస్థానం అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించిందని తెలిపారు. చదవండి: TTD: తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు -
చంద్రబాబు, పవన్లపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు హిందూ వ్యతిరేకి అని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. దేశంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రముఖమైనదైన తిరుమల తిరుపతి దేవాలయం (టీటీడీ)పై బాబు, పవన్కల్యాణ్ అసత్యాలు ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హిందూ దేవాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు. హిందూ దేవాలయాలను కించపరిస్తే సహించేది లేదన్నారు. ఢిల్లీల్లో న్యాయవాది సత్య సభర్వాల్తో కలిసి స్వామి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని ఇష్టారీతిన అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ క్రిస్టియన్ అని, తిరుమల ఆలయం సమీపంలో అన్యమత ప్రచారం జరుగు తోందనడం అబద్ధం. ప్రజా క్షేత్రంలో పోరాడలేకే చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నిజానికి.. కాగ్ ద్వారా ఆడిట్కు టీటీడీ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. చదవండి: మహిళా కమిషన్ను పవన్ గౌరవించడం లేదు: వాసిరెడ్డి పద్మ వారి ఆరోపణలు అసత్యమని రుజువుచేస్తా వైఎస్సార్సీపీ నేతలు తప్పుడు రశీదులిచ్చి శ్రీవాణి ట్రస్టు ద్వారా సొమ్ములు లూటీ చేస్తున్నా రని చంద్రబాబు, పవన్కల్యాణ్ ఆరోపిస్తున్నారు. నేను శ్రీవాణి ట్రస్టును సందర్శించి వారి ఆరోపణలు అవాస్తవమని రుజువు చేస్తా. చంద్రబాబు, పవన్ కల్యాణ్ల వ్యాఖ్యలు మతప్రాతిపదికన శతృత్వం సృష్టించేలా ఉన్నాయి. ఉద్దేశ/దురుద్దేశపూర్వకంగా భక్తుల మతపరమైన భావాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇక టీటీడీలో అవకతవకలు జరిగాయంటూ ఢిల్లీ వచ్చి అసత్యా లు ప్రచారం చేస్తున్నారు. తిరుమల ఆలయ ప్రతిష్ట తగ్గించేలా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై నేను వేసిన పరువు నష్టం దావా కేసు పురోగతిలో ఉంది. చదవండి: పవన్ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే.. ఇదిగో సాక్ష్యం -
రాహుల్ కొత్త పాస్పోర్ట్ ప్రయత్నం.. సుబ్రమణ్యస్వామి కౌంటర్ ఇదే..
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. ఈ నెల 31 నుంచి రాహుల్.. పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, రాహుల్.. జూన్ 4న న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఏర్పాటు చేసే బహిరంగ సభతో పాటు వాషింగ్టన్, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక, రాహుల్ అమెరికా పర్యటన నేపథ్యంలో కొత్త పాస్పోర్టు కోసం ఢిల్లీ హైకోర్టును కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సాధారణ పాస్పోర్టును పొందేందుకు అనుమతి(ఎన్వోసి) ఇవ్వాలని రాహుల్ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం.. మే 26(శుక్రవారం)తేదీన విచారణ జరుపనున్నట్టు స్పష్టం చేసింది. అయితే, మోదీ ఇంటి పేరు వ్యవహారంలో రాహుల్కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో, రాహుల్ తన లోక్సభ సభ్యత్వం కోల్పోవడం, అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే రాహుల్ తన పాస్పోర్టు సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులు సమర్పించారు. అంతకు ముందు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ.. రాహుల్ పాస్పోర్టును సీజ్ చేసింది. దీంతో ఇప్పుడు కొత్తగా సాధారణ పాస్పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. అందుకే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ కొత్త పాస్పోర్టుపై కోర్టును ఆశ్రయించడంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి స్పందించారు. రాహుల్ విజ్ఞప్తిని ఆయన వ్యతిరేకించారు. ఇప్పుడు రాహుల్ గాంధీని విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు ఆటంకం కలుగుతుందని సుబ్రమణ్యస్వామి తెలిపారు. పాస్పోర్టు ఇవ్వకపోవడమే మంచిదని పరోక్షంగా స్పష్టం చేశారు. #Breaking BJP leader Subramanian Swamy opposes Rahul Gandhi's plea for grant of a fresh passport. Swamy says that if Gandhi is allowed to travel abroad, it may hamper the probe in the National Herald case. #RouseAvenueCourt @RahulGandhi @Swamy39 #Passport pic.twitter.com/tO28Q5ykjm — Bar & Bench (@barandbench) May 24, 2023 ఇది కూడా చదవండి: పెద్ద నోట్ల రద్దు.. ఇంతకీ వాటిని ఏం చేశారు.. ఎక్కడున్నాయో తెలుసా? -
ఆర్బీఐ, సీబీఐకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), దర్యాప్తు సంస్థ సీబీఐకు సోమవారం నోటీసులు జారీ చేసింది. బ్యాంకు రుణాల మోసం కేసుల్లో ఆర్బీఐ నామినీ డైరెక్టర్, ఇతర సిబ్బంది పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం తాజా నోటీసు లిచ్చింది. వివిధ బ్యాంకింగ్ స్కామ్లలో ఆర్బీఐ అధికారుల పాత్రపై విచారణ జరపాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పీటీషన్ను సుప్రీం విచారణకు స్వీకరించింది. జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం బీజేపీ నేత పిటిషన్పై సమాధానం ఇవ్వాలని ఆర్బీఐ, సీబీఐను కోరింది. కాగా కింగ్ఫిషర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యెస్ బ్యాంక్ లాంటి వివిధ కుంభకోణాల్లో ఆర్బీఐ అధికారుల ప్రమేయంపై విచారణ జరగలేదని స్వామి ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంతో సహా, పలు చట్టాలను ప్రత్యక్షంగా ఉల్లంఘిస్తూ ఆర్బీఐ అధికారులు నిర్లక్క్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. Supreme Court issues notice to Reserve Bank of India (RBI) and Central Bureau of Investigation (CBI) on a plea filed by BJP member Subramanian Swamy seeking a CBI probe into the alleged role of RBI's nominee director in bank loan fraud cases. — ANI (@ANI) October 17, 2022 -
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఇందుకు ఆరు వారాలు గడువిస్తూ నోటీసులు పంపింది. సుబ్రహ్మణ్యస్వామికి కేంద్రం 2016 జనవరిలో ఢిల్లీలో అధికారిక నివాసం కేటాయించింది. రాజ్యసభ ఎంపీ అయిన ఆయన పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్లో ముగిసింది. దీంతో బంగ్లాను ఇతర ఎంపీలకు కేటాయించాల్సి ఉన్నందున ఆయన ఖాళీ చేయాలని కోర్టు సూచించింది. సుబ్రహ్మణ్యం రియాక్షన్.. అయితే బంగ్లా ఖాళీ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. 2016లో తాను ఎంపీ కాకముందే భద్రతా కారణాల దృష్ట్యా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తనకు జడ్ ప్లస్ కేటగిరీతో ఢిల్లీలో బంగ్లా కేటాయించారని పేర్కొన్నారు. ఆ తర్వాత తాను ఎంపీ అయ్యాక అదే బంగ్లాలో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. తనకు బంగ్లా కావాలని ఎప్పుడూ ఎవర్నీ అడగలేదని స్పష్టం చేశారు. అయితే పాత ఒప్పందం మళ్లీ కొనసాగుతుందా అని భద్రతా అధికారులకు లేఖ రాశానని వివరించారు. ఈ విషయంపైనే కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కానీ కేంద్రం తనకు బంగ్లా కేటాయించలేమని చెప్పిందని పేర్కొన్నారు. అందులో ఇబ్బందేమీ లేదని, తాను బంగ్లా ఖాళీ చేస్తానని స్పష్టం చేశారు. చదవండి: డబ్బు, అధికార మదంతో బీజేపీ సిగ్గుచేటు చర్య -
బ్రహ్మణేతర అర్చకులు.. స్టాలిన్ సర్కార్కు నోటీసులు
ఢిల్లీ/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆలయాల్లో బ్రహ్మణేతరులను అర్చకులుగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్ ఆధారంగా.. నియామకాలపై వివరణ కోరుతూ స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఈ మేరకు సుప్రీం కోర్టులో స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం, బ్రహ్మణేతరులను ఆలయ అర్చుకులుగా నియమించడం లాంటి స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ స్వామి ఈ పిటిషన్ వేశారు. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాగానే.. ఎన్నికల హామీలో భాగంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని కులాల వాళ్లను ఆలయ అర్చుకులుగా నియమిస్తామని మాటిచ్చారు ఆయన. ఈ మేరకు అర్చక శిక్షణ తీసుకున్న పలువురిని కిందటిఏడాదిలో అగస్టులో అర్చకులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ విభాగం.. సుమారు 208 మందికి అర్చక ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. అయితే.. ఈ నియామకాలపై బీజేపీ నేత స్వామి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తండ్రి కరుణానిధిలాగే.. తనయుడు స్టాలిన్ కూడా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని, దీనిపై కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు కూడా. ఈ మేరకు ‘‘స్టాలిన్.. ఆయన తండ్రిలాగా ఆలయాల విషయంలో తప్పులు చేయరనే అనుకుంటున్నా. స్టాలిన్ 2014లో సభనాయాగర్ నటరాజ్ ఆలయ విషయంలో సుప్రీం కోర్టు నుంచి చివాట్లు తిన్న విషయం మరిచిపోయారేమో!. ఇప్పుడు ఆలయాల అర్చకుల విషయంలో తప్పు చేస్తుంటే ఊరుకోను. కోర్టుకు వెళ్లాల్సి వస్తే.. వెళ్తానంటూ కిందటి ఏడాది ఆగస్టులో స్వామి ఓ ట్వీట్ కూడా చేశారు. ఇదీ చదవండి: ఇంటి నుంచి వెళ్లగొట్టారు.. ఆజాద్ ఆవేదన -
నిర్మలా సీతారామన్పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాల డిమాండ్పై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి సెటైర్లు వేశారు. ఆర్థిక మాంద్యం భయాలు, భారత్ కరెన్సీ రూపాయి విలువ పతనం తదితర అంశాలను ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ దేశంలో మాంద్యం పరిస్థితులన్న ప్రశ్నేలేదని స్పష్టం చేశారు. డాలర్ మారకంలోభారత్ రూపాయి విలువ కుప్పకూలలేదని అది తన సహజ స్థాయిని కనుగొంటోందని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ వ్యంగ్యంగా స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే ప్రసక్తే లేదు.. నిజమే, ఆమె సరిగ్గా చెప్పారు. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ ఏడాది క్రితమే మాంద్యంలోకి జారుకుందంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఇక మాంద్యం లోకి జారుకోవడం అనే ప్రశ్న లేదంటూ విమర్శించారు. తద్వారా దేశ ఆర్థికపరిస్థితి, నిర్మలా సీతారామన్ ప్రకటనపై ట్వీట్ చేసి మోదీ సర్కార్పై వ్యంగ్య బాణాల్ని సంధించడమే కాదు, తీవ్ర చర్చకు తెర తీశారు. (ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!) “No question of the Indian economy getting into recession” says Finance Minister according to media today. She is right!! Because Indian economy has already got into recession last year. So question of getting into recession does not arise. — Subramanian Swamy (@Swamy39) August 2, 2022 కాగా ద్రవ్యోల్బణంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రకటన సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేశారు. కోవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్లు,సంక్షోభం ఉన్నప్పటికీ దేశం మంచి స్థితిలోనే ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ నిలుస్తోందని, అలాగే పరిస్థితులను నియంత్రించేందుకు రిజర్వు బ్యాంక్ చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు. ముఖ్యంగా అమెకా పరిస్థితిని ప్రస్తావిస్తూ, భారత్లో మాంద్యం వచ్చే ప్రశ్నే లేదని సీతారామన్ తెలిపిన సంగతి తెలిసిందే. (బ్లెస్సింగ్స్ అడిగిన కస్టమర్కు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే రిప్లై) -
బీజేపీకి బిగ్ షాక్.. అమిత్ షా, జై షాపై కమలం నేత సంచలన కామెంట్స్
ఐపీఎల్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చే గేమ్. రిచ్ టోర్నీగా పేరొందిన భారత ప్రీమియర్ లీగ్లో పాల్గొనేందుకు వివిధ దేశాల క్రికెటర్లు సైతం ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, సొంత పార్టీ నేతలు, పార్టీ విధానాలపై అప్పుడప్పుడు విమర్శలు చేసే సుబ్రమణ్య స్వామి తాజాగా ఐపీఎల్, అమిత్ షా కుమారుడు జై షాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. సుబ్రమణ్య స్వామి.. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐపై ఒక నియంతలా పెత్తనం చెలాయిస్తున్నాడని ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. మరో అడుగు ముందుకేసి.. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేబట్టబోదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అందుకే దీనిపై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఐపీఎల్లో కొత్త ప్రాంఛైజీకి చెందిన గుజరాత్ టైటాన్స్ కప్ కొట్టింది. అందరి అంచనాలకు తల కిందులు చేస్తూ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ నుంచీ గుజరాత్ వరుస విజయాలతో టాప్లోనే కొనసాగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, సుబ్రమణ్య స్వామి అంతుకుముందు.. జమ్ముకశ్మీర్లో పండిట్లు, హిందువుల హత్యలను ఆపడంతో హెం మంత్రి అమిత్ షా విఫలమయ్యారని ఆరోపించారు. అమిత్ షాకు హోంశాఖ కంటే క్రీడాశాఖనే బాగా సెట్ అవుతుందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. అలాగే, జ్ఞానవాపీ మసీదు వివాదంపై కూడా అమిత్ షాను టార్గెట్ చేసిన సుబ్రమణ్య స్వామి.. మసీదు అంశానికి సంబంధించి షా అనవసరంగా తప్పుడు అంచనాలను పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. There is widespread feeling in intelligence agencies that the Tata IPL Cricket outcomes were rigged. It may require a probe to clear the air for which PIL may be necessary since Govt will not do it as Amit Shah’s son is defacto dictator of BCCI — Subramanian Swamy (@Swamy39) June 2, 2022 ఇది కూడా చదవండి: ‘మీ సీనియర్ నాయకుడి అవినీతిని బట్టబయలు చేస్తాం’ -
దేశం మొత్తం ఒక్కటే డీఎన్ఏ
శ్రీనగర్కాలనీ: దేశం మొ త్తం ఒక్కటే డీఎన్ఏ ఉం దనే విషయాన్ని ఒవైసీకి చెప్పానని, టెస్ట్ చేయించుకోవడానికి రమ్మని సవాల్ విసిరినా, ఆయన ముందుకు రాలేదని మాజీ పార్ల మెంట్సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి అన్నారు. కాశీ విశ్వనాథస్వామి ఆలయాన్ని ముట్టుకోవద్దని ఒవైసీ అంటున్నారని, అక్కడ పూజించే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ శ్రీనగర్కాలనీ సత్యసాయి నిగమాగమంలో ఇస్కాన్ సంస్థకు చెందిన ‘కౌఇజం’ యూ ట్యూబ్ చానల్ ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో చెక్కు చెదరకుండా బతికున్న సంస్కృతి, హిందూ సంస్కృతి మాత్రమేనన్నారు. దేశంలోని ప్రతి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులపై ఉందని తెలిపారు. మన సంస్కృతి, నాగరికత ఆవు తోనే ముడిపడి ఉందని చెప్పారు. గోవును జాతీయ జంతువుగా చేయాలని పోరాడుతున్నామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆవు అని, స్వలాభం కోసం మార్పులు చేసుకుని హస్తం గుర్తుగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఇస్కాన్ చైర్మన్ డాక్టర్ సహదేవ దాసా, బీఎస్ఎఫ్ మాజీ అడిషనల్ డీజీ పి.కె.మిశ్రా పాల్గొన్నారు. -
మద్దతు ధరపై తగ్గేదేలే!
సాక్షి, న్యూఢిల్లీ: రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పించేవరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ పార్టీ తమ పోరాటం కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం మెడలు వంచేందుకు కలిసివచ్చే అన్ని పార్టీలు, సంఘాలతో కలిసి పోరాడేందుకు తాము సిద్ధమని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై తమ పార్టీ ఎంపీలు గట్టిగా కొట్లాడతారని చెప్పినట్టు సమాచారం. ధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాల్సిన ఆవశ్యకతను మరోమారు నొక్కిచెప్పిన సీఎం.. దేశ వ్యాప్తంగా సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయాన్ని, రైతులను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ నూతన విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఐదు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన కేసీఆర్తో గురువారం రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయస్థాయి కూటమి ఏర్పాటు, వ్యవసాయ సమస్యలు, పంటలకు చట్టబద్ధతపై పోరాటం వంటి అంశాలపై చర్చించా రు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవితలు భేటీలో ఉన్నారు. అంతా కలిసి సీఎం నివాసంలోనే మధ్యాహ్న భోజనం చేశారు. బీజేపీతో దేశ సమగ్రతకు ముప్పు పార్టీవర్గాల సమాచారం ప్రకారం.. సుబ్రహ్మణ్య స్వామితో భేటీలో ప్రధానంగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు అంశంపై కేసీఆర్ చర్చించారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లతో తాను జరిపిన భేటీలు, జేడీయూ, ఆర్జేడీ సహా ఇతర పార్టీల నేతలతో చర్చల వివరాలను ఆయనకు తెలియజేశారు. మతతత్వాన్ని బీజేపీ పెంచి పోషిస్తోందని, దీనివల్ల మున్ముందు దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయన్న అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనేందుకు భావసారూప్యత కలిగినపార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు అవసరం ఉందని, ఇందుకోసం తన ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. రైతు పోరాటాలకు సంపూర్ణ మద్దతు రైతు సంఘం నేత టికాయత్తో జరిగిన భేటీలో ప్రధానంగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనలు, చట్టాల రద్దు అనంతరం కేంద్రం తీరు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరిపై ప్రధానంగా చర్చించారు. గత సీజన్లో రాష్ట్రంలో పండించిన ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును వివరించారు. వ్యవసాయానికి ప్రత్యామ్నాయ జాతీయ విధానంపై రైతు సంఘాలు చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. రైతు ఉద్యమంలో చనిపోయిన 750 కుటుంబాలకు సంబంధించి తెలంగాణ ప్రకటించిన రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా అంశం ప్రస్తావనకు రాగా.. మార్చి 10 తర్వాత ఆయా రైతుల జాబితాను అందజేస్తామని టికాయత్ చెప్పారు. తెలంగాణ విధానాలు దేశమంతా అమలవ్వాలి బీకేయూ నేత రాకేశ్ టికాయత్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వంటి రైతు ప్రోత్సాహక పథకాలు దేశమంతటా అమలు కావాలని బీకేయూ నాయకుడు రాకేశ్ టికాయత్ అన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగ అనుకూల విధానాలు అమలవుతున్నాయని, రైతు సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం టికాయత్ మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ నూతన వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పన కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా. అందులో భాగంగానే తెలంగాణ సీఎంను కలిశా. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలుస్తా. వ్యవసాయ రంగం, రైతాంగ సమస్యలపై హైదరాబాద్లో లేదా మరోచోట అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తాం’అని టికాయత్ తెలిపారు. కేసీఆర్తో వ్యవసాయ అంశాల గురించి మాత్రమే చర్చ జరిగిందని, రాజకీయాలపై మాట్లాడలేదని ఆయన తెలిపారు. అయితే రాజకీయాల్లోనూ పోటీ ఉండాలని, పీపుల్స్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వేదికగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఉందని, అలాంటప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. నేడు జార్ఖండ్కు కేసీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శుక్రవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో భేటీ కానున్నారు. రాంచీకి వెళ్లనున్న కేసీఆర్.. చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన జార్ఖండ్కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను కూడా అందజేయనున్నారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్బాబు కుటుంబంతో పాటు 19 మంది అమర జవాన్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని గతంలో సీఎం ప్రకటించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం చర్యలు చేపట్టనున్నారు. -
ఆదాయ పన్ను రద్దు చేయండి
కరోనా వేళ దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతోంది. కోట్ల మంది ప్రజలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒత్తిడి కింద నలిగిపోతున్నారు. కొవిడ్-19 జబ్బు ప్రభావంతో మందుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి కేంద్ర ప్రభుత్వాన్ని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలంటూ సలహా ఇచ్చారు. ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ను రద్దు చేయాలంటున్నారు ఆయన. ఈ పరిస్థితుల్లో ఆదాయ పన్ను వసూళ్లను రద్దు చేయడం ఉత్తమం. అది కొన్నాళ్లపాటు!. ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి ఈ నిర్ణయం ప్రకటించడం ద్వారా ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుంది. పరిస్థితులు సర్దుకుని సాధారణ స్థితికి వచ్చే వరకు పౌరుల నుంచి పన్నులు వసూలు చేయకపోవడం మంచిదే అని ఓ జాతీయ మీడియా హౌజ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రిగా ఉండి ఉంటే మీరు ఏం చేసి ఉండేవారన్న ప్రశ్నకు.. మొదటగా పన్ను వసూళ్లను రద్దు చేస్తా. ఏప్రిల్ 1 నుంచి ఇది దేశ వ్యాప్తంగా వర్తిస్తుందని ప్రకటిస్తా. పరిస్థితుల సాధారణం అయ్యేదాకా అది కొనసాగిస్తా. ఆపై దాన్ని శాశ్వతంగా కొనసాగించడం గురించి ఆలోచిస్తా’ అని పేర్కొన్నారు. ఇక తన వాదనను సమర్థించుకునే క్రమంలో సుబ్రమణియన్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. మార్గాలెన్నో.. బీజేపీ మొదటి దఫా అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నేను ఈ సలహా ఇచ్చా. ఆదాయపు పన్ను ద్వారా సుమారు 4 లక్షల కోట్ల ఆదాయం పొందుతున్నాము. అదే బడ్జెట్ చూసుకుంటే దాదాపు 8-9 లక్షల కోట్ల మధ్య ఉంటోంది. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చు కదా అని చెప్పాను. ఉదాహరణకు.. 2జీ లైసెన్స్ల వేలం. మొదటి వేలంలో దాని ద్వారా ఎంత వచ్చిందో తెలుసా? 4 లక్షల కోట్లు. అంటే ఆదాయ పన్నుల వసూళ్లకి సమానం. పన్నులు పెంచే బదులు.. ఇలాంటి ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ముందర ఎన్నో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారి గాడిన పడిందంటే.. ప్రజలు వాళ్లంతట వాళ్లే పన్నులు చెల్లిస్తారు. అలాగే, రీఇన్వెస్ట్ చేసిన కంపెనీల ఆదాయానికి పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుందని రూల్ పెడితే.. పొదుపు రేటు పెరుగుతుంది. ఆపై వృద్ధి రేటు కూడా పెరుగుతుంది అని స్వామి చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లోనుల మీద వడ్డీ రేటును తగ్గిస్తే (12 నుంచి 9 శాతానికి) మంచిదని, అది ప్రభుత్వం చేతుల్లో ఉందని, బ్యాంకులు కూడా చేసి తీరతాయని సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను 6 నుంచి 9 శాతానికి పెంచడం ద్వారా ప్రజలు సేవింగ్స్కు ముందుకొస్తారని పేర్కొన్నారు. మహమ్మారి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక ఒత్తిడి కారణంగా జీడీపీ వాటా పరంగా గృహాల పొదుపు మొత్తం తగ్గిందని, పెట్టుబడులు కూడా తగ్గాయని స్వామి అంటున్నారు. ప్రపంచ మహమ్మారి విధ్వంసానికి ముందు 2019-20 నాలుగో త్రైమాసికంలో చూసిన వృద్ధి స్థాయిని ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ తిరిగి పొందలేదని సుబ్రమణియన్ స్వామి గుర్తు చేస్తున్నారు. ఆర్థిక అంచనాలు, అధికారిక డేటా ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి బలమైన వృద్ధిని సూచిస్తున్నప్పటికీ.. మిగిలిన త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆధారపడి ఉంటుందని సుబ్రమణియన్ స్వామి అన్నారు. ఇదిలా ఉంటే బడ్జెట్టైంలో సుబ్రమణియన్ స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. అయితే గతంలోనూ ఆయన ఇలాంటి సలహాలే ఇచ్చారు కూడా!. క్లిక్ చేయండి: బడ్జెట్ 2022లో మధ్యతరగతి వర్గానికి ఊరట! -
దేశంలోని నాలుగు లక్షల హిందూ దేవాలయాలపై అసత్య ఆరోపణలు
-
టీటీడీ వెబ్సైట్పై దుష్ప్రచారం.. తెలుగు దిన పత్రికపై దావా: ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, తిరుపతి: హిందూ దేవాలయాలపై ఎక్కడ అసత్య ప్రచారం చేసినా తాను ముందుంటానని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. దేశంలో హిందూ దేవాలయాలు ఎక్కడా ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదని, బ్రాహ్మణులే వంశపారపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదని చెప్పారు. ఈ మేరకు తిరుపతిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. అనువంశిక అర్చకత్వానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. పురాణాల్లో విశ్వామిత్రుడు, వాల్మీకీలు బ్రాహ్మణులు కాకపోయినా ఆధ్యాత్మిక ప్రచారం చేశారని గుర్తు చేశారు. దేశంలోని నాలుగు లక్షల హిందూ దేవాలయాలపై అసత్య ఆరోపణలు చేస్తే తాను సహించనని, న్యాయపోరాటం చేస్తానని సుబ్రమణ్యస్వామి తెలిపారు. చదవండి: థాయ్లాండ్కు చంద్రబాబు.. అంత రహస్యమెందుకో? తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెబ్సైట్తో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారని ఓ తెలుగు దిన పత్రిక ఆరోపణలపై టీటీడీ ఈవో విజ్ఞప్తి మేరకు పరువు నష్టం దావా కేసు వేసినట్లు ఆయన తెలిపారు. అసత్య వార్తలు రాసిన సదరు తెలుగు దినపత్రిక క్షమాపణ చెప్పాలని, రూ. 100 కోట్లు జరిమాన చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. భారత దేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నారని, హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇక తమిళ రాజకీయాల గురించి ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో కరుణానిధి, అన్నాడీఎంకే పార్టీల పాలన దరిద్రంగా సాగిందని.. ఎంకే స్టాలిన్ పాలన ఇంకా చూడలేదన్నారు. చదవండి: నాడు ‘పార్టీలేదు బొక్కాలేదు’.. నేడు చంద్రబాబు గుట్టు రట్టు చేసిన అచ్చెన్న -
సీఎం జగన్ను కలిసిన రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ‘ఆంధ్రజ్యోతి’ కథనం
సాక్షి, అమరావతి: టీటీడీ ప్రతిష్టను దిగజార్చడంతో పాటు, భక్తుల మనోభావాలను దెబ్బతీసి సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి బుధవారం హైకోర్టుకు నివేదించారు. ఈ కేసును పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. కథనాన్ని ప్రచురించే ముందు టీటీడీ అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదన్నారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగానే తాను ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్టు చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.ఈ మేరకు సీజే జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. -
సీఎం జగన్ను కలిసిన ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, తాడేపల్లి : టీటీడీకి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనాల వెనక చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. సొంత లాభం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదన్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు వార్తలు తనను తీవ్రంగా కలిచివేశాయన్నారు. అందుకే ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేశానన్నారు. ఓ కేసు విషయంలో బుధవారం ఏపీకి వచ్చిన ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆయనను సాదరంగా ఆహ్వానించి, శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. భేటీ అనంతరం ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ లావాదేవీలను కాగ్ ద్వారా ఆడిట్ చేయించేందుకు సీఎం జగన్ అంగీకరించారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్తో మంచి సంబంధాలు ఉండేవని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సీఎం జగన్ చర్చలు జరుపుతారని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రధానికి సీఎం జగన్ రెండు సార్లు లేఖ రాశారని గుర్తుచేశారు. అఖిల పక్షం, కార్మిక నేతలతో కలుస్తానని సీఎం చెప్పారన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తాను విభేదిస్తున్నానని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. -
ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేశా
-
ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) గురించి కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. టీటీడీ పరువుకు భంగం కలించేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతిపై రూ. 100 కోట్లు పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. తిరుపతిని సందర్శించిన సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘తిరుమల స్వామి వారి ఆలయం గురించి ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేస్తోంది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు తమను కాపాడతారన్న భావనలో ఆంధ్రజ్యోతి ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిది ఒక మాట.. కానీ, బాబు ఓడిన తర్వాత ఆ మాట మార్చింది. చంద్రబాబుకు ప్రజల మద్దతు లేదు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదు. కుట్రపూరితంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లు పరువునష్టం దావా వేశా. నా జీవితంలో ఎప్పుడూ పరువు నష్టం దావా కేసు ఓడిపోలేదు’’ అని ఆంధ్రజ్యోతి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరును విమర్శించారు. చదవండి: వైఎస్ జగన్కు కృతజ్ఞతలు: బీజేపీ ఎంపీ -
పెట్రో సెగ: కేంద్రంపై బీజేపీ ఎంపీ వ్యంగ్యాస్త్రం
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పెట్రోల్ ధరలు సెంచరీ దాటగా.. తాజాగా బడ్జెట్లో కేంద్రం పెట్రోల్, డీజిల్ మీద వ్యవసాయ సెస్ విధిస్తున్నుట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వగా.. ఈ సెస్ను సుంకం నుంచి మినహాయిస్తామని... వినియోగదారులపై ఈ భారం మోపమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: పెట్రో...కనికట్టు) ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లకు సంబంధించి ఓ వ్యంగ్య ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక దీనిలో ‘‘రామ జన్మభూమిగా భావించే ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయలు.. సీతమ్మవారు పుట్టిన దేశం నేపాల్లో లీటర్ పెట్రోల్ ధర 53 రూపాయలు.. అదే రావణుడి లంకలో పెట్రోల్ లీటర్ 51 రూపాయలు మాత్రమే’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇక దేశంలో ఇంధన రేట్లు పెరిగిన నాటి నుంచి ఈ ఫోటో వైరలవ్వగా.. సుబ్రహ్యణ్య స్వామి ట్వీట్ చేయడంతో మరోసారి ఇది వైరలవుతోంది. ఇక దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. pic.twitter.com/Imrz3OSag7 — Subramanian Swamy (@Swamy39) February 2, 2021 -
వ్యాక్సిన్: సుబ్రమణియన్ స్వామి కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అతిత్వరలోనే అందుబాటులోకి రానుందని భావిస్తున్న కరోనా వైరస్ టీకాకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన ట్వీట్ చేశారు. ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందిస్తున్న కోవిషీల్డ్ వాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కనీసం అత్యవసర వినియోగానికి కూడా ఇంకా అనుమతి ఇవ్వలేదు..ఈ నేపథ్యంలో భారతీయులంతా ప్రయోగాలకు ఉపయోగించుకునే గినియా పిగ్స్లా మారి పోనున్నారా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి సంబంధించి నిపుణుల కమిటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. (తొలి విడతలో 3 కోట్ల మందికి టీకా ఉచితం : కేంద్ర మంత్రి) దీంతో ట్విటర్లో దుమారం రేగింది. ముఖ్యంగా మన శాస్త్రవేత్తల సామర్ధ్యాన్నే తప్పుబడుతున్నారా అని కొంతమంది ప్రశ్నించారు. అలాగే మహమ్మారి గురించి ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టి డబ్ల్యూహెచ్ఓ మొత్తం ప్రపంచాన్నే మోసం చేసింది. అలాంటి సంస్థను ఎందుకు విశ్వసించాలంటూ మరికొంతమంది ట్విటర్ యూజర్లు ప్రశ్నించారు. అయితే టీకాలకు తాను వ్యతిరేకం కాదని, కానీ ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ దేశాన్ని దోచుకోవాలనుకుంటున్న దోపిడీదారులను అనుమతించకూడదంటూ స్వామి సమాధానం ఇచ్చారు. (కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్కు గ్రీన్ సిగ్నల్) మరోవైపు ఈ వ్యాక్సిన్ను బీజేపీ వ్యాక్సిన్ అంటూ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు. తాను వ్యాక్సిన్ను తీసుకోబోనని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నవ్యాక్సిన్ను తానెలా విశ్వసిస్తున్నానంటూ వైద్యులను శాసస్త్రవేత్తలను అవమానిస్తున్నారన్న బీజేపీ విమర్శలనుఆయన తిప్పికొట్టడం విశేషం. WHO hasn't cleared AstraZeneca even for emergency use!! Are Indians going to be Guinea pigs? — Subramanian Swamy (@Swamy39) January 2, 2021 -
బాబులో ‘కాగ్’ వణుకు
సాక్షి, అమరావతి: టీటీడీ నిధుల వినియోగంపై కాగ్తో దర్యాప్తునకు అనుకూలంగా ప్రస్తుత పాలక మండలి తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్ష నేత చంద్రబాబులో వణుకు మొదలయ్యాయని బీజేపీ జాతీయ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. అందుకే తిరుమల శ్రీవారి దర్శనాల్లో డిక్లరేషన్ అంశంపై బాబు అనుకూల మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారన్నారు. స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడూ ఏ మతస్తుడు అన్నది గుర్తించడం కష్టమని.. భక్తుడు తనకు తాను చెబితేగానీ తెలియదనే దాని గురించే టీటీడీ చైర్మన్ మాట్లాడారని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు -
నాకైతే సంబంధం లేదు: సుబ్రహ్మణ్యస్వామి
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రష్యా పర్యటనపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అసహనం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా డిఫెన్స్ మినిస్టర్ వెయి ఫెంఘెతో భేటీ అయిన తర్వాత మళ్లీ జైశంకర్ మాస్కో వెళ్లడం ఎందుకు అని ప్రశ్నించారు. విదేశాంగ విధాన పరంగా.. ఈ ఏడాది మే 5 తర్వాత భారత్, చైనాతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలేవీ లేవని, అలాంటప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ అనవసరం అన్నారు. ఇలాంటి విషయాలు ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను పలుచన చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే స్పందించి భారత విదేశాంగ మంత్రి రష్యా పర్యటనను రద్దు చేయాల్సిందిగా ట్విటర్ వేదికగా విజ్జప్తి చేశారు.(చదవండి: ఎల్ఏసీని గౌరవించాలి) కాగా జూన్లో గల్వాన్లోయలో చైనా ఆర్మీ ఘాతుకానికి కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు అమరులైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకోగా.. దౌత్య, మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. అయినప్పటికీ డ్రాగన్ దేశం తన వైఖరి మార్చుకోలేదు. వివిధ స్థాయి చర్చల్లో కుదిరిన బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో ఇటీవల మరోసారి వాస్తవాధీన రేఖ( ఎల్ఏసీ) వెంబడి ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ క్రమంలో శుక్రవారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి వెయి ఫెంఘెతో దాదాపు రెండు గంటల 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఎల్ఏసీను చైనా గౌరవించాలని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని స్పష్టంచేశారు. భారత్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉందని.. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పర్యటనకై జైశకంర్ మంగళవారం రష్యాకు బయల్దేరనున్నారు. ఈ సందర్భంగా డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం. నాకైతే సంబంధం లేదు.. బీజేపీ ఐటీ సెల్ విభాగం పనితీరుపై ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో పనిచేసే కొంతమంది సభ్యులు నకిలీ ఐడీలతో సోషల్ మీడియా వేదికగా తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై తన ఫాలోవర్లు గుర్రుగా ఉన్నారని, కాబట్టి వారు ఎదురుదాడికి దిగే అవకాశం ఉందని, అందుకు తాను బాధ్యత వహించబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు.. ‘‘బీజేపీ ఐటీ సెల్ దుర్మార్గంగా తయారైంది. అందులోని కొంత మంది సభ్యులు ఫేక్ ఐడీలతో నకిలీ ట్వీట్లతో నాపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. ఒకవేళ నా ఫాలోవర్లు అదే రీతిలో బదులిస్తే అందుకు నేను బాధ్యత వహించను. బీజేపీ ఐటీ సెల్ తీరుకు పార్టీ ఎలాగైతే బాధ్యత వహించదో.. అచ్చంగా అలాగే’’ అంటూ ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు. ‘‘మాది మర్యాద పురుషోత్తముల పార్టీ. రావణ, దుశ్శాసన ఇక్కడ లేరు. ఇటువంటి విషయాలను నేను పెద్దగా పట్టించుకోను గానీ.. గొడవలు సృష్టించే వాళ్లను బీజేపీ.. పదవి నుంచి తీసేయాలి’’ అంటూ మరో ట్వీట్లో ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై విరుచుకుపడ్డారు. అయితే ఇందుకు గల మూలకారణం గురించి మాత్రం సుబ్రహ్మణ్యస్వామి ప్రస్తావించలేదు. The BJP IT cell has gone rogue. Some of its members are putting out fake ID tweets to make personal attacks on me. If my angered followers make counter personal attacks I cannot be held resonsible just as BJP cannot be held respinsible for the rogue IT cell of the party— Subramanian Swamy (@Swamy39) September 7, 2020 -
‘నీట్, జేఈఈపై ఇప్పుడేం చేయలేం’
న్యూఢిల్లీ: సమాజంలో జరిగే కీలక అంశాలపై విశ్లేషించే రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా నీట్, జేఈఈ పరీక్షలపై ట్విటర్ వేదికగా స్పందించారు. సుబ్రహ్మణ్యస్వామి ఆదివారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో నీట్ ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని కొందరు తనను కలిసారని, కానీ తనను ముందే సంప్రదిస్తే మరో విధంగా ఉండేదని తెలిపారు. పరీక్షలు రద్దు చేయాలని కొందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేయలేదని, వారు సైతం రద్దుకు మద్దతిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితే నీట్, జేఈఈ పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలు, కొందరు సామాజికవేత్తలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రవేశ పరీక్షలు(నీట్, జేఈఈ) నిర్వహించాలని పట్టుదలతో ఉంది. కాగా ఇది వరకే కోవిడ్ నిబంధనలు పాటించి ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చని సుప్రీం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రవేశ పరీక్షలను ఆపడం అసాధ్యమని, సుప్రీం తన తీర్పును సమీక్షించే అవకాశం లేదని పేర్కొన్నారు. మరోవైపు నీట్ పరీక్షలను రద్దు చేయాలని ఆగస్ట్ 4న కొందరు రివ్యూ పిటిషన్ వేశారు. కానీ సుప్రీం కోర్టు వాదనలను(రివ్యూ పిటిషన్) వినడానికి నిరాకరించింది. కాగా పరీక్షలు రద్దు చేయాలని రివ్యూ పిటిషన్ వేసిన వారిలో పశ్చిమ బెంగాల్ న్యాయ శాఖ మంత్రి మొలోయ్ ఘటక్, జార్ఖండ్ ఆర్థిక మంత్రి రామేశ్వర్ ఒరాన్, రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ, పంజాబ్ కార్మిక శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్దూ, మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్ సమంత్ తదితరులు ఉన్నారు. (చదవండి: గాంధీ హత్యకేసుపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు) -
వైఎస్ జగన్కు కృతజ్ఞతలు: బీజేపీ ఎంపీ
సాక్షి, అమరావతి: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేయించాలన్నది గొప్ప నిర్ణయమని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీటీడీలో నిధుల వ్యయాన్ని కాగ్తో ఆడిటింగ్ చేయించడంతోపాటు, ఇక ముందు కూడా ఇలాగే చేయాలని కోరుతూ సత్యపాల్ సబర్వాల్తో కలసి సుబ్రహ్మణ్యస్వామి గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ అంశంపై స్వచ్ఛందంగానే సానుకూలంగా స్పందించింది. టీటీడీ నిధులను కాగ్తో ఆడిట్ చేయించాలని నిర్ణయించారు. టీటీడీ ఆదాయ, వ్యయాలన్నీ పూర్తి పారదర్శకంగా ఉండాలని చెప్పారు. తద్వారా టీటీడీకి భక్తులు, దాతలు విరాళాల రూపంలో ఇస్తున్న నిధుల నిర్వహణ సక్రమంగా ఉండాలని నిర్దేశించారు. ఈ మేరకు 2020–21 నుంచి టీటీడీ ఆదాయ, వ్యయాలను కాగ్తో ఆడిట్ చేయించాలని ఆగస్టు 28న సమావేశమైన టీటీడీ పాలకమండలి తీర్మానాన్ని ఆమోదించింది. హైకోర్టుకు కూడా తెలియజేయాలని నిర్ణయించింది. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు టీటీడీ నిధుల వ్యయాన్ని కాగ్తో ఆడిటింగ్ చేయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. తన ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాలకమండలి సభ్యులు గొప్ప మనసుతో సమ్మతించారని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్కు స్పందించిన వైవీ సుబ్బారెడ్డి పారదర్శకత, అవినీతిరహిత పాలన పట్ల సీఎం నిబద్ధతతో ఉన్నారంటూ ట్వీట్ చేశారు. చదవండి: రైతులపై రూపాయి భారం పడినా రాజీనామా -
సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై తాజాగా ఒక షాకింగ్ వీడియో అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా సుశాంత్ మరణానికి కారణం ఆత్మహత్య కాదు హత్య అని చెబుతున్న ఒక వీడియోను షేర్ చేశారు. దీనిపై తన వాదనలకు మద్దతుగా ఈ వీడియోలో వివరించారు. ముఖ్యంగా సుశాంత్ ముఖంపై, ఇతర ప్రదేశాల్లో గాయాల గురించి వివరించారు. అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంపై మార్పులను గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. దీంతో సుశాంత్ ఆత్మహత్యపై ఇప్పటికే వ్యక్తమవుతున్నఅనుమానాలకు తోడు తాజా వీడియో ద్వారా మరింత బలం చేకూరుతోందన్న వాదన వినిపిస్తోంది. (‘సుశాంత్ హత్యకు గురయ్యారు’) మరోవైపు సుశాంత్ ది ఆత్మహత్యకాదు కచ్చితంగా హత్యే అంటూ సంచలనం రేపిన మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామి ఈ ట్వీట్ ను రీట్వీట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. (సుశాంత్ కేసు : మరో వివాదం) Shocking relevations made on Sushant’s case! PS: Sensitive Content. pic.twitter.com/r0orseM72b — Dr.Minakshi Mishra (@savethesaviours) August 2, 2020 -
సుశాంత్ మృతిపై స్వామి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ను హత్య చేశారని ఆరోపించిన స్వామి ముంబై పోలీసుల ఎఫ్ఐఆర్పై పలు సందేహాలు వ్యక్తం చేశారు. తన ఆరోపణలకు మద్దతుగా ఓ డాక్యుమెంట్ను ట్విటర్లో పోస్ట్ చేసిన సుబ్రహ్మణ్యస్వామి ఇందులో పేర్కొన్న 26 పాయింట్లలో 24 పాయింట్లు ఇది హత్యేనని పేర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. స్వామి ట్వీట్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం ఆయన పలు వాదనలను ముందుకుతెచ్చారు. సుశాంత్ రాజ్పుత్ మెడపై ఉన్న గుర్తు ఆత్మహత్యతో సరిపోలడం లేదని, ఇది నరహత్యను సూచిస్తోందని అన్నారు. ఈ డాక్యుమెంట్ ప్రకారం సుశాంత్ శరీరంపై కొట్టిన గుర్తులు ఉన్నాయని, ఎలాంటి సూసైడ్ నోట్ లేదని ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు. సుశాంత్ కంటే ముందు బలవన్మరణానికి పాల్పడిన మేనేజర్ దిశా సలియాన్కు కొన్ని అంశాలు తెలిసిఉంటాయని చెప్పుకొచ్చారు. ముంబై పోలీసులు సుశాంత్ కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ను అనుసరించారా అని సుబ్రహ్మణ్య స్వామి సందేహం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు. సుశాంత్ మరణంపై ఆయన బుధవారం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో మాట్లాడారు. సుశాంత్ మరణానికి ఆయన మాజీ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి వేధింపులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా సుశాంత్ జూన్ 14న ముంబైలోని బాంద్రా నివాసంలో ఉరి వేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. సుశాంత్ బలవన్మరణంతో సినీ పరిశ్రమలో వేళ్లూనుకున్న బంధుప్రీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. చదవండి : రియాతో బంధం తెంచుకోవాలనుకున్నాడు: అంకిత -
సుశాంత్ కేసులో సీబీఐ విచారణ జరగాలి: స్వామి
ముంబై: సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యపై కేంద్ర దర్యాప్తు సంస్ధ(సీబీఐ)తో విచారణ జరిపించాలని మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్ చేశారు. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు ఇష్కారణ్ సింగ్ భండారీతో సుశాంత్ కేసు సీబీఐ విచారణకు తగినదో లేదో కనుక్కోవాలని చెప్పినట్లు ట్విట్టర్ వేదికగా శుక్రవారం వెల్లడించారు. (నిషేధిత చైనా యాప్ కంపెనీలకు 79 ప్రశ్నలు) ఈ కేసులో పోలీసుల వెర్షన్ సరైనదైనా అనే కోణంలో కూడా పరిశీలన చేయాలని భండారీతో చెప్పినట్లు స్వామి మరో ట్వీట్లో పేర్కొన్నారు. యూట్యూబ్ లైవ్లో సుశాంత్ ఆత్యహత్య ఘటనపై సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడతారని భండారీ ట్వీట్ చేశారు. (పాకిస్తాన్కు అమెరికా భారీ షాక్) ప్రస్తుతం ముంబై పోలీసులు సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా 30 మంది నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. అందులో సుశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వృత్తికి సంబంధించిన వారు ఉన్నారు. ఇటీవల సంజయ్ లీలా బన్సాలీ కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన సుశాంత్కు బాజీరావు మస్తానీ, రామ్లీలా, పద్మావత్ సినిమాలను ఆఫర్ చేశారు. అయితే, డేట్స్ కుదరకపోవడం వల్లే ఆ సినిమాలు చేయలేకపోయామని ఆయన వెల్లడించారు. సుశాంత్ కేసుకు సంబంధించిన సమాచారం ఉంటే ఎవరైనా తనకు సాక్ష్యాధారాలతో సహా పంపొచ్చని భండారీ పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ రూపా గంగూలీ, పుస్తక రచయిత తుహిన్ సిన్హా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఇది ఓ కృత్రిమ వివాదం..
-
టీటీడీపై దుష్ప్రచారం బాబు కుట్రే
ఈ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను వేలం వేస్తోందన్న దుష్ప్రచారం అంతా చంద్రబాబు కుట్రే. వాస్తవానికి టీటీడీ ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమే. అప్పటి టీటీడీ కమిటీలో ఏపీ బీజేపీ నేత భాను ప్రకాశ్రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మాట మార్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. 51 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని 2016, జనవరి 30న సమావేశమైన టీటీడీ పాలకమండలి తీర్మానించింది. ఆ సమయంలో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తన మనుషులతో నియమించిన టీటీడీ పాలకమండలే ఆ 51 ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. అంటే టీటీడీ ఆస్తులను విక్రయించాలన్న నిర్ణయం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్నదే. ఆ సమయంలో ఏపీ బీజేపీ నేత మాణిక్యాలరావే రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కూడా. చంద్రబాబు కుట్రలకు ఏపీలో కొందరు బీజేపీ నేతలు వత్తాసు పలుకుతుండటం దురదృష్టకరం. టీటీడీ ఆస్తుల విక్రయానికి వ్యతిరేకంగా ఇళ్లల్లో ఉపవాస దీక్షలు చేస్తుండటం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీ ఆస్తుల విక్రయానికి అనుకూలంగా వ్యవహరించినందుకు వీరంతా ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి. అప్పుడు తప్పు చేశాను.. ఇప్పుడు అబద్ధాలు చెప్పానని చంద్రబాబు కూడా అంగీకరించాలి. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. – సుబ్రహ్మణ్యస్వామి, బీజేపీ నేత సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను వేలం వేస్తోందన్న దుష్ప్రచారం అంతా చంద్రబాబు కుట్రే. వాస్తవానికి టీటీడీ ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమే. అప్పటి టీటీడీ కమిటీలో ఏపీ బీజేపీ నేత భానుప్రకాశ్రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు మాటమార్చి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు’.. అని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కుండబద్దలుగొట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే కాదు.. ఏపీకి ద్రోహం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోసం, కుట్ర అన్నవి చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటేనని ‘సాక్షి’కి మంగళవారం ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మండిపడ్డారు. టీటీడీ ఆస్తులను వేలం వేయాలని టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించిన విషయాన్ని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు. చంద్రబాబును ప్రజలు నిలదీయాలని ఆయన సూచించారు. తాను చేసిన మోసానికి చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్ చేశారు. అలాగే, టీటీడీ ఆస్తులను వేలం వేయాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం వైఎస్ జగన్ నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేయడాన్ని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్వాగతించారు. నిజాయితీ, నిబద్ధత ఉన్న అరుదైన రాజకీయ నేత వైఎస్ జగన్ అని ఆయన ప్రశంసించారు. టీటీడీ ఆస్తుల వేలంపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం.. చంద్రబాబు సర్కారు హయాంలో జరిగిన వాస్తవాలపై సుబ్రహ్మణ్యస్వామి తన ఇంటర్వ్యూలో అంశాల వారీగా చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. వేలం వేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమే టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేయాలని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగానే నిర్ణయించారు. ఏపీలోనూ.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న టీటీడీకి చెందిన 84 ఆస్తులను విక్రయించాలని 2015లోనే టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం 2015, జూలై 28న ఓ కమిటీని నియమించింది. అప్పటి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న ఏపీ బీజేపీ నేత భానుప్రకాశ్రెడ్డి కూడా ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆ కమిటీ పలుమార్లు భేటీ అయి ఆ ఆస్తులను కాపాడలేమని, విక్రయించాలని సూచించింది. ఆ కమిటీ నివేదికలో భానుప్రకాశ్రెడ్డి కూడా సంతకం చేశారు. 2016, జనవరి 29న చివరిసారిగా ఆ కమిటీ సమావేశమై 53 ఆస్తులను విక్రయించాలని సూచించింది. అనంతరం 2016, జనవరి 30న సమావేశమైన టీటీడీ పాలక మండలి.. 51 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తీర్మానించింది. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ నేత మాణిక్యాలరావే రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఏపీకి ద్రోహం చేస్తున్న చంద్రబాబు అసలు టీటీడీ ఆస్తులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేలం వేస్తోందంటూ టీడీపీ కృత్రిమ వివాదం సృష్టించింది. ఇది కచ్చితంగా చంద్రబాబు కుట్రే. నా దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయి. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను వేలం వేస్తోందని చంద్రబాబు ఇంతవరకూ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే కాదు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. కుట్రలు చేయడం చంద్రబాబు నైజం. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఆయన కుట్రలు పన్నుతున్నారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ను చేయగానే ఆయన క్రిస్టియన్ అని దుష్ప్రచారం చేశారు. కానీ, వైవీ హిందూ ధార్మిక వాది. నాకు బాగా తెలుసు. కొందరు ఏపీ బీజేపీ నేతల తీరు దురదృష్టకరం చంద్రబాబు కుట్రలకు ఏపీలో కొందరు బీజేపీ నేతలు వత్తాసు పలుకుతుండటం దురదృష్టకరం. అప్పట్లో టీటీడీ ఆస్తుల వేలాన్ని సమర్థించిన ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. ఇళ్లల్లో ఉపవాస దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. వీరంతా కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలు తెలుసుకోవాలి. అక్కడ కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాలతో సహా అన్ని దేవాలయాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అన్నింటికీ ముఖ్యమంత్రే తనను తాను చైర్మన్గా ప్రకటించుకున్నారు. ఇది బీజేపీ సిద్ధాంతానికి విరుద్ధమని తెలీదా. ఏపీ బీజేపీ నేతలు ఉత్తరాఖండ్ వెళ్లి ఉపవాస దీక్షలుచేయాలి. సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు టీటీడీ ఆస్తులను వేలం వేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలుపుదల చేయడం సంతోషకరం. అందుకు ఆయనకు ధన్యవాదాలు. వైఎస్ జగన్ అరుదైన రాజకీయ నేత. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత ఉన్న నేత. మంచి నాయకుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. టీటీడీ ఆస్తులను వేలం వేయాలని చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఆధారాలను ఆయన ప్రజల ముందుంచాలి. అంతేకాదు.. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయాలి. టీటీడీ ఆస్తుల అంశంపై సలహాలు, సూచనలివ్వాలని హిందూ ధార్మిక సంస్థలు, మత పెద్దలు, భక్తులను జగన్ కోరడం సరైన చర్య. ప్రభుత్వానికి నేనూ సలహాలిస్తాను. అలాగే.. అందరూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి. చంద్రబాబును ప్రజలు నిలదీయాలి రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వంపై కుట్రలకు పాల్పడుతూ దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలి. టీటీడీ ఆస్తులను విక్రయించాలని ఎందుకు తీర్మానించారో చెప్పాలని కూడా ప్రశ్నించాలి. భానుప్రకాశ్రెడ్డినీ నిలదీయాలి. చంద్రబాబు వాస్తవాన్ని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. విద్వేషాలు రెచ్చగొట్టే యత్నాలను మానుకోవాలి. -
టీటీడీ గుట్టువిప్పిన సుబ్రహ్మణ్య స్వామి
సాక్షి, ఆంధ్రప్రదేశ్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూముల అమ్మకాలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గుట్టు విప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే (2016) టీడీపీ, బీజేపీ కలిసి టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని కోసం నియమించిన కమిటీలో బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో తమ పార్టీకి చెందిన నాయకుడు దేవాదాయ శాఖకు మంత్రిగా ఉన్నారని, చంద్రబాబు హయాంలోనే ఆస్తుల అమ్మకాల నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. నిరర్థక ఆస్తుల అమ్మకాలపై గత ప్రభుత్వ తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి సుబ్రహ్మణ్య స్వామి ధన్యవాదాలు తెలిపారు. (2016 టీటీడీ బోర్డు నిర్ణయం నిలుపుదల) కాగా గత వారం రోజులుగా టీడీపీ ఆస్తులపై ప్రతిపక్ష టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీలో సాక్షి టీవీతో మాట్లాడారు. ‘తిరుమల ఆస్తుల అమ్మకంపై టీడీపీ, బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. దేవుడిపైన అబద్ధాలు చెప్పడం సరైనది కాదు. రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యం. అబద్ధాలు చెబితే దొరికి పోక తప్పదు. సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయత కలిగిన వ్యక్తి. చెప్పింది చేసి.. సూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి . క్రిస్టియన్ అయినంత మాత్రాన ప్రభుత్వంపై బురద జల్లడం మంచిది కాదు. చంద్రబాబు ఈ రాజకీయాలు మానుకోవాలి. బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలి. తిరుమల ఆస్తులను అమ్మకూడదు. వాటిని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని, ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నాను.’ అని అన్నారు. (అవన్నీ నిరర్థక ఆస్తులే) కాగా టీటీడీపై గతంలోనూ సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ హయాంలో ఆలయ నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవాలని తన పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై ఆయన సుప్రీంను సైతం ఆశ్రయించగా.. హైకోర్టుకు వెళ్లమని న్యాయస్థానం సూచించింది. -
సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ హత్య కేసును రీ-ఓపెన్ చేయాలంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి ట్విటర్ వేదికగా సంచలన వాఖ్యలు చేశారు. గాంధీ హత్య కేసును రీఓపెన్ చేసి పునర్విచారణ జరిపించాలని ఆయన కోరారు. గాంధీజీ హత్యపై సుబ్రమణియన్ స్వామి ట్విట్టర్లో వరుస ప్రశ్నలు సంధించారు. గాంధీ మృతదేహానికి ఎందుకు పోస్టుమార్టమ్ నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రత్యక్ష సాక్షులైన అభా, మనులను కోర్టులో ఎందుకు విచారించలేదన్నారు. గాడ్సే కాల్చిన రివాల్వర్ను ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. అందుకే కేసును రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ('కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రిస్తే మేలు') 1st question: Why no post mortem or autopsy on Gandhiji's body? 2nd : Why Abha and Manu as direct eyewitnesses not questioned in court? 3rd: How many empty chambers in Godse's revolver? Italian revolver "untraceable"!! Why? We need to re-open the case — Subramanian Swamy (@Swamy39) February 16, 2020 మరో ట్వీట్లో అసోసియేటెడ్ ప్రెస్ ఇంటర్నేషనల్ జర్నోను ప్రస్తావిస్తూ.. ఆరోజు సాయంత్రం 5.05 గంటలకు అతను 4 బుల్లెట్ శబ్దాలు విన్నాడని చెప్పారు. అయితే గాడ్సే మాత్రం తాను రెండుసార్లు మాత్రమే కాల్చాడని చెప్పాడన్నారు. ఏపీఐ జర్నలిస్టు బిర్లా హౌజ్ వద్ద గాంధీ 5.40గంటలకు చనిపోయాడని చెప్పాడని.. అంటే, 35నిమిషాల పాటు ఆయన బతికే ఉన్నారని అన్నారు. కాగా సుబ్రమణియన్ స్వామి చేసిన ఈ ట్వీట్పై నెటిజెన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(ఇమ్రాన్ది రోడ్డుపక్క ప్రసంగం) Page 52 quotes Associated Press International journo: he heard at 5.05 pm 4 shots [not 3 as PP in Court later told court]. Godse deposed he fired only 2. Same API journalist said Gandhi declared dead in Birla House at 5.40PM i.e., he was alive for 35 mins. — Subramanian Swamy (@Swamy39) February 16, 2020 కాగా, గతంలోనూ గాంధీ హత్యపై పునర్విచారణ జరిపించాలన్న డిమాండ్లు వినిపించాయి. 2017 అక్టోబర్లో ఐటీ ప్రొఫెషనల్ డా.పంకజ్ కుముద్చంద్ర ఫడ్నీస్ గాంధీ హత్యపై పునర్విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సే నాల్గవ బుల్లెట్ను కాల్చాడా లేదా అన్న దానిపై కొంత అస్పష్టత ఉన్నందున.. ఈ హత్యను పరిశీలించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. గాంధీ హత్య కేసులో గాడ్సే, దత్తాత్రేయ ఆప్టేలను 15 నవంబర్,1949లో ఉరితీశారని.. దేశంలో సుప్రీం కోర్టు ఏర్పాటుకు 71 రోజుల ముందు ఈ ఘటన జరిగిందని తెలిపారు. అప్పట్లో సుప్రీం కోర్టు లేకపోవడం వల్ల ఈస్ట్ పంజాబ్ హైకోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేసే అవకాశం వారికి లేకుండా పోయిందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ను సుప్రీం కొట్టివేసింది. -
'కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రిస్తే మేలు'
న్యూఢిల్లీ: భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మను ముద్రించడం వల్ల మేలు జరుగుతుదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేశుని బొమ్మను ముద్రించిన విషయాన్ని ప్రస్తావించారు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇండోనేషియా కరెన్సీపై గణేశుని బొమ్మ ముద్రించడాన్ని విలేకరులు ఆయన వద్ద ప్రస్తావించినపుడు స్వామి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. తాను దీనికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. గణేశుడు విఘ్నాలను తొలగిస్తాడని చెప్పారు. లక్ష్మీదేవి బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే, భారతీయ కరెన్సీ పరిస్థితిని మెరుగుపడవచ్చునని చెప్పారు. దీని గురించి ఎవరూ చెడుగా అనుకోవాల్సిన అవసరం లేదన్నారు. చదవండి: ‘టీటీడీపై దుష్ప్రచారం చేస్తే పరువునష్టం దావా’ -
తిరుమలలో అన్యమత ప్రచారంలో నిజం లేదు
-
‘టీటీడీపై దుష్ప్రచారం చేస్తే పరువునష్టం దావా’
సాక్షి, తిరుమల: టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై పరువునష్టం దావా వేయాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం టీటీడీ నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. వాటిపైన సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా ఏళ్ల తరబడి శ్రీవారి సేవలో ఉన్న అర్చకులను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి ఆ అర్చకులకు అవకాశమివ్వడం శుభపరిణామమన్నారు. ఏ ప్రభుత్వం అజమాయిషీ లేకుండా టీటీడీకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని సుబ్రహ్మణ్యస్వామి కోరారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్యమతస్తుడని సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగిందని వ్యాఖ్యానించారు. టీటీడీని అన్యమతస్థులతో నింపారని ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై పరువు నష్టం దావా వేయాలని పేర్కొన్నారు. టీటీడీ నిధులపై ఆడిటింగ్ లేకపోవడంతో నిధులు పక్కదారి పట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ నిధులు కేవలం ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలని పేర్కొన్నారు. చదవండి: ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లు దావా: టీటీడీ వలసదారులకు ఎన్డీయే పౌరసత్వం కల్పిస్తోంది.. భారతదేశంలో వుండి కూడా పౌరసత్వం లేక పనిచేసే అవకాశం కోల్పోతున్న వారిని ఆదుకొని, దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని కనుగొని వారికి మన దేశ పౌరసత్వం పొందే అవకాశం ఉందా లేదా అని పరిశీలించడమే ఎన్నార్సీ ప్రధాన ఉద్దేశ్యమని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. భారతీయ ముస్లింలకు ఇది నష్టం కలిగిస్తుందన్నదాంట్లో వాస్తవం లేదన్నారు. ఎన్నార్సీకి అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్(కాంగ్రెస్) అంగీకరించారని గుర్తు చేశారు. కానీ దీనిపై కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సుదీర్ఘ కాలంగా జీవిస్తున్న వలసదారులకు ఎన్డీయే పౌరసత్వం కల్పిస్తోందని స్పష్టం చేశారు. దీనిపై అనవసర విద్వేశాలు రెచ్చగొట్టడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. -
‘డిసెంబర్ 6 నుంచి రామ మందిర నిర్మాణం’
లక్నో : అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు డిసెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వెల్లడించారు. రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై బుధవారం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో సాక్షి మహారాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుదవారం ఆయన ఉన్నావోలో మీడియాతో మాట్లాడుతూ..1992 డిసెంబర్ 6వ తేదీనే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేశారని, మసీదు నిర్మాణం కూల్చి వేసిన తేదీనే ఆలయ నిర్మాణం ప్రారంభం కావడం విశేషమని సాక్షి మహారజ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కృషి వల్లే రామ మందిర నిర్మాణం కల నిజమైందని ఆయన అన్నారు. రామ మందిర్ నిర్మాణానికి హిందూవులు, ముస్లింలు కలిసి రావాలని ఎంపీ పిలుపునిచ్చారు. బాబర్ వారి పూర్వీకుడు కాదని, ఒక ఆక్రమణ దారుడని.. ఈ విషయాన్ని సున్నీ వక్స్ బోర్డు అంగీకరించాలన్నారు .మరో బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి మాట్లాడుతూ..తన పిటిషన్ తర్వాతే అయోధ్య కేసులో సుప్రీంకోర్టు విచారణను వేగవంతం చేసిందని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం ఎంతో మంది హిందువుల కలని సాకారం చేస్తుందని, ఈ దీపావళి మాత్రమే కాకుండా దేశం మొత్తం ఏడాదిపాటు పండగ చేసుకుంటుందని ఆయన తెలిపారు. -
ఇమ్రాన్ది రోడ్డుపక్క ప్రసంగం
సాక్షి,న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దీనిపై స్పందించారు. ఇమ్రాన్ ప్రసంగాన్ని 'రోడ్డుపక్క ప్రసంగం'తో పోల్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోడ్డు పైనున్న జనాలను ఉద్దేశించి మాట్లాడినట్టు ఇమ్రాన్ ప్రసంగం సాగిందని, పాక్ ఆర్మీ ఒత్తిడికి తలొగ్గి అలా ప్రసంగించారని విమర్శించారు. ఇమ్రాన్ ప్రసంగం పాక్లో చదువురాని కొందరికి సంతోషం కలిగించొచ్చని, ధైర్యంగా ప్రసంగించారని వారి మెప్పు పొందొచ్చని అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఒత్తిడికి లొంగే ఆయన ప్రసంగం సాగినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. -
రాయని డైరీ
తెలుసు కదా అని ఏదైనా చెప్పబోతే, ‘మాకు తెలియకపోతే కదా’ అని ఎవరైనా చటుక్కున అనేస్తే మనసు ఎంత చివుక్కుమంటుంది! ‘డెబ్బయ్ తొమ్మిదేళ్ల వయసులోని రాజకీయవేత్తకు, ఆరితేరిన ఆర్థిక నిపుణుడికి మనకు తెలిసినవే కాకుండా, అదనంగా మరికొన్ని కూడా తెలిసి ఉండే అవకాశం ఉందేమో తెలుసుకుందాం’ అని వీళ్లంతా ఎందుకు అనుకోరు?! రీసెంట్గా నిర్మలా సీతారామన్కు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా గట్టెక్కించవచ్చో ఐదు టిప్స్ ఇచ్చాను. ‘అసలు గట్టెక్కించాల్సిన అవసరం ఏముందీ’ అన్నట్లు విస్తుపోయి చూశారు! బీజేపీ గట్టున ఉంటే దేశం కూడా గట్టునే కదా ఉంటుంది అని ఆమె నమ్మకం కావచ్చు. ‘‘ఎందుకలా విస్తుపోయి చూశారు నిర్మలగారూ?’’ అన్నాను. ‘‘బీజేపీ వాళ్లకు బీజేపీ వాళ్లు టిప్స్ ఇవ్వడం నేనెక్కడా చూళ్లేదు. మీరు బీజేపీ అయుండి, నేను బీజేపీ అయుండి మీరు నాకు టిప్స్ ఇవ్వడమేవిస్మయంగా ఉంది’’ అన్నారు. ‘‘అయితే మీకు నా టిప్స్ నచ్చాయి కానీ, ఆ టిప్స్ని నేనివ్వడమే మీకు నచ్చలేదన్నమాట’’ అన్నాను.‘‘నేను అడగకుండా ఎవరు నాకు టిప్స్ ఇచ్చినా నాకు నచ్చదు సుబ్రహ్మణియన్ గారూ. పైగా మీరు ‘టిప్స్ ఇచ్చేదా’ అని నన్ను అడక్కుండానే నాకు టిప్స్ ఇచ్చేశారు’’ అన్నారు సీతారామన్! రెండు పొరపాట్లు చేశానని అర్థమైంది. అడగకుండా టిప్స్ ఇవ్వడం. టిప్స్ఇమ్మంటారా అని అడగకపోవడం.సీతారామన్ గురించి ఆలోచిస్తూ ఉంటే అయోధ్య రాముడి గురించి కబురొచ్చింది! ‘‘మిస్టర్ సుబ్రహ్మణియన్.. కేసును సుప్రీం కోర్టు తీసేసుకుంది. మధ్యవర్తులు చేతులెత్తేశారు. మీరేం చెప్పదలచుకున్నారు? ఇండియా వాంట్స్ టు నో’’ అంటున్నాడు ఆర్ణబ్ గోస్వామి! ‘‘ఇండియా నా నుంచి తెలుసుకోవాలని కోరుకుంటోందా?!’’ అని అడిగాను నిస్సత్తువగా. చెప్పలేకపోవడం వల్ల దేహానికి కలిగిన నిస్సత్తువ కాదది. వినేవారెవరన్న నిస్పృహ వల్ల మనసును ఆవరించిన నిస్సత్తువ. ‘‘ఎస్ మిస్టర్ సుబ్రహ్మణియన్.. ఇండియా వాంట్స్ టు నో అబౌట్ యువర్ కామెంట్స్. అయోధ్య మధ్యవర్తుల కమిటీలో ఉండేందుకు అప్పట్లో మీరూ ఉత్సాహం చూపారు కదా..’’ అన్నాడు ఆర్ణబ్. ‘‘నా దగ్గర కామెంట్స్ ఏమీ లేవు ఆర్ణబ్. టిప్స్ ఉన్నాయి. అవి ఇండియాకు పనికొస్తాయా? ఎందుకంటే ఇండియాలోనే కొందరు నేనిచ్చే టిప్స్ని తీసుకోవాలని అనుకోవడం లేదు’’ అన్నాను. ‘‘వెల్ మిస్టర్ సుబ్రహ్మణియన్. ఇండియా అంటే.. మీ టిప్స్ని తీసుకోనివాళ్లు మాత్రమే కాదు, మీ టిప్స్ని తీసుకునేవాళ్లు కూడా..’’ అన్నాడు ఆర్ణబ్. ‘‘మరి ముందే టిప్స్ కావాలని ఎందుకు అడగలేదు ఆర్ణబ్! ఇండియా వాంట్స్ టు నో అబౌట్ యువర్ కామెంట్స్ అని కదా మీరన్నారు..’’ అన్నాను. ఆర్ణబ్ పెద్దగా నవ్వాడు. ఆర్ణబ్ పెద్దగా చెవులు పగిలేలా మాట్లాడ్డమే తప్ప, ఏవీ పగలకుండా పెద్దగా నవ్వడం ఇదే తొలిసారి నేను వినడం! చెవులు పగలడమే బాగుంది. ‘‘మిస్టర్ సుబ్రహ్మణియన్.. ముందే టిప్స్ కావాలని మిమ్మల్ని ఎందుకు అడగలేదంటే, కామెంట్స్ అడిగినా మీరిచ్చేది టిప్సే కదా అనే నమ్మకం..’’ అన్నాడు! ‘‘నమ్మకం మంచిదే ఆర్ణబ్. ఒకవేళ నా మూడ్ బాగుండి, టిప్స్ ఇవ్వకుండా మీరడిగినట్లు కామెంట్సే ఇస్తే?’’ అన్నాను. ‘‘మీకు తెలియందేముంది మిస్టర్ సుబ్రహ్మణియన్, మూడాఫ్ చెయ్యడానికి మా దగ్గర ఒక టీమ్ ఎప్పుడూ ట్వంటీ ఇంటూ సెవన్.. పని చేస్తూనే ఉంటుంది కదా’’ అన్నాడు ఆర్ణబ్! -
ఇండియా బుల్స్ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: సోమవారం నాటి నష్టాల మార్కెట్లో ఇండియా బుల్స్ గ్రూపునకు భారీ షాక్ తగిలింది. పలు షెల్ కంపెనీలద్వారా ఇండియాబుల్స్ గ్రూప్ రూ. లక్ష కోట్లకు పైగా నిధులను అక్రమంగా దారి మళ్లించిందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు దీనిపై సిట్ ద్వారా దర్యాప్తు చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆదివారం లేఖ రాసినట్టుగా వార్తలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన లేఖ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో దాదాపు100 షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. దీంతో ఈ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంకు(ఎన్హెచ్బీ) నుంచి షెల్ కంపెనీల ద్వారా నిధులను సమీకరించి ఇండియాబుల్స్ గ్రూప్ అక్రమంగా మళ్లించినట్లు సుబ్రమణ్యన్ స్వామి ఆరోపించారు. మనీలాండరింగ్ స్కామ్ కింద సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐవో, ఐటీ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయవలసిందిగా ప్రధాని మోదీని కోరినట్టు సమాచారం. ట్రేడింగ్లో ఇండియాబుల్స్ గ్రూప్నకు చెందిన లిస్టెడ్ కంపెనీల కౌంటర్లలో అమ్మకాల వెల్లువ కురిసింది. ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ 10 శాతానికిపైగా పడిపోయి టాప్లూజర్గా నమోదైంది. ఐబీ వెంచర్స్ 5 శాతం, ఐబీ కన్జూమర్ ఫైనాన్స్ 3 శాతం ఇండియాబుల్స్ రియల్టీ 8.4 శాతం పతనమయ్యాయి. ఐబీ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ షేరు 5శాతం లోయర్ సర్క్యూట్ను తాకి రూ. 121.55 వద్ద ఫ్రీజ్ అయింది. మరోవైపు బీజేపీ నేత ఆరోపణలను ఇండియా బుల్స్ హౌసింగ్ బీఎస్ఈ ఫైలింగ్లో తీవ్రంగా ఖండించింది. జూన్ 28నాటి సుబ్రమణియన్ స్వామి ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను హైలైట్ చేయాలనుకుంటున్నామంటూ వివరణ ఇచ్చింది. ఎన్హెచ్బి నుంచి ఇండియాబుల్స్ హౌసింగ్కు ఎలాంటి రుణాలులేవని కంపెనీ సీఈవో గగన్ బాంగా స్పష్టం చేశారు. అసలు తమ చరిత్రలో ఎన్బీహెచ్ నుంచి లోన్స్ గానీ, రీఫైనాన్సింగ్ నిధులను గానీ తీసుకోలేదన్నారు. తమ మొత్తం లోన్బుక్ సుమారు రూ.87,000 కోట్లుగా ఉందని వివరించారు -
‘బీజేపీ నుంచి ఆయనను సాగనంపండి’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు క్రిమినల్ కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఆధారంగా ఆబిడ్స్ రోడ్డు పోలీసులు స్వామిపై కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీ మాదక ద్రవ్యాలను వినియోగిస్తారని సుబ్రహ్మణ్యస్వామి రెచ్చగొట్టే విధంగా లేనిపోని వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకులు సోమవారం సుబ్రహ్మణ్యస్వామి దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుబ్రహ్మణ్యస్వామి తీరును తప్పు పట్టారు. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా స్వామి వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ జాతీయతపై నిరాధార ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. నైతిక విలువలు, ఉన్నత ప్రమాణాల గురించి పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి పూర్తిగా భిన్నంగా బీజేపీ ఎంపీల ప్రవర్తన ఉందని, సుబ్రహ్మణ్యస్వామి చేసిన తాజా వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీ నుంచి స్వామిని సస్పెండ్ చేయాలని డాక్టర్ దాసోజు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో శ్రవణ్తో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఇతరులు పాల్గొన్నారు. అనంతరం మైనార్టీ సంక్షేమ విద్యా సంస్థలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 33 మంది విద్యార్థులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. -
సర్కస్లో కోతి మాదిరిగా...
సాక్షి, విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహణ బాధ్యత సాధువులకు అప్పగిస్తే అభివృద్ధి జరుగుతుందని తన నమ్మకమని ప్రముఖ న్యాయవాది, బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. టీటీడీ పై తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ను హైకోర్టు స్వీకరించిందని తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 6న వాదనలు వినిపించనున్నట్లు పేర్కొన్నారు.‘హైకోర్టు ఆధ్వర్యంలో ఆడిట్ కమిటీ నియమించాలి. టీటీడీ ప్రభుత్వం చేతుల్లో ఉంది. దేవాలయాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉండకూడదు అనేది నా సలహా. టీటీడీకి వచ్చిన ఆదాయాన్నిరాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం టీటీడీ వ్యవహారంలో చాలా దారుణంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కస్లో కోతి మాదిరి బాబు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కస్లో కోతి మాదిరి అటూ ఇటూ దూకుతున్నారని సుబ్రమణ్య స్వామి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం చేస్తానని చెప్పినప్పటికీ.. నాలుగేళ్ల తమతో కలిసి ఉన్న చంద్రబాబు చివరి సంవత్సరం కాంగ్రెస్ పంచన చేరారని విమర్శించారు. ‘ప్రత్యేక హోదా ఇవ్వలేదనే నెపంతో చంద్రబాబు కాంగ్రెస్తో జట్టుకట్టారు. మొదటి సంవత్సరమే ప్రత్యేక హోదా ఇవ్వలేము అని చెప్పాం మరి అప్పుడు ఏం చేశారు అని సుబ్రమణ్య స్వామి ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహారం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. -
‘ఫెర్నాండెజ్ అంటే ఇందిర కూడా భయపడేది’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన స్నేహితుడు, బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, ఫెర్నాండెజ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఫెర్నాండెజ్ను చూస్తే.. ఇందిరా గాంధీ విపరీతంగా భయపడేవారన్నారు సుబ్రమణ్య స్వామి. ఆయన మాట్లాడుతూ.. ‘గాంధీ కుంటుంబం అంటే ఫెర్నాండెజ్కు అసలు ఇష్టం ఉండేది కాదు. ఆ కుటుంబం దేశాన్ని నాశనం చేస్తుందని ఆయన నమ్మేవాడు. ఆయన తన జీవితాంతం కాంగ్రెస్ను, గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించాడు’ అని తెలిపారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలను ఫెర్నాండెజ్ తీవ్రంగా వ్యతిరేకించేవాడన్నారు. ‘ఆ సమయంలో ఫెర్నాండెజ్ను చూస్తే ఇందిరా గాంధీ భయపడేవారు. ఆయనను అరెస్ట్ చేసిన తర్వాతే ఇందిరా గాంధీ ప్రశాంతంగా ఉండగలిగార’ని తెలిపాడు సుబ్రమణ్య స్వామి. అంతేకాక తమ అనుబంధం గురించి మాట్లాడుతూ.. ‘ఫెర్నాండెజ్ నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. మేం తరచుగా కలుసుకుని పలు అంశాల గురించి చర్చించేవాళ్లం. అతను చాలా తెలివైన వాడు. అతడు తన జీవితంలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నో గొప్ప ర్యాలీలు, సభలు నిర్వహించాడ’ని తెలిపారు. అంతేకాక ఫెర్నాండెజ్ బోఫోర్స్ కేసును ఓ కొలిక్కి తీసుకురావాలనిభావించారు. కానీ వాజ్పేయ్ సూచన మేరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారన్నారు సుబ్రమణ్య స్వామి. అంతేకాక సైనికులు క్షేమం గురించి ఫెర్నాండెజ్ కన్నా ఎక్కువగా ఏ రక్షణశాఖ మంత్రి కృషి చేయలేదని ప్రశంసించారు. -
ప్రియాంకపై స్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక ‘బైపోలార్ డిజార్డర్’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఈ వ్యాధి ప్రజలకు కూడా వ్యాపించేలా కాంగ్రెస్ యత్నిస్తోందని, బైపోలార్ డిజార్డర్తో ప్రియాంక ప్రజా జీవితంలో పనిచేయలేదని ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్రియాంకకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్ఛార్జ్గా నియమిస్తూ గత బుధవారం కాంగ్రెస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై ఇటీవల మరికొందరు బీజేపీ నేతలు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందమైన ముఖం చూసి జనం ఓట్లు వేయరని బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా వ్యాఖ్యానించగా.. అవినీతి, కళంకిత మనిషి రాబర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్లో కీలక బాధ్యతలు చేపట్టడం బీజీపీకి లాభిస్తుందని బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ మరో నేత కైలాష్ విజయ్వర్జియా.. ‘కాంగ్రెస్లో సమర్థవంతమైన నాయకులు లేరు. అందుకనే ప్రియాంకకు పదవులు కట్టబెట్టారు. చాకొలేట్ ఫేస్లతో వచ్చే లోక్సభ ఎన్నికలను ఎదుర్కొందామని కాంగ్రెస్ నేతలు కలలుగంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో మానసిక ఉద్వేగాలు అతి ఎక్కువగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్మెంట్కి లోనుకావడం, బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. వీరిలో కనిపించే ఈ మానసిక స్థితిని బైపోలార్ డిజార్డర్గా పిలుస్తారు. -
మోదీ సర్కార్ను కూలదోస్తా: బీజేపీ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మందిర నిర్మాణంపై ముస్లిం వర్గాలకు అభ్యతరం లేదనీ, అయినా కూడా కేంద్రంలోని మోదీ సర్కార్, యూపిలోని యోగి సర్కార్ ఈ విషయంలో జాప్యం చేస్తే సంహించేది లేదని అన్నారు. ఏదేని కారణాలతో రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే సొంత ప్రభుత్వాలను కూడా కూల్చేందుకు వెనకాడనని హెచ్చరించారు. బీజేపీ నేతలే ఆలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే జనవరి తర్వాత అయోధ్య కేసును విచారిస్తామని సుప్రీం కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
శబరిమల వివాదం : హిందూ సంఘాలపై స్వామి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ఆలయంలోకి మహిళా భక్తుల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న హిందూ సంస్థలు, నిరసనకారులపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. ‘సుప్రీం కోర్టు ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు అది తమ సంప్రదాయమని హిందువులు చెబుతున్నారని, ట్రిపుల్ తలాక్ కూడా సంప్రదాయమేనని, కానీ దాన్ని రద్దు చేసిన తర్వాత అందరూ స్వాగతించారని, హిందువులు కూడా ఇదే మాదిరి వ్యవహరించా’లని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇది హిందూ పునరుజ్జీవానికి, తిరోగమనానికి మధ్య సాగుతున్న పోరాటమని అభివర్ణించారు. హిందువులందరూ ఒకటేనని, కుల వ్యవస్థ రద్దు కావాలని హిందూ పునరుజ్జీవ శక్తులు కోరుతున్నాయన్నారు. బ్రాహ్మణులు ప్రస్తుతం కేవలం మేథావులుగానే మిగిలిపోలేదని, వారు సినిమా, వ్యాపారం తదితర రంగాల్లోనూ ఉన్నారని చెప్పుకొచ్చారు. పుట్టుకతోనే కులం నిర్ధారణ అవుతుందని ఎక్కడ రాశారని, శాస్ర్తాలను సవరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శబరిమల ఆలయంలోకి పది నుంచి 50 సంవత్సరాల మహిళల ప్రవేశాన్ని హిందూ నిరసనకారులు అడ్డగిస్తున్నారనే వార్తల నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. -
టీటీడీపై స్వామి పిటిషన్.. స్వయంగా వాదనలు
సాక్షి. హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని ఏపీ ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీని ప్రభుత్వం అజమాయిషీ నుంచి తప్పించి నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. స్వామి స్వయంగా బుధవారం హైదరాబాద్ వచ్చి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో పదిరోజుల్లో తిరిగి హైదరాబాద్ వస్తానని.. తానే స్వయంగా ఈ కేసులో వాదలు వినిపిస్తానని ఆయన తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన ఢిల్లీ పయనమయ్యారు. కాగా టీటీడీ నిధులు గత కొంత కాలంగా ఏపీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. టీటీడీలో నిధుల దుర్వినియోగం, టీటీడీకి సంబంధించిన విలువైన నగలు, కానుకలు మాయం అవుతున్నాయని ఆరోపిస్తూ.. సుబ్రహ్మణ్య స్వామి గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఇదివరకే టీటీడీ వివాదంపై స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, సుప్రీంకోర్టు ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. టీటీడీ ప్రధాన అర్చకుడి పదవి నుంచి రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు మాయం కావడం, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న వివాదాలు తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణ చేపట్టాలని స్వామి కోరుతున్నారు. -
‘ఇమ్రాన్ ఖాన్ ఓ చప్రాసీ’
అగర్తల : ఇస్లామాబాద్లో సైన్యం, ఐఎస్ఐ ఉగ్రవాదులు పాలన కొనసాగిస్తున్నారు. అక్కడ ఇమ్రాన్ ఖాన్ ఓ చప్రాసీ మాత్రమే అంటూ బీజేపీ వివాదాస్పద ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక పాకిస్తాన్ను నాలుగు భాగాలుగా విభజించాలని పేర్కొన్నారు. పాకిస్తాన్ సరిహద్దు తీవ్రవాదాన్ని ప్రోత్సాహిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందంటూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ ఐక్య రాజ్య సమితి వేదికగా ప్రకటించిన నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పాకిస్తాన్లో సైన్యం, ఉగ్రవాదం అధికారమేలుతున్నాయి. ఇప్పుడక్కడ ఇమ్రాన్ ఖాన్ కేవలం ఓ చప్రాసీ మాత్రమే. మన దేశం ఎంత శాంతియుతంగా ఉంటున్న పాక్ మాత్రం దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక్కటే మార్గం. పాకిస్తాన్ను బలూచ్, సింధ్, పష్తున్లతో పాటు పశ్చిమ పంజాబ్ అనే నాలుగు భాగాలుగా విభజించాలి. అప్పుడైతేనే ఈ సమస్యలు సమసిపోతాయి’ అన్నారు. అంతేకాక ‘అంతర్జాతీయ వేదికల మీద మన దేశం, పాకిస్తాన్ తప్పులను ఎత్తిచూపినప్పుడల్లా ఆ దేశం ఒత్తిడికి గురై ఏవేవో ఆరోపణలు చేస్తుంది. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక పాకిస్తాన్ గురించి మర్చిపోండి. మన ఆర్మీని సిద్ధం చేయండి. కేవలం ఒక్క రోజులో పాక్ నాలుగు భాగాలుగా విడిపోతుంది’ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్ గురించి కూడా ప్రస్తావించారు. ‘మన దేశం అన్ని రకాలుగా బంగ్లాదేశ్కు సాయం చేస్తోంది. కానీ బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. అందుకే ఆమె హిందూవులను వేధిస్తూ, దేవాలయాలను నాశనం చేస్తూన్న పిచ్చి వారిని ఆపడంలేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే బంగ్లాదేశ్పై తగు చర్యలు తీసుకోవాలిని నేను మన ప్రభుత్వానికి సిఫారసు చేస్తాన’ని తెలిపారు. -
టీటీడీపై పిటిషన్; హైకోర్టును ఆశ్రయించండి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వివాదంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టీటీడీ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఆయన వీటిపై సీబీఐ విచారణ చేపట్టాలని సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్కు సూచించింది. కాగా, కోర్టు తీర్పుపై సుబ్రహ్మణ్యస్వామి ట్విటర్లో స్పందించారు. ‘తిరుపతి విషయంలో నేను దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు నేను హైకోర్టును ఆశ్రయిస్తాను. ఇది ఒక మంచి ప్రారంభం’ అని ఆయన పేర్కొన్నారు. -
సెక్షన్ 377పై తీర్పు : ‘హెచ్ఐవీ కేసులు పెరుగుతాయి’
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును బీజేపీ వివాదాస్పద నేత, ఎంపీ సుబ్రమణియన్ స్వామి తప్పు పట్టారు. దీని వల్ల హెచ్ఐవీ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 377పై సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కం గురించి ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే చివరిది కాదు. దీన్ని ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్కి తీసుకెళ్లవచ్చని తెలిపారు. సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక దుష్ప్రవర్తనకు దారి తీయడమే కాక పలు లైంగిక వ్యాధుల సంక్రమణకు అవకాశం కల్పించినదిగా ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల హెచ్ఐవీ కేసులు పేరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక స్వలింగ సంపర్కం అనేది ఒక జన్యుపరమైన రుగ్మతగా పేర్కొని.. దీన్ని ఒక ప్రత్యామ్నాయ లైంగిక ప్రవర్తనలా పరిగణించకూడదని తెలిపారు. స్వలింగ సంపర్కం గురించి సుమారు 157 ఏళ్లుగా సాగుతున్న వివాదానికి సుప్రీం కోర్టు నేటితో స్వస్తి పలికింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ ఏకగ్రీవంగా తీర్పును వెలువరించడం విశేషం. -
‘పరిపూర్ణానందపై బహిష్కరణ ఎత్తేయండి’
సాక్షి, హైదరాబాద్ : స్వామి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేయడంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి తీవ్ర అభ్యంతరం తెలిపారు. గూండాల విషయంలో నగర బహిష్కరణను అమలు చేస్తారని గుర్తు చేసిన స్వామి, తన అభ్యంతరాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు గురువారం ఓ లేఖ రాశారు. సంఘ వ్యతిరేక, ప్రమాదకర కార్యకలాపాల చట్టం 1980లోని సెక్షన్ 3 కింద పరిపూర్ణానందపై చర్యలు తీసుకోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఆ సెక్షన్ను చదివితే అది గూండాల బహిష్కరణకు ఉద్దేశించిందన్న విషయం తనకు తెలిసిందన్నారు. అటువంటిది పరిపూర్ణానందపై ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకోవడం ఆయనను అవమానించడం, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడమేనన్నారు. కాబట్టి వెంటనే బహిష్కరణ ఉత్తర్వుల రద్దుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తాను న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుందని తెలిపారు. -
పీడీపీ సహకరిస్తే హిందూ వ్యక్తిని సీఎంగా ఎన్నుకుంటాం
-
‘కశ్మీర్కు హిందూ సీఎం కావాలి’
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని బీజేపీ వివాదాస్పద నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) హిందూ లేదా సిక్కు వ్యక్తిని సీఎంగా ప్రతిపాదిస్తే తాము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కశ్మీర్కు కేవలం ముస్లిం వ్యక్తే సీఎంగా ఎన్నుకునే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారని, దానికి స్వస్తి పలికి హిందూ వ్యక్తి సీఎం కావాలని స్వామి పేర్కొన్నారు. ముస్లిం వ్యక్తి తప్ప ఒక్క హిందూ వ్యక్తి కూడా ఇంత వరకు సీఎంగా ఎన్నుకోలేదని, పీడీపీ సహకరిస్తే తామూ చేసి చూసిస్తామని తెలిపారు. కాగా జూన్ 19న పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ మద్దతు విరమించుకోవడంతో సీఎం మహబూబా ముప్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కశ్మీర్లో గవర్నర్ పాలన విధించారు. -
టీటీడీపై సుప్రీంకోర్టులో పిటిషన్ : స్వామి
న్యూఢిల్లీ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలిలో గత కొంతకాలం నుండి వివాదాలు కొనసాగుతున్నాయి. ఓవైపు ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులును తొలగించడం మొదలుకుని శ్రీవారి నగలు, ఇతరత్రా విషయాల్లో చోటుచేసుకుంటున్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో టీటీడీ వివాదంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 19న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియంత్రణ నుంచి టీటీడీని తొలగించాలన్నదే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ సారాంశమని సమాచారం. ఆభరణాల మాయం అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేయాలని డిమాండ్, దేవాలయ నిర్వహణ సాధువులకు ఇవ్వాలని, లేదంటే లూటీ ఇలాగే కొనసాగుతుందని గతంలో స్వామి వ్యాఖ్యానించారు. బోర్డులో జరుగుతున్న వివాదంపై టీటీడీ సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలపగా, భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. టీటీడీ బోర్డులో పొరుగు రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రి భార్యకు చోటు కల్పించడం, టీడీపీ ఎమ్మెల్యే అనితకు సైతం బోర్డు మెంబర్గా నియమించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అనిత చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఏపీ ప్రభుత్వం ఆమె విషయంలో వెనక్కి తగ్గింది. -
రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్కి డ్రగ్స్ అలవాటు ఉందని, డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తే ఆ విషయం తేలుతుందని స్వామి పేర్కొన్నారు. తాజాగా పంజాబ్ ప్రభుత్వం ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సాక్షి, న్యూఢిల్లీ: ‘పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందుగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి డోపింగ్ టెస్ట్ నిర్వహించాలి. ఆయన ఖచ్ఛితంగా విఫలం అవుతారు. ఎందుకంటే ఆయన కోకైన్ తీసుకుంటారు కాబట్టి’ అని ఓ ఛానెల్తో మాట్లాడుతూ స్వామి పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ కూడా స్పందిస్తూ.. ‘పంజాబ్లో డ్రగ్స్ అడిక్ట్స్ ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 70 శాతం యువత డ్రగ్స్ మత్తులో ఊగుతోందని రాహుల్ అంటున్నారు. కానీ, వారి పార్టీలోనే ఉన్న డ్రగ్ అడిక్ట్స్కు ముందుగా డోప్ టెస్టులు నిర్వహించండి. అది రాహుల్తోనే మొదలుపెడితే బాగుంటుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. (సంచలన నిర్ణయం) ప్రభుత్వ ఉద్యోగులకు(పోలీస్ శాఖతోసహా) డోప్ టెస్ట్ నిర్వహించాలని, నిందితులుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ సర్కార్ నిర్ణయించింది. అంతేకాదు నిషేధిత డ్రగ్స్ విక్రయించే, అక్రమ రవాణాకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా కఠిన చట్టాన్ని రూపొందిస్తున్నామని కెప్టెన్, సీఎం అమరీందర్ సింగ్ ఇటీవల ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల అనంతరం చేసే ఎంపిక ప్రక్రియ సమయంలో కొత్త అభ్యర్థులకు సైతం డ్రగ్స్ టెస్ట్లు చేయిస్తామని ఆయన తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.. సీఎంతోసహా ప్రజా ప్రతినిధులందరినీ ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. -
శశిథరూర్కు భారీ ఊరట
భార్య మృతి కేసులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్కు భారీ ఊరట లభించింది. పాటియాలా హౌస్ కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాక్షి, న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ నేత శశిథరూర్కు ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. సునంద మృతిలో కేసులో 3000 పేజీల చార్జిషీట్ను రూపొందించిన ఢిల్లీ పోలీసులు.. థరూర్ పేరును నిందితుడిగా చేర్చారు. ఐపీసీలోని 498-ఏ(గృహహింస), 360(ఆత్మహత్యకు ప్రేరేపించటం) సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఇంతదాకా అరెస్ట్ మాత్రం చేయని పోలీసులు.. తాజాగా జూలై 7న కోర్టు విచారణకు మాత్రం హాజరుకావాలంటూ సమన్లు జారీ చేశారు. దీంతో థరూర్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ దొరికితే ఆయన దేశం విడిచిపోతారని పోలీసులు వాదించగా, కోర్టు ఆ వాదనతో ఏకీభవించలేదు. లక్ష రూపాయల పూచీకత్తు, దేశం విడిచిరాదన్న షరతుల మేరకు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. జనవరి 17, 2014న ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ గదిలో సునంద అనుమానాదాస్పద స్థితిలో మృతి చెందగా, కేసుపై దర్యాప్తు కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. స్వామి వెటకారం... కాగా, సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్కు బెయిల్ లభించటంపై బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి స్పందించారు. ‘థరూర్ ఇప్పుడు వేడుకలు జరుపుకోవటం అప్రస్తుతం. అతనేం తీహార్ జైల్లో కూర్చోడు. రాహుల్, సోనియా గాంధీలతో కూర్చుంటాడు. అఫ్కోర్స్.. వాళ్లు కూడా బెయిల్ వాలాస్(బెయిల్పై ఉన్నవాళ్లే) కదా! మంచి కంపెనీ’ అంటూ స్వామి ఛలోక్తులు విసిరారు. -
’ పింక్ డైమండ్ ’ గోల్మాల్ గోవిందం !
-
సుబ్రహ్మణ్యస్వామిని కలిసిన రమణ దీక్షితులు
-
టీటీడీ వ్యవహారంపై సుప్రీంలో పిటిషన్ : స్వామి
సాక్షి, చెన్నై : రమణ దీక్షితులుతో పదవీ విరమణ చేయించే అధికారం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి లేదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. టీటీడీపై ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఆభరణాల మాయం అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మూడు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే రమణ దీక్షితులు రిటైర్మెంట్పై స్టే ఇవ్వాలని కోరతానని చెప్పారు. టీటీడీపై సమీక్ష నిర్వహించే అధికారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని పేర్కొన్నారు. దేవాలయ నిర్వహణ సాధువులకు ఇవ్వాలని, లేదంటే లూటీ ఇలాగే కొనసాగుతుందని అన్నారు. బీజేపీకి ఈ కేసుకు సంబంధం లేదని చెప్పారు. విరాట్ హిందూ సంఘటన ఆధారంగా కేసు వేస్తున్నట్లు స్వామి వెల్లడించారు. దేవాలయానికి బంగారుపూత కేసులో విజయం సాధించినట్లే, ఈ కేసులో సైతం విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ను దెబ్బతీసింది ఆయనే..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నైతిక ఓటమికి రాహుల్ గాంధీనే కారణమని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి అన్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏఎన్ఐతో స్వామి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన సెటైర్లు పేల్చారు. ‘రాహుల్ అపరిపక్వ రాజకీయాలే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఆయన వేసిన సవాళ్లు అసంబద్ధంగా, మూర్ఖంగా ఉన్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం కూడా లేదు. రాహుల్ ఇంక లండన్ వెళ్లి స్థిరపడటం మంచిది. బీజేపీ వందకు పైగా సీట్లు సాధిస్తుందని నేను ముందు నుంచే చెబుతున్నా. లింగాయత్ అంశంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. బీజేపీ అవినీతి నిర్మూలన ఎజెండా కన్నడ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. పట్టణాలతోపాటు గ్రామాల్లో కూడా ప్రజలు బీజేపీకి ఓట్లేశారు’ అని స్వామి తెలిపారు. ఇక ఈవీఎంల మూలంగానే బీజేపీ విజయం సాధించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై స్వామి నవ్వి ఊరుకున్నారు. మరోవైపు జేడీఎస్-కాంగ్రెస్ పొత్తు అంశంపై స్పందించని స్వామి, తన మిత్రుడైన యెడ్యూరప్ప ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. BJP MP Subramanian Swamy's reaction when asked about Congress raising questions on EVMs #KarnatakaElections2018 pic.twitter.com/ZWGSrdwaD8 — ANI (@ANI) 15 May 2018 -
ఆదాయ పన్ను రద్దు చేయండి!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ వివాదాస్పద ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి తనదైన శైలిలోవ్యాఖ్యలు చేశారు. ఆదాయపు పన్నును రద్దు చేయాలని పిలుపునిచ్చారు. దీని వలన ఎక్కువ మంది పొదుపు చేయడానికి వీలవుతుందని, తద్వారా పెట్టుబడుల పెరుగుదలకు దారితీస్తుందన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఫ్యూచర్ అఫ్ ఇండియా ఇన్ ఎమర్జింగ్ వరల్డ్ 8వ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం, పేదరికం సమస్యల పరిష్కారానికి దేశం 10 ఏళ్లలో 10 శాతం వృద్ధిరేటు సాధించాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు, స్టార్టప్ కంపెనీలు అధిక పన్ను భారాన్ని మోస్తున్నారన్నారు. చాలా తక్కువమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. ఇది కూడా వేధింపులతో సమానమన్నారు. మధ్య తరగతిపై భారాన్ని తగ్గించేందుకు, వ్యక్తిగత ఆదాయపన్నును రద్దు చేయాలని సూచించారు. అందువల్ల ప్రజల్లో పొదుపు సామర్ధ్యం పెరుగుతుందని, పెట్టుబడులు పుంజుకుంటాయన్నారు. -
మీవల్లే జైల్లో శశికళ.. రూప సెల్ఫీపై చర్చ
సాక్షి, బెంగళూరు : శశికళ పరప్పన అగ్రహార జైల్లో శశికళ వీఐపీ సదుపాయాలపై నివేదికతో ఐపీఎస్ అధికారిణి రూప వార్తల్లోకెక్కారు. అప్పటి నుంచి తరచూ ఆమె వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ విమర్శలకు దారితీసింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని పొగుడుతూ ఆయనతో దిగిన ఓ సెల్ఫీని ఆమె ట్వీట్ చేయగా.. అది చర్చనీయాంశమైంది. ‘మీరు(సుబ్రహ్మణ్య స్వామి) చాలా గొప్ప వ్యక్తి సార్. మీరే గనుక ఫిర్యాదు చేయకుంటే మాత్రం ఆ వ్యక్తి అసలు జైలుకి వెళ్లే వారు కాదేమో. మీ స్ఫూర్తితోనే ఆమె జైల్లో చేసిన అక్రమాలు నేను బయటపెట్టా’ అని రూప ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఆ ట్వీట్పై పలువురు విమర్శలు మొదలుపెట్టారు. ‘మీరు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఓ వ్యక్తి రీట్వీట్ చేయగా... రూప దానికి స్పందించారు. ‘నేను జైలు రిపోర్టు అందజేయగానే నన్ను బదిలీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక పోలీస్ శాఖ ప్రవర్తించింది. అప్పుడు ఎవరూ ప్రశ్నించరు. కానీ, ఇప్పుడు ఓ స్పూర్తిదాయాక వ్యక్తితో ఫోటో దిగితే రాజకీయాలు చేస్తున్నారు. ఇది సరికాదు’ అని ఆమె పేర్కొన్నారు. కాగా, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదుతో తేనెతుట్టే కదిలింది. సుమారు రెండు దశాబ్దాలపాటు జరిగిన విచారణ అనంతరం బెంగళూరు కోర్టు గతేడాది ఫిబ్రవరిలో జయలలిత ఆమె సన్నిహితురాలు శశికళను కోర్టు దోషులుగా తేల్చింది. అయితే అప్పటికే జయలలిత మరణించగా, శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే శశికళకు జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్ అందిందని.. అందుకోసం అధికారులు రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారంటూ జైల్లో డీఐజీగా ఉన్న రూప సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కర్ణాటక హోం శాఖ.. ఆపై రూపను వేరే విభాగానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
ఎయిరిండియా అమ్మకంపై స్వామి సంచలన వ్యాఖ్యలు
ఎయిరిండియా అమ్మకంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తన సొంత ప్రభుత్వంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియా ప్రతిపాదిత సేల్కు వ్యతిరేకంగా తను ప్రైవేట్ క్రిమినల్ లా కంప్లైంట్ దాఖలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ఎయిరిండియా సేల్లో మరో కుంభకోణం చోటు చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఎయిరిండియాలో 76 శాతం వాటాలను అమ్మాలని కేంద్రం సిద్ధమవుతున్న క్రమంలో ఆయన ఈ ఫిర్యాదు నమోదుచేయడం సంచలనానికి తెరతీసింది. అంతేకాక ఈ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియతో ప్రైవేట్ ప్లేయర్ల చేతిలోకి ఎయిరిండియా యాజమాన్య హక్కులు వెళ్లనున్నాయి. ప్రస్తుతం ప్రతిపాదించిన ఎయిరిండియా సేల్ మరో కుంభకోణం చోటు చేసుకుంటుందని, ఎవరి ఈ ప్రక్రియ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో తాను గమనిస్తున్నానని, ఒకవేళ ఏదైనా నేరం కంటపడితే ప్రైవేట్ క్రిమినల్ లా కంప్లైంట్ దాఖలు చేయనున్నట్టు స్వామి హెచ్చరించారు. ఎయిరిండియా విక్రయంపై మొదటి నుంచి స్వామి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. రూ.52వేల కోట్లకు పైగా రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాకు 2012లో యూపీఏ ప్రభుత్వం రూ.30వేల కోట్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ కల్పించింది. ఈ నిధులతో సంస్థ నెట్టుకొస్తూ ఉంది. రెండు రోజుల క్రితమే కంపెనీలో వ్యూహాత్మక వాటా విక్రయానికి సంబంధించిన ప్రాథమిక సమాచార పత్రాన్ని కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం 76 శాతం వాటాలు విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే, లాభాల్లో ఉన్న చౌక విమాన సేవల విభాగం ఎయిరిండియా ఎక్స్ప్రెస్, సింగపూర్కి చెందిన ఎస్ఏటీఎస్తో కలిపి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ ఏఐఏటీఎస్ఎల్లో కూడా డిజిన్వెస్ట్మెంట్ ఉంటుంది. -
రామసేతును కాపాడుతాం
న్యూఢిల్లీ : భారత్-శ్రీలంక మధ్య సముద్రంలో ఉన్న చారిత్రక నిర్మాణమైన రామ సేతును కాపాడుతామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీం కోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. సేతుసముద్రం ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మణాన్ని ఎట్టి పరిస్థితుల్లో తొలగించబోమని స్పష్టం చేసింది. దేశప్రజల ఆసక్తి దృష్ట్యా ఈ చారిత్రాత్మక నిర్మాణాన్ని ముట్టుకోబోమని, కాపాడటానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపింది. సేతు సముద్రం ప్రాజెక్టుతో రామసేతు నిర్మాణం దెబ్బతింటుందని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ విచారణలో భాగంగా షిప్పింగ్ కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ అఫడవిట్ దాఖలు చేసింది. లంకలో ఉన్న సీత కోసం వానరసేన సాయంతో రాముడే ఈ సేతును నిర్మించినట్లు ప్రచారం జరిగింది. ఇది తమిళనాడులోని రామేశ్వరం దగ్గర్లో ఉన్న పంబన్ దీవి నుంచి శ్రీలంక ఈశాన్య తీరంలోని మన్నార్ దీవి వరకు ఉంది. ఇది సహజసిద్ధంగా ఏర్పడిందని కొందరు వాదించినా.. అదంతా ఉత్తదే అని చాలాసార్లు తేలిపోయింది. -
శ్రీదేవి మృతిపై సుబ్రహ్యణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు
-
నిర్మలా సీతారామన్ను టార్గెట్ చేసిన స్వామి
సాక్షి,న్యూఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన పదవికి రాజీనామా చేయాలన్నారు. జమ్మూ కాశ్మీర్ షోపియాన్లో సైన్యం కాల్పులు..సామాన్య ప్రజలు మరణించిన ఘటనలో మేజర్ ఆదిత్యకుమార్పై చట్టపరమైన చర్యలపై సుప్రీంకోర్టు మద్యంతర స్టే విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తాజా వ్యాఖ్యల అనంతరం ఆమె రాజీనామా చేయాలని కోరాలన్నారు. కాల్పులు జరిగిన సమయంలో తన కొడుకు (ఆదిత్య) ఘటనాస్థలంలో లేడని..అతనిపై నమోదైన కేసును కొట్టివేయాలని మేజర్ ఆదిత్యా తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ కరమ్వీర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన సుప్రీం కేసు విచారణఫై సోమవారం మధ్యంతరం స్టే విధించింది. సైన్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తుందని ప్రశ్నించింది. అలాగే ఈ కేసులో తమ వైఖరి వెల్లడించాల్సిందిగా, జమ్ముకశ్మీర్ ప్రభుత్వాన్ని, కేంద్రాన్నికోరింది. రెండు వారాల్లో తమ స్పందన తెలియచేయాలని నోటీసులు జారీ చేసింది. దీనిపై సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగి మాట్లాడుతూ ఈ కేసును హైకోర్టులో విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఎఫ్ఐఆర్పై విచారణను ఆపివేయడం తోపాటు.. కర్తవ్య నిర్వహణలో భాగంగా తీసుకున్న మేజర్ ఆదిత్య చర్యపై కేంద్ర ప్రభుత్వం లేదా జమ్మూకశ్మీర్ పోలీసులు యాక్షన్ తీసుకోలేవని కోర్టు పేర్కొందని చెప్పారు. మరోవైపు ఇది ఆర్మీకి సానుకూలమైన ప్రోత్సాహకరమైన రోజంటూ కరమ్ంసింగ్ న్యాయవాది ఐశ్వర్య భాటి సంతోషం వ్యక్తం చేశారు. పిటీషన్ కాపీని భారత అటార్నీ జనరల్ కార్యాలయానికి అందించాలని తమను కోరిందని చెప్పారు. కాగా జనవరిలో షోపియాన్లో ఆందోళనకారులపై కాల్పులు, ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మేజర్ ఆదిత్యాకుమార్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. : Nirmala Sitaraman should be asked to resign after SC’s remarks on the FIR — Subramanian Swamy (@Swamy39) February 12, 2018 -
వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్
సాక్షి, శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మెహబూబాపై బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైన్యం పై కేసు నమోదు చేయటం ఏంటని? ఆయన కశ్మీర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సైన్యంపైనే కేసా? ఆమె తీసుకున్న నిర్ణయం అర్థం పర్థం లేనిది. ఈ అంశంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి. తక్షణమే కేసు వెనక్కి తీసుకోకపోతే.. విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చెయ్యండి’’ అని సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యానించారు. కాగా, ఈ వివాదం ఇప్పుడు పీడీపీ-బీజేపీ మిత్రపక్షం మధ్య చిన్నగా చిచ్చును రాజేస్తోంది. మెహబూబా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేబినెట్ నుంచి బయటకు వచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధం కావటం కలకలం రేపింది. అయితే అధిష్ఠానం సూచనలతో వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం. అసలేం జరిగింది... దక్షిణ కశ్మీర్ షోపియాన్ జిల్లాలోని గోవాంపురా ప్రాంతంలో శనివారం సైనిక వాహన శ్రేణిపై దాదాపు 250 మందికి పైగా నిరసనకారులు రాళ్లు రువ్వారు. అంతేకాదు ఒక అధికారి నుంచి ఆయుధాన్ని లాక్కునేందుకు ప్రయత్నించడంతో వారిపై సైనికులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. దీంతో లోయలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జవాన్ల కాల్పుల్లో పౌరుల మృతికి నిరసనగా వేర్పాటువాదులు ఒక్క రోజు బంద్కు పిలుపునిచ్చారు. ఘటనపై పూర్తి నివేదిక సమర్పించమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు కాల్పుల జరిపిన సైన్యంపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదుచేశారు. గర్వాల్ 10 బెటాలియన్పై హత్య, హత్యాయత్నం కేసును నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
నేషనల్ హెరాల్డ్ కేసులో అనూహ్య మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ శనివారం అనూహ్య మలుపు తిరిగింది. కేసు విచారణను ప్రారంభించిన పటియాలా కోర్టుకు బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ఆదేశాలను సమర్పించారు. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2012లో రూ. 90.25 కోట్ల రుణాన్ని వడ్డీ లేకుండా నేషనల్ హెరాల్డ్ న్యూస్పేపర్ను నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంటూ సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. అందులో సోనియా, రాహుల్, మోతీలాల్ వోరాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2016లో స్వామి పిటిషన్పై స్పందించాలంటూ కోర్టు సోనియా, రాహుల్లను న్యాయస్థానం కోరింది. దీంతో గతేడాది నవంబర్లో రాహుల్, ఆయన తల్లి సోనియాలు కోర్టులో స్వామి పిటిషన్పై కౌంటర్ను దాఖలు చేశారు. శనివారం పటియాలా కోర్టు ఈ కేసులో విచారణను ప్రారంభించగా.. తన పిటిషన్ను బలపర్చుతూ స్వామి ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన ఆదేశాల పత్రాలను ఆధారాలుగా సమర్పించారు. రూ. 414 కోట్ల పన్నును కాంగ్రెస్ పార్టీ చెల్లించాలని కోర్టులో వాదించారు. -
‘స్వలింగ సంపర్కం’పై స్వామి ఏమన్నారంటే..
సాక్షి, న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కులతోపాటు, స్త్రీ, పురుషుల మధ్య అసహజ శృంగారానికి అడ్డుకట్ట వేస్తున్న భారతీయ శిక్షా స్మతిలోని 377వ సెక్షన్ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పునర్ పరిశీలించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్వలింగ సంపర్కం (మగ-మగ, ఆడ-ఆడ మధ్య శృంగారం), ఎల్జీబీటీల అంశంపై స్పందించారు. ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందినవారు ఏం చేసినా వ్యక్తిగత విషయంగా ఉండాలని, కానీ పబ్లిక్ లో ఆ విషయాన్ని బహిరంగంగా వెల్లడించడంలాంటివి చేస్తే శిక్షించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. జన్యు పరమైన లోపాల కారణంగానే స్వలింగ సంపర్కులుగా తయారవుతారని చెప్పారు. తమ జెండర్ (హోమో సెక్స్వల్) పలానా అని, తాము పలానా కమ్యూనిటీ(ఎల్జీబీటీ) వ్యక్తులతో శృంగారంలో పాల్గొంటామని బహిర్గతం చేయడం చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాలు స్వలింగ సంపర్క వివాహాలను వ్యతిరేకిస్తున్నారని స్వామి గుర్తుచేశారు. మనుషులు సాధారణంగా హమో సెక్స్వల్స్గా మారడం లేదని, జన్యుపరమైన లోపాలు అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోందని బీజేపీ సీనియర్ నేత పేర్కొన్నారు. -
ఇదే మంచి తరుణం
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాతో ద్వైపాక్షి సంబంధాలను మరింత ధృఢతరం చేసుకోవడానికి భారత్కు ఇదే మంచి తరుణమని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందన్న కారణంతో అమెరికా ఆ దేశానికి నిధులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వామి ఇటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ మరింత దగ్గరయ్యేందుకు ఇంతకుమించిన మంచి సమయం మరొకటి లేదని ఆయన అన్నారు. భారత్ వెంటనే తన రాయబార కార్యలయాన్ని టెల్ అవైవ్ నుంచి జెరూలసలేంకు మార్చడం మంచిదని ఆయన మరోసారి సూచించారు. ఈ చర్యతో పాకిస్తాన్ను చావుదెబ్బ కొట్టడంతో పాటు.. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు మరింత దగ్గరకావొచ్చన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు 15 ఏళ్లుగా అమెరికా లక్షలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసినా.. ఆ దేశం తమకు అబద్దాలను చెప్పిందన్న ట్రంప్ ట్వీట్ను సుబ్రమణ్య స్వామి స్వాగతించారు. అమెరికా ఇప్పటికైనా నిజాలు గ్రహించిందని వ్యాఖ్యానించారు. -
రజనీ ప్రకటన.. స్వామి రియాక్షన్
సాక్షి, చెన్నై : రజనీకాంత్ రాజకీయాలపై ఇలా ప్రకటన చేశాడోలేదో.. వెంటనే బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి స్పందించారు. కాసేపటి క్రితం ఓ జాతీయ ఛానెల్తో మాట్లాడిన ఆయన మరోసారి రజనీపై విమర్శలు చేశారు. ‘‘రజనీ రాజకీయాల్లోకి వస్తానని మాత్రమే చెప్పాడు. అంతకు మించి వేరే ఏ వివరాలు చెప్పలేకపోయాడు. అతనో నిరక్షరాస్యుడు. ఇదంతా మీడియా హైప్ మాత్రమే. తమిళ ప్రజలను రజనీ తక్కువగా అంచనా వేస్తున్నారు. కానీ, ఆయన అనుకుంటున్నట్లు వారు అంత తెలివి తక్కువోళ్లు కాదు. చాలా తెలివైన వాళ్లు. ఎప్పుడెలా స్పందించాలో వాళ్లకు బాగా తెలుసు’’ అని స్వామి వ్యాఖ్యలు చేశారు. కాగా, గతంలోనూ స్వామి రజనీకాంత్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూడా. రజనీకాంత్ రాజకీయాలకు సరిపోడని..రాజకీయాల్లో ఎలా మెలగాలన్న జ్ఞానం తలైవాకు లేదని. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇబ్బందికర పరిస్ధితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్వామి హెచ్చరించారు కూడా. -
‘పాకిస్తాన్ను ఖండఖండాలుగా తెగ నరకండి’
ముంబై : పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న కుల్భూషణ్ జాధవ్ను కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లి, భార్యలకు జరిగిన అవమానంపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి తనదైన శైలిలో స్పందించారు. జాధవ్ను కలవడానికి వెళ్లిన ఆయన తల్లి అవంతి, భార్య చేతాంకుల్ల పట్ల పాకిస్తాన్ భద్రతా సిబ్బంది అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. వారి దుస్తుల్ని మార్పించి వేరే బట్టలు వేసుకోమనడం, మెడలో ఉన్న మంగళ సూత్రాలను, గాజుల్ని తీయించడం, బొట్టు ఉండరాదనడం, బూట్లు తీయించడం, జాధవ్తో మాతృభాషలో సంభాషించడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవడం లాంటివి విస్మయం కలిగించాయి. చివరకు జాధవ్ భార్య మంగళసూత్రాలు, ఆమె బూట్లను పాకిస్తాన్ అధికారులు వెనక్కి ఇవ్వలేదు. ఈ సంఘటనను ‘ద్రవపది వస్త్రాపహరణం’గా అభివర్ణించిన సుబ్రమణియన్ స్వామి.. జాధవ్ కుటుంబాన్ని అవమానించిన పాకిస్తాన్ గడ్డను ఖండఖండాలుగా తెగ నరకాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టాలని సూచించారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. వాస్తవాధీన రేఖ అవల భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్పై కూడా ఆయన మాట్లాడారు. ఆపరేషన్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే, పాకిస్తాన్కు ఇది సరిపోదని, దాన్ని నాలుగు ముక్కలుగా విభజించడమే రక్త దాహాన్ని ఆపగలుగుతుందని అభిప్రాయపడ్డారు. భారత్ - పాకిస్తాన్ల మధ్య యుద్ధం వస్తే మరే ఇతర దేశం కూడా అందులో జోక్యం చేసుకోదని అన్నారు. ఇందుకు కారణం అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్పై ఉన్న ముద్రేనని చెప్పారు. -
బీజేపీ మంత్రులకు సుబ్బూ సూచన!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ మంత్రులు విదేశీ దుస్తులు ధరించకుండా నిషేధం విధించాలి. అంతేకాకుండా బీజేపీ మంత్రులు మద్యం కూడా ముట్టుకోకూడదు. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణ చర్యలను అమలుచేయాలని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సూచించారు. బీజేపీ మంత్రులు భారతీయ వాతావరణానికి అనుకూలంగా దుస్తులు వేసుకోవాలని హితవు పలికారు. పాశ్చాత్య సంస్కృతి దుస్తులు ధరించడమంటే విదేశీ బానిసత్వానికి లొంగిపోవడమేనని విమర్శించారు. 'పాశ్చాత్య దుస్తులంటే విదేశీ బానిసత్వాన్ని అంగీకరించడమే. మంత్రులు భారతీయ వాతావరణానికి అనుకూలమైన దుస్తులు వేసుకునేలా బీజేపీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 49 మద్యపానాన్ని నిషేధించాలని సూచిస్తోంది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకోవడం లేదు కానీ బీజేపీ తన క్రమశిక్షణలో దీనిని కూడా భాగం చేసుకోవాలి' అని సుబ్రహ్మణ్యస్వామి వరుసగా ట్వీట్ చేశారు. పార్లమెంటు సెంట్రల్హాల్లో జరిగిన పండిట్ మదన్ మోహన్ మాల్వియా జయంతి ఉత్సవాల్లో ఎన్డీయే మంత్రులు పాల్గొనలేదని సుబ్రహ్మణ్యస్వామి సోమవారం ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ మంత్రులు వెస్ట్రన్ దుస్తులు ధరించకూడదంటూ స్వామి ఈ మేరకు ట్వీట్ చేశారు. -
అన్నాడీఎంకే అసలు సారథి శశికళే
-
సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు
వివాదస్పద వ్యాఖ్యలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచే బీజేపీ ఫైర్ బ్రాండు, సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. పనామా పేపర్లలో ప్రముఖ టాటా సన్స్ డైరెక్టర్లలో చాలా మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. తనకు సమయమిస్తే, అందరి వివరాలను ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. ట్విట్టర్ ద్వారా సుబ్రహ్మణ్యస్వామి ఈ ఆరోపణలు చేశారు. పనామా పేపర్ల లీక్ ప్రపంచాన్నే కుదిపేసిన సంగతి తెలిసిందే. విదేశాల్లో నల్లధనం దాచుకున్న నల్ల కుబేరుల జాబితాను ఈ పేపర్లు బయటపెట్టాయి. చాలా మంది ప్రముఖులే ఈ పేపర్లలో ఉన్నారు. ఇటీవల పనామా పేపర్ల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన పదవివే పోగొట్టుకున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో, ప్రభుత్వ పదవులు చేపట్టకుండా ఆయనపై ఆ దేశ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. నేడు సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. Many prominent Tata&Sons Directors figure in Panama Papers. Will publish details when time permits — Subramanian Swamy (@Swamy39) December 16, 2017 -
అప్పుడే వేలుపెట్టిన సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ రాజధాని వ్యవహారం ఓ పక్క వివాదంగా మారుతుండగా వెంటనే భారత్ తన దౌత్య కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలేంకు మార్చాలంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. గురువారం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్న ఆయన 'జెరూసలేం ఇజ్రాయెల్ భూభాగంగా గుర్తింపు లభించడంతో ఆ దేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇక భారత్ తన దౌత్య కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలేంకు మార్చాల్సిందే' అని అన్నారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. పలు అరబ్ దేశాలతోపాటు యురోపియన్ యూనియన్లోని పలు దేశాలు, ఐక్యరాజ్యసమితి విభాగం కూడా ట్రంప్ను విమర్శిస్తున్నారు. భారత్ కూడా ఇప్పటి వరకు ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఈలోగా భారత ప్రభుత్వంలో భాగస్వామి అయిన సుబ్రహ్మణ్య స్వామి పై విధంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. -
అయోధ్యలోనే వచ్చే ఏడాది దీపావళి
సాక్షి, న్యూఢిల్లీ : నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టించే బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి.. తాజాగా అయోధ్యం అంశంపై అటువంటి మాటలే అన్నారు. మంగళవారం రామజన్మభూమి-మసీదు అంశంపై సుప్రీకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సుబ్రమణ్య స్వామికి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు తీర్పుల ఏలా వచ్చినా.. వచ్చే ఏడాది దిపావళి వేడుకలు మాత్రం ఆయోధ్యలో జరుగాతయని ఆయన అన్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి రామజన్మభూమిలో అయోధ ఆలయ నిర్మాణం పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఆలయాన్ని ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వివాదాస్పద ప్రాంతంగా పిలవబడుతున్న చోట.. ప్రార్థనలు చేసుకోవడం హిందువుల హక్కు అని ఆయన చెప్పారు. రామజన్మభూమి ప్రాంతంపై ముస్లింలకు హక్కు లేదని.. కేవలం ఆస్తి కోసమే దావాలు వేశారని ఆయన చెప్పారు. -
చరిత్రపై కుట్ర జరుగుతోంది
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తాజాగా రూపొందించిన పద్మావతి చిత్ర వివాదాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఈ చిత్రంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. హిందువుల చరిత్రపై అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. అందులో భాగంగానే ఇటువంటి చిత్రాలు వస్తున్నాయని ఆయన అన్నారు. ముస్లిం రాజులను హీరోలు చూపించే ప్రయత్నంలో చరిత్రను వక్రీకరిస్తున్నారని.. ఈ క్రమంలో అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని సుబ్రమణ్యస్వామి చెప్పారు. ముస్లింలను హీరోలుగా చూపించేందుకు దుబాయ్ వాసులు కలలు కంటున్నారని ఆయన అన్నారు. అమీర్ఖాన్ తీసిన పీకే చిత్రం కూడా ఈ కోవలోకే వస్తుందని.. ఈ చిత్రం పాకిస్తాన్ను ప్రోత్సహించేలా ఉందని ఆయన ఆరోపించారు. డిసంబర్ 1న విడుదల కానున్న పద్మావతి చిత్రంపై ఇప్పటికే అనే వివాదాలు చుట్టుముట్టాయి. రాజపుత్ర వర్గాలు, కర్నీసేన, ఇతర సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలంటూ పేసిన పిల్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ చిత్రంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. సెన్సార్ బోర్డును సంప్రదించాలని పిల్ దాఖలు చేసిన వారికి సుప్రీం కోర్టు సూచించింది. -
చరిత్రపై కుట్ర జరుగుతోంది
-
హిందూ ఉగ్రవాదం.. కమల్ సంచలన వ్యాసం
సాక్షి, చెన్నై : ఉలగనాయకన్(లోకనాయకుడు) కమల్హాసన్ మరోసారి తన మాటలతో రాజకీయ దుమారం రేపారు. పరోక్షంగా బీజేపీ, అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకున్న ఆయన.. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ సంచలన ప్రకటన చేశారు. హిందూ ఉగ్రవాదాన్ని అడ్డుకోవటంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. పాలిత రాష్ట్రాలైన యూపీ, గుజరాత్, రాజస్థాన్లలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆనంద వికటన్ పత్రికలో ఆయన రాసిన వ్యాసం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయనెమన్నారంటే‘‘గతంలో హిందూ సంఘాలు హింసకు పాల్పడేవి కావు. కేవలం మాటలతోనే ప్రత్యర్థులపై విరుచుకుపడేవి. కానీ, పరిస్థితులు ఇప్పుడు దారుణంగా మారాయి. భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి చేరుకున్నారు. వారిని వెనకాల నుంచి కొందరు ప్రోత్సహిస్తున్నారు. అసలు హిందూ టెర్రరిజం లేదన్న కొందరి వాదన నిజం కాదు. అది ఉంది. ఇప్పుడు తారా స్థాయికి చేరింది ’’ అంటూ కమల్ వ్యాఖ్యానించారు. అయితే హిందూ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేళ ప్రభుత్వం విజయవంతం అయ్యిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్పై కమల్ ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో మెర్సల్ వివాదాస్పద డైలాగుల అంశం గురించి కూడా ప్రస్తావించారు. కొత్త పార్టీ ఆలోచనలో ఉన్న కమల్ మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకిగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తనది కాషాయం రంగు కాదని కేరళ సీఎంను కలిసిన సమయంలో ఆయన వ్యాఖ్యలు చేయటం కూడా చూశాం. మరోపక్క ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సన్నిహితంగా మెదులుతున్నారు కూడా. కమల్ స్వార్థపరుడు... ఢిల్లీ : స్వలాభం కోసమే కమల్ రాజకీయ ఎత్తుగడ వేస్తున్నాడని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి మండిపడ్డారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కమల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కమల్ ఓ అవినీతి పరుడని.. బీజేపీ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కుట్రలకు తెరలేపుతున్నాడని స్వామి విమర్శించారు. -
ఆధార్పై స్వామి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఫైర్బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆధార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు వివిధ సేవలకు, సంక్షేమ పథకాల లబ్దికి ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేస్తూ వెళ్తున్న క్రమంలో, సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఆధార్ను జాతీ భద్రతకు ముప్పుగా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయనున్నట్టు కూడా తెలిపారు. మరోవైపు ఆధార్పై సుప్రీంకోర్టులో చర్చ జరుగుతోంది. ఈ చర్చ నేపథ్యంలో దీన్ని సుప్రీంకోర్టు కచ్చితంగా నిలిపివేస్తుందని తెలిపారు. ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ''ఆధార్ను తప్పనిసరి చేయడం ఏ విధంగా మన జాతి భద్రతకు ముప్పో తెలుపుతూ త్వరలోనే ప్రధానికి లేఖ రాయనున్నాను. సుప్రీంకోర్టు కచ్చితంగా దీన్ని నిలిపివేస్తుంది'' అని ట్వీట్లో తెలిపారు. మొబైల్కు ఆధార్ను లింక్ చేయడంపై వెల్లువెత్తిన ఫిర్యాదులపై స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. టెలికాం కంపెనీలకు కూడా నోటీసులు పంపింది. అయితే ఆధార్ యాక్ట్ను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నమోదుచేసిన పిటిషన్ను మాత్రం సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా సవాలు చేయగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ''కేంద్రం నిర్ణయాన్ని వ్యక్తులు సవాలు చేయొచ్చు.. అంతేగానీ రాష్ట్రాలు కాదు. మమతా బెనర్జీని వ్యక్తిగతంగా పిల్ దాఖలు చేయమనండి. వ్యక్తిగత హోదాలో పిల్ దాఖలు చేస్తే అప్పుడు దానిని పరిగణనలోకి తీసుకుంటాం'' అని సుప్రీం వెల్లడించింది. -
సునంద కేసు.. స్వామికి చురకలు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై ఆయన వేసిన పిల్ను గురువారం కొట్టేసింది. కేసును శశిథరూర్ ప్రభావితం చేస్తున్నారని.. కోర్టు ఆధ్వర్యంలో సిట్ విచారణ జరిగేలా ఆదేశించాలంటూ స్వామి ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే స్వామి వేసిన పిటిషన్ ఓ రాజకీయ ప్రయోజన వ్యాజ్యంలా ఉందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. అయితే స్వామి ఆరోపణలకు సంబంధించి సరైన సాక్ష్యాలను సమర్పించలేకపోయాడని జస్టిస్ ముదలియర్, జస్టిస్ మెహతా నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. కోర్టుకు సమర్పించిన అంశాలను స్వామి రహస్యంగా ఉంచారని ఈ సందర్భంగా జడ్జిలు పేర్కొన్నారు. నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా కేసులు వేయటం సరికాదని.. ఈ విషయంలో న్యాయ వ్యవస్థ చాలా జాగ్రత్తగా వ్యహరిస్తుందని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు కేసును తప్పుదోవ పట్టించేందుకు శశిథరూర్ జోక్యం చేసుకున్నారంటూ స్వామి ఆరోపణలు చేయగా.. వాటిని ఢిల్లీ పోలీసులు, కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వాటిని ఖండించారు. -
వచ్చే దీపావళికి రామ మందిరం పూర్తి!
సాక్షి, న్యూఢిల్లీ : రామ జన్మభూమి.. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరం కట్టి తీరతామని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ప్రకటించారు. త్వరలో ఆటంకాలన్నీ తొలగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన... వచ్చే దీపావళి నాటికి గుడి నిర్మాణం పూర్తి చేసి తీరతామని చెబుతున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘సుప్రీంలో ప్రస్తుతం రివ్యూ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది. అది పూర్తవ్వగానే రామ మందిర నిర్మాణ పనులు మొదలుపెడతాం. వచ్చే ఆగష్టు నుంచి పనులు మొదలుపెట్టి 3-4 నాలుగు నెలల్లో పూర్తి చేసి దీపావళి నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాం’ అని అన్నారు. కాగా, డిసెంబర్ 5న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో ఇరు వర్గాలు తుది వాదనలు వినిపించనున్నారు. ఆ మరుసటిరోజు అంటే డిసెంబర్ 6 నాటికి బాబ్రీ కూల్చివేత ఘటన జరిగి సరిగ్గా 26 ఏళ్లు పూర్తవుతుండటం విశేషం. స్వామి వాదన ఏంటంటే... ఆ కాలంలో మొగలు చక్రవర్తి బాబర్ స్వాధీనంలో ఉండటంతో ఆ స్థలం తమకు చెందించే అని ముస్లిం నేతలు వాదిస్తున్నారు. కానీ, అలహాబాద్ హైకోర్టు దానిని తోసిపుచ్చింది. అదే సమయంలో నేను లేవనెత్తిన అంశంపై కూడా వారి నుంచి సమాధానం రావటం లేదు. అది స్థిరాస్థి హక్కు అని వారు(ముస్లిం సంఘాలు) అంటున్నారు. కాబట్టి అదొక సాధారణ హక్కు అవుతుంది. కానీ, రామ జన్మభూమిపై హిందువులకు ప్రాథమిక హక్కు ఉందని న్యాయస్థానం గత తీర్పులో స్పష్టం చేసింది. ఆ లెక్కన్న వారు గెలిచే అవకాశాలు లేనే లేవన్నది స్పష్టమవుతోంది అని స్వామి చెబుతున్నారు మరోవైపు ఆలయ నిర్మాణానికి తమకేం అభ్యంతరం లేదని.. కాకపోతే వివాదాస్పద స్థలానికి సహేతుక దూరంలో మసీదు నిర్మించాలంటూ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఓ ప్రతిపాదనను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
రాహుల్ హిందువా? నమ్మొద్దు
సాక్షి, తిరువనంతపురం : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హిందువా? లేక క్రైస్తవుడా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణియన్ స్వామి ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ పర్యటనలో రాహుల్ ప్రముఖ దేవాలయాలను సందర్శించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విలేకరులతో మాట్లాడిన స్వామి రాహుల్పై విమర్శలు చేశారు. ‘రాజ్పథ్లోని చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తాడు. ఇప్పుడేమో ఇలా దేవాలయాలకు వెళ్తున్నాడు. తానోక హిందువునని ప్రకటించుకునే దమ్ము రాహుల్కు ఉందా? అని స్వామి ప్రశ్నించారు. రాహుల్ ఎప్పటి నుంచో క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నాడని ఆయన అన్నారు. తన తండ్రి రాజీవ్లాగే తాను కూడా ఓ హిందువునని రాహుల్ చెప్పాల్సిందేనని.. అప్పటిదాకా అతన్ని నమ్మలేమని స్వామి పేర్కొన్నారు. కాగా, గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతుండంతో రాహుల్గాంధీ మూడు రోజులపాటు గుజరాత్తో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ద్వారకా గుడి నుంచి మొదలుపెట్టి.. చోటిలా దేవాలయంలో పూజతో రాహుల్ తన పర్యటనను ముగించారు. దీంతో ఆయన(రాహుల్) చేసిన పని హిందుత్వ వాదులకు(బీజేపీ, ఆరెస్సెస్)లకు చెంపపెట్టని కాంగ్రెస్ వ్యాఖ్యానించగా, స్వామి కౌంటర్ వేశారు. -
రాహుల్ ప్రచారం.. శుద్ధ దండగే!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుజరాత్ ఎన్నికల కోసం ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ప్రచారంలో భాగంగా నేటి నుంచి ఆయన మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ స్పందించింది. రాహుల్ ప్రచారం చేసినా కాంగ్రెస్కు ఓటమి తప్పదని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి చెబుతున్నారు. సోమవారం ఉదయం విలేకరులతో మాట్లాడిన ఆయన... ‘కావాలంటే రాహుల్ దేశంలో ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు. కానీ, దాని వల్ల ఏం అతనికి, పార్టీకి ఏం ఒరగదు’ అని చెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా గుజరాత్లో బీజేపీ గెలుపు ఖాయమని స్వామి ఉద్ఘాటించారు. ఇక మూడు దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న గుజరాత్లో ఎలాగైనా విజయం సాధించాలన్న ధీమాతో కాంగ్రెస్ ఉంది. ముఖ్యంగా పటేల్ ఉద్యమంను ప్రధానాశంగా చేసుకుని ప్రచారం నిర్వహించాలని భావిస్తోంది. సోమవారం ద్వారకలోని కృష్ణ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం రాహుల్ తన పర్యటనను కొనసాగించనున్నారు. ‘రాహుల్ నిజాయితీపరుడైన నేత. ఆయన ప్రసంగం కోసం గుజరాత్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శక్తిసిన్హ్ గోహ్లి మీడియా సమావేశంలో తెలియజేశారు. -
తీహార్ జైల్లో ఉండాల్సిన ఫ్యామిలీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత జనతాపార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి చిదంబరం కుటుంబంపై విరుచుకుపడ్డారు. కేంద్రమాజీ మంత్రి చిదంబరం, ఆయన తనయుడు కార్తీ ఇద్దరూ తీహార్ జైలుకు వెళ్లాల్సిన వాళ్లేనని స్వామి అన్నారు. చిదంబరం కుటుంబాన్ని మోసగాళ్ల ఫ్యామిలీగా స్వామి అభివర్ణించారు. కార్తీ అతి పెద్ద మోసగాడని ధ్వజమెత్తారు. మంచి చదువు లేదు.. మంచి ఉద్యోగం చేయలేదు.. అయినా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని, ఇంత సంపదను ఎలా సృష్టించారని స్వామి ప్రశ్నించారు. వ్యాపారస్తుల దగ్గర అక్రమంగా కార్తీ అక్రమంగా డబ్బును వసూలు చేశారని.. అందువల్లే ఇంత సంపదను సాధించారని చెప్పారు. ఇక చిదంబరం భార్య నళిని సైతం ఇలాగే డబ్బులు వసూలు చేసేవారని స్వామి ఆరోపించారు. చిదంబరం ఫ్యామిలీని తీహార్ జైలుకు పంపాలని స్వామి అన్నారు. కార్తి చిదంబరం విదేశీ బ్యాంకుల్లో ఉన్న తన అకౌంట్లను మూసివేసేందుకే విదేశాలకు వెళుతున్నారని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపిన తరువాత స్వామి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
నతాలియా రామోస్ ఎవరు ?
గత రాత్రి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యుక్షుడు రాహుల్ గాంధీని కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాంటూ ఓ నటి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇంకేముంది రాహుల్పై సెటైర్లు గుప్పించడంలో ముందుండే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్లో స్పందించారు. 'గత రాత్రి మంచి వాక్చాతుర్యం ఉన్న రాహుల్గాంధీతో ఉన్నా. రాహుల్ గాంధీ ఓ జ్ఞాని' అంటూ సెప్టెంబర్ 14న నతాలియా పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. రాహుల్ గాంధీ ఏదో లెక్చర్ టూర్లో ఉన్నప్పుడు తనతోనే ఉన్నాడంటూ నతాలియా ట్వీట్ చేశారని సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. గత రాత్రి బుద్ధూను కలుసుకున్నానని ఆమె ట్వీట్ చేసింది కదా? నతాలియా రామోస్ ఎవరు? అంటూ సెటైర్లు విసిరారు. అమెరికాలో రెండు వారాల పర్యటనలో భాగంగా నతాలియా రామోస్ను రాహుల్ గాంధీ కలిశారు. యూఎస్లో జరిగిన సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు హాజరయిన పలువురు ప్రముఖుల్లో రాహుల్ కూడా ఉన్నారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ వ్యూహకర్త పునీత్ అహుల్వాలియాను కలిశారు. వర్జీనియా గవర్నర్ టెర్రీ మెకాలిఫ్ను కూడా రాహుల్ కలిసినట్టు సమాచారం. అయితే రాహుల్ ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడంతో నతాలియాతో కలిసి తీసుకున్న ఫోటోపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ నతాలియా ఎవరంటే ? అస్ట్రేలియన్-స్పానిష్ నటి నతాలియా నోరా రామోస్ కొహెన్ 1992లో జన్మించారు. అమెకి అమెరికా పౌరసత్వం కూడా ఉంది. ది డిమోండ్, బ్రాట్జ్ చిత్రాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా నిక్లోడెన్ టెలివిజన్ సిరీస్లోని హౌస్ ఆఫ్ అనుబిస్లో నినా మార్టిన్గా ప్రధాన పాత్రలో నటించారు. నతాలియా తల్లి ఆస్ట్రేలియన్ కాగా, తండ్రి స్పానిష్ పాప్ సింగర్ జువాన్ కార్లోస్. Who is Nathalia Ramos? She tweets that she was with Buddhu "last night". Some lecture tour! pic.twitter.com/RpR816X8ZV — Subramanian Swamy (@Swamy39) September 22, 2017 -
ఐపీఎల్ వేలంపై సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వచ్చే ఐదేళ్ల కాలానికి టెలివిజన్, డిజిటల్ రైట్స్ను భారీ మోత్తానికి స్టార్ ఇండియా సంస్థ సొంతం చేసుకుంది. అయితే స్టార్ ఇండియాకు ఐపీఎల్ మీడియా హక్కులు రావడంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. సోమవారం నిర్వహించిన వేలంలో రూ. 16 వేల 347.50 కోట్ల భారీ మొత్తానికి స్టార్ ఇండియా సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకోగా.. ఆ సంస్థకు మీడియా హక్కులు రావడంలో బీసీసీఐతో పాటు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా హస్తముందని.. అందుకుగానూ ఆయన రూ. 100 కోట్లు అందుకోనున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇంటర్నల్ ఆర్బిటరీ అప్లికేషన్ రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం నిర్వహించిన వేలంలో నిబంధనల ప్రకారం సీల్డ్ కవర్లో అత్యధిక బిడ్ వేసిన గ్రూప్నకు బీసీసీఐ హక్కులను కేటాయించింది. ఉపఖండంలో టెలివిజన్ హక్కుల కోసం స్టార్తో పోటీ పడిన సోనీ సంస్థ ఈసారి అవకాశం కోల్పోయింది. కొత్త ఒప్పందం ప్రకారం 2018 నుంచి 2022 వరకు స్టార్కు ఈ హక్కులుంటాయి. 2008లో తొలి ఐపీఎల్ సమయంలో పదేళ్ల కాలానికి హక్కులను వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ దాదాపు రూ. 8,200 కోట్లు సొంతం చేసుకుంది. మరుసటి ఏడాది తొమ్మిదేళ్ల కాలానికి సోనీ గ్రూప్నకు 1.63 బిలియన్ డాలర్లకు అమ్మేసింది. ఐపీఎల్ బిడ్లో అసలేం జరిగింది.. మొత్తం ఏడు కేటగిరీల్లో ఐపీఎల్ హక్కుల కోసం బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది. మొత్తం 24 కంపెనీలు బిడ్ డాక్యుమెంట్ను కొనుగోలు చేసినా.. చివరకు 14 కంపెనీలే వేలంలో పాల్గొన్నాయి. భారత్లో టీవీ హక్కుల కోసం స్టార్ రూ. 6,196.94 కోట్లతో బిడ్ వేయగా, సోనీ రూ. 11,050 కోట్లతో బిడ్ చేసి ముందంజలో నిలిచింది. అయితే డిజిటల్ హక్కుల కోసం రూ. 1,443 కోట్లతో పాటు మిగతా ఐదు కేటగిరీ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రెస్టాఫ్ వరల్డ్, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అమెరికా)లకు కూడా స్టార్ బిడ్ వేయగా... సోనీ మాత్రం మరే ఇతర కేటగిరీలోకి అడుగే పెట్టలేదు. ఓవరాల్గా గ్లోబల్ బిడ్కే హక్కులు కేటాయించాల్సి రావడంతో స్టార్ ఇండియా ఐపీఎల్ హక్కులు దక్కించుకుంది. -
సునందాపుష్కర్ కేసు: స్వామికి చుక్కెదురు!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో బీజేపీ ఎంపీ సుబ్రహ్యణ్యస్వామికి చుక్కెదురైంది. సునందా పుష్కర్ మృతిపై కోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్న సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను సమర్పించాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశించింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఏవైనా కొత్త విషయాలు ఉంటే రెండువారాల్లోగా సమర్పించాలని, ఆలోగా ఏమీ సమర్పించకపోతే.. ఒక ఈ కేసు విషయాన్ని తామే చూసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో వాదనలు వినిపించిన సుబ్రహ్మణ్యస్వామి విషం వల్ల సునందపుష్కర్ మరణించిందని దర్యాప్తు సంస్థలు నిర్ధారిస్తే.. ఇంకా అది ఏ తరహా విషమో విశ్లేషించడంలో ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అమెరికా ఎఫ్బీఐ, ఇతర ఏజెన్సీల చేత ఫోరెన్సిక్ దర్యాప్తును విశ్లేషించడం.. కేసు దర్యాప్తులో జాప్యం చేయడమేనని చెప్పారు. -
'తమిళనాడులో త్వరలో కొత్త ప్రభుత్వం'
-
'తమిళనాడులో త్వరలో కొత్త ప్రభుత్వం'
సాక్షి, చెన్నై: తమిళనాడులో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే, దినకరన్ వర్గాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. 'తమిళనాడుకు గొప్ప ఎదురుదెబ్బ తగలనుంది. స్టాలిన్, దినకరన్ కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని కొద్ది రోజుల్లో ఏర్పాటు చేయనున్నార'ని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు పళనిస్వామి ప్రభుత్వానికి పడగొట్టేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. డీఎంకే, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకులు ఆదివారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావును కలిశారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే శాసనసభా పక్ష ఉప నేత దురై మురుగన్ నేతృత్వంలో ఓ బృందం రాజ్భవన్కు వెళ్లింది. డీఎంకే ఎంపీలు కనిమొళి, ఆర్ఎస్ భారతి, ఓ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ థరణి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అబూబక్కర్లు 15 నిమిషాలపాటు గవర్నర్తో భేటీ అయ్యారు. స్టాలిన్ తరపున వినతి పత్రాన్ని సమర్పించారు. గవర్నర్తో భేటీ అనంతరం మీడియాతో దురై మురుగన్ మాట్లాడారు. బల పరీక్షకు ఆదేశాలివ్వాలని ఇప్పటికే లేఖలు రాశామని, ప్రస్తుతం స్వయంగా గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేశామని చెప్పారు. మరి కొద్ది రోజులు చెన్నైలో గవర్నర్ రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరికొద్ది రోజులపాటు గవర్నర్ విద్యాసాగర్రావు చెన్నైలోనే ఉండనున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఓ వైపు, డీఎంకే, కాంగ్రెస్ శాసనసభా పక్షాలు మరోవైపు సీఎం పళని స్వామి విశ్వాస పరీక్ష కోసం విజ్ఞప్తులు చేసిన దృష్ట్యా అందుకు తగ్గ కసరత్తుల్ని గవర్నర్ మొదలెట్టినట్టు సమాచారం. -
రాహుల్గాంధీలాగే ఆయన కూడా....
న్యూఢిల్లీ: హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ మాదిరే హూడా కూడా అజ్నానంతో మాట్లాడుతున్నాడంటూ స్వామి విరుచుకుపడ్డారు. ‘అధికారం, పరిజ్నానం రెండూ లేకపోవటం మూలంగానే హూడా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రపతి పాలన విధించటం అంటే ఆషామాషీ కాదు. రాహుల్ గాంధీలాగానే హూడా కూడా అజ్నానంతో మాట్లాడుతున్నారు. బాంబే తీర్పును ఓసారి పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది’ అంటూ స్వామి మాజీ సీఎంకు చురకలంటించారు. హరియాణాలో గుర్మీత్ దోషిగా తీర్పు, ఆపై డేరా అనుచరుల హింస దృష్ట్యా ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటూ శనివారం భూపిందర్ సింగ్ కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఇలా స్పందించారు. మరోవైపు రాష్ట్రం రావణ కాష్టంలా తగలబడుతుంటే సహకరించాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారంటూ హూడాపై హరియాణా బీజేపీ నేత ఎస్ ప్రకాశ్ మండిపడ్డారు. డేరా సచ్చా సౌదా భూపిందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఒకరకంగా ఈ హింసాకాండకు మీరు(హూడా) కూడా బాధ్యులేనని ప్రకాశ్ ధ్వజమెత్తారు. -
అభీష్ట ప్రదాత తిరుత్తణిగై
పుణ్య తీర్థం తమిళంలో మురుగన్ అంటే అందం అని అర్థం. అందానికి ప్రతీకగా భక్తులచే పూజలందుకునే దైవంగా కీర్తి చెందిన సుబ్రమణ్యస్వామి (మురుగన్) తన ఆరు పుణ్యక్షేత్రాల్లో ఉగ్రరూపుడిగా దర్శనమిచ్చినా ఒక్క తిరుత్తణి కొండలో మాత్రం శాంతస్వరూపుడిగా భక్తులను కటాక్షిస్తున్నాడు. ఈ ఆలయంలో స్వామికి నిర్వహించే అభిషేకాల్లో వినియోగించే విభూది, గంధ ప్రసాదాల ద్వారా ఆరోగ్య సమస్యలు నయమవుతాయని విశ్వాసం. ఆరోగ్యం, విద్య, వ్యాపారం, కోర్టు సమస్యలు, వివాహం తదితర సమస్యలు సుబ్రమణ్యస్వామిని దర్శించుకుంటే తొలగుతాయని ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తిరుత్తణికి విచ్చేస్తుంటారు. ఈ క్షేత్రానికి తమిళంలో తొండ్రుతొట్టు అని పేరు. అంటే తప్పులు, పాపాలను మన్నించి సౌభాగ్యాలు ప్రసాదించడం అని, తిరుత్తణిగై అంటే శాంతించిన దేవుడని అర్థం. ఇప్పుడక్కడ ఆడికృత్తిక ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా... స్థలపురాణం దేవతలు, మునులు, రుషులను బాధపెట్టిన శూరపద్ముడనే రాక్షసునితో ఉగ్రరూపుడిగా భీకర యుద్ధం చేపట్టి, వల్లీదేవిని వివాహం చేసుకునేందుకు బోయ రాజులతో తేలికపాటి పోరు ముగిసిన తరువాత స్వామి శాంతస్వరూపుడిగా కొలువుదీరిన పుణ్యక్షేత్రం తిరుత్తణి కొండమీద తూర్పుదశలో వున్న ఆలయానికి ఇరుపక్కల రెండు పర్వత్రÔó ణులు వ్యాపించి వున్నాయి. ఉత్తరాన గల పర్వతం తెల్లగా ఉండడం వల్ల పచ్చిబియ్యపు కొండగా, దక్షిణం వైపున్న పర్వతం నల్లగా వున్నందున గానుగ పిండి పర్వతంగా పిలుస్తారు. ఈ కొండను చేరుకునేందుకు 365 మెట్లు వున్నాయి. తన తండ్రి పరమేశ్వరుని కొలిచేందుకు తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్టించాడు. అందుకే ఈ పుణ్యక్షేత్రంలో వున్న శివలింగానికి కుమారేశ్వరుడని పేరు. దేవసేనను తిరుప్పరంకుండ్రంలోనూ, ఇంద్రుడి కుమార్తె వల్లీదేవిని తిరుత్తణికొండలోనూ వివాహం చేసుకుంటాడు. వివాహం సందర్భంగా ఇంద్రుడు కానుకగా ఇచ్చిన గజరాజం ఆలయ వాకిలికి ముందు ధ్వజ స్తంభానికి ఆనుకుని ఇప్పటికీ దర్శనమిస్తుంటుంది. ఈ గజరాజాన్ని దర్శించుకున్నాకనే ఆలయంలోకి అడుగుపెట్టడం ఆచారం. ఇంద్రుడు ఇచ్చిన మరో కానుక గంధపు రుబ్బురాయి. కొండ ఆలయంలోని రెండవ ప్రాకారంలో యాగశాలకు ఎదురుగా వున్న ఈ రుబ్బురాతిలోనే నేటికీ స్వామివారి సేవలకు వినియోగించే గం«ధాన్ని తీస్తారు. మొదటి ప్రాకారానికి వెనుక వైపు బాలమురుగన్ సన్నిధిలో ఆరుద్ర దర్శనంలో బాలమురుగన్కు వేడినీళ్లతో అభిషేకం చేస్తారు. ఆలయంలోని నాల్గవ ప్రాకారంలో నెలకొని వున్న మూలమూర్తి ఎడమ చేతిలో శూలంతో దర్శనమిస్తున్నాడు. స్వామివారికి ఇరువైపులా దేవసేన, వల్లీదేవతలకు వేర్వేరుగా సన్నిధులున్నాయి. ఈ ఆలయంలో నిర్వహించే ఏకాంత సేవలో ఒకరాత్రి వల్లీదేవితో, మరురాత్రి దేవసేనతో సుబ్రమణ్యస్వామి కొలువుదీరడం మరే ఆలయంలో లేని ప్రత్యేకత. లక్ష రుద్రాక్ష మండపం ఉత్సవర్లు కొలువుదీరిన లక్ష రుద్రాక్షమండపం ఈ ఆలయ ప్రత్యేకత. లక్ష రుద్రాక్షలతో రూపుదిద్దుకున్న పల్లకిలో నిత్యం వల్లీదేవీ, దేవసేన సమేతంగా భక్తులకు దర్శనమిస్తుంటారు. అలాగే షణ్ముఖర్, ఆపత్సహాయక వినాయకుడు, ఆది బాలసుబ్రమణ్యం, కుమారేశ్వరుడు, బైరవుడు తదితర సన్నిధులను కూడా కచ్చితంగా దర్శించుకోవడం నియమం. విశిష్ట ఉత్సవ వేడుకలు సుబ్రమణ్యస్వామి కృత్తిక నక్షత్రంలో జన్మించడంతో ప్రతి కృత్తిక, మంగళవారం రోజుల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఆషాఢంలో శరవణ పుష్కరిణిలో మూడు రోజులపాటు తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు కావిళ్లతో కొండకు వస్తారు. ముందుగా తలనీలాలు సమర్పించి శరవణ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి మెట్లమార్గంలో ఆలయం చేరుకుని స్వామికి కావళ్లు చెల్లించి హుండీల్లో కానుకలు చెల్లించడం పరిపాటి. ఎలా వెళ్లాలంటే..? అప్పట్లో తమిళ, తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో తెలుగు వారు ఎక్కువగా ఉన్న తిరుత్తణిని ఆంధ్రరాష్ట్రంలో చేర్చారు. అయితే తమిళ భాషాభిమానులు చేపట్టిన ఉద్యమంతో తిరుత్తణి తమిళనాట అంతర్భాగంగా మారింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దులోని తిరుత్తణి చెన్నైకు 80 కిలోమీటర్లు, తిరుపతికి 65 కిలోమీటర్ల దూరంలో వుంది. చెన్నై నుంచి ముంబయి రైలు మార్గంలోని అరక్కోణం రైల్వే జంక్షన్కు పది కిలోమీటర్ల దూరంలో వుంది. – చక్రాల నరసింహులు, సాక్షి, తిరుత్తణి (తమిళనాడు) -
జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించాలి
ఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. మహబూబా ముఫ్తీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. సర్కార్ వైఫల్యం వల్లే అనంత్నాగ్ లో యాత్రికులపై ఉగ్రదాడి జరిగిందన్నారు. జమ్మూ ప్రజలకు భద్రత కరువైందని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. కాగా జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు నిన్న అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 32 మంది గాయపడ్డారు. మృతులంతా గుజరాత్ వాసులు. 2000 సంవత్సరం తర్వాత ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రికులపై భీకరంగా దాడి చేయడం ఇదే తొలిసారి. మరోవైపు ముఖ్యమంత్రి ముఫ్తీ తాజా పరిణామాలతో పాటు, శాంతి భద్రతలపై మంత్రివర్గంతో సమావేశమయ్యారు. ఈరోజు ఉదయం ఆమె ఉగ్రవాదిలో గాయపడ్డవారిని పరామర్శించారు. ఉగ్రదాడితో కాశ్మీరీలందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది అని ఆమె అన్నారు. -
వావ్! 420.. రజినీపై స్వామి సంచలన వ్యాఖ్య
న్యూఢిల్లీ: దక్షిణాది ప్రముఖ స్టార్, త్వరలో తమిళ రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా అడుగుపెట్టనున్నారంటూ విస్తృత ప్రచారంలో ఉన్న రజనీకాంత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మరో బాంబు పేల్చారు. రజినీకాంత్ అమెరికాలో క్యాసినోలో దూరి గ్యాంబ్లింగ్ ఆడుతున్నారని, ఆయనపై వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించాలంటూ ఆయన సంచలన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో రజినీ గ్యాంబ్లింగ్ ఆటను వీక్షిస్తున్న రజినీ ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు. ‘ఆర్కే 420’ అంటూ ఆయన పరుష పదజాలాన్ని పరోక్షంగా రజినీకాంత్ను ఉద్దేశించి ట్వీట్లో పేర్కొన్నారు. ‘వావ్! ఆర్కే 420 తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు అమెరికాలోని క్యాసినోలో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. ఆయనకు అన్ని డాలర్లు ఎక్కడ నుంచి వచ్చాయో ఈడీ తప్పనిసరిగా కనుక్కోవాల్సిందే’ అంటూ సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్లో పేర్కొన్నారు. Wow! RK 420 in a US Casino gambling to improve his health!! ED must find out from where his $$ came from. pic.twitter.com/4UeUgg9yNN — Subramanian Swamy (@Swamy39) 5 July 2017 -
‘ప్రధాని మోదీ ఇక రజనీకాంత్ను కలవరు’
చెన్నై: సినీ నటుడు రజనీకాంత్పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి మాటల యుద్ధం కొనసాగుతోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, అలాగే ఇకపై రజనీని ప్రధాని నరేంద్రమోదీ కలువబోరని ఆయన పేర్కొన్నారు. చెన్నైలోని శంకరమఠం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి నుంచి సుబ్రహ్మణ్యస్వామి అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్ ఇక రాజకీయాల్లోకి రాబోరని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రజనీకాంత్ ఆర్థిక నేరగాడు అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వామి అంతటితో సరిపెట్టుకోలేదు..ఆ ఆర్థికనేరాలకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయనే బాంబును సైతం పేల్చారు. మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు రజనీ అభిమానుల్లో ఆక్రోశాన్ని రగిల్చాయి. ఆందోళనల బాటకు దూరంగా సామాజిక మాధ్యమాల్లో ట్విట్లతో స్వామిపై దాడికి దిగారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని కమలం పెద్దలపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. రజనీని విమర్శించడం మానుకోకుంటే, తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని స్వామికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ హెచ్చరించారు. -
రజనీకాంత్ అభిమానుల ఆగ్రహం
►సామాజిక మాధ్యమాల్లో అభిమానుల ట్వీట్లు ►స్వామిపై చర్యలకు పట్టు ►అర్జున్ సంపత్ హెచ్చరిక సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు రజనీ అభిమానుల్లో ఆక్రోశాన్ని రగిల్చాయి. ఆందోళనల బాటకు దూరంగా సామాజిక మాధ్యమాల్లో ట్విట్లతో స్వామిపై దాడికి దిగారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని కమలం పెద్దలపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. రజనీని విమర్శించడం మానుకోకుంటే, తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని స్వామికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ హెచ్చరించారు. చెన్నై : దక్షిణ భారత చలనచిత్ర సూపర్ స్టార్ రాజకీయ ఆరంగ్రేటంపై రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. తలైవా వస్తారన్న ఆశతో ఎదురుచూసే వాళ్లు, వ్యతిరేకించే వాళ్లు ఒకే స్థాయిలోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రజనీని ఉద్దేశించి బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ‘రజనీ ఆర్థిక నేరగాడు.. రాజకీయాల్లోకి రాకూడదు’ అన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించడం తలైవా అభిమానుల్లో ఆక్రోశాన్ని రగిల్చింది. ఆందోళనతో తమ ఆగ్రహాన్ని ప్రదర్శించేందుకు నిర్ణయించినా, తలైవా అభిమానం వారిని కట్టిపడేసింది. తనను విమర్శించే వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేయకూడదని కథానాయకుడు విధించిన ఆంక్షలతో అభిమాన సేనలు వెనక్కుతగ్గారు. అయితే, సామాజిక మాధ్యమాల్లో స్వామిపై దాడికి దిగడం గమనార్హం. అభిమాన సేనల్లో ఆగ్రహం రజీన అభిమానులు తమ ఆగ్రహాన్ని ఆందోళనతో కాకుండా ట్విట్లతో చూపించారు. ఫేస్ బుక్, ట్విటర్ వంటి తలైవా సేనల్లో ఆక్రోశం సామాజిక మాధ్యమాల్లో రజని అభిమాన గ్రూప్స్, ప్రపంచ రజనీ అభిమాన సంఘం, తదితర సంఘాల పేరిట స్వామిపై ముప్పేట దాడి చేశారు. బాబు అనే అభిమాని తన ట్వీట్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీలో కూర్చుని పదే పదే ఎవరి మీద పడితే వారి మీద ఆరోపణలతో ›ప్రకటనలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. సురేష్ అనే అభిమాని కాస్త సున్నితంగా, రాజకీయాల్లో పెద్ద వాడిగా ఉంటూ, ఇదేంటీ.. నీచపు రాజకీయాలు అని మందలించారు. గణేషన్ అనే అభిమాని మరింత దూకుడుగా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటే, తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ నాయకుడు అభిమానం, ఆంక్షలు కట్టి పడేసి ఉన్నాయని లేకుంటే, తామేమిటో రుచి చూపించి ఉంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొందరు అభిమానులు అయితే, రజనీ కోసం గాలం వేస్తున్న కమలం పెద్దలు ఏమయ్యారని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి రావాలని, తమతో చేతులు కలపాలని పదేపదే పిలుపు నిస్తున్న ఆ పెద్దలు, సుబ్రహ్మణ్య స్వామిని కట్టడి చేయడంలో ఎందుకు విఫలం అవుతున్నారని మండి పడ్డారు. నిజంగా రజనీ మీద అభిమానం ఉంటే, సుబ్రహ్మణ్య స్వామిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఇక, హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ ఒక అడుగు ముందుకు వేసి తస్మాత్ జాగ్రత్త అన్న హెచ్చరికతో ప్రత్యేక ప్రకటనను విడుదల చేయడం గమనార్హం. ఇక నైనా, రజనీని విమర్శించడం మానుకోకుంటే, స్వయంగా రంగంలోకి దిగి ఆందోళనలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
రజనీకి స్వామి షాక్
♦ ఆయనో ఆర్థిక నేరగాడు ♦ ఆధారాలు ఉన్నాయి ♦ రాజకీయాల్లోకి రావొద్దు ♦ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా.. రారా అని తమిళనాడుతోపాటు దేశమంతా ఎదురుచూస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి ఆయనకు షాకిచ్చారు. నీవో ఆర్థికనేరగాడివి, రాజకీయాల్లోకి రావొద్దు అంటూ హెచ్చరికను పోలిన సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. స్వామి అంతటితో సరిపెట్టుకోలేదు...రజనీకాంత్ ఆర్థికనేరాలకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయనే బాంబును సైతం పేల్చారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో గత నెలలో ఐదు రోజులపాటు రజనీకాంత్ అభిమానులతో సమావేశమయ్యారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. తమిళనాడులో అవినీతి పెరిగిపోయింది, రాజకీయ వ్యవస్థ దెబ్బతినిందని ప్రసంగించారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తాను అంటూ సంకేతాలు ఇచ్చారు. నాకంటూ ఒక వృత్తి, బాధ్యతలు ఉన్నాయి, మీకు కూడా వృత్తి, ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి..వాటిని నిర్వర్తించండి అని ఉద్బోధించారు. యుద్ధం వస్తుంది...మాతృభూమిని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండండి అంటూ సందేశం ఇచ్చారు. యుద్ధం అనే మాటలను అసెంబ్లీ ఎన్నికలుగా అందరూ విశ్లేషించుకున్నారు. ఇటీవల 16 మందితో కూడిన అన్నదాతల బృందం రజనీకాంత్ను ఇంటి వద్ద కలసి జాతీయ స్థాయిలో నదులన్నింటినీ అనుసంధానం చేయాలన్న వారి కోర్కెకు మద్దతు తెలిపారు. అన్నదాతల కోర్కెను ప్రధాని దృష్టికి తీసుకెళతానని, నదుల అనుసంధానానికి రూ.కోటి నిధులను విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమని రజనీకాంత్ ప్రకటించారు. చెన్నై విమానాశ్రయంలో ఇటీవల మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, రాజకీయ ప్రవేశంపై వివిధ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నాను, ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు, రాజకీయాల్లోకి రావాలని తీర్మానించుకుంటే ముందుగా మీడియాకు చెబుతానని అన్నారు. రాజకీయాల్లోకి రాదలుచుకుంటే బీజేపీలో చేరాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ప్రకటించారు. అయితే ఆ తరువాత తాను అలా అనలేదని ఖండించారు. రాజకీయాల్లో రాదలుచుకుంటే ఇదే సరైన సమయమని తమిళనాడుకు చెందిన బీజేపీ అగ్రనేత గురుమూర్తి వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను పూడ్చేందుకు రజనీ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆహ్వానం పలికారు. మోకాలొడ్డుతున్న స్వామి: అయితే బీజేపీ నేతలంతా రజనీకాంత్కు స్వాగతం పలుకుతుండగా, అదే పార్టీకి చెందిన మరో అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి మోకాలొడ్డుతున్నారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీతో రాజకీయ ప్రవేశంలా రజనీ వైఖరి ఉందని,æ బీజేపీలోకి వస్తారని తాను భావిస్తున్నానని అన్నారు. అయితే ఆర్థిక నేరాలకు పాల్పడిన రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఎంత మాత్రం వీల్లేదని స్వామి వ్యాఖ్యానించారు. తనవి కేవలం ఆరోపణలు కాదు, ఆధారాలు ఉన్నాయని అన్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఆశలను రజనీ వదులు కోవాలని హెచ్చరికలాంటి సూచన చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్, కేంద్ర మాజీ మంత్రులు రాజా, దయానిధి మారన్, కరుణానిధి భార్య దయాళుఅమ్మాళ్, కుమార్తె కనిమొళి తదితరులపై అవినీతి ఆరోపణలు చేసి కేసులు పెట్టిన ఘనత సుబ్రహ్మణ్య స్వామిదే. వారిలో కొందరు జైళ్లలో మగ్గిపోతుండగా, మరికొందరు సీబీఐ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా సుబ్రహ్మణ్యస్వామి కన్ను రజనీకాంత్పై ఆర్థికనేరాల అస్త్రం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. -
రజనీకాంత్ రాజకీయాలకు సరిపోరు...
న్యూఢిల్లీ: దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి స్పందించారు. అంతేకాకుండా రజనీకాంత్పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీ రాజకీయాలకు సరిపోరని, ఆయన నిరక్షరాస్యుడని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. కాగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అంతేకాకుండా ఆయన ఎన్డీయేకి మద్దతు ఇస్తారంటూ రజనీ సన్నిహితుడు గురుమూర్తి పేర్కొన్న విషయం విదితమే. -
సుబ్రహ్మణ్యస్వామి సంచలన ప్రతిపాదన
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచే బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరో సంచలన ప్రతిపాదనను తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న గోశాలలకు ఫండింగ్ కోసం పెట్రోల్ పై సెస్ విధించాలని ప్రతిపాదించారు. గో రక్షణ పేరుతో విరాట్ హిందూస్తాన్ సంఘం ఆదివారం నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్ లో స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. '' 1962లో భారత్ పై చైనా అటాక్ చేసినప్పుడు, రక్షణ నిధి కోసం ఓ అప్పీల్ తీసుకొచ్చాం. ప్రస్తుతం దేశం ఇదే పరిస్థితుల్లో ఉంది. గోశాలల కోసం పెట్రోల్ పై 1 రూపాయి సెస్ ను అడిగితే, దేశం ద్రవ్యంతో నిండిపోతుంది'' అని స్వామి అన్నారు. హిందూవులు, ముస్లింలు అన్ని మతాల వారికి ఈ గోరక్షణ సెస్ అప్లయ్ అవుతుందని పేర్కొన్నారు. గోరక్షకులు మంచి సర్వీసులు అందిస్తున్నారని, వారికి కచ్చితంగా మనం సర్టిఫికేషన్ ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ అన్నారు. గోవుల కోసం అభయారణ్యం ఏర్పాటుచేయాలని ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న హోం వ్యవహారాల సహాయ మంత్రి హన్సురాజ్ అహిర్ ప్రతిపాదించారు. గోవుల అభయారణ్యం కోసం 7 కోట్ల ఎకరాల అడవుల భూమిని కేటాయించాలని తాను ప్రతిపాదిస్తున్నానని, టైగర్ అభయారణ్యం మాదిరి దీన్ని ఏర్పాటుచేయాలని కేంద్రప్రభుత్వాన్ని ప్రజలు కోరాలని చెప్పారు. అంతేకాక గోవుల రక్షణ కోసం పాఠశాల పాఠ్య ప్రణాళికలో కచ్చితంగా చాప్టర్స్ ను ప్రవేశపెట్టాలని ఉర్జా వరల్డ్ ఫౌండేషన్ స్వామి అరిహంత్ అన్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన గోవుల అమ్మకాల చట్టంపై స్పందించిన స్వామి, ప్రజలు ఏం తినాలనుకుంటున్నారో వారి హక్కులను ఈ చట్టం ఉల్లంఘించడం లేదని ఉద్ఘాటించారు. -
చిదంబరం చేసిన తప్పులకు జైల్లో ఉండాలి
-
రజనీ.. రాజకీయాల్లోకి రావద్దు!
-
రజనీ.. రాజకీయాల్లోకి రావద్దు!
'దేవుడు శాసిస్తే.. నేను రాజకీయాల్లోకి రావచ్చు' అని సూపర్స్టార్ రజనీకాంత్ చెప్పడాన్ని ఒక పొలిటికల్ జోక్గా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి అభివర్ణించారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని సలహా ఇచ్చారు. రజనీకాంత్కు స్పష్టమైన సిద్ధాంతం లేదని, ఆయన గతంలో వేర్వేరు పార్టీలతో కలిశారు తప్ప అందులో సిద్ధాంతాలు పాటించలేదని, ఆయన తరచు నిర్ణయాలు మార్చుకుంటారని స్వామి అన్నారు. అయితే.. ఒకవైపు స్వామి ఇలా చెబుతున్నా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్.గురుమూర్తి తదితరులు మాత్రం రజనీకాంత్తో టచ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో చేరచ్చు అన్న రజనీ వ్యాఖ్యలను గురుమూర్తి స్వాగతించారు. రజనీ బాగా ఆలోచించి మాత్రమే మాట్లాడుతున్నారని, ఆయన అచ్చం మోదీలాగే చెబుతున్నారని కూడా అన్నారు. అయితే సుబ్రమణ్యం స్వామికి మాత్రం ఎందుకో రజనీ కామెంట్లు పెద్దగా నచ్చినట్లు లేవు. అసలు గట్టిగా మాట్లాడితే రజనీకాంత్ తమిళుడే కాదని, బెంగళూరు నుంచి వచ్చిన మరాఠీ వ్యక్తి అని స్వామి వ్యాఖ్యానించారు. రజనీకాంత్కు అభిమానులు ఉన్నారంటే వాళ్లు ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినవాళ్లు కారని, ఓ గుంపులా ఆయనను ఆరాధిస్తున్నారని అన్నారు. ప్రకటనలు చేయడంలో సినిమావాళ్లు దిట్టలని, ఎందుకంటే వాళ్లకు డైలాగులు వేరే ఎవరో రాసిస్తారని స్వామి మండిపడ్డారు. -
వచ్చే ఏడాదే రామమందిరం: స్వామి
అయోధ్య: వివాదాస్పద అయోధ్య రామమందిర విషయాన్ని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మళ్లీ లేవనెత్తారు. వచ్చే ఏడాది రామమందిరం నిర్మాణం ప్రారంభం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రామాలయ నిర్మాణం విషయంలో తమకు అనుకూల తీర్పు వస్తుందని నమ్ముతున్నానని, ఈ ఏడాది నవంబర్నాటికి ఆ తీర్పు విషయంలో స్పష్టత వస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఆదివారం విశ్వ సంవాద్ కేంద్రం నిర్వహించిన నరద్ సమ్మాన్ సమరో కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామమందిరంపై ఇలా వ్యాఖ్యానించారు. రామమందిరం, బాబ్రీ మసీదు వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందన్న ఆయన నవంబర్ నాటికి క్లియర్ అవుతుందనుకుంటున్నానని చెప్పారు. 2024నాటికి రామాలయం నిర్మాణం ప్రారంభమవుతుందని గత మార్చిలో స్వామి చెప్పిన విషయం తెలిసిందే. -
కేజ్రీవాల్పై మరో అవినీతి పిడుగు!
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కళ్లముందు మంత్రి సత్యేంద్రజైన్ నుంచి రూ.2 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపించి తిరుగుబాటు చేయగా.. తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మరో అవినీతి ఆరోపణను తెరపైకి తెచ్చారు. కేజ్రీవాల్ ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి రెండు కోట్లు లంచం తీసుకున్నారని సుబ్రమణ్యస్వామి అన్నారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్కు లేఖ రాశారు. కేజ్రీవాల్ లంచం తీసుకున్నారని, ఆయన అవినీతిపై విచారణ చేపట్టాలని తన లేఖలో స్వామి డిమాండ్ చేశారు. రూ.50 లక్షల చొప్పున నాలుగు దఫాలుగా కేజ్రీవాల్ ఆ నగదును తీసుకున్నారని 'క్విడ్ ప్రొకో'లో భాగంగా అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. గతంలోనే ఢిల్లీ ఎల్జీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లానని, విచారణకు ఆదేశించని కారణంగా ఈసారి లేఖాస్త్రం సంధించినట్లు వివరించారు. కేజ్రీవాల్పై చేసిన ఆరోపణలకుగానూ తనవద్ద సాక్ష్యాలు ఉన్నాయని, ఎల్జీ విచారణకు ఆదేశిస్తారని సుబ్రమణ్యస్వామి ఆశాభవం వ్యక్తంచేశారు. ఇప్పటికే కపిల్ మిశ్రా ఆరోపణలపై దర్యాప్తు జరిపి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఏసీబీని ఎల్జీ బైజల్ ఆదేశించిన విషయం తెలిసిందే. -
‘సిగ్గులేని వ్యక్తి నుంచి రాజీనామా కోరడమా?..’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ఒక సిగ్గు లేని వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి నుంచి రాజీనామా ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు రుజువైతే తప్ప కేజ్రీవాల్ రాజీనామా చేయనందున ఈ విషయాన్ని వెంటనే సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ.2కోట్ల లంఛాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకోవడాన్ని తాను కళ్లారా చూశానని ఆప్ మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్పై ముప్పేట దాడి జరుగుతోంది. ఇందులో భాగంగానే ఓ మీడియా స్వామిని ఈ విషయంపై స్పందన కోరగా..‘సిగ్గులేని ఒక కేజ్రీవాల్లాంటి వ్యక్తి నుంచి ఎవరు మాత్రం రాజీనామా ఆశిస్తారు? ముందునుంచే నేను ఆయనను రాజీనామా చేయాలని అడుగుతున్నాను. నేను ఆయనను శ్రీ 420 అని పిలుస్తుంటాను. అన్నా హజారేతో ఉన్నప్పటి నుంచి కేజ్రీవాల్ గురించి నాకు తెలుసు. ఆయన కమ్యూనిజానికి అనుకూలంగా ఉంటారని ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని స్వామి చెప్పారు. -
‘రాజీ రాకుంటే కోర్టే పరిష్కరించాలి’
లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ముస్లింలు రాజీకి రాకుంటే, సుప్రీంకోర్టు పరిష్కరించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో గురువారం భేటీ అయిన స్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత వివాదాస్పద ప్రదేశంలో రామ మందిర నిర్మాణం ఉన్నట్లు 2010లో అలహాబాద్ హైకోర్టు పేర్కొందని గుర్తు చేశారు. న్యాయపరంగా కూడా మందిర నిర్మాణంపై విజయం సాధిస్తామన్నారు. స్వామి వ్యాఖ్యలను బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ (బీఎంఏసీ) కన్వీనర్ జాఫర్యాబ్ జిలానీ ఖండించారు. స్వామి ముస్లింలను బెదిరించడం సరికాదన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకముందన్నారు. ‘ఈ విషయం సామరస్యంగా పరిష్కారమైతే సరి. లేకుంటే రాజ్యసభలో 2018 ఏప్రిల్లో తమకు పూర్తి మెజారీటీ వచ్చిన తర్వాత రామమందిర నిర్మాణానికి సంబంధిచి చట్టాన్ని తీసుకొస్తాం’ అని గతంలో స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
‘గుజరాత్ అల్లుడ్ని కాదా? రాష్ట్రపతిగా ఆమె బెస్ట్’
న్యూఢిల్లీ: ఈ మధ్య ఆకట్టుకునేలా ట్వీట్లు చేస్తూ కాస్తంత వివాదాలను కూడా మూటగట్టుకుంటున్న బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చ జరగగా తాజాగా రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్నందున మరోసారి ఆ ఎన్నికల చుట్టూ ఆసక్తికరమైన ప్రకటనలు వస్తున్నాయి. తాజాగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ రాష్ట్రపతి అభ్యర్థికి తగినవారంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆమె గుజరాతీ అయితే మాత్రం ఏంటని ప్రశ్నించారు. తాను మాత్రం గుజరాత్ అల్లుడిని కాదా అంటూ ఓ ట్వీట్ ట్వీటారు. అంతకుముందే శివసేన పార్టీ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రెసిడెంట్ రేసులో లేనందున తాము ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు రాష్ట్రపతిగా మద్దతిస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే జేడీయూ నితీశ్ కుమార్ను రాష్ట్రపతి అభ్యర్థిగా తగినవారంటూ పేర్కొంది. One of the best candidate for President is fmr Gujarat CM Anandibehn Patel. So what if she is Gujarati? I too am Gujarat's son in law. — Subramanian Swamy (@Swamy39) 25 April 2017 -
మాల్యా తర్వాత.. అరెస్ట్ చేసేది ఆయన్నే
న్యూఢిల్లీ: బ్యాంకులకు దాదాపు 9 వేల కోట్ల రూపాయల బకాయిలను ఎగవేసి విచారణకు హాజరుకాకుండా లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ అభ్యర్థన మేరకు బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేయడంపై పలువురు రాజకీయ నాయకులు స్పందించారు. మాల్యా తర్వాత ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని అరెస్ట్ చేయవచ్చని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. 'మాల్యాను అరెస్ట్ చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మోదీ ఎప్పుడూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతారు. మాల్యా జైలుకు వెళ్లే సమయం వచ్చింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ జాబితాలో తర్వాత లలిత్ మోదీ ఉండవచ్చు' అని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ.. ఈడీ విచారణకు హాజరుకాకుండా ఇంగ్లండ్లో తలదాచుకుంటున్నాడు. ఆయన్ను రప్పించేందుకు భారత్ ప్రయత్నించినా సాధ్యంకాలేదు. మాల్యాను అరెస్ట్ చేయడం భారత ప్రభుత్వం, ఆర్థిక శాఖ పెద్ద విజయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. మాల్యాను భారత్కు రప్పిస్తామని మరో కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ అన్నారు. -
‘ఉరితీస్తే మాత్రం భారత్ ఇలా చేయాలి’
న్యూఢిల్లీ: పాకిస్థాన్ తీరుపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ను పాకిస్థాన్ ఉరితీస్తే మాత్రం ఇండియా బలోచిస్థాన్ను స్వతంత్ర్య దేశంగా తప్పకుండా గుర్తించాల్సిందేనని అన్నారు. సింధ్ ప్రావిన్స్ను పాకిస్థాన్ విడిచి వెళ్లాల్సిందేనని డిమాండ్ చేశారు. గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ భారత్కు చెందిన నేవీ మాజీ అధికారి కులభూషణ్కు ఉరిశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటులో కూడా ఈ విషయంపై తీవ్ర స్థాయిలో మంగళవారం చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యస్వామి తాజా వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉరిశిక్ష ప్రకటించిన వెంటనే సోమవారం స్పందించిన స్వామి పాకిస్థాన్కు భారత్ గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందేనని కోరిన విషయం తెలిసిందే. జాదవ్ను ఉరితీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఆ దేశానికి మంచిదికాదని నేరుగా హెచ్చరించాలని కేంద్రాన్ని కోరారు. -
ఎయిర్ సెల్-మ్యాక్సిస్ డీల్పై స్పందించిన చిదంబరం
నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్సెల్-మ్యాక్సిస్ డీల్ కు ఆమోదం తెలిపారని తనపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందించారు. సాధారణ వ్యాపారాలకు మాదిరిగానే ఎయిర్ సెల్- మ్యాక్సిస్ డీల్ కు ఆమోదముద్ర వేసినట్టు చిదంబరం మంగళవారం చెప్పారు. కాగ విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) నిబంధనల ఉల్లంఘనలో ఆర్థికమంత్రిగా చిదంబరం పాత్రపై దర్యాప్తు జరిపిన ఈడీ, ఆ నివేదికను నిన్న సుప్రీంకోర్టుకు అందజేసింది. ''ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో విదేశీ ఇన్వెస్ట్మెంట్ల విలువ బట్టి, ఎఫ్ఐపీబీ ఆ డీల్ ఆమోదం కోసం ఆర్థికమంత్రి ముందుకు తీసుకొచ్చింది. ఆర్థికమంత్రిగా నేను సాధారణ వ్యాపారాలకు ఆమోదం ఇచ్చిన మాదిరిగానే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను'' అని చిదంబరం చెప్పారు. ఎఫ్ఐపీబీలో ఐదుగురు సెక్రటరీలు ఉంటారని, వారు ఈ కేసులను పరిశీలించిన తర్వాతనే ఆమోదించాలా లేదా తిరస్కరించాలా అనేది ప్రతిపాదిస్తారని చిదంబరం నేటి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసును పరిశీలించే ప్రతిఒక్కరి దగ్గర్నుంచి సీబీఐ రిపోర్టు తీసుకుందని, సాధారణ వ్యాపారం మాదిరిగా ఆమోదం ఇవ్వడానికి ఆర్థికమంత్రికి సమర్థాధికారం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ ఇందులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్టు కోర్టుకు వివరించింది. దీనిపై స్పందించిన కోర్టు దర్యాప్తు స్థితిగతులపై నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఒప్పందానికి ఎఫ్ఐపీబీ అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. గరిష్టంగా రూ. 600 కోట్ల విలువైన ఎఫ్డీఐలకు మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థికమంత్రికి ఉంటుందని, అంతకు మించి పెట్టుబడులను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించవలసి ఉంటుందని స్వామి పేర్కొన్నారు. -
ఎయిర్సెల్ స్కాం: మౌనం వీడిన చిదంబరం!
ఎయిర్సెల్-మాక్సిస్ కుంభకోణంపై తాజాగా కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం స్పందించారు. ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందానికి సాధారణ ప్రక్రియలో భాగంగానే తాను అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. 'ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో విదేశీ పెట్టుబడుల విలువను పరిగణించి.. ఎఫ్ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు) ఆర్థికమంత్రికి నివేదిక సమర్పించి.. ఆమోదం కోరుతుంది. ఒక ఆర్థికమంత్రిగా సాధారణ ప్రక్రియలో భాగంగానే నేను అనుమతి ఇచ్చాను' అని చిదంబరం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో వివిధ అంశాలపై దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సీబీఐను సుప్రీంకోర్టు సోమవారం కోరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ నేత, పిటిషనర్ సుబ్రహ్మణ్యస్వామి ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని సీబీఐ తనకు సమాధానం ఇచ్చిందని, ఈ ఒప్పందానికి 2006లో అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం ఇచ్చిన ఎఫ్ఐపీబీ అనుమతిని కూడా విచారిస్తున్నామని సీబీఐ స్పష్టం చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై నివేదిక సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం ఎఫ్ఐపీబీ అనుమతి ఇచ్చారని, ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందాన్ని నిజానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ)కు నివేదించాల్సి ఉండేదని స్వామి కోర్టులో వాదించారు. నిబంధనల ప్రకారం రూ. 600 కోట్ల పైచిలుకు విదేశీ పెట్టుబడుల వ్యవహారాలన్నింటినీ సీసీఈఏకు నివేదించాల్సి ఉంటుందని, కానీ రూ. 3,500 కోట్ల విలువచేసే ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందాన్ని సీసీఈఏకు నివేదించడానికి బదులు చిదంబరమే స్వయంగా ఆమోదం తెలిపారని స్వామి తప్పుబట్టారు. అయితే, ఈ వ్యవహారంలో తాను నిబంధనలన్నింటినీ పాటించినట్టు చిదంబరం తాజా ప్రకటనలో వివరణ ఇచ్చారు. -
రామమందిరం కేసులో స్వామికి చుక్కెదురు
-
‘స్వామికి అంత తొందరెందుకు?’
న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదంలో కేసు విచారణను వేగవంతం చేసేలా బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి తొందరపెడుతున్నారని ఇక్బాల్ అన్సారీ అనే కక్షిదారు ఆరోపించారు. కేసు విచారణకు సంబంధించిన కక్షిదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని మహ్మద్ హసీమ్ అన్సారీ కుమారుడు ఇక్బాల్ అన్సారీ.. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్కు లేఖ రాశారు. తమ తరపు న్యాయవాదికి సమాచారం ఇవ్వకుండానే సీజేఐ ముందు స్వామి వివాదానికి సంబంధించిన విచారణను లేవనెత్తారన్నారు. మొదటిసారిగా ఫైజాబాద్ కోర్టులో రామజన్మభూమిపై కేసు వేసిన అన్సారీ (95) గతేడాది ఆగస్టులో కన్నుమూశారు. కాగా, రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదం కేసును అత్యవసరంగా విచారించాలన్న స్వామి అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. -
రామమందిరం కేసులో స్వామికి చుక్కెదురు
అయోధ్యలో రామమందిరం నిర్మాణం విషయంలో సీనియర్ న్యాయవాది, బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. అసలు ఈ కేసులో సుబ్రమణ్యం స్వామి ఒక పార్టీ అన్న విషయమే తమకు తెలియదని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాక.. అసలు ఈ కేసు దాఖలు చేయడానికి మీకున్న అర్హత (లోకస్ స్టాండీ) ఏంటని కూడా సుబ్రమణ్యం స్వామిని ప్రశ్నించింది. రామమందిరం కేసులో మీ పిటిషన్ను ఇప్పటికిప్పుడు విచారించేందుకు తమకు సమయం లేదని తేల్చిచెప్పింది. దాంతో రామమందిరం వివాదం గురించి కోర్టులో తన వాదనలను వినిపించేందుకు స్వామికి అవకాశం ప్రస్తుతానికి లేనట్లే. -
రాజీవ్ గాంధీపై బీజేపీ ఎంపీ ప్రశంసలు
పట్నా: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రశంసలు కురిపించారు. నెహ్రూ కుటుంబంలో రాజీవ్ గాంధీ ఒక్కరే మంచి మనిషి అని కొనియాడారు. హిందువులను జాగృత పరచడానికి ఎంతో కృషి చేశారని మెచ్చుకున్నారు. 'కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించినప్పటికీ హిందువుల పౌరాణిక ధారవాహిక రామాయణంను దూరదర్శన్ లో ప్రసారం చేయడానికి రాజీవ్ గాంధీ అనుమతించారు. భక్తులు పూజలు చేసేందుకు అయోధ్యలోని రామాలయం తలుపులు తెరిపించార'ని పట్నాలో విలేకరులతో మాట్లాడుతూ స్వామి చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా బాబ్రీ మసీదు వివాదం పరిష్కారమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉందని, తాము అంత్యక్రియలు చేయనున్నామని వ్యాఖ్యానించారు. -
ఆవును చంపితే ఉరిశిక్ష
రాజ్యసభలో స్వామి ప్రైవేటు బిల్లు న్యూఢిల్లీ: ఆవును చంపితే ఉరిశిక్ష విధించాలని ప్రతిపాదిస్తూ రూపొందించిన ప్రైవేటు బిల్లును బీజేపీ సభ్యుడు, సుబ్రహ్మణ్యస్వామి శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జాతిపిత మహాత్మాగాంధీ ఆశించిన గోవధపై నిషేధం కోసం ఉద్దేశించిన గోరక్షణ బిల్లు–2017ను స్వామి ప్రవేశపెట్టారు. గోసంతతి పరిరక్షణకు కమిటీని నియమించాలన్నారు. ఇందులో పశుసంవర్థక, వ్యవసాయం, ఆర్థిక, పశుసంక్షేమ, పురాతన భారతీయ చరిత్ర, సంస్కృతి రంగాలకు చెందిన నిపుణులను నియమించాలని విన్నవించారు. రూ.5వేలు, రూ.10వేల నోట్లు తీసుకురాం రూ.5వేలు, రూ.10వేల నోట్లు తీసుకొచ్చే ప్రణాళికలేమీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ విషయమై రిజర్వు బ్యాంకును సంప్రదించామని.. రూ.5వేల, రూ.10వేల నోట్లను తీసుకురాలేమని ఆర్బీఐ తెలిపిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. బినామీ చట్టం కింద 140 మందికి నోటీసులు నిషేధిత బినామీ ఆస్తిలావాదేవీల చట్టం కింద 140 మందికి నోటీసులు పంపినట్టు కేంద్రం శుక్రవారం లోక్సభ దృష్టికి తీసుకొచ్చింది. రూ. 200 కోట్ల విలువైన బినామీ లావాదేవీలు జరిగాయని, ఇందులో 124 మందికి చెందిన ఆస్తులను జప్తు చేసుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి సంతోశ్కుమార్ గంగ్వార్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. జప్తు చేసుకున్న వాటిల్లో స్థిర, చరాస్తులు ఉన్నాయని ఆయన వివరించారు. రూ. 45, 622 కోట్ల నల్లధనం వెలికితీత ఈ జనవరితోపాటు గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల వ్యవధిలో నిర్వహించిన సోదాల ద్వారా రూ. 45. 622 కోట్లు విలువైన లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఆదాయపన్ను శాఖ వెలికితీసింది. 2,534 వ్యక్తులపై జరిపిన దాడిలో ఈ మొత్తం బయటపడిందని గంగ్వార్ లోక్సభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. -
స్వామి తాజా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మరో తాజా వివాదం లేవనెత్తారు. పాకిస్థాన్లో కనిపించకుండా పోయి తిరిగి భారతదేశంలోకి సురక్షితంగా వచ్చిన ముస్లిం మత పెద్దలపై స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు అబద్ధం చెబుతున్నారని అన్నారు. వారు భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. సోమవారం పార్లమెంటు వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘వారిని వారు రక్షించుకునేందుకు సానుభూతి పొందేందుకు అబద్ధం చెబుతున్నారు. రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) ఏజెంట్లుగా తమను తాము వర్ణించుకుంటున్నారు. వారిని నమ్మలేం. వారు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మా వద్ద పక్కా సమాచారం ఉంది’ అని స్వామి అన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో అదృశ్యమైన ఇద్దరు మతగురువులు హజ్రత్ నిజాముద్దీన్, సయ్యద్ ఆసిఫ్ నిజామీ సోమవారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 8న కనిపించకుండా వెళ్లిన వారు కనిపించకుండా పోవడంతో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్లోని ఉమ్మత్ దినపత్రిక తమ గురించి తప్పుడు కథనాలు రాసిందని, తాము భారత విదేశాంగ నిఘా సంస్థ రా గూఢచారులమని పేర్కొంటూ ఫొటోలు ప్రచురించిందని, అందువల్లే ఇంత గందరగోళం చోటుచేసుకున్నదని నజీమ్ నిజామీ తెలిపారు. -
‘కమల్ ఓ బోన్లెస్.. స్వామి బాగా రూడ్’
చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఉండేది చెన్నైలోనే. వారి ఇళ్ల మధ్య దూరం మూడు కిలో మీటర్లే. కానీ, ఇప్పుడు మాత్రం వారి మధ్య వైరుధ్యాలు పక్కపక్కనే కలిసి ముందుకెళుతున్నాయి. తమిళనాడు రాజకీయ పరిణామాల పుణ్యమా అని వారిద్దరి మధ్య వర్డ్ష్ వార్(మాటల యుద్ధం) నడుస్తోంది. కమల్ను తక్కువ చేస్తూ స్వామి ట్వీట్ చేసిన క్షణంలోనే కమల్ కూడా అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. దాదాపు పచ్చగడ్డివేస్తే భగ్గుమన్న తీరుగా వీరి వ్యవహారం ట్విట్టర్లో దర్శనం ఇస్తోంది. అసలు వీరిద్దరి మధ్య గొడవెలా వచ్చిందంటే ఓ ట్విట్టర్ ఖాతాదారుడు సుబ్రహ్మణ్యస్వామిని ప్రశ్నిస్తూ కమల్ తమిళనాడు రాజకీయాల్లోకి వస్తే ఆ పరిణామాన్ని బీజేపీ ఆహ్వానిస్తుందా అని అడగగా బీజేపీ సంగతి తెలియదుగానీ, తాను మాత్రం వ్యతిరేకిస్తానని చెప్పారు. బోన్లెస్ వండర్, డంబాలకు పోయే ఇడియట్ కమల్ అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆగ్రహించిన కమల్ వెంటనే బదులు ట్వీట్ చేశారు. తనకు ఒక అంశంపై మొండిగా పోరాడే తత్వం ఉందని, అది మాత్రం చాలు. సంతోషం.. సుబ్రహ్మణ్యస్వామి తమిళులను ఎలా పిలుస్తారో ఆయనకు తెలుసు. నేనెప్పుడు ఆయనను వ్యతిరేకించను.. ప్రజలే ఆ పనిచేస్తారు. స్వామి ఓ కరడు వ్యక్తిత్వం ఉన్నవ్యక్తి. ఆయనకు నేను బదులచెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ కమల్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. -
చిదంబరంపై మరో బాంబు పేల్చిన స్వామి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మరిన్ని చిక్కుల్లో పడనున్నారు. సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై మరోసారి తన దాడిని ఎక్కుపెట్టారు. కార్తి, అతని కంపెనీలకు సంబంధించిన దాదాపు 21 రహస్య విదేశీ బ్యాంకు ఖాతాల వివరాలను బహిర్గతం చేసి చిదంబరం, ఆయన కుటుంబంపై పెద్ద బాంబు పేల్చారు. ఈ వివరాలను మీడియాకు వెల్లడించిన స్వామి త్రీవమైన ఆరోపణలు చేశారు. ఆర్ధిక మంత్రిత్వశాఖ, ఆదాయపు పన్ను అధికారుల అలక్ష్యం కారణంగా ఈ కఠోర అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. చిదంబరం కొడుకు కార్తీకానీ,అతని పేరెంట్ ఇండియన్ భారతీయ కంపెనీలుకానీ ఈ విదేశీ బ్యాంకు ఖాతాల కార్డులు వివరాలను ఆదాయపు పన్ను అధికారులకు వెల్లడించలేదని ఆరోపించారు. ముఖ్యంగా మొనాకో బార్క్లేస్ బ్యాంక్, కెనడాలోని బ్యాంక్ మెట్రో, సింగపూర్ లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఓసీబీసీ, కెనడాలోని హెచ్ఎస్బీసి , ఫ్రాన్స్ లో డ్యుయిష్ బ్యాంక్, స్విట్జర్లాండ్ లో యూబీఎస్, కాలిఫోర్నియా లోని వెల్స్ ఫార్గో బ్యాంక్ లాంటి వివిధ విదేశీ బ్యాంకుల ఖాతాలను ఆయన సోమవారం వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా కార్తీ ఈ ఖాతాలను రహస్యంగా మెయింటైన్ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఆర్థికమంత్రిత్వశాఖలోని సన్నిహితులపై చిదంబరం ఒత్తిడి మూలంగానే గత ఎనిమిది నెలలుగా చెన్నై ఆదాయ పన్ను శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 2014 ఎన్నికల సందర్భంగా లోక్ సభకు పోటీ చేసిన కార్తీ ఈసీకి సమర్పించిన అఫిడవిట్ లో ఈ ఖాతాల వివరాలను ప్రకటించలేదని చెప్పారు. ఈ జాబితా, ఖాతాల నెంబర్లు, గతంలో తాను మోదీకి రాసిన లేఖ, కార్తీ ఆదాయ ప్రకటన వివరాలను స్వామి మీడియాకు అందించారు. ఫిబ్రవరి 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గతంలో ఒకలేఖ రాశానని చెప్పుకొచ్చారు. ఎయిర్ సెల్ మాక్సిస్ స్కాం కుంభకోణంపై పలు ఆరోపణలు గుప్పించిన ఆయన ఈ కుంభకోణంలో చిదంబరం, ఆయన కుమారుడు ప్రమేయంపై తాను సాక్ష్యాలను సమర్పించినా, హెచ్చరించినా కూడా సీబీఐ, ఈడీ తగిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కొంతమంది బీజేపీ నాయకులు అవినీతి నిరోధక చట్టాన్ని నీరుకార్చేందకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ చర్యను తాను వ్యతిరేకిస్తున్నానని, దీని అంతు తేలేవరకు తాను పోరాటం చేస్తానని చెప్పారు. దీనికోసం పార్లమెంట్ లో సవరణలు ప్రతిపాదించనున్నట్టు చెప్పారు. -
'డీఎంకే కంటే శశికళనే బెస్ట్'
చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో బలనిరూపణ సందర్భంగా డీఎంకే సభ్యులు సృష్టించిన గందరగోళ పరిస్థితులపై బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. డీఎంకేను జాతి విద్రోహక, హింసాత్మక పార్టీగా అభివర్ణించారు. డీఎంకే కంటే జైలులో ఉన్న శశికళనే చాలా బెస్ట్ అని వ్యాఖ్యానించారు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. శశికళ వర్గానికి చెందిన సీఎం పళనిస్వామి విశ్వాస పరీక్షను నేడు డీఎంకే సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఓటింగ్ ను మరోరోజు వాయిదా వేయాలని, రహస్య ఓటింగ్ జరుపాలంటూ ప్రతిపాదనలను తీసుకొచ్చారు. అయితే వారి అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించడంతో డీఎంకే సభ్యులు ఆయనపై కుర్చీలు, పేపర్లు విసిరేశారు. దీంతో తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను మధ్యాహ్నం ఒంటిగంట వరకు వాయిదా వేశారు. -
ఒక్కో ట్వీట్కు 200 రూపాయలు!
చెన్నై : బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకె స్టాలిన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శశికళ కంటే ఎంకె స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ , ఆయన సోదరుడు కళానిధి మారన్లు ప్రమాదమైన వ్యక్తులని మండిపడ్డారు. మనం చేయాల్సింది మాత్రం ఇంకా మిగిలే ఉంది అని చెప్పారు. వీళ్లను ఓడించడం ప్రపంచ చరిత్రలోనే ఫాసిస్టు, నియంతగా శాశ్వతంగా నిలిచి పోయిన అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలినీలపై గెలవడం లాంటిదని ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు. స్టాలిన్ అల్లుడు, మారన్ సోదరులు వందమంది నిరుద్యోగులను రిక్రూట్ చేసుకొని వారితో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు క్రియేట్ చేపిస్తున్నారని సుబ్రమణ్యంస్వామి ఆరోపించారు. వాటి నుంచి చేస్తున్న ఒక్కో తప్పుడు ట్వీట్కు రూ.200 ఇస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం తనని ఎంతో బాధించిందని సుబ్రమణ్యంస్వామి పేర్కొన్నారు. I am unhappy to learn that MK Stalin's Son in law & Marans have hired 100 unemployed youth to put out false ID tweets at Rs 200 per tweet. — Subramanian Swamy (@Swamy39) February 15, 2017 -
అమ్మపై పేల్చిన తూటా చిన్నమ్మను కూల్చింది!
-
అమ్మపై పేల్చిన తూటా.. చిన్నమ్మను కూల్చింది!
శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి బలంగా మద్దతిస్తున్న వారిలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి కూడా ఉన్నారు. ఆమెను తక్షణమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను ఆయన బహిరంగంగా డిమాండ్ చేశారు. కానీ ఆయన ఇరవై ఏళ్ల కిందట జయలలిత లక్ష్యంగా పేల్చిన తూటా.. ఇప్పుడు శశికళను కూల్చింది. శశికళ సీఎం కలను కల్లలు చేసి మళ్లీ జైలు పాలు చేసింది. నిజానికి 1996లో జయలలిత అక్రమాస్తులపై స్వామి (అప్పుడు జనతా పార్టీ అధ్యక్షుడు) ఫిర్యాదు చేసినపుడు అందులో ఆమె పేరు ఒక్కటే ఉంది. శశికళ తదితరుల పేర్లు లేవు. విచారణ కోర్టు తీర్పు ప్రకారం.. 1987లో జయలలిత మొత్తం ఆస్తుల విలువ రూ. 7.5 లక్షలు మాత్రమే. అందులో ఎక్కువ భాగం ఆమె తల్లి ఎన్ఆర్ సంధ్య నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులే ఉన్నాయి. అదనంగా రూ. 1 లక్ష నగదు ఉంది. ఆ ఏడాది ఎంజీఆర్ మరణించిన తర్వాత ఆమె రాజకీయాల్లో పూర్తిగా క్రియాశీలకం అయ్యారు. 1991 ఎన్నికల్లో గెలిచి అధికారంలో వచ్చారు. కానీ 1996లో జయలలిత ఓడిపోయిన నెల రోజుల్లోనే సుబ్రమణ్యంస్వామి ఆమెపై అవినీతి ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ‘‘జయలలిత 1989-90 లో ప్రకటించిన ఆస్తులు ఏమీలేవు. కానీ ఆమె ముఖ్యమంత్రిగా నెలకు కేవలం 1 రూపాయి వేతనం తీసుకున్నారు. 1990-91లో ఆమె ఆస్తులు రూ. 1.89 కోట్లకు పెరిగాయి. 1991-92 నాటికి రూ. 2.60 కోట్లకు, 1992-93 నాటికి రూ. 5.82 కోట్లకు, 1993-94 నాటికి రూ. 91.33 కోట్లకు, 1994-95 నాటికి రూ. 38.21 కోట్లకు పెరిగాయి’’ అని స్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై చెన్నైలోని ప్రత్యేక కోర్టు దర్యాప్తుకు ఆదేశించింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం 1996 డిసెంబర్లో జయలలితను అరెస్ట్ చేసిన తర్వాత.. ఆమె నివాసం పొయెస్ గార్డెన్లో సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శశికళ, ఆమె బంధువుల పాత్రపై కూడా ఆధారాలు లభించాయి. శశికళను రెండో ముద్దాయిగా, ఆమె మేనల్లుడు వి.ఎన్.సుధాకరన్ను మూడో ముద్దాయిగా, శశికళ వదిన జె.ఇళవరసిని నాలుగో ముద్దాయిగా ఇదే కేసులో చేర్చారు. 1997 జూన్లో నిందితులు నలుగురిపైనా చార్జ్షీట్ నమోదు చేశారు. ‘‘ఆరోపిత నేరంలో ఎ2 నుంచి ఎ4 వరకూ పాలుపంచుకున్నారని దర్యాప్తు సందర్భంగా సేకరించిన సాక్ష్యాలు చెబుతున్నాయి’’ అని విచారణ కోర్టు పేర్కొంది. ఆ అభియోగాల నుంచి తమను మినహాయించాలంటూ శశికళ, ఇళవరసి, సుధాకరన్లు సమర్పించిన దరఖాస్తులను కోర్టు 1997 అక్టోబర్లో తిరస్కరించింది. ఆ ముగ్గురూ రూ. 66.65 కోట్ల అక్రమాస్తులను సంపాదించిన నేరపూరిత కుట్రలో పాలుపంచుకున్నారని, వాటిలో ఎక్కువ భాగాన్ని తమ పేర్లపై కలిగివున్నారని, వారి పేర్లపై 32 వ్యాపారాలను ప్రారంభించారని నేరాభియోగాలు నమోదు చేశారు. అలా ఇరవై ఏళ్ల కిందట జయలలితపై ప్రారంభమైన అవినీతి కేసు విచారణ ఆ తర్వాత శశికళ తదితరులను కూడా నిందితులుగా చేర్చడంతో.. అనేక మలుపుల అనంతరం, జయలలిత కన్నుమూసిన తర్వాత.. మిగతా ముగ్గురినీ జైలుకు పంపించింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట
-
తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట
గవర్నర్పై కేసు వేస్తా: సుబ్రమణ్యస్వామి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ముగించేందుకు గవర్నర్ విద్యాసాగర్రావు సోమవారంలోగా నిర్ణయం తీసుకోకపోతే ఆయనపై కేసు వేస్తానని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. శనివారం రాత్రి ఆకస్మికంగా గవర్నర్తో భేటీ అయిన ఎంపీ సుబ్రమణ్యస్వామి రాజ్యాంగం ప్రకారం శశికళకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలని కోరారు. కాగా తమిళనాడులో ఏర్పడిన రాజకీయ పరిస్థితులపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని మాజీ గవర్నర్ రోశయ్య వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా తన వర్గం నుంచి పన్నీర్ సెల్వం వైపు ఫిరాయించిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్ను శశికళ పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ ప్రతిపాదనను స్వాగతిస్తున్నా: వెంకయ్య బెంగళూరు: పోయెస్గార్డెన్లోని జయలలిత నివాసమైన వేదనిలయాన్ని ‘అమ్మ’ స్మారక భవనంగా మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్వాగతించారు. ఆదివారమిక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. జయలలిత గొప్ప నాయకురాలని, ఆమె నివాసాన్ని స్మారక భవనంగా మార్చడమనేది మంచి నిర్ణయమన్నారు. అయితే ఇది అన్నాడీఎంకే, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన అంశమని, దీంట్లో కేంద్రం పాత్ర ఏమీ లేదన్నారు. గవర్నర్కు రాజకీయాలు ఆపాదించొద్దు.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న తనను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని శశికళ ప్రశ్నించడాన్ని ప్రస్తావించగా.. వెంకయ్య స్పందిస్తూ, గవర్నర్కు రాజకీయాలు ఆపాదించొద్దని, ఆయన రాజ్యాంగబద్ధంగా నిష్పక్షపాతంగా తన విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. తమిళనాడు ప్రజలకు సుస్థిర ప్రభుత్వాన్ని అందించేందుకు రాజ్యాంగ బద్ధంగా గవర్నర్ నడుచుకుంటారని చెప్పారు. అయినా అక్కడ ఎలాంటి ఖాళీ లేదని, ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు. అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభాన్ని ఆ పార్టీ నేతలే పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. జయలలిత ఉన్న సమయంలో పన్నీర్సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. ఆ సమయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలే ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని చెప్పారు. అయినా ఆయన తరఫున మాట్లాడటానికి తానేమీ పన్నీర్ న్యాయవాదిని కాదన్నారు. కాగా, ఆ రాష్ట్ర అసెంబ్లీలో తమ పార్టీకి సభ్యులు లేరని, అందువల్ల తాము ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. -
'రేపటికల్లా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి'
చెన్నై: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు తీరును రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యేల మద్ధతున్న వ్యక్తిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించక పోవటం ప్రలోభాల కిందకే వస్తుందన్నారు. తమిళనాడు సీఎంగా ఎవరికి అవకాశమివ్వాలన్న అంశంలో గవర్నర్ ఇంకా నాన్చడం సరికాదని హితవు పలికారు. రేపటికల్లా గవర్నర్ విద్యాసాగర్ రావు దీనిపై నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ఆర్టికల్ 32 కింద రిట్ దాఖలు చేస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. న్యాయపోరాటం చేసి అయినా తమిళ రాజకీయ సంక్షోభానికి తెరదించుతామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల మద్ధతున్న వ్యక్తిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో జాప్యం చేయడం ప్రలోభాల కిందకే వస్తుందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. వారం రోజుల కిందట పన్నీర్ సెల్వం రాజీనామా అనంతరం.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను హ్యాండిల్ చేయలేకపోతే పదివి వదిలేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. శశికళను పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని, ఎమ్మెల్యేల సంపూర్ణ మద్ధతు ఆమెకు ఉన్న తరుణంలో ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలంటూ ఇటీవల ఆయన సూచించారు. మరోవైపు పన్నీర్ సెల్వానికి రోజురోజుకు మద్ధతు పెరిగిపోవడం శశికళ వర్గంలో గుబులు రేపుతోంది. The TN Guv must decide CM issue by tomorrow otherwise a WP under Art 32 of the Constitution can be filed charging abetment of horse trading — Subramanian Swamy (@Swamy39) 12 February 2017 -
‘ఎయిర్సెల్–మ్యాక్సిస్’ ఆధారాలివ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: ఎయిర్సెల్–మ్యాక్సిస్ డీల్కు సంబంధించి తను చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలు సమర్పించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామిని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. 2006లో జరిగిన ఎయిర్సెల్–మ్యాక్సిస్ డీల్కు విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బీ) అనుమతి ఇచ్చే విషయంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అక్రమాలకు పాల్పడ్డారని స్వామి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ జరిపింది. రూ.600 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ఐపీబీ క్లియరెన్స్ ఇచ్చి.. దాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ముందుకు పంపేలా చేయడంలో చిదంబరం సూత్రధారి అంటూ స్వామి కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం చిదంబరం పాత్రపై ఆధారాలు రెండు వారాల్లో కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. -
గవర్నర్ హ్యాండిల్ చేయలేకపోతే వెళ్లిపోవాలి
-
గవర్నర్ హ్యాండిల్ చేయలేకపోతే వెళ్లిపోవాలి: స్వామి
తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు తీరుపై బీజేపీ ఎంపీ, సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ బాధ్యతలను గుర్తుచేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చెన్నైలో ఉండాలని, కానీ ఇక్కడ ఉండకుండా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారని, అసలు ఎవరూ పిలవకపోయినా ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తమిళనాడు పరిస్థితులను ఆయన హ్యాండిల్ చేయలేకపోతే పదవి వదిలేయాలని డిమాండ్ చేశారు. తాను తమిళనాడులో ఉన్న పరిస్థితులను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. శశికళను పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని, ఆమెకు సంపూర్ణ బలం ఉందని తెలిపారు. అప్పటికి ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేసి, శశికళ తమ నేత అని ప్రకటించారని, ఆ మేరకు ఒక తీర్మానం కూడా చేసి, ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్కు అందించారని గుర్తుచేశారు. దానికి గవర్నర్ వెంటనే స్పందించి ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను పిలవాలని, ప్రమాణస్వీకారం తర్వాత సభలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని, రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ అనుసరించాల్సిన పద్ధతి ఇదేనని చెప్పారు. కానీ ప్రస్తుత గవర్నర్ మాత్రం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. -
మంటలు రాజేస్తున్న సుబ్రహ్మణ్యంస్వామి
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యంస్వామి సొంత పార్టీ తీవ్ర ఆరోపణలు చేశారు. తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో చెలరేగిన సంక్షోభం వెనుక కొంత మంది బీజేపీ నాయకులు ఉన్నారని అగ్గి రాజేశారు. ‘ఒక పార్టీగా బీజేపీకి ఈ సంక్షోభంతో సంబంధం లేదు. కానీ కొంత మంది బీజేపీ నేతల హస్తం ఉంద’ని ఆయన వ్యాఖ్యానించారు. పన్నీరు సెల్వం తన రాజీనామాను వెనక్కు తీసుకోలేరని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా శశికళతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ విద్యాసాగరరావు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేసేందుకు అన్నాడీఎంకే ఎంపీలు రాష్ట్రపతిని కలవడానికి సిద్ధమయ్యారని తెలిపారు. ‘తమిళనాడులో ఇలాంటి రాజకీయ సంక్షోభ పరిస్థితులు పెట్టుకొని గవర్నర్ మహారాష్ట్రలో కూర్చోవడం తగదు. ఆయన వచ్చి బాధ్యతల ప్రకారం ప్రమాణం చేయించాలి. ఒక వేళ పూర్తి స్థాయి మద్దతు లేకుండా ఉంటే మాత్రం రాజకీయ అనిశ్చితి ఎలాగో తప్పదు’ అంటూ ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతకుముందు అన్నారు. -
పన్నీర్సెల్వంపై స్వామి సంచలన కామెంట్
చెన్నై: తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యంస్వామి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పారు. ఈ విషయంపై తాను ఇప్పుడే రాష్ట్రపతిని కలిశానని, తమిళనాడు రాజకీయ పరిణామాలు వివరించానని, రాష్ట్ర గవర్నర్ బాధ్యతలు కూడా రాష్ట్రపతితో చర్చించానని తెలిపారు. ‘తమిళనాడులో ఇలాంటి రాజకీయ సంక్షోభ పరిస్థితులు పెట్టుకొని గవర్నర్ మహారాష్ట్రలో కూర్చోవడం తగదు. ఆయన వచ్చి బాధ్యతల ప్రకారం ప్రమాణం చేయించాలి. ఒక వేళ పూర్తి స్థాయి మద్దతు లేకుండా ఉంటే మాత్రం రాజకీయ అనిశ్చితి ఎలాగో తప్పదు’ అంటూ ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నాకు జయలలిత చాలా సంవత్సరాలుగా శత్రువుగా, మిత్రురాలిగా తెలుసు. ఆమె కచ్చితంగా పన్నీర్ సెల్వాన్ని ఒక రబ్బర్ స్టాంపుగానే భావించి ఉంటుంది’ అంటూ సంచలన వ్యాఖ్య చేశారు. ‘రాజీనామా చేసిన తర్వాతే శశికళపై ఎందుకు కామెంట్ చేస్తున్నారు? రాజీనామా చేయకముందే తనను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని చెప్పి, ఈ విషయాలన్నీ చెబితే గొప్ప నాయకుడు అయ్యేవారు. శశికళను ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నవారిలో సెల్వం లేరా. ఇప్పుడంతా చేయి జారాక ఆయన మాట్లాడటం సరికాదు’ అని స్వామి అన్నారు. -
‘పన్నీర్సెల్వంపై స్వామి సంచలన కామెంట్’
-
ఆ ఉద్యమం వెనుక ఐఎస్ఐ?
తమిళనాడులో ఉవ్వెత్తున ఎగసిన జల్లికట్టు ఉద్యమం చాలావరకు అహింసాయుతంగానే సాగినా.. చివర్లో మాత్రం ఒక్కసారిగా హింస ప్రజ్వరిల్లింది. దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఉద్యమాన్ని ఆపేయాలని సూపర్ స్టార్ రజనీకాంత్ పిలుపునిచ్చారు. అయితే.. ఈ ఉద్యమం వెనక ఐఎస్ఐ హస్తం ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రమణ్యం స్వామి అనుమానం వ్యక్తం చేశారు. ముందంతా కేవలం విద్యార్థులు, యువత మాత్రమే ఉన్న ఈ ఉద్యమంలోకి ఐఎస్ఐ వచ్చిన తర్వాతే హింస చెలరేగిందని ఆయన అన్నారు. నిజాయితీగా ఉద్యమం చేస్తున్నవాళ్లు చాలామంది ఇప్పుడు అక్కడ లేరని.. దానికి బదులు సంఘవిద్రోహ శక్తులు అందులోకి ప్రవేశించాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జల్లికట్టు కోసం తాను ముందునుంచి పోరాడుతున్నానని, కాంగ్రెస్ పార్టీ మాత్రం దాన్ని దగ్గరుండి నిషేధించిందని అన్నారు. తాము ముందునుంచి ఆట పట్ల సానుభూతితోనే ఉన్నామని.. అయితే ఇప్పుడు తమకు శాశ్వత పరిష్కారం కావాలని వాళ్లంటున్నారు గానీ, అది ఎక్కడి నుంచి వస్తుందని స్వామి ప్రశ్నించారు. -
ఆమె కూడా అన్నలాగే..!
ప్రియాంకా గాంధీ కూడా తన అన్నయ్య రాహుల్ గాంధీ లాగే ఫ్లాప్ అవుతారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్లో ఓటర్లకు తాము ఇది చేశాం అని చూపించుకోడానికి కాంగ్రెస్ వద్ద ఏమీ లేదని, సమాజ్వాదీ సాయంతో యూపీ జలాల్లో చేపలవేట మొదలుపెడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీఎస్పీ నుంచి ముస్లిం ఓట్లను లాక్కోవాలన్నది వాళ్ల ప్రయత్నమని అన్నారు. ఇక ప్రియాంకాగాంధీ చేసేది కూడా ఏమీ ఉండబోదని.. అక్కడ ఎన్నికల్లో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవే కీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గానీ, నెహ్రూ కుటుంబం నుంచి గానీ ఎవరూ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించే అవకాశమే లేదన్నారు. మొత్తం 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ మెజారిటీ సాధిస్తుందన్న నమ్మకాన్ని స్వామి వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సమాజ్వాదీ - కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు విషయంలో ప్రియాంకా గాంధీ పాత్ర ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కూడా ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుబ్రమణ్యం స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. -
రతన్ టాటాపై కేసు నమోదు
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణియన్ స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. టాటాగ్రూపు అధినేత రతన్ టాటాపై మనీలాండరింగ్ ఆరోపణలపై కేసు ఫైల్ చేశారు. 2జి స్పెక్ట్రమ్ లైసెన్స్ పొందటానికి మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ శుక్రవారం స్పెషల్ సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేశారు. 2 జి స్పెక్ట్రమ్ కేటాయింపు కుంభకోణం కేసులో మాజీ టెలికాం మంత్రి ఎ. రాజా, కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా తదితరులను విచారించాలని స్వామి కోరారు. టాటా సన్స్ మధ్యంతర ఛైర్మన్ రతన్ టాటా, యూనిటెక్ అధికారులపై స్వామి ఆరోపణలు గుప్పించారు. అలాగే ఈ కేసులో గుర్తు తెలియని సీబీఐ అధికారులు టాటాలను రక్షిస్తున్నారని ఆరోపించారు. అవినీతి నిరోధక చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంలోని 409 , 420 (మోసం), 463 (ఫోర్జరీ), 120-బి (నేరపూరిత కుట్ర) సెక్షన్లకింద తన ఫిర్యాదును నమోదు చేశారు. దీంతో సీబీఐ ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ స్వామి ఫిర్యాదును స్వీకరించారు. తదుపరి విచారణ నిమిత్తం ఈకేసును జనవరి 11 కు వాయిదా వేశారు. -
అధికార పార్టీలో చీలిక తప్పదా?
-
అధికార పార్టీలో చీలిక తప్పదా?
తమిళనాడు రాష్ట్ర రాజకీయ భవితవ్యంపై బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన శశికళ చెప్పినట్లుగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేయరని, అలాంటి పరిస్థితి లేదని అన్నారు. దాంతో ఆ పార్టీలో చీలిక తప్పదని ఆయన తేల్చిచెప్పారు. ఇక తమిళనాడు ప్రజలు ఆమోదించే స్థాయిలో బీజేపీలో రాష్ట్రస్థాయి నాయకుడు ఇప్పటికిప్పుడు ఎవరూ లేరని కూడా ఆయన అన్నారు. అందువల్ల రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వంను ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే, పన్నీర్ సెల్వమే ప్రతిసారీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలని మరో సీనియర్ మంత్రి ప్రశ్నించారు. కానీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పన్నీర్కు మద్దతు పలకడంతో ఆయనే సీఎం అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను బీజేపీ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం చాలావరకు చెన్నైలోనే ఉన్నారు. అక్కడి పార్టీ నాయకులతో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక డీఎంకే మాత్రం ఇప్పటికిప్పుడు అన్నాడీఎంకేలో చీలిక తెచ్చి, అధికారం చేపట్టే ఉద్దేశంలో ఉన్నట్లు కనిపించడం లేదు. కొంతమంది అధికార, అనధికార ప్రముఖులు ఇంతకుముందే, జయలలిత ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ అవకాశాల గురించి కరుణానిధి, స్టాలిన్ల వద్ద ప్రస్తావించగా, దొడ్డిదారిలో అధికారాన్ని చేపట్టడం అనవసరమని, ఒకవేళ ప్రభుత్వం నిలబడలేని పరిస్థితి వస్తే.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లి అప్పుడే విజయం సాధించి ప్రజాక్షేత్రం నుంచే అధికార పగ్గాలు చేపట్టాలని వాళ్లు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమిళనాడులో సమీప భవిష్యత్తులో మధ్యంతర ఎన్నికలు వస్తాయా, లేక ఇదే ప్రభుత్వం చివరివరకు కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే.