పోలింగ్ సిబ్బందిపై రాములమ్మ ఫైర్ | vijayashanthi-fire-on-electoral-staff | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 30 2014 4:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి పోలింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న విజయశాంతికి.. పోలింగ్ సిబ్బంది టీఆర్ఎస్కు ఓటేయమని చెబుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమాషా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తామెవరికీ ఓటేయమని చెప్పలేదని ఎన్నికల సిబ్బంది చెబుతున్నా విజయశాంతి ఆగ్రహంతో ఊగిపోయారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement