హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రీన్ చాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. బడా బడా పొలిటీషయన్లతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొని ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. కేటీఆర్, కవిత, సచిన్, రాజమౌళి, మహేష్ బాబు లాంటి ప్రముఖులు ఇప్పటికే ఇందులో పాల్గొన్నారు కూడా. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందులో పాల్గొని మరికొందరికి సవాల్ వేశారు.