BC Reservations
-
కుదిరితే సయోధ్య.. లేకుంటే ధర్మయుద్ధం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకునేందుకే ఢిల్లీకి వచ్చామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రిజర్వేషన్లు పెంచని పక్షంలో కేంద్రంతో ధర్మయుద్ధం తప్పదని స్పష్టంచేశారు. రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం జాప్యం చేస్తే ‘గద్దె దిగాల్సిందే.. లేకుంటే గ్రామాల్లో గద్దెలు కూలాల్సిందే’అని హెచ్చరించారు. బుధవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన జరిగిన బీసీ పోరు గర్జన ధర్నాలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం జాప్యం చేస్తోందని విమర్శించారు. ‘కురుక్షేత్ర యుద్ధానికి ముందు అయిననూ పోయి రావలె హస్తినకు అన్నారు. ధర్మ యుద్ధం కోసం ఢిల్లీకి వచ్చాం. సంధిలో భాగంగానే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాం. సయోధ్య కుదుర్చుకుందాం.. ఐదు గ్రామాలు ఇవ్వమన్నా నాడు దుర్యోధనుడు ఇవ్వలేదు. తర్వాత కురుక్షేత్రంలో ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటాం అని అడుగుతున్నాం. ఇకపై విజ్ఞప్తులు తీసుకొని ఢిల్లీకి రాం. గల్లీలకు వాళ్లు ఎట్లా వస్తారో చూస్తాం. ధర్మయుద్ధం ప్రకటించి మన సత్తా ఏంటో చూపుదాం’అని పిలుపునిచ్చారు. గద్దె దిగుడో.. గద్దెలు కూల్చుడో.. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుకుంటామని అడిగితే ప్రధాని మోదీకి వచ్చిన నొప్పేంటని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ కుర్చీ అడిగామా? లేక గుజరాత్లో అమలు చేయమన్నామా? అని నిలదీశారు. ‘బీజేపీకి హెచ్చరిక జారీ చేస్తున్నా. అయితే రిజర్వేషన్లు పెంచాలి. లేదంటే మీరు గద్దె దిగాల్సిందే.. గ్రామాల్లో గద్దెలు కూలాల్సిందే. ఇదే నినాదంతో ముందుకు పోతాం. ఇప్పుడు రాకుంటే రిజర్వేషన్లు ఎప్పుడూ రావు. మీకు సహకారం అందించే సీఎంగా నేనున్నా. రాహుల్గాంధీ మద్దతు ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాలను ఏకం చేసి రిజర్వేషన్లు పెంచే బాధ్యత రాహుల్గాంధీ తీసుకుంటారు. మీరంతా ఏకమై ధర్మయుద్ధం ప్రకటించండి. మీ బలమేంటో పరేడ్ గ్రౌండ్లో చూపెట్టండి. మున్ముందు ఎర్రకోటపై మనమే జెండా ఎగురవేస్తాం. అందరం కలిసి రిజర్వేషన్లను సాధించుకుందాం’అని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ కమండల్ యాత్ర ప్రతినిధి రాహుల్గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కులగణన చేపట్టామని, బీసీల రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేశామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ విధానపరంగా వ్యతిరేకమని విమర్శించారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం మండల్ కమిషన్ను నియమిస్తే, దానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్ యాత్ర మొదలుపెట్టిందని తెలిపారు. ఆ యాత్ర ప్రతినిధే నరేంద్ర మోదీ అని విమర్శించారు. బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందనే 2021లో చేయాల్సిన జనాభా లెక్కలను బీజేపీ ప్రభుత్వం వాయిదావేసిందని ఆరోపించారు. ‘బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన చేపట్టలేదు. మేము బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరడం లేదు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే 10 లక్షల మందితో సభ పెట్టి మోదీని సన్మానిస్తాం. అలా కాకుండా మాపై అధికారం చెలాయిస్తామంటే నాడు రజాకార్లకు పట్టిన గతే ఇప్పుడు బీజేపీకి పడుతుంది. జనగణనతోపాటు కులగణన నిర్వహించాల్సిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీల కోసం ప్రాణం ఇస్తామంటున్నారు. మాకు ప్రాణాలు అక్కర్లేదు. కేవలం రిజర్వేషన్లు పెంచితే చాలు’అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు యువత పోరాడినా గత దుర్మార్గ పాలకులు పట్టించుకోలేదని బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు ఇవ్వనందుకే తండ్రీకొడుకుల ఉద్యోగాలను యువత ఊడగొట్టారని తెలిపారు. -
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగిరావాలి, లేకుంటే..: రేవంత్రెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తే.. గుజరాత్కు వచ్చిన నష్టమేంటని ప్రధాని మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ఆలోచనా విధానం.. బీసీలకు వ్యతిరేకమన్న ఆయన.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జంతర్ మంతర్లో జరిగిన బీసీ సంఘాల పోరు గర్జనలో పాల్గొని ఆయన ప్రసంగించారు. బీసీల లెక్క తేలకుండా రిజర్వేషన్లు ఇవ్వలేమని కోర్టులు చెబుతున్నాయి. లెక్కలు పక్కగా తీస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. అందరి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అందుకే అధికారంలోకి వస్తే కులగణన చేయిస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. జనగణనతోనే కులగణన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానం. అందుకే కేంద్రం కుట్రపూరితంగా జనగణన కూడా చేయడం లేదు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కులగణన చేయడం లేదు. మండల్ కమిషను కు వ్యతిరేకంగా.. కమండల్ తెచ్చిన చరిత్ర బీజేపీది. దేశ రాజకీయాలకు తెలంగాణ ఓ వెలుగు. రాహుల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. తెలంగాణలో 56.36 శాతం అని పక్కాగా తేల్చాం. ఫిబ్రవరి 4వ తేదీన సోషల్ జస్టిస్ డే జరుపుకుంటున్నాం. బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. రిజర్వేషన్ల పెంపు కేంద్ర పరిధిలోని అంశం. అందుకే కేంద్రానికి పంపాం. మేం తెలంగాణలో రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం. గుజరాత్లో ఇవ్వాలని కాదు. తెలంగాణలో రిజర్వేషన్లు ఆమోదిస్తే గుజరాత్కు వచ్చిన నష్టమేంటి?. విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అమలైతేనే బీసీలకు న్యాయం జరుగుతుంది.బీసీల రిజర్వేషన్లు పెంచాలనే కోరిక అసంబద్ధమైంది కాదు. అందుకు పలు పార్టీలు కూడా మద్దతు ఈ వేదికపై ప్రకటించాయి. ఎవరేం అనుకున్నా బీసీలకు మేం అడగా నిలబడతాం. మా రాష్ట్రంలో మేం పెంచుకుంటే.. మీకేంటి నష్టం. మేమంతా మద్దతు ఇస్తున్నా మీకు వచ్చిన నష్టమేంటి?. మీ కుర్చీ.. ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం అని మేం అనడం లేదు. మాకు మీ ప్రాణాలొద్దు.. 42 శాతం రిజర్వేషన్లు కావాలి. ప్రధాని మోదీ మా గుండె చప్పుడు వినాలి. రిజర్వేషన్లకు అనుమతిస్తే పది లక్షల మందితో మోదీకి సన్మానం చేస్తాం. మాకు అనుమతి ఇవ్వకపోతే దేశమంతా కార్చిలా ఉద్యమిస్తాం. అధికారం, చట్టం మీ చేతుల్లో ఉందని మాపై ఆధిప్యతం చెలాయించాలని చూడకండి. బలం లేకపోయినా వక్ఫ్ బిల్లు తెచ్చారు...మరి బీసీ బిల్లుకు అభ్యంతరం ఏమిటి?. మేం సయోధ్యకు వచ్చాం. గల్లీలో వినిపించుకోవడం లేదని.. ఢిల్లీలో గళం వినిపించేందుకు వచ్చాం. యుద్ధభేరి మోగించే ముందు ఢిల్లీకి రావాలని వచ్చాం. రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాలి. ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం. చెప్పిన మాట వినకపోతే మా సత్తా చూపిస్తాం. తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వని తండ్రీకొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టాం. రిజర్వేషన్లపై దిగి రావాలి.. లేదంటే దిగిపోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలు వీళ్ల సంగతి తేల్చాలి అని రేవంత్ పిలుపు ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లు బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలనే డిమాండ్తో హస్తినలో బీసీ గర్జన జరగ్గా.. దేశవ్యాప్తంగా పలు పార్టీల అధినేతలు, ప్రతినిధులు హాజరై మద్ధతు ప్రకటించారు. -
మీ మద్దతు లేకుండా అధికారం కష్టం
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల ప్రజ ల మద్దతు లేకుండా తెలంగాణలో ఎవరూ అ ధికారంలో కొనసాగలేరని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. బీసీల సహకారంతోనే రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని చెప్పా రు. బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మనసు పెట్టి పనిచేశానని, పక్కాగా బీసీ జనా భా లెక్కలతో డాక్యుమెంట్ తయారు చేసి, చట్టం చేసి రక్షణ కల్పించామని వెల్లడించారు. బీసీ సంఘాలు పొలిటికల్ ట్రాప్లో పడి కులగణన విషయంలో విమర్శలు చేయవద్దన్నారు. బీసీ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో.. మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పలు బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సీఎంను బీసీ సంఘాల నేతలు శాలు వాలతో సత్కరించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మీరు నాకు అభినందనలు చెబుతున్నా రు. ఈ అభినందనలన్నింటినీ మూటగట్టి తీసుకెళ్లి రాహుల్గాం«దీకిస్తా. భారత్జోడో యాత్ర సందర్భంగా కృష్ణా మండలం మీదుగా తెలంగాణలో ప్రవేశించినప్పటి నుంచి చార్మినార్ వరకు రాహుల్గాంధీ ఒకటే మాట చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రాష్ట్రాలతోపాటు కేంద్రంలో అధికారంలోకి వస్తే జాతీ య స్థాయిలో కులగణన చేస్తామన్నారు. మీ సహకారంతోనే తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. అందుకే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మనసు పెట్టి పని చేశా. నిబద్ధతతో ముందుకు వెళ్లాం.. కులగణన చేసేందుకు ఉత్తమ్కుమార్రెడ్డిని సబ్కమిటీ చైర్మన్గా నియమించాం. కొందరు దీన్ని కూడా తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్గాంధీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లగలిగిన నిబద్ధత, అధికారులతో పని చేయించగలిగిన నైపుణ్యం ఉన్న నాయకుడు కనుకనే ఆయనకు బాధ్యత ఇచ్చాం. బీసీల జనాభాకు సంబంధించి ఏ పరీక్షకైనా, ఎలాంటి స్రూ్కటినీలో అయినా నిలబడేలా పక్కా డాక్యుమెంట్ రూపొందించాం. దాన్ని లాకర్లో దాచిపెట్టదల్చుకోలేదు. డాక్యుమెంట్ను బిల్లు పెట్టి చట్టం చేశాం. అందుకే బీసీల కులగణన విషయంలో నేను చరిత్రలో ఉండిపోతా. దేశంలో ఏ రాష్ట్రంలో కులగణన జరిగినా తెలంగాణకు వచ్చి నేర్చుకుని పోవాలి. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు కూడా ఇంతటి కీర్తిని ఊహించి ఉండరు. అదే తరహాలో తెలంగాణలో బీసీల గణన గురించి ఇప్పటికిప్పుడు చర్చ జరగకపోవచ్చుగానీ మున్ముందు మాత్రం కచి్చతంగా తెలంగాణ గురించి చెప్పుకోవాల్సిందే. తప్పు ఉందంటే.. నష్టం చేసుకున్నట్టే.. బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి. కులగణన లో తప్పు ఉందని అంటే.. మీకు మీరు నష్టం చేసుకున్నట్టే. స్వయంగా పర్యవేక్షణ చేస్తూ, అందరినీ భాగస్వాములను చేశాను కాబట్టే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. వాయిదా వేయాలనుకుంటే పదేళ్లకు కూడా వీడని విధంగా చిక్కుముళ్లు వేయొచ్చు. ఓబీసీలతో కాంగ్రె స్ పార్టీకి చరిత్రాత్మక అనుబంధం ఉంది. బీసీల మద్దతు లేకుండా ఎవరూ అధికారంలో కొనసాగలేరు. అడగాలి కొట్లాడాలే తప్ప మమ్మల్ని అనుమానించి అవమానిస్తే లాభం లేదు. బీసీల గణన విషయంలో తెలంగాణ ఇచి్చన డాక్యుమెంట్ ఓ బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిది. అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని కూడా సవరించుకున్నాం. అలాగే ఈ డాక్యుమెంట్ను కూడా భవిష్యత్తులో అవసరమైతే సవరించుకుంటాం. 10 లక్షల మందితో సభ పెట్టండి బీసీ కుల గణన ప్రక్రియలో ఎన్నో పరిణామాలను ఎదుర్కొన్నా. అవన్నీ బయటకు చెప్పను. రిస్క్ చేసి బీసీల జనాభా లెక్కలు తేల్చా. మీరు అభినందనలు ఇక్కడే తెలపడం కాదు. పరేడ్ గ్రౌండ్స్లో 10 లక్షల మందితో సభ పెట్టండి. రాహుల్గాందీని పిలిపిస్తా. అభినందించండి. ఆయనకూ బలం వస్తుంది. దేశం మొత్తం కుల గణన జరపాలని పోరాడే శక్తి వస్తుంది’ అని సీఎం రేవంత్ అన్నారు. సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం, పొంగులేటి, వీహెచ్, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు ఈర్ల శంకరయ్య, రాజ్ఠాకూర్, వాకిటి శ్రీహరి, ప్రకాశ్గౌడ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్గౌడ్, టి. చిరంజీవులు, దాసు సురేశ్ పాల్గొన్నారు. సీఎం చెప్పిన ఏడంతస్తుల కథ బీసీల కులగణన విషయంలో రాజకీయ నాయకుల విమర్శలను పెద్దగా పట్టించుకోనుగానీ బీసీ సంఘాలు మాత్రం విమర్శలు చేయవద్దని, తమను బాధ పెట్టవద్దని సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘బీసీల గణనకు నేను పునాదులు వేశా. స్లాబ్ వేసి ఓ అంతస్తు కట్టా. ఆ ఇంట్లోకి రండి. వచ్చి కాపురం చేయండి. అన్నం వండుకుని తినండి. మీకు వీలున్నప్పుడు రెండో అంతస్తు, మూడో కట్టుకోండి. అలా కాకుండా మాకు ఏడంతస్తుల భవనం కట్టివ్వలేదు. మేం ఆ ఇంట్లోకి రామంటే మీకే నష్టం. ఏడంతస్తులు కట్టేలోపు పునాదులు శిథిలమై స్లాబ్ కూలిపోతుంది. బీసీ సంఘాలు పొలిటికల్ ట్రాప్లో పడొద్దు. నేనిచ్చిన డేటా మీకు లంకెబిందెల్లాంటిది. కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కొట్లాడితేనే దేశానికి స్వాతంత్య్రం వచి్చంది. కొట్లాడితే జనగణనలో కులగణన జరగదా? ఒక్కసారి జనగణనలో కులగణన ప్రారంభమైతే ప్రతి పదేళ్లకోసారి బీసీల జనాభా ఎంత ఉందో తేలిపోతుంది’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
తెలంగాణ మార్గం చూపింది.. దేశమంతా జనగణన జరగాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మరో వాగ్దానాన్ని నెరవేరుస్తూ బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించిందని లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్గాంధీ ట్వీట్ చేశారు. జనగణన విషయంలో తెలంగాణ.. దేశానికి ఓ మార్గం చూపిందని, ఈ జనగణన దేశమంతా జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ మంగళవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశా రు. ‘జనగణన ద్వారా మాత్రమే వెనుకబడిన వర్గాల హక్కులు సాధ్యమవుతా యని కాంగ్రెస్ పార్టీ మరోమారు స్పష్టం చేసింది. తెలంగాణ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇప్పటి వరకు రిజర్వేషన్ల విషయంలో ఉన్న 50 శాతం పరిమితి తొలగింపునకు మార్గం సుగమమైంది. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించనుంది’ అని రాహుల్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. మీకు అండగా ఉంటాం: ప్రియాంక ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది. 42% రిజర్వేషన్లతో బీసీ వర్గాలు మరింత అభివృద్ధి సాధిస్తారు. తెలంగాణ ప్రజలు, బీసీ వర్గాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది కేవలం రిజర్వేషన్ల కల్పన మాత్రమే కాదు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం. మీరు మమ్మల్ని నమ్మినట్టుగానే, మేం మీకు అండగా ఉంటాం. జై తెలంగాణ, జైహింద్, జైకాంగ్రెస్’ అని ప్రియాంక ఫేస్బుక్లో పోస్టు చేశారు. కలలు సాకారమవుతున్నాయి: సీఎం రేవంత్ రాహుల్, ప్రియాంకాగాంధీలు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులకు సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ‘గర్వించదగిన రోజు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం వాగ్దానాలను నెరవేర్చుతోంది. రాహుల్, ప్రియాంక నేతృత్వంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కలలను సాకారం చేస్తూ, ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, ప్రతి గ్యారంటీని నిజం చేస్తూ ముందుకెళుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన విప్లవాత్మక నిర్ణయం. సామాజిక న్యాయ అమలులో తెలంగాణ దేశానికి మార్గదర్శనం చేయడం గర్వకారణం. ఆ ఇద్దరి ప్రేరణకు ధన్యవాదాలు’ అని రేవంత్రెడ్డి రీట్వీట్ చేశారు. -
అపాయింట్మెంట్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే అంశంలో సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ సోమవారం రాత్రి లేఖ రాశారు. ‘‘రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానం మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కులగణన సర్వే నిర్వహించాం. ఆ సర్వే నివేదికల ఆధారంగా రాష్ట్రంలోని బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో రెండు బిల్లులను పెట్టి చర్చించాం. అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాయి. బిల్లులు ఆమోదం పొందాయి. ఈ చర్చ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సహకారం కోరాలని రాజకీయ పక్షాలు సూచించాయి. ఈ మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీల తరఫున మిమ్మల్ని కలసి మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం. సానుకూలంగా స్పందించి అపాయింట్మెంట్ ఇవ్వగలరు’’అని ఆ లేఖలో సీఎం కోరారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టండి రైల్వేశాఖ ఇటీవల ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్కు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కోరుతూ రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్కు సీఎం సోమవారం రాత్రి లేఖ రాశారు. చర్లపల్లి టెర్మినల్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ లాజిస్టిక్ హబ్గా మరో కేంద్రం ఏర్పాటు కావడం సంతోషకరమని చెప్పారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును ఈ టెర్మినల్కు పెట్టడం సముచితమని పేర్కొన్నారు. -
ఇప్పటికిప్పుడు బీసీ కోటా అసాధ్యం!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఇప్పటికిప్పుడు బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరని, వచ్చే నెల తొలివారంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే బాధ్యతను రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలని సవాల్ చేశారు.రాష్ట్రంలో సమగ్రంగా కులగణన చేపట్టామని, అది దేశానికే ఒక రోడ్ మ్యాప్గా నిలుస్తుందని పేర్కొన్నారు. కులగణనలో సేకరించిన వివరాల ఆధారంగానే కమిషన్ లేదా అధికారులతో కమిటీ వేసి భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీతో భేటీ అయిన సీఎం రేవంత్రెడ్డి.. అనంతరం అక్కడి తుగ్లక్రోడ్డులోని తన నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘మేం చేపట్టిన కులగణనలో బీసీలు ఆరు శాతం పెరిగారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలు మాత్రమే చూపారు. అందులో బీసీలు 51 శాతం, ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 10 శాతంకాగా.. మిగతా వాళ్లను ఓసీలుగా చూపారు. మేం చేసిన సర్వేలో మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించాం. మా సర్వే ప్రకారం హిందూ, ముస్లిం బీసీలంతా కలిసి 56 శాతం ఉన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చి, పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తాం.కేసీఆర్ సర్వేలో ఎస్సీల్లో 82 కులాలున్నాయని చెప్పారు. కానీ ఉన్నవి 59 కులాలే. స్పెల్లింగ్ తప్పుగా ఎంట్రీ అయినా దాన్ని మరో కులంగా చూపారు. లేని కులాలను ఇప్పుడు చూపెట్టాలంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసిన నేను పట్టించుకోను. ప్రధానిపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. 1994లో ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని నేను చెప్పాను. నేను చేసిన వ్యాఖ్యలను కూడా అంగీకరించాను. కాకపోతే తేదీ, సమయం విషయంలో కొంత తేడా వచి్చంది. కిషన్రెడ్డి చెప్పింది నేను అంగీకరిస్తున్నా.. ప్రధానిపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు. ఆయన హోదాను తగ్గించలేదు. అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు. రాహుల్ గాందీయే నా బాస్.. కాంగ్రెస్ సీఎంగా నేను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచన మేరకు నడుచుకుంటా. ఆయన మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తా. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకోను. కేవలం రాహుల్ గాంధే నా బాస్. ఆయన చెప్పినట్టు నడుచుకుంటా. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ నాపై అనేక ఫిర్యాదులు, విమర్శలు వచి్చనా పట్టించుకోలేదు. రాహుల్ ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేశాం. పీసీసీ, మంత్రివర్గ విస్తరణ అంశాల్లో కొందరు నాపై అబద్ధపు ప్రచారాలు, ఊహాగానాలు వ్యాప్తిచేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు..’’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.శనివారం సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ పూలమాల వేసి నివాళులు అరి్పంచారు. బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహరాజ్ నిలిచారని కొనియాడారు.ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాల్సి ఉందని.. ఈ విషయంలో అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలను పాటిస్తామని రేవంత్ చెప్పారు. కేటీఆర్ తానే కోర్టు అన్నట్టుగా మాట్లాడుతున్నారని, కోర్టు తీర్పు రాకముందే తీర్పులు ఇచ్చేస్తున్నారని విమర్శించారు. న్యాయ ప్రక్రియకు లోబడే ఈ విషయంలో ముందుకు వెళతామని తెలిపారు. అయితే దానం నాగేందర్ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ గుర్తుపై పోటీచేసిన రుజువులున్నాయి కదా అని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ‘గతంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో గెలిచారు? ఏ పార్టీలో మంత్రులుగా పనిచేశారు? నేను ఈ అంశంపై ఫిర్యాదులు చేసినా ఏం జరిగింది?’అని రేవంత్ పేర్కొన్నారు. -
బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర: కవిత
సాక్షి, ఖమ్మం జిల్లా: కేసీఆర్పై కక్షతో రైతులను బాధపెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం ఆమె మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. బీసి రిజర్వేషన్ల సర్వే పూర్తి చేసి ఫిగర్స్ స్పష్టం చేయాలని.. బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. 46 శాతం ఉన్న బీసీలకు అదే స్థాయిలో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వాలన్న కవిత.. బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు.మూడు బిల్లులు పెట్టకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టే. మీకు నిజాయితీ ఉంటే సిన్సియర్గా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మూడు బిల్లులు పెట్టండి. రేవంత్ రెడ్డి తనకు అవసరమైనప్పుడు బీజేపీ నేతలతో మాట్లాడిస్తుంటారు. ఖమ్మంకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. నిజామాబాద్లో మంత్రే లేడు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాం. కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కవిత వ్యాఖ్యానించారు. -
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్న వించారు. గురువారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు నూతి శ్రీకాంత్ గౌడ్, ఈరవత్రి అనిల్, బీసీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, జాజు ల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, వినయ్ కుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్, దాసు సురేశ్ తదితరులు సమావేశమయ్యారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనని వారికి.. ఈ నెల 16 నుండి 28 తేదీల మధ్య అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. 25న బెంగళూరులో ఓబీసీ జాతీయస్థాయి సదస్సు: కృష్ణయ్యఈ నెల 25న బెంగళూరులో ఓబీసీ జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి గురువారం కాచిగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించడంపై కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. -
మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయం
-
‘స్థానికం’.. ఇప్పట్లో లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందని, బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడమే తరువాయి అన్నంతగా నెలకొన్న ఉత్కంఠ ఒక్కసారిగా చల్లారిపోయింది. రాష్ట్రంలో మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయించడం, బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని భావించడమే దీనికి కారణం. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సమయం పట్టే అవకాశం ఉందని, దీనితో మే లేదా జూన్ నాటికి ‘స్థానిక’ఎన్నికలు జరగవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో విడత కులగణన సర్వే.. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని 3.1 శాతం (దాదాపు 16 లక్షల మంది) వివరాల నమోదు కోసం మరో విడత సర్వే నిర్వహించాలని నిర్ణయించామని సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు చెప్పారు. ఆ సర్వే తర్వాత బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు సాధిస్తామని తెలిపారు. తద్వారా ‘స్థానిక’ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు పరోక్షంగానే బయటపెట్టారనే చర్చ జరుగుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడినట్టేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించి పార్లమెంట్కు పంపడం, అక్కడ ఆమోదం పొందడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో.. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు కాక స్థానిక ఎన్నికలు మరికొన్ని నెలలు వాయిదా పడవచ్చని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, మే లేదా జూన్లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వడివడిగా అడుగులు వేసినా.. బీసీ డెడికేటెడ్ కమిషన్ వేగంగా అధ్యయనం పూర్తి చేసి సర్కారుకు నివేదిక అందజేయడం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక అందడం, కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలపై అసెంబ్లీలో చర్చ వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈనెల 15వ తేదీలోగా వస్తుందని కొందరు మంత్రులు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలు కసరత్తు చేపట్టాయి. సిబ్బందికి శిక్షణ, జిల్లా కలెక్టర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి.. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోగా మండల, జిల్లా పరిషత్, ఆ తర్వాత వారం రోజుల వ్యవధి ఇచ్చి పంచాయతీ ఎన్నికలు నిర్వహించవచ్చని ప్రచారం జరిగింది. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పేపర్లపై ‘నోటా’ గుర్తు చేర్పు అంశంపై రాజకీయ పారీ్టల ప్రతినిధులతో సమావేశం కూడా జరిగింది. ఎన్నికలపై భిన్నాభిప్రాయాల మధ్య స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలా, వద్దా అన్న అంశంపై బుధవారం సీఎం ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందని తెలిసింది. తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని కొందరు మంత్రులు ప్రతిపాదించగా.. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తదితరులు రిజర్వేషన్లపై బీసీలకు ఇచి్చన మాట నిలబెట్టుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించే దిశగా ముందుకెళ్లాలని వారు స్పష్టం చేశారని సమాచారం. స్థానిక సంస్థలకే కాకుండా విద్య, ఉద్యోగపరంగా కూడా బీసీలకు తగిన రిజర్వేషన్లను కల్పించాలని వారు అభిప్రాయపడ్డారని తెలిసింది. మరోవైపు వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి అందాల్సిన విధులు రావని.. వీలైనంత త్వరగా నిర్వహించాలని కొందరు మంత్రులు సూచించారని సమాచారం. అయితే ఈ అంశం చాలా సున్నితమైనదని.. బీసీల రిజర్వేషన్లు కీలకమని, ఈ విషయంలో విధుల కంటే కాంగ్రెస్ పారీ్టకి ఉన్న నిబద్ధత ముఖ్యమని సీఎం రేవంత్తోపాటు మరికొందరు అభిప్రాయపడ్డారని తెలిసింది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, అసెంబ్లీలో బిల్లును ఆమోదించి, తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్లో ఈ అంశాన్ని పొందుపరచాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారని సమాచారం. -
‘స్థానిక’ తేదీలపై నేడు స్పష్టత!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల తేదీలతో పాటు బీసీ రిజర్వేషన్ల ఖరారుపైనా బుధవారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, ఆయా శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొననున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే నివేదికను సమర్పించిన నేపథ్యంలో, నివేదికపై చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను ఖరారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, అదే జరిగితే అయిదారు రోజుల్లోనే అంటే ఈ నెల 17 లోగానే స్థానిక ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) విడుదల చేయవచ్చని చెబుతున్నారు. అలాగే ముందుగా ఏ ఎన్నికలు జరపాలి?, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలా..?, లేక గ్రామపంచాయతీ ఎన్నికలా?.. ఏయే తేదీల్లో వీటిని నిర్వహించాలి? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.వారం తేడాతోనే రెండు ఎన్నికలు!ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించినా లేదా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించినా, వారం రోజుల తేడాతోనే రెండు ఎన్నికలూ నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమైంది. షెడ్యూల్ను ప్రకటించాక 21 రోజుల్లోనే ఆ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అంతా ముగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి వీలుగా వారం రోజుల్లో సీఎస్, డీజీపీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించవచ్చని తెలిసింది.తదనుగుణంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లేదా ప్రత్యక్షంగా ఎస్ఈసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాలను మండలాలు, జిల్లా పరిషత్లలో ప్రదర్శించారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ కూడా మొదలైంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇవన్నీ ఈ నెల 15 కల్లా పూర్తవుతాయని, షెడ్యూల్ వెలువడిన వెంటనే సంబంధిత అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కార్యరంగంలోకి దిగుతారని పంచాతీరాజ్, ఎస్ఈసీ అధికారులు చెబుతున్నారు.తొలుత ఎంపీటీసీ ఎన్నికలే..?పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరంగా క్షేత్రస్థాయిలో చేస్తున్న ఏర్పాట్లు, అధికారులు, సిబ్బంది పరంగా నిర్వహిస్తున్న సమీక్షలను బట్టి చూస్తే మాత్రం ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే జరిగే సూచనలున్నాయి. బుధవారం ఉదయం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా), అదనపు కలెక్టర్లు (స్థానికసంస్థలు), ఆర్డీవోలు, సీఈవోలకు పంచాయతీరాజ్ శాఖ శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు కమిషనరేట్ కార్యాలయం నుంచి లేఖ పంపించారు. మరోవైపు క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల కోటా ఖరారు చేయగానే.. వచ్చే 3,4 రోజుల్లోనే పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్ల స్థాయిల్లో (స్థానికంగా జీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు) జనాభాకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పీఆర్ శాఖ నిర్ణయించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా కాకుండా...స్థానికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల జనాభా ప్రకారం హెచ్చుతగ్గుల్లో ఉంటాయని అధికార వర్గాల సమాచారం. -
మిగిలింది రిజర్వేషన్ల లెక్కే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల్లో అమలు చేసే రిజర్వేషన్ల లెక్క తేలడమే మిగిలింది. బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ బీసీ కమిషన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. సోమవారం ఈ మేరకు ప్రత్యేక సమావేశం జరగనుంది. కమిషన్ నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.మరోవైపు ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే నిబంధన ఉండటంతో.. ఆ మేరకు రిజర్వేషన్లకు ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,848 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ స్థానాలు 5,817, ఎంపీపీలు 570, జెడ్పీటీసీ స్థానాలు 570 ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. మిగతా ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయిస్తారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సైతం స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసుకుంది.బీసీ రిజర్వేషన్లు 23శాతంలోపే..!రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రకారం.. రాష్ట్ర జనాభాలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) 17.43 శాతం, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) 10.45 శాతం ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి, అదే సమయంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదు. దీనితో ఎస్సీలకు 17.43 శాతం, ఎస్టీలకు 10.45 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. వీటిని మినహాయిస్తే.. బీసీలకు 22.12 శాతమే రిజర్వేషన్లు అందుతాయి. ఇందులో డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇచ్చే నివేదికకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలనే డిమాండ్ వస్తోంది.రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధంస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. ఈ నెల 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్లు, మండల పరిషత్లలో పరిశీలన కోసం ప్రదర్శించాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ రాణీ కుముదిని ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ నియోజకవర్గాల వారీగా విభజించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై 11న జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా కొనసాగుతోంది. ఈనెల 15న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాలను ప్రచురించనున్నారు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. -
వారంలో ‘స్థానిక’ షెడ్యూల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్(Election schedule) ఈ నెల 15వ తేదీ లోగా వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల(BC ReservationBC ReservationBC Reservation)BC ReservationsBC ReservationsBC ReservationBC Reservationsకు సంబంధించి ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. ఈ నివేదికపై చర్చించాక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోటాను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనుంది. అనంతరం రిజర్వేషన్ల ఖరా రుతో పాటు ఎన్నికల తేదీలపైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేయనుంది.వెంటనే ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్(election notification) జారీ చేయనుంది. మార్చి మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు, అదే నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. టెన్త్ పరీక్షలకు ఎక్కువగా పరీక్షా కేంద్రాలు అవసరం కాబట్టి, ఇవి మొదలు కావడానికి అయిదారు రోజుల ముందే... అంటే మార్చి 17, 18 లోగానే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మూడు కాదు..రెండు విడతల్లోనే ‘పంచాయతీ’ ఈ నెల 15వ తేదీ లోగా నోటిఫికేషన్ జారీచేస్తే..ఆ తర్వాత 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే తొలుత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ఒకే విడతలో పూర్తి చేసేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. ఈ లెక్కన ఫిబ్రవరి చివర్లోగా ఈ ఎన్నికలు పూర్తయితే..తర్వాత మార్చి 17, 18 లోగానే రెండు విడతల్లో గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2019లో పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించగా, ఈసారి కూడా అలాగే జరిపేందుకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం.అయితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలేవీ పెద్దగా లేవు కాబట్టి రెండు విడతల్లోనే పంచాయతీ పోరు ముగించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థలకు నోడల్ ఏజెన్సీ అయిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరంగా కూడా ఎన్నికల దిశగా అన్నిరకాల కసరత్తును వేగవంతం చేశారు. 11న కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ భేటీ ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా అందుకు తగిన విధంగా సిద్ధంగా ఉండేలా ఎస్ఈసీ కసరత్తు ముమ్మరం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు చేస్తున్న సన్నాహాలు, సన్నద్ధమౌతున్న తీరుపై ఈ నెల 11న జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీ కుముదిని సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెల 10 తేదీన...ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఓటర్ల జాబితాలను జిల్లా పరిషత్లు, మండల పరిషత్లలో పరిశీలన కోసం ప్రదర్శించాలని ఆదేశిస్తూ శుక్రవారం రాణీ కుముదిని నోటిఫికేషన్ విడుదల చేశారు.అలాగే గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను ఎంపీటీసీ, జడ్పీటీసీ నియోజకవర్గాల వారీగా విభజించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే నాగర్కర్నూల్ జిల్లాలోని నరసింహాపురం ఎంపీటీసీ, కొల్లాపూర్ జడ్పీటీసీ, ఖమ్మం జిల్లాలోని పోలేపల్లి ఎంపీటీసీ, ఖమ్మం రూరల్ జడ్పీటీసీ స్థానాలు మినహా ప్రచురించాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీ దాకా గ్రామ పంచాయతీ ఫొటో ఓటర్ల జాబితాల్లో పేర్లు చేర్చడం, తొలగింపు, దిద్దుబాటు వంటివి చేసే అవకాశం ఉన్నందున చట్టంలోని అంశాలకు లోబడి ఆ ప్రక్రియను చేపట్టాలని ఆమె సూచించారు.ఇదిలా ఉంటే.. ఈ నెల 10వ తేదీకల్లా రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది నియామకం, 12వ తేదీలోగా ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లా, మండల స్థాయిల్లోని క్షేత్రస్థాయి సిబ్బంది (రిటర్నింట్ ఆఫీసర్లతో సహా)కి శిక్షణా తరగతులు చేపట్టాలని ఎస్ఈసీ సూచించింది. 15వ తేదీలోగా పోలింగ్ అధికారులు (పీవో), అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు(ఏపీవో) శిక్షణ తరగతులు పూర్తి చేయాలని తెలిపింది. 15న పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రచురణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈనెల 15న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాలను ప్రచురించాలని జిల్లా కలెక్టర్లు / జిల్లా ఎన్నికల అధికారులకు (హైదరాబాద్ మినహా) ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్కుమార్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సీఈవోలు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీడీవోలకు సర్క్యులర్ జారీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారుల (కలెక్టర్లు) నుంచి ఆమోదం లభించాకే వాటిని ప్రచురించాలని సూచించారు. ఎంపీడీవోలు, ఎన్నికల అధికారులు పోలింగ్ స్టేషన్ల కోసం ప్రతిపాదిస్తున్న భవనాలను స్వయంగా పరిశీలించి, స్టేషన్ల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయనే నిర్థారణకు రావాలన్నారు. 23 శాతంలోపే బీసీ రిజర్వేషన్లు? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నప్పటికీ.. ఆ మేరకు సాధ్యమయ్యే అవకాశాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుల గణన సర్వే అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చి న ట్రిపుల్ టెస్ట్ ఆదేశాల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించాలని (1), మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడాలని (2), డెడికేటెడ్ కమిషన్ను నియమించి రిజర్వేషన్లు ఖరారు చేయాలని (3) న్యాయ నిపుణులు చెబుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ వారం మొదట్లో వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతంగా ఉన్నారు. జనాభాకు అనుగుణంగా వీరికి రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నందున ఈ రెండు వర్గాలకు 27.88 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని, 50 శాతంలో ఇంకా మిగిలింది 22.12 శాతమేనని చెబుతున్నారు. ఇక డెడికేటెడ్ కమిషన్ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికి మించకుండానే రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
తెలంగాణ అసెంబ్లీలో బీసీ జనాభా లెక్కల నివేదికపై చర్చ
-
Telangana: స్థానిక పోరుకు రెఢీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులోగా లేదా మార్చి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మార్చి మొదటివారంలో ఇంటర్ పరీక్షలు, మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీనితో వచ్చే నెల చివర్లోగానీ, ఆ రెండు పరీక్షల మధ్య సమయంలో (మార్చి 17, 18 నాటికి)గానీ ఎన్నికల ప్రక్రియ ముగించవచ్చని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల 5న కేబినెట్ భేటీ ఉంటుందని, స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ కూడా తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మొదలైన నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపట్టవచ్చా అన్న సందేహాలున్నా.. ఆ కోడ్ స్థానిక ఎన్నికలకు అడ్డుకాబోదని ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఒకరు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి.. స్థానిక ఎన్నికలకు సన్నాహాల్లో భాగంగానే సమగ్ర కుల సర్వే నివేదిక ఫిబ్రవరి 2న మంత్రివర్గ ఉప సంఘానికి చేరనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఉప సంఘం ఆ నివేదికపై చర్చించి తగిన ప్రాధాన్యతాంశాలతో మంత్రివర్గానికి నివేదిక అందిస్తుందని వెల్లడించాయి. ఫిబ్రవరి 5న జరిగే కేబినెట్ భేటీలో ఉప సంఘం నివేదిక, బీసీ రిజర్వేషన్ల పెంపు, డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సులపై చర్చించనున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 6 లేదా 7వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపించనున్నట్టు సమాచారం. ఎంపీటీసీ స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియ మొదలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సన్నాహాలు మొదలుపెట్టాయి. రెవెన్యూ మండలాల పరిధి, స్థాయికి తగినట్టుగా మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల పునర్విభజన చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు గురువారం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో ఎంపీటీసీ స్థానంలో 3వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండేలా రూపకల్పన (కార్వింగ్) చేయాలని సూచించారు. 2011 జనాభా లెక్కలకు అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ‘కార్వింగ్’ చేయాలని ఆదేశించారు. శుక్రవారం వరకు ఎంపీటీసీ స్థానాల ముసాయిదా ప్రచురించి.. శుక్ర, శనివారాల్లో అభ్యంతరాలకు గడువు ఇవ్వాలని.. శని, ఆదివారాల్లో వాటిని పరిష్కరించి 3వ తేదీన తుది ప్రచురణ చేయాలని సూచించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా జెడ్పీటీసీలు, రెవెన్యూ మండలాలకు తగ్గట్టుగా ఎంపీటీసీ స్థానాల పునర్విభజన ఉండాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో పంచాయతీల విలీనం వల్ల ఎంపీటీసీ స్థానాలు ప్రభావితమైన చోట, నిర్ణీత జనాభాకు మించి, లేదా తక్కువగా ఉన్నచోట పక్కనే ఉన్న స్థానాలతో సర్దుబాటు చేయడం, లేక కొత్త స్థానాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లలో ఎస్ఈసీ.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ నిర్ణయం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఎదురుచూస్తోంది. తేదీలపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి... రెండు, మూడు వారాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా మొదలపెట్టినట్టు సమాచారం. ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్కు ఏర్పాట్లతోపాటు సర్పంచ్ పదవికి 30దాకా, వార్డు మెంబర్లకు 20 దాకా వివిధ ఫ్రీసింబల్స్ (ఎన్నికల చిహ్నాలను) సిద్ధం చేసినట్టు జిల్లాల్లో అధికారులు చెబుతున్నారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, వివిధ శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకం, బ్యాలెట్ బాక్స్లను సైతం సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైనట్టు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పెంపు సాధ్యమేనా? బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు చర్యలు చేపట్టింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50శాతం మించరాదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేరుగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం కాకుండా... ఎక్కడికక్కడ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్ల పరిధిలోని జనాభా ప్రామాణికంగా వేర్వేరుగా రిజర్వేషన్లు అమలు చేసే యోచన కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంటే ఎస్సీ, ఎస్టీల జనాభా అధికంగా ఉన్నచోట బీసీలకు తక్కువగా, బీసీల జనాభా ఎక్కువగా ఉన్నచోట 42 శాతం దాకా రిజర్వేషన్లు ఇచ్చేలా ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. కానీ ఇది ఆచరణ సాధ్యమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీపరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం నుంచి 50 శాతం దాకా టికెట్లు ఇవ్వవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
బీసీ రిజర్వేషన్లు పెంచాకే ‘స్థానిక’ ఎన్నికలు జరపాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరగనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీని అమలు చేయకుంటే ఉద్యమిస్తామన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో జనవరి 3న ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కవిత ప్రకటించారు. 40కి పైగా బీసీ సంఘాల నాయకులతో శుక్రవారం కవిత తన నివాసంలో భేటీ అయ్యారు.బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఆమె బీసీ సంఘాల నాయకులతో చర్చించారు. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాతో పంచుకున్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు’అని కవిత పేర్కొన్నారు.జనవరి 3న సినిమా చూపిస్తాం ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్తో మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుపుతాం. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పణ, బీసీల జనాభా సంఖ్యను వెల్లడించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. బీసీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. మొత్తంగా బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్తో జనవరి 3న జరిపే సభ ద్వారా ప్రభుత్వానికి సినిమా చూపిస్తాం’అని కవిత ప్రకటించారు. -
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: విద్యా ఉద్యోగాల్లో అమలు చేసినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని అత్యంత వెనుకబడిన కులాల ప్రతినిధులు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాతినిధ్యానికి నోచుకోని కులాలు, సంచార జాతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు డీఆర్డీఎస్ రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ కేవీ రావు, రిటైర్డ్ అడిషినల్ డీసీపీ ఆర్. వెంకటేశ్వర్లు, ఎంబీసీ ప్రతినిధి మహేశ్ వినతిపత్రం సమర్పించారు. 35 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యంత వెనుబడిన కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. బీసీల్లోని 8 నుంచి 9 కులాలే రాజకీయాల్లో రిజర్వేషన్ల ఫలాలను మొత్తం అనుభవిస్తున్నాయని.. అత్యంత వెనుకబడిన వర్గాలకు కనీసం వార్డు మెంబర్ పదవులు కూడా ఇప్పటికీ దక్కడం లేదన్నారు. ఏబీసీడీ వర్గీకరణ అమలుతోనే రాజకీయాల్లో ఎంబీసీలకు ప్రాతినిధ్యం దక్కుతుందని వివరించారు.తెలంగాణలో 56 శాతం వరకు బీసీలు ఉన్నారని.. దీనికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరముందన్నారు. కులగణన తర్వాత దాషామా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు. రాష్ట్రంలో 93 బీసీ కులాలు ఉండగా 90 శాతం రిజర్వేషన్లు 9 కులాలే దక్కించుకుంటున్నాయని, మిగతా 10 శాతం రిజర్వేషన్లను 15 కులాలకు చెందిన వారు దక్కించుకున్నారని వివరించారు. అత్యంత వెనుకబడిన బీసీ-ఏ కులాలకు, సంచార జాతులకు రాజకీయ ప్రాతినిధ్యం శూన్యమని తెలిపారు. ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా ఉండాలంటే ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయడం ఒక్కటే మార్గమని నొక్కి చెప్పారు. ఎంబీసీల సామాజిక సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం ఎంతో కీలమని తేల్చిచెప్పారు.చదవండి: నిరుపయోగంగా 50 ఎకరాలు... నెరవేరని ప్రభుత్వ లక్ష్యం -
బీసీ కేటగిరీల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల్లోని కులాలను పునర్వ్యవస్థీకరణ (రీకేటగిరైజేషన్) చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి ఎక్కువగా వచ్చిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పది జిల్లాల్లో నిర్వహించిన బీసీ కమిషన్ బహిరంగ విచారణల్లో ఈ అంశంపైనే ఎక్కువగా విజ్ఞప్తులు వచ్చాయని వెల్లడించారు. లోతైన విచారణ చేపట్టిన తర్వాతే పునర్వ్యవస్థీకరణ సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, బాల లక్షి్మ, తిరుమలగిరి సురేందర్లతో కలిసి నిరంజన్ మీడియాతో మాట్లాడారు.‘‘బీసీల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణ చేపట్టాం. ఇప్పటివరకు 1,224 విజ్ఞప్తులు అందాయి. వాటిని కంప్యూటరీకరిస్తున్నాం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తోంది. సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, కుల విభాగాల్లో ఈ సర్వే కొనసాగుతోంది. ప్రారంభ రోజుల్లో కాస్త ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ప్రస్తుతం ప్రజల నుంచి స్పందన బాగుంది. కొన్ని విభాగాలకు సంబంధించిన ప్రశ్నలకు సరైన జవాబులు అందడం లేదని వార్తలు వస్తున్నాయి. బీసీ కులాల పునర్వ్యవస్థీకరణ చేయాలంటే వారి ఆర్థిక స్థితి కూడా తప్పకుండా తేల్చాలి. అందుకే ఈ సర్వే ఎంతో కీలకంగా మారింది..’’అని కమిషన్ చైర్మన్ వెల్లడించారు. అనుమానాలకు ప్రభుత్వం వివరణ ఇస్తుంది.. సమగ్ర సర్వే ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయిందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. తార్నాక వద్ద రోడ్లపై సర్వే ఫారాలు లభ్యమైనట్లు వచి్చన వార్తలపై స్పందించి, సూపర్వైజర్ను సస్పెండ్ చేసి, జవహర్నగర్ మున్సిపల్ కమిషనర్కు షోకాజ్ నోటీసు జారీ చేశామని వివరించారు. సర్వే ఫారాలను కంప్యూటరీకరించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సర్వేపై ఎలాంటి అనుమానాలున్నా ప్రభుత్వం సమాధానం ఇస్తుందని తెలిపారు. ఈడబ్ల్యూఎస్తో నష్టంపై వినతులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలు నష్టపోతున్నారనే వినతులు సైతం పెద్ద సంఖ్యలో వచ్చాయని నిరంజన్ తెలిపారు. 2– 4 శాతం కూడా జనాభా లేని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా... జనాభాలో సగం ఉన్న బీసీలకు అత్యల్పంగా రిజర్వేషన్లు కలి్పంచారంటూ వాదనలు వచ్చాయని వివరించారు. ఇటీవల డీఎస్సీలో బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయంటూ వినతుల్లో ప్రస్తావించారని వెల్లడించారు. వచ్చే నెల 9న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో విచారణ ఉందని.. ఆరోజు నాటికి రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ తరపున నివేదిక సమర్పించనున్నామని తెలిపారు. కమిషన్ తరఫున కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నాం బహిరంగ విచారణ ప్రక్రియలో వచ్చిన అంశాలన్నీ ప్రభుత్వానికి నివేదిస్తామని జి.నిరంజన్ వెల్లడించారు. ‘‘కుమ్మర కులస్తులకు మట్టి కేటాయింపులపై జారీ చేసిన జీవోలను క్షేత్రస్థాయి అధికారులకు పంపేలా చర్యలు.. రంగారెడ్డి జిల్లా బండ రావిర్యాలలో వడ్డెరలకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేయడం, సంచార జాతులు, ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు.. గ్రామ అభివృద్ధి కమిటీలు చేస్తున్న కుల బహిష్కరణలపై కఠినంగా వ్యవహరించడం, ఆరె కటికల కోసం మీట్ కార్పొరేషన్ ఏర్పాటు, మద్యం దుకాణాల్లో ఆరె కటికలకు 30 శాతం రిజర్వేషన్లు, ట్యాంక్బండ్ వద్ద భగీరథుడి విగ్రహం ఏర్పాటు, రజకులను ఎస్సీ కేటగిరీలో చేర్చడం తదితర అంశాలపై వచ్చిన వినతుల ఆధారంగా ప్రభుత్వానికి ప్రతిపాదన లు చేస్తాం’’అని వివరించారు.బీసీ సంక్షే మ వసతి గృహాల్లో వ సతులు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. ఇటీవల బహిరంగ వి చారణ ప్రక్రియలో భాగంగా కొన్ని హాస్ట ళ్లను సందర్శించామని.. కొన్నిచోట్ల ఏళ్ల త రబడి అద్దె చె ల్లించని పరిస్థితి ఉంద ని వివరించారు. ప్రతి జిల్లా కేంద్రంలో బా లురు, బాలికలకు ప్రత్యేక హాస్టళ్లను పూర్తిస్థాయి వసతులతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్దేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ (ప్రత్యేక) కమిషన్ను ఏర్పాటు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు ఈ కమి షన్కు చైర్మన్గా వ్యవ హరిస్తారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం, రిజర్వేషన్లలో లోటుపాట్లు, ఇతర అంశాలపై కమిషన్ సమగ్ర విచారణ చేపట్టనుంది. రాజ్యాంగంలో ని నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నెలరోజుల్లో నివేదిక సమరి్పంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులుజారీ చేశారు. బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్య దర్శి బి.సైదులు ఈ కమిషన్కు కార్యదర్శిగా వ్యవహరిస్తూ సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలకు కట్టుబడి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెపె్టంబర్ 6వ తేదీన జి.నిరంజన్ చైర్మన్గా బీసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అధ్యయనం కోసం ఈ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ రాజ్యాంగ నిబంధనలకు లోబడి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం తన నివాసంలో లోతుగా చర్చించి ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమాచారాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి తాజాగా ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ అధ్యయనం పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించే క్రమంలో గతంలో నియమించిన బీసీ కమిషన్లు సేకరించిన సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కమిషన్లు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు, ప్రముఖులు, కీలక వ్యక్తుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు గణాంకాలు తీసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. అవసరాన్ని బట్టి నిపుణులు, పరిశోధకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, అధ్యయనానికి సంబంధించి పర్యటనలు చేపట్టవచ్చని, పరిశోధన సంస్థల నుంచి సమాచారం తీసుకోవచ్చని తెలిపింది. డెడికేటెడ్ కమిషన్కు అవసరమైన సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. వివిధ శాఖల్లో విశేష సేవలు వెనుకబడిన తరగతులకు చెందిన బూసాని వెంకటేశ్వరరావు బీఈ (ఎలక్ట్రానిక్స్), ఎంఈ (సాలిడ్ స్టేట్ ఎల్రక్టానిక్స్), ఎల్ఎల్బీ చదివారు. ఈయన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 1987లో గ్రూప్–1 (స్టేట్ సివిల్ సరీ్వసు) టాపర్గా నిలిచి ప్రభుత్వ అధికారిగా ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయనగరం జిల్లా కలెక్టర్గా, పర్సనల్ అడ్మిని్రస్టేషన్ అండ్ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్గా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యదర్శిగా, ఏపీ హ్యాండీక్రాఫ్టŠస్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీఎండీగా, రెవెన్యూ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా, మత్స్య శాఖ కమిషనర్గా, జీఏడీ (సర్వీసెస్–హెచ్ఆర్ఎం) కార్యదర్శిగా, చివరిగా తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ(డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం ముఖ్య కార్యదర్శిగా సేవలందించి 2019 డిసెంబర్–31న పదవీ విరమణ పొందారు. -
ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయండి
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కల్పనకు సేకరించే వివరాల కోసం ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ వి చారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బాధ్యతను బీసీ కమిషన్కు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా బుధవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిజర్వేషన్ల బాధ్యతను బీసీ కమిషన్కు అప్పగించడం సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల బెంచ్ తీర్పునకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలన్న అత్యున్నత న్యా యస్థానం మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, రెండు వారాల్లో స్థాయీ నివేదిక న్యాయస్థానం ముందు ఉంచాలని స్పష్టం చేశారు. వాదనలు ఇలా..: పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. బీసీ కమిషన్నే ప్రత్యేక కమిషన్గా ప్రభుత్వం పేర్కొనడం డాక్టర్ కె.కృష్ణమూర్తి, వికాస్ కిషన్రావు గవాలి కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులకు విరుద్ధమని తెలిపారు. బీసీలకు కల్పించిన రిజర్వేషన్ల సమీక్ష నిమిత్తం బీసీ కమిషన్ ఏర్పాటవుతుందన్నారు. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పన నిమిత్తం వాస్తవ గణాంకాల సేకరణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మహారాష్ట్రలో బీసీ కమిషన్నే ప్రభుత్వం ప్రత్యేక కమిషన్గా నియమించగా, అది ఇచ్చిన మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బాంథియా కమిషన్ను ఏర్పాటు చేసిందన్నారు. బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక రిజర్వేషన్ల పునఃసమీక్షకు తప్ప రాజకీయ రిజర్వేషన్ల కల్పనకు గణాంకాలుగా పరిగణించరాదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసమే జీవో: ఏజీ వాదనల అనంతరం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేయగా, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై పునరాలోచన చేసి మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించాలని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి మధ్యాహ్నం న్యాయమూర్తిని కోరారు. రెండున్నర నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన దశలో ఈ ఉత్తర్వులు సరికాదన్నారు. 2021లో ప్రభుత్వం జీవో 9 జారీ చేసిందని తెలిపారు. ఈ జీవో అమలు నిమిత్తం తిరిగి జీవో 47 జారీ చేస్తూ గణాంకాల సేకరణకు విధివిధానాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ జీవోలు జారీ చేసినందున సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని చెప్పడానికి వీల్లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల అమల్లో భాగంగా ప్రభుత్వం ఈనెల 9న జీవో 47 జారీ చేసిందన్నారు. ఈ జీవోను పిటిషనర్లు సవాలు చేయలేదని తెలిపారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది బీఎస్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయంగా వెనుకబడిన వర్గాల వాస్తవ గణాంకాల సేకరణకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఏజీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఒకవేళ అభ్యంతరాలుంటే కౌంటరుతోపాటు పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పారు. బీసీ కమిషన్నే ప్రత్యేక కమిషన్గా పరిగణించాలంటూ ఇచ్చిన జీవో 47 సరికాదని, ఇది సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగంతో విభేదిస్తున్నట్లు స్పష్టంచేశారు. కాగా, హైకోర్టు తీర్పుపై ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తీర్పును గౌరవించి వెంటనే నిపుణులతో కూడిన డెడికేటెడ్ కమిషన్ను నియమించాలని కోరారు. -
బీసీ రిజర్వేషన్లు: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెండు వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక.. ఈ బాధ్యత బీసీ కమిషన్కు అప్పగించటడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. -
బీసీ రిజర్వేషన్ల పెంపే మా ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: బీసీలకు రాజకీయ అవకాశాలను మెరుగుపరిచేందుకు స్థానికసంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, వారి జనాభాకు అనుగుణంగా అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు, బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చారి, కన్వీనర్ బాలగోనీ బాలరాజుగౌడ్ తదితరులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా బీసీ ప్రతినిధుల బృందానికి డిసెంబర్లోగా కుల గణన సర్వే పూర్తి చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దీనిపై బీసీ కుల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభు త్వం చిత్తశుద్ధితో ఉండటం పట్ల బీసీ సంక్షేమసంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులను సందర్భంగా కోరారు. -
తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కూడా విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా పోరాడుతామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, వారిని అన్ని రంగాల్లో ముందుకు నడిపించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్లను పరిశీలించేందుకు మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో బీఆర్ఎస్కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ చైర్మన్లు రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం చెన్నైలో అక్కడి అధికారులతో సమావేశం అయ్యారు. తమిళనాడులో రిజర్వేషన్లు ఏ విధంగా అమలు అవుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తద్వారా తమ వద్ద జరుగుతున్న రిజర్వేషన్ల అమలు తీరును బీఆర్ఎస్ నేతలకు వివరించారు. శాస్త్రీయంగా ఇంటింటి సర్వే నిర్వహించి బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. తమిళ తరహాలో రిజర్వేషన్ల సాధనకు పోరాటం: మధుసూదనాచారి తెలంగాణలో విద్యా ఉద్యోగాలలో బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు దక్కాలంటే తమిళనాడు తరహా రిజర్వేషన్ల అమలు ఒక్కటే అంతిమ పరిష్కార మార్గమని మధుసూదనాచారి అన్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడో స్పష్టం చేశారని, సమావేశం ముగిసిన తరువాత మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణలో తమిళనాడు తరహా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రధాన మంత్రి మోదీని పలుమార్లు కేసీఆర్ కోరారన్నారు. 42 శాతం అమలయ్యే దాకా.. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు వి. శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్నలు మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు విద్యా ఉద్యోగాల్లోనే కాకుండా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేదాక బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్లు, అభివృద్ధి పథకాలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పుట్టమధు, కోరుకంటి చందర్, అలాగే జూలూరు గౌరీశంకర్, డా.ఆంజనేయగౌడ్, పల్లె రవికుమార్, తుల ఉమ, గెల్లు శ్రీనివాస్యాదవ్, నాగేందర్ గౌడ్, రవీంద్రసింగ్, బాలరాజు యాదవ్, సుభప్రద పటేల్, కిశోర్గౌడ్, దాసోజు శ్రీనివాస్, చెరుకు సుధాకర్, రాజ్యలక్షి్మ, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్, విద్యార్థి సంఘం నేత దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. -
సుప్రీం మార్గదర్శకాల మేరకు..బీసీ రిజర్వేషన్లను నిర్ధారించండి
సాక్షి, హైదరాబాద్: వికాస్ కిషన్రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీ రిజర్వేషన్లను నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనానికి రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలి.. సామాజిక, రాజకీయ అంశాలు, వెనుకబాటుతనం లాంటి అంశాలను పరిశీలించి జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు నిర్ధారించాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లన్నీ 50 శాతానికి మించకూడదు’ అని వికాస్ కిషన్రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొన్న ఈ మూడు సూత్రాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. దీన్ని అమలు చేసేందుకు మూడు నెలల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి కోరారు. దీంతో తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేస్తూ, అప్పటిలోగా నివేదిక అందజేయాలని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో బీసీల జనాభా వివరాలను సేకరించడానికి, సర్వేల నిర్వహణకు తెలంగాణ బీసీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ను అధీకృత సంస్థగా ప్రభుత్వం గుర్తించడం రాజ్యాంగ వ్యతిరేకమని.. రాజ్యాంగ బద్ధమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లను నిర్ణయించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావు మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ధర్మేశ్ డీకే జైస్వాల్, శ్రీనివాస్ యాదవ్, కౌటూరు పవన్కుమార్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్, కేంద్రం తరఫున డీఎస్జీ గాడి ప్రవీణ్కుమార్ హాజరయ్యారు. వికాస్ కిషన్రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్లోని పేరా 13 అమలుపై వివరాలు తెలుసుకుని చెబుతామని గత విచారణ సందర్భంగా ఏజీ వెల్లడించారు. మంగళవారం విచారణ సందర్భంగా మూడు అంశాలు అమలు చేయడానికి ఎంత సమయం కావాలని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి అధ్యయనానికి 3 నెలల సమయం కావాలని కోరడంతో అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. -
ఆ 21 కులాలు రాష్ట్రమంతటా బీసీలే
సాక్షి, అమరావతి: కొన్ని ప్రాంతాలకే వెనుకబడిన తరగతులు (బీసీ)గా పరిమితమైన 21 కులాలు, వాటి ఉప కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితులను తొలగించి రాష్ట్ర మంతటా బీసీలుగానే పరిగణిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము ఉత్తర్వులు జారీ చేశారు. వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న 138 కులాల్లో 31 కులాలు వాటి కార్యకలాపాలపై ప్రాంతం, భౌగోళిక పరిమితులను కలిగి ఉన్నాయి. వాటిలో పది బీసీ కులాలు తెలంగాణాలో, 21 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 21 కులాలను కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బీసీలుగా పరిగణిస్తున్నారు. ఈ విషయంలో వచ్చిన అనేక అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం ఈ 21 కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితిని తొలగించడం ద్వారా రాష్ట్రం అంతటా బీసీలుగా గుర్తించే అవకాశం దక్కింది. ఆ కులాలకు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా బీసీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కల్లుగీతపై ఆధారపడిన శెట్టి బలిజ కులానికి మాత్రం రాయలసీమ ప్రాంతంలో ఇది వర్తించదు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందిన అనేక కులాలకు కొన్ని ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు పొందేలా 2008లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అవకాశం కల్పిస్తే, ఇప్పుడు 21 కులాలకు, వాటి ఉప కులాలకు రాష్ట్రమంతటా బీసీలుగా పరిగణిస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆ 21 కులాలు ఇవీ.. ► బీసీ–ఏ గ్రూప్లో ఆరు కులాలు, వాటి ఉపకులాలు ఉన్నాయి. అవి కురకుల, పొండర, సామాంతుల (సామంత, సౌంటియా), పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కవలి, ఆసాదుల, కెవుట (కెవుటో, కెవిటి) కులాలు ఉన్నాయి. ► బీసీ–బీ గ్రూపులో నాలుగు కులాలు, వాటి ఉప కులాలు ఉన్నాయి. వాటిలో అచ్చుకట్లవాండ్లు, గౌడ (ఈడిగ, గౌడ, గమల్లా), కలాలీ, గౌండ్ల, శెట్టి బలిజ (రాయలసీమ మినహా అంతంటా), కుంచిటి వక్కలింగ (వక్కలింగ, కుంచిటిగ), గుడ్ల (గుడ్లయ) కులాలు ఉన్నాయి. – బీసీ–డీ గ్రూపులో 11 కులాలు, వాటి ఉప కులాలు ఉన్నాయి. వాటిలో మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, అయ్యరక, నగరాలు, ముదలర్, ముదిలియర్, బెరి వైశ్య (బెరి శెట్టి), అతిరాస, కుర్మి, కలింగ కోమటి(కలింగ వైశ్య) కులాలు ఉన్నాయి. -
కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ఎంపీ ఆర్.కృష్ణయ్య భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షాతో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య శుక్రవారం భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు చర్చించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని వినతించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని అమిత్షా అన్నారు. క్రిమిలేయర్ను ఎత్తివేయాలని, జాతీయ జనగణనలో బీసీ కులగణన చేయాలని ఆర్.కృష్ణయ్య కోరారు. భేటీ అనంతరం ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ దేశంలో 2,640 బీసీ కులాలున్నాయి. కుల, చేతి, సేవా వృత్తులు పోయాయి. యంత్రాలు, పరిశ్రమలు, గ్లోబలైజేషన్, ఇండస్ట్రీయలైజేషన్తో పెనుమార్పులు సంభవించాయన్నారు. చదవండి: Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? -
బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి.. సీఎంకు ప్రవీణ్కుమార్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వే షన్లను 27% నుంచి 50 శాతానికి పెంచా లని, బీసీ జన గణన ను చేపట్టాలని ప్రభు త్వాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశా రు. తెలంగాణలో బీసీల జనాభా 50 శాతా నికిపై ఉన్నా విద్య, ఉద్యోగాలు సహా అన్ని రంగాల్లో బీసీల వాటా 27శాతమే ఉందన్నారు. పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వే షన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 50% నిధులను బీసీలకు కేటా యించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యలను తక్షణ మే పరిష్కరించకపోతే ప్రభుత్వం రాజీనామా చేసి గద్దెదిగాలని లేఖలో డిమాండ్ చేశారు. చదవండి: రేవంత్రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
‘వెన్నెముక’పై విషపు రాత
బీసీలంటే చంద్రబాబుకు ఎంత ప్రేమంటే.. తలా ఇస్త్రీ పెట్టె, కత్తెర ఇచ్చి ఇదే ఆదరణ అంటూ అవమానించేంత. ఓటేసేంత వరకు బీసీలను ఓటు బ్యాంకుగా చూసి, అమిత ప్రేమ ఒలకబోయటం, వారి ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత చీదరింపులు, అవమానాల పాలు చేయడం. బాబు వంచనకు తట్టుకోలేకపోయిన బీసీలు ఇదేమి ఆదరణ అని ప్రశ్నిస్తే.. ‘మీ తోకలు కత్తిరిస్తా.. పిచ్చాటలు ఆడితే తోలుతీస్తా..’ అంటూ కళ్లెర్రజేసి, వేలు చూపించి బెదిరించడం. ఆ చంద్రబాబుకు ప్రజలే అధికారాన్ని కత్తిరించి దీటైన బదులిచ్చారు. నేడు.. వెనుకబడిన కులాలను అన్ని విధాలుగా అగ్రస్థానంలో నిలబెడుతూ వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తాత్కాలిక ఉపశమనాలతో సరిపెట్టకుండా బీసీలను ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దేలా సరికొత్త వివ్లవానికి నాంది పలికారు సీఎం వైఎస్ జగన్. అందుకే బీసీలంతా వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకొని ఈరోజు సీఎం వైఎస్ జగన్కు అండదండగా నిలుస్తున్నారు. టీడీపీ, ఎల్లో బ్యాచ్కు మాత్రం ఇది ఓ దురవస్థ. వాస్తవాలను జీర్ణించుకోలేని కడుపు మంట. వైఎస్ జగన్కు బీసీల మద్దతు కొనసాగితే చంద్రబాబుకు, టీడీపీకి పుట్టగతులుండవన్న ఏడుపు. అందుకే టీడీపీ, దాని ఎల్లో మీడియా విషం కక్కుతోంది. పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. తాజాగా ‘పైసా పనికాలేదు.. పదవీ కాలం ముగిసిపోయింది’ అంటూ ఈనాడు అబద్ధాలను వండి వార్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న బీసీల సమగ్రాభివృద్ధిని గమనిస్తే పచ్చ పత్రిక వంకర రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అవగతమవుతుంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణంలో బీసీల పురోగతిపై వాస్తవాలు ఇవి.. -సాక్షి, అమరావతి బీసీల కోసం నిలబడటం అంటే ఇదీ.. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో, ఏ బీసీ ముఖ్యమంత్రి సైతం చేయని విధంగా బీసీల పక్షాన నిలబడింది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. ఇది ఓ రికార్డు. అధికారంలోకి రాక ముందు బీసీల సమస్యల అధ్యయానికి కమిటీ వేసి వారి సూచనలను మేనిఫెస్టోలో చేర్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి హామీనీ అమలు చేశారు సీఎం వైఎస్ జగన్. బీసీల సమస్యల పరిష్కారానికి దేశంలోనే తొలిసారిగా శాశ్వత కమిషన్ వేసి కార్యదక్షతను చాటారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ పార్లమెంట్లో ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టించిన ఘనత జగన్కే దక్కింది. 38 బీసీ ఉప కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, వారి సంక్షేమానికి రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణలో సైతం కులం కాలమ్ చేర్చి కుల జనగణన చేపట్టాలని, తద్వారా జనాభా (దమాషా) ప్రాతిపదికన బీసీల వాటా బీసీలకు కేటాయించి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి చరిత్ర సృష్టించారు. బీసీల ప్రయోజనాల పరిరక్షణ, వారి అభ్యున్నతికి పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలు చేస్తున్న కృషి మరువరానిది. తిరుమల ఆలయంలో సన్నిధి గొల్లలకు తలుపులు తెరిచే సంప్రదాయ హక్కును కల్పించి ఏడుకొండలస్వామిని సేవించుకొనేలా జీవో జారీ చేయడం విశేషం. బీసీల సామాజిక సాధికారతకు బాటలు రాష్ట్రంలో రాజకీయంగానూ బీసీలకు ప్రముఖ స్థానం కల్పించారు సీఎం జగన్. రాష్ట్ర మంత్రివర్గంలో ఏకంగా 11 మంత్రి పదవులు బీసీలకే ఇచ్చారు. ఇందులో ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది. 136 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వారి అభ్యున్నతికి బాటలు వేశారు. దేవాలయాల ట్రస్టు బోర్డులు, మార్కెట్ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించి, వారికి ఉన్నత స్థానాలు కల్పించారు. నామినేషన్ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ల పద్ధతిలో బీసీలకు కేటాయించేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేసి మరీ అమలు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు, మరో 54 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, మరోవైపు ఆరోగ్య రంగం, అవుట్సోర్సింగ్ విభాగంలో దాదాపు లక్ష మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 2.60 లక్షల మంది వాలంటీర్లలో సగానికిపైగా బీసీలే కావడం గమనార్హం. ఇలా అనేక రంగాల్లో వారి బీసీల అభ్యున్నతికితో డ్పడి, తలరాతలు మార్చి, సామాజిక సాధికారతను సాధించి పెట్టారు సీఎం వైఎస్ జగన్. సంక్షేమంలోనూ సగానికి మించి.. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు పదవుల్లోనే కాదు. సంక్షేమంలోను సగానికిపైగా అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయ నిర్మాతగా వారి మన్ననలు అందుకుంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ నవరత్నాలతో బీసీల్లో నవోదయం తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల ద్వారా బీసీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయమైన లబ్ధి చేకూరింది. ఏలూరు బీసీ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా బీసీ సబ్ప్లాన్కు ప్రతి యేటా రూ.15 వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి అంతకు మించి ఖర్చు చేస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లలో ఒక్క బీసీలకే డీబీటీ (ప్రత్యక్షంగాను), నాన్ డీబీటీ (పరోక్షంగాను) ద్వారా ఏకంగా రూ.1.63 లక్షల కోట్లు లబ్ధిని చేకూర్చి రికార్డు సృష్టించారు. 2019 జూన్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఖర్చు చేసిన మొత్తాన్ని గమనిస్తే ఏకంగా 51 శాతంపైగా నిధులు బీసీలకు దక్కడం విశేషం. రాష్ట్రంలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తం 10,20,17,931 మంది లబ్ధిదారులకు వివిధ పథకాల కింద రూ.3,19,227.86 కోట్ల ప్రయోజనం కలిగితే వారిలో 5,05,32,725 మంది బీసీ లబ్ధిదారులకు రూ.1,63,344 కోట్లు లబ్ధి కలిగింది. ప్రత్యక్షంగా (డీబీటీ) 7,46,80,150 లబ్ధిదారులకు రూ.1,77,585.51 కోట్లు లబ్ధి కలిగితే వారిలో బీసీలు 3,72,56,695 మందికి రూ.85,915.06 కోట్లు ప్రయోజనం కలిగింది. పరోక్షంగా 2,73,37,781 లబ్ధిదారులకు రూ.1,41,642.35 కోట్లు లబ్ధి కలిగితే వారిలో బీసీలు 1,32,76,030 మందికి రూ.77,429.10కోట్ల ప్రయోజనం కలిగింది. దగా చేసిన బాబుకు ఈనాడు బాకా ఊదుతోంది ఇవి ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేని వాస్తవాలు. చంద్రబాబు 14 ఏళ్లే కాదు.. ఎన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, బీసీలకు మేలు చేయడానికి మనసు రాదన్నది సత్యం. ఇందులో పదో వంతు మేలు కూడా చేయలేరన్నది నిజం. అందుకే చంద్రబాబు హయాంలో బీసీలు దగా పడ్డారన్నది సుస్పష్టం. మేలు చేయాలన్న చిత్తశుద్ధి లేక ఆదరణ పేరుతో ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, షేవింగ్ కిట్లు, పనిముట్లు ఇచ్చి బీసీలను బురిడీ కొట్టించారు. బీసీలకు 2014లో చంద్రబాబు 114 హామీలు ఇచ్చి పది శాతం కూడా అమలు చేయకుండా దగా చేశారు. వ్యవసాయ రుణాలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలను మాఫీ చేస్తానని దగా చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ను ఒక ప్రహసనంగా మార్చారు. కేజీ నుంచి పీజీ వరకు బీసీ పిల్లలకు ఉచిత చదువులను అటకెక్కించారు. ప్రధానంగా బీసీ సబ్ప్లాన్ తెచ్చి ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తానని నమ్మించిన బాబు కనీసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయకుండా వంచించారు. అప్పట్లో ఇంటికో ఉద్యోగమని, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి అని నమ్మబలికి మోసం చేశారు. బీసీల వెన్నెముక విరిచారు. ఇప్పడు బడుగువర్గాల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు చేస్తున్న మేలు చూసి ఈనాడు వెన్నులో వణుకు పుట్టింది. జన్మలో చంద్రబాబు సీఎం కాలేరన్న నిజం నెత్తికెక్కడంతో జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది. బీసీలను అడుగడుగునా దగా చేసిన చంద్రబాబును భుజాన వేసుకుంది. మరోమారు బీసీలను మభ్యపెట్టి, సాధికారితను దెబ్బకొట్టి, చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే వారిగా మార్చాలని అబద్ధపు వార్తలు రాస్తోంది. అయినప్పటికీ, ప్రజలు వాస్తవాలు గ్రహించారు. ఈనాడు వంకర రాతలను నమ్మేస్థితిలో లేరు. ఇది పచ్చి నిజం. -
బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి
నాంపల్లి: బీసీ రిజర్వేషన్లను యాభై శాతానికి పెంచాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఏసీగార్డ్స్ అడ్వకేట్స్ కాలనీలోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు–బీఎస్పీ భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. జనాభా దామాషా పద్ధతిలో బీసీ రిజర్వేషన్లు 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, క్రీమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. కాలేల్కర్, మండల్ కమిషన్ల సిఫార్సులను అమలు చేయకుండా ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో దేశవ్యాప్తంగా బీసీల కోసం 8617 టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతి ఉన్నా ఉద్దేశపూర్వకంగా 4821 పోస్టులను ఖాళీగా ఉంచారని నిందించారు. దర్యాప్తులు, ఐటీ దాడుల పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని దుయ్యబట్టారు. పథకం ప్రకారమే రెండు ప్రభుత్వాలు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా ఫారెస్టు అధికారులను చంపుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం నుంచి తమ పార్టీ కార్యాచరణ ప్రారంభం అవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానంద రావు, రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ అబ్రార్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, అధికార ప్రతినిధులు సాంబశివగౌడ్, అరుణ, డాక్టర్ వెంకటేష్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓబీసీల వర్గీకరణకు మోక్షం ఎప్పుడు?
ఓబీసీ కులాల వర్గీకరణ ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017 అక్టోబర్ 2న జస్టిస్ రోహిణి అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జాతీయ కమీషన్ను ఆర్టికల్ 340 ప్రకారం ఏర్పాటు చేసింది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ) కోటాలో విద్యా, ఉద్యో గాల్లో 27 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న సుమారు 2640 కులాలను వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించడానికి ఈ కమిషన్కు మొదట 12 వారాల గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఆ గడువును ఇప్పటికి 13 సార్లు పొడిగించి చివరగా నివేదిక సమర్పించడానికి 2023 జనవరి 31 చివరి తేదీగా నిర్ణయించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన ఓబీసీ కులాలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల రాజకీయంగా నష్టపోతామనే భయంతో బీజేపీ ప్రభుత్వం ఓబీసీలను వర్గీకరించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాల్లో బీసీ రిజ ర్వేషన్లను విద్యా, ఉద్యోగాల్లో వర్గీకరణ ద్వారా అమలు చేస్తున్నారు. బీసీ/ఓబీసీ కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థికపరమైన వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే కేంద్రం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు అమలు చేస్తున్నప్పటికీ, నేటికీ కేంద్రంలో 1600 కులాలకు పైగా ఎలాంటి రిజర్వేషన్ల ఫలాలను పొందలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏ ఓబీసీ కులం అయితే జనసంఖ్య అధికంగా కలిగి సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా బలంగా ఉంటుందో ఆకులం వారు.. వారి జనాభాకు మించి రిజర్వేషన్లు అనుభవించడం జరుగుతోంది. గత సంవత్సరం మార్చిలో కొన్ని పత్రికలకు లీకులు వదిలారు. వీటి ప్రకారం... ఓబీసీ కులాలు నేటి వరకు కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్ల ఫలాలను ఏమేరకు అనుభవించాయనే లెక్కలను, వారి జన సంఖ్యను పరిగణలోకి తీసుకొని జస్టిస్ రోహిణి కమీషన్ ఓబీసీలను నాలుగు గ్రూపులుగా వర్గీకరించింది. గ్రూప్–ఏలో 1,654 కులాలకు 2 శాతం, గ్రూప్– బీలో 534 కులాలకు 6 శాతం, గ్రూప్–సీలో 328 కులాలకు 9 శాతం, గ్రూప్–డీలో 104 కులాలకు 10 శాతం రిజర్వేషన్లను కేటా యించిది. అయితే ఈ లీకుల్లో నిజమెంతో తెలియదు. 1993 నుండి ఉద్యోగాల్లో, 2008 నుండి విద్యాసంస్థల్లో వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే, ఓబీసీలో బాగా వెనుకబడిన కొన్ని కులాలకైనా న్యాయం జరిగి ఉండేది. మండల్ కమిషన్ నివేదికపై తీర్పులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం బీసీల వర్గీకరణకు ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్లను వర్గీకరించకుండా అమలు చేయడం వలన వీరిలో ఐక్యత లోపించింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 1994 నుండి బీసీలకు ఉమ్మడిగా అమలుపరుస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారు. అయినప్పటికీ బీసీ కులాలు ఉద్యమాలు చేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం 110కి పైగా బీసీ కులాలు రాజకీయ రిజర్వేషన్లు పొందలేదు, వారికి చెందని రిజర్వేషన్ల కోసం వారు ఎందుకు కొట్లాడుతారు? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఓబీసీల వర్గీకరణపై నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఓబీసీల వర్గీకరణ వల్ల అత్యంత వెనుకబాటుకు గురైన కులాలవారూ ప్రయోజనం పొందడానికి మార్గం సుగమం అవుతుంది. (క్లిక్ చేయండి: విచారణ ఖైదీల వెతలు తీరేదెన్నడు?) - కోడెపాక కుమార స్వామి సామాజిక విశ్లేషకులు -
‘దేశంలోనే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రం ఏపీ’
సాక్షి, ఏలూరు: దేశంలో 56 శాతం ఉన్న బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు ఇంకా లభించలేదు. 45 ఏళ్ల పోరాటం ఫలితంగా విద్యాహక్కు సాధించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగానికి పెద్దపీట వేశారని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. కాగా, కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఫీజురీయింబర్స్మెంట్తో 30 లక్షల మంది బీసీ విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. బీసీలకు కూడా జనాభా ప్రకారం 56 శాతం రిజర్వేషన్కు పెంచాలి. దేశంలో 16 రాష్ట్రాల నుండి కనీసం ఒక్క ఎంపీ కూడా లేదు. బీసీల బిల్లు ఆమోదానికి దేశంలో అన్ని పార్టీలు పార్లమెంట్లో మద్దతివ్వాలి. బీసీలు భరత మాత ముద్దు బిడ్డలు. జనాభా ప్రాతపదికన మా వాట మాకు కావాలి. ఈ నెల 24 ఛలో ఢిల్లీకి పిలుపునిస్తున్నాము. దేశంలోనే బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రం ఏపీనే. దేశంలో ఎక్కడా లేని పథకాలు బీసీలకు ఇచ్చారు . మంత్రి పదవులు ఇచ్చారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు బీసీలను ఓటర్లుగా చూస్తే.. సీఎం వైఎస్ జగన్ సొంత మనుషుల్లా చూశారు అంటూ కామెంట్స్ చేశారు. -
వారికి రిజర్వేషన్లు సహేతుకం కాదు!
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్)కు పదిశాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ 2019 జనవరి 8న పార్లమెంట్ చేసిన 103వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ సుప్రీం కోర్ట్ 2022 నవంబర్ 7న తీర్పు ఇచ్చింది. దీంతో రిజర్వేషన్ అంశం దేశ వ్యాప్తంగా మరోసారి చర్చకు వచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ రవీంద్రభట్లు ఈడబ్ల్యూఎస్ కోటాను విభేదించగా... జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది సమర్థించారు. మొత్తం మీద 3:2 మెజారిటీతో 103వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ ఎస్సీ, ఎస్టీ బీసీలు కాని వారిలో పేదలు... అనగా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్పునివ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశంలో తరతరాలుగా సామాజికంగా, విద్యాపరంగా; అంటరానితనం, వివక్షతలను అనుభవిస్తున్న కులాలకు కల్పించవలసిన రిజర్వేషన్లు... ఆర్థికపరంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం కల్పించడం రాజ్యాంగ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమనీ, ఆ సవరణను రద్దు చేయాలనీ సుమారు 40 మంది సుప్రీం కోర్టులో కేసులు వేశారు. జస్టిస్ యు.యు. లలిత్ కుమార్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ విచారణ సమయంలో దీన్ని ప్రభుత్వం సమర్ధించుకుంటూ... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంతకు ముందే రిజర్వేషన్లు కల్పిస్తున్నందున వారికి కేటాయించిన 50 శాతం కోటాకు ఈ 10 శాతం అదనంగా ఉంటుందనీ, వీటితో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధం లేదనీ, ఇది రాజ్యాంగబద్ధమే అనీ చెప్పింది. ఈ కోర్టు తీర్పు రాగానే అధికార, ప్రతిపక్ష, వివిధ రాజకీయ పార్టీలు క్రెడిట్ మాదంటే మాది అని ప్రకటించుకోవడం సిగ్గుచేటు. 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్టికల్ 15 (6), 16 (6) క్లాజు లను చేర్చడం ద్వారా దేశ జనాభాలో 8 నుంచి 10 శాతం ఉన్న అగ్ర వర్ణాలకు అందులో కేవలం మూడు శాతం ఉన్న పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఏ విధంగా సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎసీ,్ట బీసీలలో ఉన్న నిరుపేదలు పేదలు కాదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలలో ఎలాంటి స్థిరాస్తులు కలిగి లేకుండా ఏడాదికి రూ. 2.5 లక్షల ఆదాయం ఉన్న వారిని పేదలుగా గుర్తించినప్పుడు... అగ్రవర్ణాలకు మాత్రం 5 ఎకరాల లోపు భూమీ, సంవత్సరాదాయం రూ. 8 లక్షల లోపు ఆదాయం... అంటే నెలకు 60 వేల ఆదాయం ఉండా లని నిర్ణయించడం వివక్ష కాదా? నెలకు 60 వేల ఆదాయం సంపాదించే వారు ఎలా పేదలవుతారో తెలపాలి. పేదలు ఎవరైనా పేదలే అన్న ప్పుడు ఈ వివక్ష ఎందుకో సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎస్సీలలో 38 శాతం, ఎస్టీలలో 48.4 శాతం, బీసీలలో 13.8 శాతం, ఓసీలలో 3 శాతం పేదలు ఉన్నారు. పేదరికం, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా ఓసీలలో ఉన్న మూడు శాతం పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్న పేదలకు ఎందుకు ఇందులో అవకాశం ఇవ్వరు? వీరు పేదలు కాదా? కేవలం అగ్రవర్ణాల్లోనే పేదలుంటారని ఈడబ్ల్యూఎస్ కోటా నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీలను తప్పించడం రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కును కాలరాయడమే. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వే షన్లను కొందరికే ఎలా వర్తింపచేస్తారని రాజ్యాంగ నిపుణులు అంటు న్నారు. ఉదాహరణకు దివ్యాంగులకు ఏ కులం వారికైనా రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు. నిరుపేదలు ఏ కులంలో ఉన్నా ఈడబ్ల్యూఎస్ రిజ ర్వేషన్లు వర్తింపజేయాలి కదా! ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 52 శాతం ఉన్న బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వలేదు. పైపెచ్చు 1992లో ఇందిరా సహాని కేసులో తొమ్మిది మంది సభ్యులు గల సుప్రీంకోర్టు బెంచ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్లు 50 శాతానికి దాటడానికి వీలులేదని తీర్పునిచ్చింది. ఇదే సందర్భంలో ప్రమోషన్లలో రిజర్వేషన్లను కూడా తొలగించి, బీసీలకు క్రిమిలేయర్ ని వర్తింపజేసింది. దేశంలో 49.5 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా ప్రస్తుత ఈడబ్ల్యూఎస్లకు ఇస్తున్న 10 శాతం కలిపితే 59.5 శాతం అవుతున్నది. అయితే ఓ న్యాయమూర్తి 50 శాతం అనేది లక్ష్మణరేఖ కాదని పేర్కొనడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలోనూ అనేక అన్యాయాలు జరగుతు న్నాయి. 2018లో హైకోర్టు జీవో నంబర్ 26ను సమర్థిస్తూ ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు కల్పించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 26ను తొలగిస్తూ జీవో నంబర్ 247ను తీసుకు రావడం జరిగింది. దీనివల్ల దళిత, గిరిజన ఉద్యోగుల ప్రమోషన్లకు అడ్డుకట్ట వేయడం జరిగింది. ఇదిలా ఉండగా మరో అన్యాయాన్ని గమనిస్తే (ఈడబ్ల్యూఎస్) అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కేటాయించడం వల్ల ఓపెన్ కేటగిరిలో వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీలు పది శాతం రిజర్వేషన్లు కోల్పోవడం జరుగుతుంది. ఇటీవలే జరిగిన కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియలో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ పాటించక పోవడం వల్ల అన్యాయానికి గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చేయడం... ఈ అంశం అసెంబ్లీలో చర్చకు రావడం వల్ల తిరిగి వాటిని సరిచేయడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగ నియమకాల ఫలితాలలో ఎస్సీలకు –82.50, ఎస్టీలకు –76.50, బీసీ లకు 110.50, ఈడబ్ల్యూఎస్ (ఓసీ)లకు – 51.25 మార్కులు కటాఫ్ మార్కులుగా కేటాయించారు. ఇలా నిరుపేదలు, వికలాంగుల కంటే కూడా ఈడబ్ల్యూఎస్ (ఓసీ)లకు తక్కువ కటాఫ్ మార్కులు కేటాయిం చడం అన్యాయం. ఈ విధంగా కూడా దళిత గిరిజనులకు, బహుజను లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇలా ఒక్కొక్కటిగా రాజ్యాంగ రక్షణలు అన్నిటిని కూడా పెకిలించివేస్తున్న చర్యలను వివిధ సామాజిక వర్గాల మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సామాజిక వెనుకబాటే ఆర్థిక వెనుకబాటుకు కారణం కాబట్టి ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ సాధన కోసం సామాజికంగా, విద్యా పరంగా... వివక్ష, అంటరానితనం అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. రిజర్వేషన్లు ఆర్థిక ఉద్దీపన కోసం కాదన్న విషయం గమనించాలి. కాబట్టి ఆర్థిక వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు కల్పించలేమన్న విషయాన్ని గుర్తించాలి. అగ్రవర్ణ పేదలపై ఎవరికీ వ్యతిరేకత లేదనేది గమనించాలి. వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటే కాదనేది ఎవరు? ఆ దిశలో కృషి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. (క్లిక్ చేయండి: రాష్ట్రాల వృద్ధిలో కేంద్రం పాత్రేమిటి?) - బైరి వెంకటేశం రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి, తెలంగాణ -
భిక్ష కాదు... వాటా కావాలి!
స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు దాటినా, 56 శాతం జనాభా గలిగిన బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం స్పష్టంగా కన్పిస్తోంది. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం 28 ఏళ్ల క్రితం కేంద్రప్రభుత్వ ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికి బీసీలకు 15 శాతం కూడా వాటా లేదు. చట్టసభలలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అనేక రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా తీర్మానం చేశాయి. ప్రజాస్వామ్యం సుస్థిరంగా కొనసాగాలంటే అన్ని సామాజిక వర్గాలకూ, వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ సామాజిక రంగాలలో వారి వాటా వారికివ్వాలి. బీసీలకు కావలసింది భిక్ష కాదు... రాజ్యాంగబద్ధంగా వాటా! త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా గణనలో కుల గణన కూడా చేయా లనీ, చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్పై దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. జనాభా గణన పట్టికలో 34 కాలమ్స్ ఉన్నాయి. కుల గణన చేస్తే అదనంగా ఇంకొక కాలమ్ మాత్రమే చేరుతుంది. దీనికి రూపాయి కూడా ఖర్చు కాదు. ఒక్క కాలమ్ పెట్టడానికి అంగీకరించని కేంద్ర ప్రభుత్వం దేశంలోని 70 కోట్ల మంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తుంది? జనాభా గణనలో కుల గణనను భాగం చేస్తే బీసీలకు విద్యా, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలలో ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని కేంద్ర పాలకులు భావిస్తున్నట్లుంది. అలాగే కొత్తగా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలనే డిమాండ్ ముందుకు వస్తుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం కులాలవారీ జనగణనకు వెనకాడుతోం దని రాజకీయ పరిశీలకుల భావన. ఇది నిజమే కావచ్చు. కానీ అంత మాత్రాన బీసీ కులాలకు ఇవ్వవలసిన ప్రజాస్వామ్య వాటా ఇవ్వ కుండా ఎన్ని రోజులు దాటవేస్తారు? స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు దాటినా, 56 శాతం జనాభా గలిగిన బీసీలకు రిజర్వేషన్ల కేటాయిం పులో అన్యాయం స్పష్టంగా కన్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మేరకు, ఈ దేశంలోని 2,648 బీసీ కులాలలో దాదాపు 1,800 కులాలు చాలా పేదరికంలో, దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నాయి. ఈ కులాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్యం ఇప్పటివరకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోలేదు. రాజ్యాంగం లోని 340 ఆర్టికల్ ప్రకారం 1953లో కాకా కలేల్కర్ కమిషన్ను నియమించారు. కానీ దాని సిఫార్సులను అమలు చేయకుండా తొక్కి పెట్టారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ 1978లో మండల్ కమిషన్ను నియమించి; ఈ కులాల విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులఫై అధ్యయనం చేశారు. బీసీ కులాల అభివృద్ధికి మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే కేవలం మూడు సిఫార్సులు మాత్రమే అమలు చేశారు. మిగతా 37 సిఫార్సులు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. బీసీ కులాలను అభివృద్ధి చేయకపోతే ఈ దేశం అగ్రదేశంగా ఎలా రూపుదిద్దుకుంటుంది? బీజేపీ కలలుగనే అఖండ భారత్లో బీసీలు భాగం కారా? రాజ్యాధికారంలో బీసీలకు వాటా ఇవ్వడం లేదు. ఇంతవరకు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. బడ్జెటు కేటా యింపులు లేవు. కనీసం ఐఐటీ, ఐఐఎం తదితర కోర్సులు చదివే వారికి స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంటు స్కీమూ లేవు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలలో జనాభా ప్రకారం ప్రజాస్వామిక వాటా దక్కడం లేదు. దీనికోసం రాజకీయ పార్టీలు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావలసిన సమయం ఆసన్నమైనది. బీసీలకు చట్టసభలలో జనాభా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇందుకోసం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి. చట్ట సభ లలో, అసెంబ్లీ – పార్లమెంటు ఎన్నికలలో బీసీలకు 33 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని అనేక రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేశారు. ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 1996లో, 2008లో, 2010లో బీసీ రిజర్వేషన్లపై తీర్మానాలు చేశారు. 2014 తర్వాత ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలూ వీటిపై తీర్మానం చేశాయి. చట్ట సభలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టారు. కానీ బీసీలకు కల్పించ లేదు. దేశంలో 2,642 బీసీ కులాలు ఉంటే 2,560 బీసీ కులాలు ఇంతవరకు పార్లమెంటులో ప్రవేశించలేదు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో 14 శాతం కూడా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి బీసీ కులాలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెడితే తప్ప వారికి ప్రజాస్వామిక వాటా లభించదని తేలుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించే రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని 2010లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం అనేక రాష్ట్రాలలో బీసీ రిజర్వే షన్లను 34 శాతం నుండి 22 శాతానికి తగ్గించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాజ్యాంగ సవరణ మాత్రమే. జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. రాజ్యాంగాన్ని సవరించి అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం, బీసీ రిజర్వేషన్లకు ఒక్కసారైనా రాజ్యాంగాన్ని సవరించిందా? పాలనారంగంలో బీసీల ప్రాతినిధ్యం ఇప్పటికీ 15 శాతం దాటడం లేదు. కేంద్రస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో అన్ని కేటగిరీలతో కలిసి బీసీల శాతం 15 మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు తెలుపు తున్నాయి. కేంద్రంలోని 54 లక్షల ఉద్యోగాలలో బీసీలు కేవలం 7 లక్షల 62 వేలు మాత్రమే ఉన్నట్లు తేలింది. మండల్ కమిషన్ సిఫా ర్సుల ప్రకారం 28 సంవత్సరాల క్రితం కేంద్రప్రభుత్వ ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పటికి బీసీలకు 15 శాతం కూడా వాటా లేదు. కాబట్టి ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీల ప్రాతినిధ్యం పెరగదనేది ఇన్నేళ్ల అనుభవం ద్వారా కనిపిస్తున్న నిజం. అలాగే కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయవల సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని 16(4)ఎ ఆర్టికల్ ప్రకారం జనాభా ప్రకారం ప్రాతినిధ్యం లేకపోతే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా పేర్కొన్నారు. జనాభా నిష్పత్తిలో ప్రాతినిధ్యం లేకపోతే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని పలు సందర్భాల్లో కోర్టులూ తీర్పులు చెప్పాయి. ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీలకు న్యాయం జరగదు. కేంద్రస్థాయిలో బీసీల సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. బీసీ రిజర్వేషన్ల అంశంపై అనేక చట్టపరమైన, న్యాయపరమైన వివాదాలు వస్తున్నాయి. అనేక స్కీములను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉంది. కేంద్ర బడ్జెట్ 34 లక్షల కోట్లు కాగా, 70 కోట్ల మంది బీసీల అభివృద్ధికి వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడం చూస్తే ఈ దేశంలో బీసీలను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ బడ్జెట్తో బీసీలకు బిస్కెట్లు కూడా సరిపోవు. ఇక బీసీల అర్థికాభివృద్ధి ఎలా జరుగుతుంది? కేంద్ర స్థాయిలో బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్లు, ఫీజుల మంజూరు, పోటీ పరీక్షలకు కోచింగ్ లాంటి అనేక ఇతర స్కీములు పెట్టవలసిన అవసరం ఉంది. బీసీలను విద్యారంగంలో ప్రోత్సహించి బడ్జెటులో కేటాయింపులు చేయవలసిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములకు 80 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వవలసిన అవసరం ఉంది. స్కాలర్షిప్ మంజూరు, పూర్తి ఫీజుల మంజూరు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠ శాలల ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కేంద్రీయ విద్యా సంస్థలలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఈ రిజర్వేషన్ల కింద సీట్లు పొందినవారు ఫీజులు కట్టే ఆర్థిక స్థోమత లేని వారు. కాగా ఐఐటీ, ఐఐఎం లాంటి కోర్సుల ఫీజులు సంవత్సరానికి రూ. 90 వేల నుండి 1,70,000 వరకు ఉంటున్నాయి. ఇంత పెద్ద మొత్తం ఫీజులను పేద కులాలైన బీసీలు కట్టే పరిస్థితి లేదు. ఇందుకు ఏటా లక్ష కోట్ల రూపా యలను కేంద్ర బడ్జెట్లో కేటాయించాల్సిన ఆవశ్యకత ఉంది. కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శి స్తోంది. ప్రజాస్వామ్యం సుస్థిరంగా, శాంతియుతంగా కొనసాగా లంటే అన్ని సామాజిక వర్గాలకు, వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ సామాజిక రంగాలలో వారి వాటా వారికివ్వాలి. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన డిమాండ్. పీడిత ప్రజానీకం ఎదురు తిరుగుతున్న ప్రపంచ చరిత్రను చూస్తున్నాం. సమన్యాయం పాటించకపోతే ఇక్కడా అదే జరుగుతుంది! ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మొబైల్: 90000 09164 -
బీసీబంధు పథకంపై కేసీఆర్ స్పందించాలి
కవాడిగూడ (హైదరాబాద్): బీసీ కులాలకు బీసీబంధు ప్రవేశపెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగంలోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల ధర్మపోరాట దీక్ష చేపట్టారు. దీక్షను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ యాంత్రీకరణ, కార్పొరేటీకరణ, ఆధునీకరణ ద్వారా వృత్తులు కోల్పోయి అనేక కులాలు రోడ్డునపడ్డాయని, వీటిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంతో ఉపాధిలేక 46 మంది మనోవేదనకు గురై చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. దీక్షలకు మధుయాష్కీ, కోదండరాం, దాసోజు శ్రావణ్, వి.హనుమంతరావు, మాజీ ఎంపీ అజీజ్పాషా సంఘీభావం తెలిపారు. బీసీబంధు ప్రకటించకపోతే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు లాల్కృష్ణ, అరుణ్కుమార్, జనార్దన్, నీల వెంకటేశ్, సత్యనారాయణ, అంజి పాల్గొన్నారు. -
లక్ష మందితో పార్లమెంటును ముట్టడిస్తాం: ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్(హైదరాబాద్): ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో బీసీ సంఘాల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో సోమవారం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని బీసీ, కుల, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 27న బీసీల డిమాండ్లపై లక్షమందితో పార్లమెంట్ను ముట్టడిస్తామన్నారు. ఆదివారం విద్యానగర్లోని బీసీ భవన్లో 48 బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టాలి
రాజమహేంద్రవరం సిటీ (సీటీఆర్ఐ)/పాలకొల్లు అర్బన్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 55 శాతం జనాభా కలిగిన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా అణచివేస్తున్నారన్నారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టడానికి 14 పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. బీజేపీ అంగీకరిస్తే ఒక్క రోజులోనే ఈ బిల్లు పాసవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బీసీ కావడంతో ఆయనపైనే బీసీలు ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. మోదీ హయాంలో ఈ బిల్లు పెట్టకపోతే చరిత్ర ఆయనను క్షమించదన్నారు. లోక్సభలో 94 మంది బీసీ ఎంపీలున్నారని, పార్టీలకతీతంగా వీరందరూ బిల్లుకు మద్దతివ్వాలని, లేకుంటే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 2021–22 జనగణనలో కులాల వారీగా బీసీ జనాభాను లెక్కించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. జాతీయ స్థాయిలో రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని, జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలపై విధించిన షరతులను ఎత్తివేయాలని కోరారు. పంచాయతీరాజ్లో సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని, వీటికి రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానించారు. -
ఈ ఎత్తుగడ కోటా ఎత్తివేతకేనా?
కేంద్ర ప్రభుత్వం తన పరిధి తగ్గించుకుంటూ క్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడానికి నిర్ణయాలు తీసుకుంటోంది. దీని మూలంగా అవి బడా కార్పొరేట్ల అధీనంలోకి వెళ్లిపోతాయి. అలా జరిగితే వాటి ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాల రిజర్వేషన్ల అమలు ఉండదు. అంటే చట్టబద్ధంగా రద్దు చేయకుండానే ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర ఇది. దీని మూలంగా వందల సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న కులాలకు అధికారంలో వాటా దక్కకుండా అన్యాయం చేయడమే అవుతుంది. సామాజిక న్యాయం, సమ సమాజం నెలకొల్పాలనే రాజ్యాంగ లక్ష్యాలను ఇది విస్మరించడమే. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగని పని. కేంద్ర ప్రభుత్వం దశలవారీగా రైల్వే, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, పోస్టల్, బీహెచ్ఈఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడానికి నిర్ణయాలు తీసుకుంటోంది. దీని మూలంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు బడా కార్పొరేట్ దిగ్గజాల అధీనంలోకి వెళ్లిపోతాయి. ప్రభుత్వ రంగ సంస్థల వాటా 51 శాతం అమ్మిన, యాజమాన్య హక్కులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పిన వాటి ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామజిక వర్గాల రిజర్వేషన్ల అమలు ఉండదు. దీని మూలంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన రిజర్వేషన్లకు తిలోదకాలు ఇచ్చినట్లు అవుతుంది. చట్ట బద్ధంగా రద్దు చేయకుండానే ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేయడం అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంలో రెండు కోణాలున్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా తన పరిధిని తగ్గించుకొని బలహీన పరుచుకోవడం. తద్వారా ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. రెండవది, సామాజిక న్యాయా నికి గండికొట్టడం. దీని మూలంగా వందల సంవత్సరాలుగా వివక్ష, అణచివేతల వల్ల అధికారానికి దూరంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు అధికారంలో ఇప్పటికీ వాటా దక్కకుండా అన్యాయం చేయడం. సామాజిక న్యాయం, సమ సమాజం నెలకొల్పాలనే లక్ష్యా లను ఇది విస్మరించడమే. చట్ట ప్రకారం రిజర్వేష న్లను రద్దు చేయ కుండా, దొడ్డి దారిన ప్రైవేటీకరణతో రిజర్వేషన్లు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 245 సంస్థలు ఉన్నాయి. ఇందులో దాదాపు 26 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రైల్వేలో 13 లక్షలు, ఎల్ఐసీలో 2 లక్షలు, బీఎస్ఎన్ఎల్లో 3 లక్షలు, బీహెచ్ఈఎల్లో లక్షా 90 వేలు– ఇలా మొత్తం 26 లక్షల ఉద్యోగాలు పోతాయి. 51 శాతం వాటాలను కార్పొరేట్ సంస్థలకు అమ్మితే ప్రభుత్వం యాజమాన్య హక్కును కోల్పోతుంది. దీనితో ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నియంత్రణ ఉండదు. రిజర్వేషన్ల అమలు ఉండదు. ఇది ఇలా ఉండగా మరోవైపు జాతీయ బ్యాంకులను విలీనం చేసే ప్రక్రియ చేపట్టారు. దీనితో బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యో గాల సంఖ్య తగ్గి రిజర్వేషన్ల కోటా తగ్గిపోతుంది. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా బలంగా ముందుకు వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను పక్కన పెట్టి, ఉన్న రిజర్వేషన్లకే గండికొట్టే కుట్రకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని రంగాల్లో– విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, న్యాయ రంగాల్లో జనాభా ప్రకారం కోటా ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కోటా కల్పించారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో, రాజ్యసభ, కౌన్సిల్, నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం కోటా కల్పిం చలేదు. ఇక బీసీలకు స్వాతంత్య్రం వచ్చిన 36 ఏళ్ల తర్వాత మండల్ కమిషన్ నివేదిక ప్రకారం, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత కేంద్ర విద్యా సంస్థలలో 27 శాతం రిజర్వే షన్లు పాక్షికంగా ప్రవేశ పెట్టారు. జాతీయ స్థాయిలో బీసీల జనాభా 56 శాతం ఉంటే 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీల్లో, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో రిజర్వేషన్లు పెట్టడం లేదు. అనేక సాకులు చూపుతూ దాటవేస్తున్నారు. కానీ రాజ్యాంగంలో లేని అగ్ర కులాల్లోని పేదలకు మాత్రం ఆగమేఘాల మీద రాజ్యాంగ సవరణ చేసి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే ఆటోమేటిగ్గా రిజ ర్వేషన్లు పోతాయి. దీనివల్ల 17 నుంచి 20 లక్షల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉద్యోగాలు కోల్పోతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 14 లక్షల ఉద్యోగాలను కొన్నేళ్లుగా భర్తీ చేయకుండా పెండింగులో పెట్టారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యో గాల్లో 1993 నుంచి మండల్ కమిషన్ ప్రకారం రిజర్వేషన్ల కోటా ప్రారంభించిన తర్వాత ఉద్యోగాల భర్తీ ఆపేశారు. దీంతో రిజర్వేషన్లు ఉన్నా ఆయా వర్గాలకు ఉపయోగం లేకుండా పోయింది. మండల కమిషన్ అమలు తర్వాత ఈ 37 సంవత్సరాల కాలంలో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 2016 నాటికి ఓబీసీ ఉద్యోగులు 14 శాతం దాటలేదు. ప్రత్యేకంగా క్లాస్–1 ఉద్యోగుల్లో ఓబీసీలు 9 శాతం దాటలేదు. సివిల్ సర్వీసులో పూర్తిస్థాయి ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఇటీవల కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఐఏఎస్లో 1657 ఖాళీలు, ఐపీఎస్లో 1420 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఇన్ని ఖాళీలున్నా నాణ్యత తగ్గుతుందనే సాకుతో ఏటా ఐఏఎస్లో 100 లోపు, ఐపీఎస్లో 120 లోపు ఖాళీలు మాత్రమే భర్తీ చేస్తున్నారు. రక్షణ, బ్యాంకింగ్ రంగాల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదు. దీని మూలంగా రిజర్వేషన్ కోటా భర్తీ కాక ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నా మొత్తం ఉద్యోగాల్లో ఇప్పటి వరకూ 12 శాతం దాటలేదు. ఎస్టీలకు 7.5 శాతం అమలు చేస్తున్నా జాతీయ స్థాయిలో 5 శాతం దాటడం లేదని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. కేంద్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 56 లక్షలు కాగా ఇందులో 26 లక్షల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు పోతే, మిగిలేది 30 లక్షల ఉద్యో గాలు మాత్రమే. పెరుగుతున్న జనాభా, బడ్జెట్, సంక్షేమ అభివృద్ధి పథకాలకు తగ్గట్లుగా ఉద్యోగాల సంఖ్య పెరగాలి. ప్రభుత్వరంగ వ్యవ స్థను విస్తరించడం, బలోపేతం చేయడం ప్రజాస్వామ్య లక్షణం. కుదిం చడం, ప్రైవేటీకరించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగదు. ఒకవైపు అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుండగా మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం ‘మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ’ సామెతను గుర్తుతెస్తోంది. ఆర్థికమాంద్యంతో దెబ్బతిన్నందువల్లే ఆర్థిక వనరులు పెంచు కోవడానికి ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు విక్రయిస్తున్నామనే కేంద్ర ప్రభుత్వ వాదన సరికాదు. బడ్జెట్ పెంచుకోవడానికి అనేక మార్గాలు న్నాయి. నగదు ముద్రించడం, డిపాజిట్లు సేకరించడం, విదేశీ రుణాలు తేవడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. ఎన్నికలకు ముందు బీజేపీ దేశ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తెస్తామని ప్రకటించింది. ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు దేశంలో ఉన్న నల«్లధనాన్ని వెలికితీయడానికి అవరోధాలు ఏమిటి? నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. 50 శాతం కేంద్రానికీ, మిగతాది ఆయా వర్గాలకూ ప్రోత్సాహకాల కింద క్రమబద్ధీకరణ చేసుకొమ్మని పిలుపునిస్తే దేశంలోని పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, కాంట్రాక్టు రంగాల నుంచి 60 లక్షల కోట్ల నల్ల ధనం ప్రభుత్వ ఖాతాలో చేరుతుంది. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. ఇలాంటి పథకాలు పెట్టడానికి అవరోధాలు ఏమిటి? ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకోవడం కంటే ప్రభుత్వరంగ ఆస్తులను చౌకగా కార్పొరేటు వర్గాలకు ధారాదత్తం చేయడమే లక్ష్యంగా కనబడుతోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అధికార చట్రంలోకి వస్తున్న సమయంలోనే ఈ సంస్థలను ప్రైవేటీకరించడం, పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉద్యోగ అవకాశాలు లేకుండా పోవడం జరుగుతోంది. 2014లో తాము అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించి ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. కోటి ఉద్యోగాలు దేవుడెరుగు! ఖాళీ ఉద్యోగాల భర్తీయే లేదు. ప్రభుత్వరంగ సంస్థలను కొనసాగించడం, కొత్తవి ప్రారంభించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. అలా చేయకుండా రైల్వేను కూడా ప్రైవేటీకరిం చడం విచిత్రమైన విషయం. రైల్వేకు లక్షల కోట్ల భూములు, భవ నాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. వీటిని చౌక ధరలకు కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం న్యాయమా? ఏటా వేల కోట్ల లాభాలు ఆర్జించే సంస్థ, ఏటా కోట్లమంది పేద ప్రజలకు తక్కువ చార్జీలకు సేవలందిస్తున్న సంస్థను ప్రైవేటీకరించడంలో హేతుబద్ధత ఉందా? 40 కోట్ల మంది పాలసీదారులకు అండగా నిలిచే ఎల్ఐసీని ప్రైవేటు పరం చేయవలసిన అవసరం ఉందా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేలకోట్ల అప్పులు ఆపత్కాలంలో ఇచ్చి ఆదుకున్న సంస్థ అది. లాభాల్లో నడిచేవాటిని ప్రైవేటీకరణ చేయడంలో ఉన్న రహస్య మేమిటో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ప్రజలకు మరిన్ని సేవలు అందించే సామాజిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడం న్యాయమా? అధికారంతో ఏది చేసినా చెల్లు తుందని అనుకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్. కృష్ణయ్య మొబైల్: 90000 09164 -
బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కుట్రలు చేశారు
-
చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదు
-
రాజ్యాంగబద్ధతే ‘రిజర్వేషన్ల’కు రక్షణ
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ విధానాలతో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ రిజర్వేషన్ల గరిష్ట పరిమితిపై ప్రతిసారి న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతున్నాయి. కోర్టులు అడ్డుకుంటున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం చూడవలసిన బాధ్యత అన్ని పార్టీలపై ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. తాజాగా టీడీపీ నేత పిటిషన్ కారణంగా రిజర్వేషన్లను హైకోర్టు మళ్లీ తగ్గించినప్పటికీ వైఎస్ జగన్ స్థానిక ఎన్నికల్లో తన పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పాటించాలని ఆదేశించారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీతోపాటు ఇతర పార్టీలైన, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు కూడా బీసీలకు 34% రిజర్వేషన్లు పాటించి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ/ఎస్టీ/బీసీల రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తీర్పు చెప్పడంతో రిజర్వేషన్ల సమస్య మరోసారి చర్చకు వచ్చింది. ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఆశతో తెలుగుదేశం–ఇతర ప్రతిపక్షాలు చూస్తున్నాయే తప్ప ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరి స్తామని ఆలోచించకుండా రాజకీయంగా ఎలా వాడుకుందామని కుట్రలు చేస్తున్నాయి. కానీ ఈ తీర్పు కొత్తదేమీ కాదు. 1993 మండల్ కేసు – ఇందిరా సహాని వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసు నుంచి కూడా ఇప్పటివరకు దాదాపు 26 కేసులలో ఇదే తీర్పులు వచ్చాయి. సుప్రీం కోర్టు 2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్ణాటక స్టేట్ కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత 2010 నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు 50 శాతంకు తగ్గించాయి. తెలంగాణ ప్రభుత్వం 2019 ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతంకు తగ్గించి ఎన్నికలు జరి పింది. కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ, ఇతర రాష్ట్రాలు తగ్గించినప్పటికీ ఈ వర్గాలకు రిజర్వేషన్లు తగ్గరాదనే ఆలోచనతో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారు. దీనికనుగుణంగా 2019 డిసెంబర్ 28న జీవో నం.176 జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రతాప్ రెడ్డి అనే టీడీపీ నేత సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు సలహా మేరకు దీన్ని విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బీసీ రిజర్వేషన్లను 50 శాతంకు కుదించాలని తీర్పు చెప్పింది. టీడీపీ నాయకుడు ప్రతాప్ రెడ్డి సవాల్ చేయకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అరికట్టగలిగి ఉంటే ఈ పాటికి ఏపీలో 34% రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగేవి. కానీ చంద్రబాబు అలా చేయకుండా ఈరోజు వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేయడాన్ని బీసీలు అసహ్యించుకుంటున్నారు. కాగా, ఈ అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని చంద్రబాబు చేస్తున్న వాదనలో పసలేదు, ఉపయోగం లేదు. ఇంతకు పూర్వం గత ప్రభుత్వాలు చాలాసార్లు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాయి. కానీ ప్రతి కేసులో కూడా సుప్రీంకోర్టు 50 శాతంకి మించి రిజర్వేషన్లు ఉండరాదని తీర్పు చెప్పింది. అలాంటప్పుడు మరలా సుప్రీం కోర్టుకు వెళితే ఈ తీర్పు పునరావృతం అవుతుంది. కాలయాపన తప్ప బీసీలకు ఒరిగేదేమీ ఉండదు. సామాజిక న్యాయం పట్టదా? సుప్రీంకోర్టు, హైకోర్టులు మొదటినుంచి ఎస్సీ/ఎస్టీ/బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయి. ఇలా కోర్టులు తీర్పులు ప్రకటిం చిన ప్రతిసారీ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి ఎస్సీ/ఎస్టీ/బీసీ రిజర్వేషన్లకు రక్షణ కల్పిస్తూ వస్తున్నారు. మొట్టమొదట రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే 1951లో తమిళనాడుకు చెందిన చంపకం దొరై రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు ఈ వర్గాలకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. దీంతో 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ప్రారంభమయింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో సాగిన సామాజిక న్యాయం కేసుల విషయంలో సుప్రీంకోర్టు సరైన విధంగా స్పందించడం లేదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వంపై ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 2010 సుప్రీంకోర్టు తీర్పు రాగానే దేశంలోని స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు అమలులో ఉన్న 25 రాష్ట్రాలలో 24 రాష్ట్రాలలో వెంటనే బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి తగ్గించారు. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న కర్ణాటక, బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ 2013–2014 మధ్యలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18–22 శాతం వరకు తగ్గించారు తప్ప బీసీ రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చట్టాలను తయారు చేయలేదు. కానీ వైఎస్ జగన్ తనకున్న అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికి బీసీ రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయడానికి మరోసారి జీవో నం.176ను జారీ చేశారు. కానీ టీడీపీ నేత చర్య కారణంగా అంతిమంగా ఏపీ హైకోర్టు కూడా ఈ జీవోకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలో ఏముంది...? కేంద్ర ప్రభుత్వం 73–74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయత్ రాజ్ మున్సిపల్ చట్టం తెచ్చింది. ఈ రాజ్యాంగ సవరణలో రాజ్యాం గంలోని ఆర్టికల్ 243( ఈ–6), 243 ( ఖీ–6) ఆర్టికల్స్ పొందుపరిచి బీసీలకు కూడా జనాభా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెట్టాలని, అందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు చేయాలని ఆదేశించింది. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఖరారు చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఇచ్చారు. దీని ప్రకారం 1993లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ బీసీలకు 34 శాతం ఖరారు చేసింది. ఈ శాతమే ఇంతవరకు అమలు చేస్తూ వచ్చారు. 1980 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగిన పలు ఉద్యమాల ప్రభావంతో 1992లో వచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆధారంగా నాటి సీఎం విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 34 శాతానికి పెంచారు. కొత్తగా గ్రామ పంచాయతీలకు 34% రిజర్వేషన్లు పెట్టారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసనసభలకు వదిలిపెట్టడం తప్పితే స్పష్టంగా రాజ్యాం గంలోనే జనాభా ప్రకారం పెట్టాలని పేర్కొనక పోవడంతో ప్రతిసారి న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. దేశంలో ఇంతవరకు ఏ సీఎం కూడా చేయని విధంగా వైఎస్ జగన్ బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ విధానాలతో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీసీలు, దళితులు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవడం లేదు. జగనన్న వసతి దీవెన–విద్యా దీవెన– అమ్మ ఒడి పథకాలు ఎస్సీ/ఎస్టీ/బీసీలలో చదువుల విప్లవం తీసుకొస్తాయి. దీర్ఘకాలంలో ఈ పథకాల వలన ఎస్సీ/ఎస్టీ/బీసీల మౌలిక జీవన విధానంలో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ/ఎస్టీ/బీసీల సమగ్ర అభివృద్ధికి, సాధికారతకు అనేక స్కీములు పెట్టారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవులలో 50 శాతం కోటా కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. అలాగే కాంట్రాక్ట్ వర్క్లలో 50 శాతం కోటా, పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా కల్పించి, ఎస్సీ/ఎస్టీ/బీసీల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశారు. ఇదొక గొప్ప మలుపు. అలాగే గత ఏడాది మార్చి నెలలో వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్ – పార్టీ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుంది. దేశంలోని 70 కోట్ల మంది బీసీలు ఇప్పుడు వైఎస్ జగన్ అభిమానులుగా మారిపోయారు. పరిష్కారం ఏమిటి? రిజర్వేషన్ల గరిష్ట పరిమితిపై ప్రతిసారి న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతున్నాయి. కోర్టులు అడ్డుకుంటున్నాయి. దీనికి శాశ్వత పరి ష్కారం చూడవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉంది. దీంట్లో భాగంగా రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించి రాజ్యాంగంలో 9వ షెడ్యుల్ రిజర్వేషన్లను పెట్టింది. అదే విధంగా ఇప్పుడు అన్ని పార్టీలు చొరవ తీసుకుని రాజ్యాంగ సవరణ చేయాలి. అలాగే రాజ్యాంగ సవరణ ప్రక్రియకు సమయం తీసుకుంటుంది కాబట్టి తాత్కాలిక పరిష్కారంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో బీసీల జనాభా ప్రకారం జనరల్ సీట్లలో బీసీలకు సీట్లు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలి. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ప్రతిపాదనను అన్ని రాజకీయ పార్టీల ముందు పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర ప్రతిపక్షాలు బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆచరణలో ఈ ప్రతిపాదనను అంగీకరించాలి. జనరల్ సీట్లలో బీసీలకు కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. హైకోర్టు రిజర్వేషన్లు తగ్గించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు పాటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఏపీలోని ప్రతిపక్ష పార్టీ టీడీపీతోపాటు ఇతర పార్టీలైన, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు కూడా 34% రిజర్వేషన్లు పాటించి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. వ్యాసకర్త: ఆర్. కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మొబైల్ : 90000 09164 -
సీఎం జగన్ నిర్ణయం పై బీసీల హర్షం
-
కేసు వేయించింది చంద్రబాబే
-
చంద్రబాబుకు బీసీలపై ఉన్నది కపటప్రేమ
-
‘బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంది ఆయనే’
సాక్షి, విజయవాడ: బీసీలకు పార్టీపరంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీసీ ముఖ్యమంత్రులు చేయలేని పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారని అభినందించారు. బీసీలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వలన వేలల్లో పదవులు బీసీలకు వస్తాయని తెలిపారు. (బీసీలకు 34 శాతం సీట్లు ఇస్తున్నాం) స్థానిక ఎన్నికల్లో బీసీలు బుద్ధి చెబుతారు.. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నారని విమర్శించారు. చంద్రబాబు బీసీ వ్యతిరేకి అని ఆయన మండిపడ్డారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అడ్డుకుంది చంద్రబాబేనని.. ఆయనే సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించారని మండిపడ్డారు. రిజర్వేషన్లు అడ్డుకున్న టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెబుతారని కృష్ణయ్య పేర్కొన్నారు.(బీసీలకు 10 % అదనం) -
చంద్రబాబు బీసీ ద్రోహి
-
ఏపీ: బీసీలకు సాధికారత
సాక్షి, అమరావతి: ‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని టీడీపీ కుట్రపూరితంగా అడ్డుకుంటే వెనుకంజ వేస్తామా! సాంకేతిక కారణాలతో బీసీలకు తగినంత రిజర్వేషన్లు ఇవ్వడం కుదరకపోతే మిన్నకుండిపోతామా?.. కానే కాదు.. వైఎస్సార్సీపీ తరఫున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తాం. బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని అందిస్తాం..’ అని సీఎం వైఎస్ జగన్ ప్రకటించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలో తొలి నాయకుడు.. బీసీల సాధికారత, సామాజిక న్యాయం దిశగా సత్వరం స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను దేశవ్యాప్తంగా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను టీడీపీ న్యాయ వివాదాలతో అడ్డుకున్నా సీఎం జగన్ వెనుకంజ వేయకుండా, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ పరంగా వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం సీట్లు ఇస్తామని వెంటనే నిర్ణయం తీసుకున్నారని బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. దేశంలో ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న తొలి నాయకుడు సీఎం జగన్ అని పేర్కొంటున్నాయి. దేశంలోని అన్ని పార్టీలూ ఇదే విధానాన్ని అనుసరిస్తే సామాజిక న్యాయం సాకారమవుతుందని సూచిస్తున్నాయి. బీసీలను వంచిస్తూ కపట నాటకాలాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరోసారి కోలుకోలేని గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయం క్షేత్రస్థాయి నుంచి రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం నుంచి దామాషా ప్రకారం రాజకీయ అధికారాన్ని కోరుతున్న బీసీ వర్గాలు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. బీసీల పక్షపాతి వైఎస్ జగన్ బీసీలను ఓటుబ్యాంకుగా వాడుకున్న నేతలనే ఇన్నాళ్లూ చూశాం. బీసీల అభ్యున్నతిపై చిత్తశుద్ధితో వ్యవహరించిన నేతను ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలో మాత్రమే చూశామని బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బీసీల సంక్షేమం, రాజ్యాధికారం దిశగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వర్గాలకు 34 శాతం సీట్లు రిజర్వు చేసేందుకు వీలుగా మొత్తం రిజర్వేషన్లను 59.85 శాతంగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లోనే జీవో 176 జారీ చేయడం తెలిసిందే. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ నిరీక్షణ ఫలించిందని బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఆ జీవోను వ్యతిరేకిస్తూ టీడీపీ నేత కోర్టును ఆశ్రయించడం, 59.85 శాతం రిజర్వేషన్లను న్యాయస్థానం కొట్టివేయడంతో బీసీ వర్గాలు తీవ్ర నిస్పృహకు గురయ్యాయి. సత్వరమే స్పందించారు.. న్యాయస్థానం ఉత్తర్వుల కారణంగా బీసీలకు చట్టప్రకారం 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఇలాంటి స్థితిలో మరో నేత ఎవరైనా అధికారంలో ఉంటే సాంకేతిక, న్యాయపరమైన అంశాలను సాకుగా చూపించి బీసీలకు రిజర్వేషన్లను తగ్గించేవారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీల అభ్యున్నతిపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. న్యాయపరమైన అంశాల కారణంగా బీసీలకు చట్టప్రకారం 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నందున పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. అద్భుత నిర్ణయం రిజర్వేషన్లపై కోర్టు కేసులతో కాలయాపన చేయాలన్న టీడీపీ ఎత్తుగడలకు లొంగకుండా ముఖ్యమంత్రి జగన్ పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు ప్రకటించడం అద్భుత నిర్ణయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసించారు. బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ద్వారా గతంలోనే రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడం బీసీలపట్ల సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. చంద్రబాబు టీడీపీ నేత బిర్రు ప్రతాపరెడ్డితో కోర్టులో కేసు వేయించి ఆ జీవోను అడ్డుకున్నారని విమర్శించారు. మళ్లీ బీసీలను మోసగించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి డ్రామాకు తెర తీశారని దుయ్యబట్టారు. అయితే ముఖ్యమంత్రి జగన్ ఏమాత్రం కాలయాపన చేయకుండా పార్టీపరంగా 34 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించడం ద్వారా బీసీలకు తగిన న్యాయం చేశారని చెప్పారు. చిత్తశుద్ధితో అధిగమించిన సీఎం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రవచించిన స్ఫూర్తిని సీఎం వైఎస్ జగన్ ఆచరణలో చూపించారని విశ్లేషకులు కొనియాడుతున్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తూ బీసీలకు తగినన్ని సీట్లు కేటాయించడం లేదని, చిత్తశుద్ధితో దీన్ని అధిగమించవచ్చని సీఎం వైఎస్ జగన్ నిరూపించారని ప్రశంసిస్తున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసేవరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న విధాన నిర్ణయాన్ని దేశంలోని ఇతర నేతలు కూడా అనుసరించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ‘పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. ఎన్నికల కోసం రాజకీయ డ్రామాలాడటం వైఎస్సార్సీపీ విధానం కాదు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని వైఎస్సార్సీపీ ఇప్పటికే రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీల తరపున ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఇదే రీతిలో పార్లమెంట్లో రాజ్యాంగ సవరణకు కూడా కృషి చేయాలని కోరుతున్నా’ తొలి సీఎం జగన్.. – జస్టిస్ ఈశ్వరయ్య, అఖిల భారత బీసీ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు ‘సామాజిక న్యాయ సాధనలో ముఖ్యమంత్రి జగన్ చుక్కానిలా నిలిచారు. దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలని నిర్ణయించిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే. దేశంలో మరే సీఎంగానీ, పార్టీ అధ్యక్షుడుగానీ ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి జగన్ను చొరవను అభినందిస్తున్నాం’ దేశానికి ఆదర్శం.. – హనుమంతు లజపతిరాయ్, మాజీ వీసీ, అంబ్కేడర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం ‘పార్టీపరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం దేశానికి ఆదర్శప్రాయం. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు దీన్ని అనుసరిస్తే సామాజిక న్యాయం సాధ్యపడుతుంది’ బీసీ గర్జన హామీ చిత్తశుద్ధితో అమలు.. జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని పదవుల్లోనూ పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన ‘బీసీ గర్జన’లో ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఇతర పార్టీల కంటే అత్యధికంగా బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. ఎన్నికల ముందు దక్కిన ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవిని బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గంలో బీసీలకు అగ్రస్థానం కట్టబెట్టారు. బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, బీసీ ‘ఈ’ కేటగిరీకి చెందిన మైనార్టీ నేత అంజాద్ బాషను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. కీలకమైన రెవెన్యూ, పురపాలక, జలవనరులు, రోడ్లు–భవనాలు, మార్కెటింగ్, కార్మిక, మైనార్టీ, బీసీ సంక్షేమ శాఖలను వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. స్పీకర్ పదవికి బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా కృషి చేశారు. తాజాగా క్షేత్రస్థాయి నుంచి రాజ్యాధికారాన్ని అందించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. రుణపడి ఉంటాం.. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో బీసీ కులాలకు ఎంతో మేలు జరుగుతుంది. టీడీపీ హామీ ఇచ్చి మోసం చేస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకుని అండగా నిలుస్తోంది. బీసీలంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారు. – గదుల వెంకట్రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, విజయనగరం బీసీలకు సముచిత స్థానం బీసీలకు రాజ్యాధికారం దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గ కూర్పు, బడ్జెట్, సీట్ల కేటాయింపులో బీసీలకు సముచిత స్థానం కల్పించి గత 30 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా అమలు చేస్తున్నారు. అద్భుతమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు – మహంతి శ్రీరవి, తూర్పుకాపు అభినందనీయం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అదనంగా 10 శాతం సీట్లు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపు, మంత్రివర్గంలో చోటుతోపాటు నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత సీఎంకే దక్కుతుంది. – శంకరయ్య, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యాయం జరుగుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. పార్టీ తరపున 10 శాతం అదనంగా సీట్లు కేటాయించడం అభినందనీయం. రాజ్యాంగబద్ధంగా అదనపు రిజర్వేషన్లు పొందలేని బీసీలకు దీనివల్ల న్యాయం జరుగుతుంది. – అనుమోలు చుక్కయ్య, బీసీ సంఘం కృష్ణా జిల్లా మాజీ అధ్యక్షుడు బీసీ వ్యతిరేక శక్తులకు చెంపపెట్టు.. బీసీ వ్యతిరేక శక్తులకు చెంపపెట్టులా బలహీన వర్గాలకు అదనంగా 10 శాతం సీట్లు వైఎస్సార్సీపీ తరపున ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించడం అభినందనీయం. బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసేందుకు దోహదపడుతుంది. – కోలా అశోక్, కృష్ణబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట నిలబెట్టుకున్నారు బీసీలకు ఇచ్చిన మాటను జగనన్న నిలబెట్టుకున్నారు. బీసీలను ఎదగనివ్వకుండా కుయుక్తులు పన్నుతున్న టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. కోర్టు తీర్పుతో రిజర్వేషన్లు తగ్గినప్పటికీ వైఎస్సార్సీపీ పరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు పది శాతం అదనంగా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప విషయం. – ప్రకాష్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక చరిత్రాత్మక నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున బీసీలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. బీసీలు సీఎంకు రుణపడి ఉంటారు. గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి. బీసీలకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. – లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం మహిళలకు అవకాశం బీసీలకు సీట్లు పెరగడం వల్ల ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన గృహిణులు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం. – మానేపల్లి వీరేష్, స్వర్ణకారుడు, అమలాపురం బాబుది కాటు తంత్రం .. జగన్ది సామాజిక మంత్రం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు పన్నిన కుట్రలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థంగా తిప్పికొట్టారని బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బలహీన వర్గాలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామంటే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంటని ప్రశ్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో గుణపాఠం నేర్పినా బుద్ధి మారని టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదని స్పష్టం చేస్తున్నాయి. -
వ్యవస్థలో మార్పునకు సీఎం శ్రీకారం
-
సీఎం జగన్ మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిచడం చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం నిర్ణయించిన 34 శాతానికి బదులుగా.. బీసీలకు 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం సీట్లు పార్టీ తరుపున ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. టీడీపీ కోర్టుకు వెళ్లి అడ్డుకున్న 10 శాతం పదవులను పార్టీ బీ ఫామ్ల ద్వారా అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు మొత్తం 34 శాతం రిజర్వేషన్లు పొందనున్నారు. (రిజర్వేషన్లు 50% మించొద్దు) ఈ మేరకు పార్టీ నిర్ణయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ నేతలతో కలిసి శనివారం వెల్లడించారు. సీఎం జగన్ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న ప్రభుత్వం జీవో 176ను జారీ చేసిన విషయం తెలిసిందే. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీడీపీ నేత బిర్రు ప్రతాప్రెడ్డి, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. (ఏపీ జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారు) ఆయా వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను చట్ట విరుద్ధమని ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అలా జరగడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. టీడీపీ నేతల కుట్ర కారణంగా బీసీలు తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలోనే వెనుకబడిన బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలని సుధీర్ఘ ఆలోచన చేసిన సీఎం జగన్.. పార్టీ నుంచి అదనంగా 10శాతం సీట్లును బీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ముందే సంకల్పించిన విధంగా బీసీలకు మొత్తం 34శాతం రిజర్వేషన్లు అమలుకానున్నాయి. -
కరోనా వచ్చింది రాష్ట్రానికి కాదు.. టీడీపీకి‘
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమని సవాల్ చేసిన చంద్రబాబు ఎందుకు మాట మార్చుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా ముందు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీని చిత్తుగా ఓడించమని ప్రజలకు పిలుపునిచ్చిన చంద్రబాబు ఎందుకు ఓడించాలో కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మ ఒడి, రైతు భరోసా వంటి కార్యక్రమాలు అమలు చేసినందుకు వైఎస్సార్సీని ఒడించాలా.. బడుగు, బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు ఓడించాలా అని జోగి రమేష్ చంద్రబాబును ప్రశ్నించారు. (స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల) చంద్రబాబును ప్రజలు ఓడించిన సిగ్గు లేకుండా మళ్లీ మీడియా ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెబుతున్నారని ఆయన విమర్శించారు. కరోనా వైరస్ రాష్ట్రానికి రాలేదని, టీడీపీకి వచ్చిందని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందని, అభ్యర్థులు దొరికిన డిపాజిట్లు రాని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ పక్షాన ఉన్నారన్నారు. (‘ఏ క్షణంలో ఎన్నికలైనా మేము సిద్ధం’) గత ఎన్నికల్లో చంద్రబాబు అనే శనిని బీసీలు వదిలించుకున్నారని జంగా కృష్ణమూర్తి దుయ్యబట్టారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆయన నిజ స్వరూపం బీసీలు తెలుసుకున్నారని అన్నారు. బాబు బీసీల ద్రోహి అని, బీసీలకు మూడవ వంతు నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పదివేల కోట్లు ఇస్తానని చెప్పి, బీసీ కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టాడని మండిపడ్డారు. చంద్రబాబు బీసీ డిక్లరేషన్లో పెట్టిన ఒక్క హామీ అయినా నెరవేర్చరా అని నిలదీశారు. 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వలేదని చంద్రబాబే సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారని గుర్తు చేశారు. బీసీలకు సీఎం జగన్ అండగా ఉన్నారన్న దురుద్ధేశంతోనే బీసీ రిజర్వేషన్లు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిది అని ప్రశంసించారు. (ఎప్పటికైనా ఆ ఒక్కడినే అనుమతిస్తా: కరీనా) -
చంద్రబాబుకు మల్లాది విష్ణు సవాల్..
సాక్షి, విజయవాడ : చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అందుకే ఎన్నికలు ఆపాలని కుట్రలు పన్నుతున్నారని ఆయనమండిపడ్డారు. ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు గురుంచి ఇన్నాళ్లు మాట్లాడని చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికలు జరిపాలని చూస్తుంటే, స్టేల కోసం టీడీపీ నాయకులు యత్నిస్తున్నారని మండిపడ్డారు.బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు కోల్పోయారన్నారు. (‘బీసీల పట్ల ప్రేమ అంటూనే కోర్టుకు వెళ్తారా..’) అధికారంలో ఉండగా చంద్రబాబు బీసీలకు చేసిందేమి లేదని, గడిచిన ఎన్నికల్లో బీసీలు వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని మల్లాది విష్ణు గుర్తు చేశారు. టీడీపీ నాయకులు ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం కనుచూపు మేరలో కూడా కనిపించదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే లోకేష్ ఏడుపు గొట్టు మాటలు మాట్లాడుతున్నారని, అధికారం కోల్పోయారని తండ్రి కొడుకు కడుపు మంటతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. ఎన్నికల హామీలు 90 శాతం అమలు చేశామని తెలిపారు. (టీడీపీకి మరోసారి బుద్ధి చెప్పాలి: మంత్రి బొత్స) ‘‘బీసీలకు ఎవరు మేలు చేశారో చర్చిదాం. మీరు సిద్దమేనా...? గత ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. కులాల మతాల ప్రస్తావనతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ పారదర్శకంగా పాలన సాగిస్తున్నారు. సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసేలా చర్యలు చేపట్టారు. ఒక్కరోజులోనే 95 శాతం పింఛన్లు పంపిణీ చేసిన ఘనత మాది. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి చంద్రబాబు. విద్య, వైద్య రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలని సీఎం చూస్తున్నారు. బోండా ఉమా నిరాశలో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని విమర్శించారు. విడతల వారిగా మద్యం నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. చిత్తశుద్ధి,నిజాయితీ ఉంటే మీ అయిదు సంవత్సరాల పాలనపై, మా తొమ్మిది నెలల పాలపై చర్చకు సిద్దమా...?’’ అంటూ చంద్రబాబుకు మల్లాది విష్ణు సవాల్ విసిరారు. -
చంద్రబాబుపై భగ్గుమన్న బీసీలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: కుట్రపూరితంగా కేసులు వేయించి తమ రిజర్వేషన్లను అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్రవ్యాప్తంగా బీసీలు భగ్గుమన్నారు. మేమంటే ఇంత ద్వేషమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు రాకుండా తీరని ద్రోహం చేసిన టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామంటూ గురువారం వాడవాడలా కదం తొక్కారు. ఎక్కడికక్కడ చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసి.. తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ర్యాలీలు, ధర్నాలకు దిగి చంద్రబాబు దుర్బుద్ధిని ఎండగట్టారు. టీడీపీ నేతల నిర్వాకం వల్ల రిజర్వేషన్లు కోల్పోయామని మండిపడుతూ శ్రీకాకుళంలో బీసీ వర్గాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఫైర్స్టేషన్ సెంటర్ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తమకు మంచి చేసేందుకు అదనంగా రిజర్వేషన్లు తీసుకొస్తే.. అడ్డుకుంటారా అంటూ టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో చంద్రబాబు, టీడీపీ నేతల ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున తగలబెట్టారు. వారి చిత్రపటాలకు చెప్పుల దండ వేసి ఊరేగించారు. టీడీపీ నేత బిర్రు ప్రతాప్తో కేసులు వేయించడం ద్వారా చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఓటు బ్యాంకుగా చూస్తున్న టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రకాశం, నెల్లూరు జిల్లాల బీసీ విద్యార్థులు, నాయకులు పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చంద్రబాబు నిర్వాకంతో బీసీలు 15 వేలకు పైగా పదవులను కోల్పోవాల్సి వస్తోందని కర్నూలు జిల్లా బీసీ సంఘాల నాయకులు వాపోయారు. టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేస్తామని అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన బీసీలు, విద్యార్థులు ప్రతినబూనారు. ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల కేంద్రాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలను ఉరి తీసి తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. తమను ఆర్థికంగా, రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్న చంద్రబాబుకు తమ సత్తా ఏంటో స్థానిక ఎన్నికల్లో చూపిస్తామంటూ వైఎస్సార్ జిల్లా బీసీలు, ప్రజలు హెచ్చరించారు. (చదవండి: బీసీల కోటాపై టీడీపీ ఆట) -
టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధం
-
‘బీసీలపై సవతి ప్రేమ చూపిస్తున్నారు’
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీలను 35 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారని నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం బీసీలను వాడుకుని వదిలేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలో మంత్రి మాట్లాడుతూ.. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు నైజమని వ్యాఖ్యానించారు. కుళ్లు, కుతంత్రాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీ కమిషన్ వేస్తానని మోసం చేశారని పేర్కొన్నారు. (చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం..) నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని మంత్రి ప్రశంసించారు. కేబినెట్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ బీసీలకు శాశ్వత ప్రాతిపదికన కమిషన్ ఏర్పాటు చేశారని, స్థానిక ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు నష్టపోతామని తెలిపారు. (డ్రామాలొద్దు బాబూ) ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు 59 శాతం రిజర్వేషన్ ఇస్తామంటే అడ్డుపడుతున్నారని, బిర్రు ప్రతాప్రెడ్డి అనే వ్యక్తితో హైకోర్టులో పిషన్ వేయించారని మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. ప్రతాప్రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు ప్రభుత్వంలో పదవి పొందిన వ్యక్తి అని, బీసీలపై ప్రేమ ఉంది అంటూనే కోర్టులో పిటిషన్లు వేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు గుంటనక్కలా మాట్లాడుతున్నారని, బీసీలపై సవితి ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2018లో బాబు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్లను వేశారని, సమయంలో చంద్రబాబు కోర్టుకు 2013 వరకు మాత్రమే పెంచిన రిజర్వేషన్లు పరిమితమని చెప్పారన్నారు. (బడుగుల ద్రోహి చంద్రబాబు) చదవండి : ఈయన వైఎస్సార్సీపీ నాయకుడట! బాబు వల్లే సీట్ల కోత -
బీసీ సీట్లలో కోత
-
బాబు వల్లే సీట్ల కోత
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకు కారణమైన బీసీలను చంద్రబాబు నిలువునా మోసం చేశారు. మాటల్లో మాత్రం వారిపై కపట ప్రేమను కురిపిస్తూ ‘స్థానిక’ ఎన్నికలలో వారికి దక్కాల్సిన పదవులకు భారీగా గండికొట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటే.. దానిని తప్పుపడుతూ టీడీపీ నేతలతో సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసులు వేయించారు. ఆ కేసుల కారణంగా హైకోర్టు ఆదేశాలను అనుసరించి బీసీలకు రిజర్వేషన్లు తగ్గే పరిస్థితి వస్తే.. తగ్గించడానికి వీలు లేదు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిందేనంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది చంద్రబాబేనని బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ధైర్యంతో ఆంధ్రప్రదేశ్లో 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు కొత్త జీవో తీసుకొచ్చారు. కానీ.. టీడీపీ కుతంత్రం వల్ల బీసీలకు రిజర్వేషన్లు తగ్గిపోయాయి’ అని బీసీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తక్షణమే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది జనవరి 8వ తేదీన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వెలువడిన రెండు రోజులకు హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి కేసు వేసింది టీడీపీ నేత బిర్రు ప్రతాప్రెడ్డి. ఇప్పుడు టీడీపీ నేతలందరూ ప్రతాప్రెడ్డికి, టీడీపీకి ఏమీ సంబంధం లేదని వక్రభాష్యం చెబుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. సరిగ్గా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అదే వ్యక్తిని రాష్ట్ర ఉపాధి హామీ పథకం కౌన్సిల్ సభ్యుడిగా నియమిస్తూ 2019 మార్చి 9వ తేదీన అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిసారీ బీసీలకు అన్యాయమే రాష్ట్రానికి చెందిన న్యాయవాదులు అమరనాథ్ గౌడ్, అభినవ్కుమార్ చావలి, గంగారావు, డీవీ సోమయాజులు, విజయలక్ష్మి, కేశవరావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీం కోర్టు జడ్జిల కొలీజయం కేంద్రానికి సిఫార్సు చేస్తూ.. ఆ ఆరుగురు న్యాయవాదులపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబును కేంద్ర న్యాయ శాఖ కోరింది. బీసీ వర్గాలకు చెందిన అమర్నాథ్గౌడ్, అభినవ్కుమార్ చావలి, ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన డీవీ సోమయాజులుకు విషయ పరిజ్ఞానం, వ్యక్తిత్వం లేవని, వారు సచ్ఛీలురు కారంటూ మార్చి 21, 2017న సీఎం చంద్రబాబు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు లేఖ రాశారు. దేవదాయ శాఖ అధీనంలో ఉండే పలు ఆలయాల వద్ద క్షౌ రవృత్తి చేసే నాయీబ్రాహ్మణులు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర సచివాలయం వరకూ వెళ్లి తమకు గౌరవ వేతనం చెల్లించాలని అడిగితే ‘మీ తోక కత్తిరిస్తాం’ అంటూ అవమానించారు. ఎస్సీ, ఎస్టీలన్నా చులకనే.. ఎస్సీ, ఎస్టీలన్నా చంద్రబాబుకు చులకనే అని పలు ఘటనలు నిరూపించాయి. 2016 ఫిబ్రవరి 8వ తేదీన చంద్రబాబు విలేకరుల సమావేశంలో ‘ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు. అందరూ సంపన్ను వర్గాలోనే పుట్టాలనుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలు ఏలవచ్చనుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికొచ్చే నిధులకూ మోకాలడ్డు గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా రావాల్సిన రూ.3,710.46 కోట్ల నిధులకు ప్రతిపక్ష నేత చంద్రబాబు మోకాలడ్డుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపితే గానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఈ నిధులను విడుదల చేయదు. సర్పంచుల పదవీ కాలం 2018లో ముగిసినా అప్పట్లో సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా టీడీపీ అధికారంలో ఉన్న 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు విడుదల చేయాల్సిన రూ.1,089.33 కోట్లను కేంద్రం నిలిపివేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో గ్రామాలకు ఇవ్వాల్సిన రూ.2,622.13 కోట్లను కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఈ మొత్తం నిధులు రూ.3,710 కోట్లను మున్సిపాలిటీలకు విడుదల చేయాల్సిన నిధులతో కలుపుకుంటే ప్రస్తుతానికి రూ.5,000 కోట్లు వరకు మార్చి నెలాఖరులోగా విడుదల చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరులోగా నిధులు విడుదల కాకుంటే.. ఆ మొత్తం మురిగిపోయే పరిస్థితి ఉంది. 14వ ఆర్థిక సంఘం కాల పరిమితి ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగియనుంది. ఆ తర్వాత 14 ఆర్థిక సంఘం నిధుల విడుదల పూర్తిగా కేంద్రం దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించటం ద్వారా గ్రామాలకు, మున్సిపాలిటీలకు సంబంధిత నిధులు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయగా.. టీడీపీకి అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులతో కోర్టులలో కేసులు వేయించి ఎన్నికల జరక్కుండా అడ్డుపడ్డుతున్నారు. బీసీల కోసం వైఎస్ జగన్ ధైర్యం చేసి జీవో తెస్తే.. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 34 శాతం రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ధైర్యంతో 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు కొత్త జీవో తీసుకొచ్చారు. కానీ, ఆ జీవోపై టీడీపీ నేత సుప్రీంకోర్టులో వేసిన కేసు కారణంగానే ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయి. కోర్టు వెళ్లకపోతే బీసీల రిజర్వేషన్లు తగ్గేవి కాదు. భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోలేని నిర్ణయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకుంటే.. టీడీపీ వాళ్లు దానిని అమలు కాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు తగ్గకూడదంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేయడం ఒక్కటే మార్గం. దానికి కొంత సమయం పడుతుంది. ఇదిలా ఉంటే జనాభా ప్రతిపాదికన బీసీలకు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టింది కూడా జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ఒక్కటే. పార్లమెంట్లో బీసీలకు పెద్దపీట వేసేది తామేనని చెప్పుకునే చాలా పార్టీలున్నా, అవి కూడా చేయని పని జగన్మోహన్రెడ్డి చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు జగన్మోహన్రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి. – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు టీడీపీ నేతల్లో అసంతృప్తి 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో కేసు దాఖలు చేసిన బిర్రు ప్రతాప్రెడ్డి టీడీపీ నాయకుడనే విషయం బహిర్గతమవడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ నేతలు రకరకాల ప్రచారాలకు తెరలేపారు. చంద్రబాబు కావాలని వ్యూహాత్మకంగా ఇదంతా చేయించినట్లు బట్టబయలు కావడంతో టీడీపీలోని బీసీ నాయకులు, బీసీ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పంచాయతీరాజ్ చాంబర్, సర్పంచ్ల సంఘం, ఎంపీటీసీల సంఘాలు నడిపిన టీడీపీ నాయకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ అనుచరుడిగా ప్రతాప్రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తి. అతనితో కోర్టులో కేసు వేయించి ముందుకు నడిపించింది టీడీపీ లీగల్ సెల్లోని ముఖ్య నాయకులనే విషయం బహిరంగ రహస్యమే. టీడీపీ కార్యాలయంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో ప్రతాప్రెడ్డి పాల్గొనేవారు. అతనికి ఉపాధి హామీ పథకం డైరెక్టర్ పదవి ఇచ్చింది కూడా చంద్రబాబే. తమ పార్టీకి చెందిన వ్యక్తి, తనతో తిరిగిన అనుచరుడినే తమ వాడు కాదని చెప్పాల్సి రావడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ప్రతాప్రెడ్డి తమ నాయకుడు కాదని చెప్పక తప్పడం లేదని పలువురు టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం..
సాక్షి, మచిలీపట్నం: బీసీలు టీడీపీకి పట్టుగొమ్మ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు వారికి చేసిందేమీ లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవో తీసుకొచ్చారన్నారు. ఈ తరుణంలో తన మనుషులతో హైకోర్టులో పిటిషన్ వేయించి చంద్రబాబు మోకాలొడ్డారని ధ్వజమెత్తారు. సోమవారం పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అధ్యక్షతన జరిగిన మల్లేశ్వరం మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన చంద్రబాబు ద్వంద్వ నీతిపై మండిపడ్డారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్దే అన్నారు. చంద్రబాబుకు గుణపాఠం నేర్పాలి: బాబు నిర్వాకం వల్ల రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సోమవారం హైకోర్టు తీర్పు నివ్వడంతో ఆ మేరకు బీసీల రిజర్వేషన్లు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెలలోనే 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళతామని చెప్పారు. వరుసగా నెల రోజుల్లో çపరిషత్, పంచాయతీ, మున్సిపాల్టీ, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లోనూ గుణపాఠం నేర్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్కెట్ కమిటీలు గత పభుత్వ హయాంలో ఉత్సవ విగ్రహాలుగా ఉండేవన్నారు. -
బీసీ జనగణన ఎప్పుడు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాల అభివృద్ధికి విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు.. ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధికై అనేక స్కీములు అమలు జరుపుతున్నాయి. అలాగే రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నాయి. కానీ బీసీ జనాభాకు చెందిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. బీసీ జనాభా లెక్కలు లేని కారణంగానే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. జనాభా లెక్కలు సమగ్రంగా లేనందువలన రిజర్వేషన్లను ఎంత శాతం నిర్ణయించాలనే అంశంపై మొదటినుంచి బీసీ కమిషన్లు ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జనాభా గణనలో బీసీ కులాల వారీగా లెక్కలు తీసే విధంగా తగు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం కులాల ప్రాతిపదికన ఎస్సీ/ఎస్టీ/బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, అభివృద్ధి పథకాలు పెట్టాలని నిర్దేశించింది. ఇందులో భాగంగా ఎస్సీ/ఎస్టీ/మైనార్టీ సామాజిక వర్గాల పేరుమీద జనాభా గణన మొదటి నుంచి తీస్తున్నారు. అలాగే లింగ విభజన పేరుమీద మహిళా–పురుష జనాభా గణన ఉంది. కానీ బీసీ కులాల జనాభా వివరాలు కావాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నా, ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా, హైకోర్టు–సుప్రీంకోర్టులు ఆదేశిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఒక బీసీ కులాల కాలమ్ పెట్టడానికి ముందుకు రావడం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2021లో భారతదేశ జనగణన చేపట్టడానికి విడుదల చేసిన నమూనా పట్టికలో వివరాల కోసం 32 కాలమ్స్ నమూనా పత్రం విడుదల చేశారు. కేంద్రప్రభుత్వం హోంశాఖ ద్వారా జారీ చేసిన నమూనా పత్రంలో ఎస్సీ/ఎస్టీల వివరాలు కాలం, అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాల వివరాలు ఇతర వివరాలకు సంబంధించిన కాలమ్స్ నమూనా పత్రాన్ని జారీ చేశారు. కానీ ఈ జనాభా లెక్కల పట్టికలో బీసీ కులాల వివరాలకు సంబంధించిన కాలమ్ పెట్టలేదు. బీసీ జనాభా లెక్కల వివరాలు సేకరించవలసిన ఆవశ్యకత ఉంది. విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల కేటాయింపు–పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీసీ జనాభా లెక్కల వివరాలు అవసరం అవుతున్నాయి. జనాభా లెక్కలు లేనందున సుప్రీంకోర్టు–హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. ఏయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లను బీసీలకు కేటాయించాలి, ఎంత శాతం కేటాయించాలనే విషయంలో బీసీ జనాభా లెక్కలు లేక, న్యాయపరమైన చట్టపరమైన కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి జస్టిస్ రోహిణి నేతృత్వంలో కమిటీని నియమించింది. బీసీ కులాలవారీగా జనాభా లెక్కలు లేకపోవడంతో ఈ కమిటీ వర్గీకరణ చేసి ఏయే గ్రూపుకు ఎంత శాతం రిజర్వేషన్లు నిర్ణయించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వ స్పందన ఏమిటి? 1931లో అంటే 90 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు తీయడానికి ఊగిసలాడుతూ వచ్చింది. బీసీ సంక్షేమ సంఘం అనేక వీధి పోరాటాలు న్యాయపోరాటాలు చేసిన తర్వాత స్పందించి 2010లో కులాల వారీ లెక్కలు తీయడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే అప్పటికే జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమైంది. దీనితో ప్రత్యేకంగా బీసీ జనాభా లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 8 వేల కోట్లు కేటాయించి కులాల వారీ జనాభా లెక్కల్ని ప్రత్యేకంగా తీశారు. ఈ లెక్కలతో సమగ్ర పట్టిక తయారు చేయడానికి మాజీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్తో ఒక కమిటీ వేశారు. కానీ ఆ తర్వాత వాటి వివరాలు, జనాభా సంఖ్య ఇంతవరకు ప్రకటించలేదు. గతంలో అంటే 2010లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా బీసీ జనాభా కులాల వారిగా లెక్కలు తీయాలని భారతీయ జనతాపార్టీ పార్లమెంటులో డిమాండ్ చేసింది. బీజేపీ కోరినం దుకే అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కులాల వారీగా లెక్కలు తీయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. కావున కులాలు వారీ లెక్కలు తీయవలసిన బాధ్యత అవసరం–ఆవశ్యకత ఉంది. పైగా దీనికి ప్రత్యేక బడ్జెట్ అవసరం లేదు. ఒక రూపాయి ఖర్చు లేకుండా జనాభా లెక్కలు వస్తాయి. 01.08.2018 నాడు అప్పటి హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో జరిపిన హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో జనాభా గణనలో బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ రెండవ సారి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ఎందుకు మార్పు వచ్చింది?. జనాభా లెక్కలు తీస్తే తరాలుగా అణచివేతకు గురైన కులాలు తామే అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిస్తే వారు తిరగబడి.. దేశవనరుల్లో, అధికారంలో తమ వాటా తమకు ఇవ్వాలని అడుగుతారేమోనని పాలకవర్గాలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అంతే కాదు.. వేల సంవత్సరాలు తమ అగ్రకులాలకు సేవలు చేస్తున్న ఊడ్చేపని, స్కావెంజర్ పని, వంట చేసే పని, బట్టలుతికే వారు, హెయిర్ కటింగ్ చేసే వారు ఇలా ఇంటి పని, పొలం పనులు చేసే వారు దొరకరని భయపడి జనాభా లెక్కలు తీయడం లేదా!! అలాగే ఇన్ని రోజులు తమ కాళ్ళ కాడ పడి ఉన్న ఈ పేద కులాల వారికి అధికారంలో వాటా ఇస్తే వీరు కలెక్టర్, ఆఫీసర్, ఎమ్మెల్యే, మంత్రులయి తమ పక్కన కూర్చుంటారని భయమా!! అలాగే జనాభా లెక్కలు తేలితే విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్లు పెంచాలని అలాగే స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ బలంగా ముందుకు వస్తుందని భయమా! భయపడవలసిన అవసరం లేదు. మీరు జనాభా లెక్కలలో కులాల వారీ లెక్కలు తీసినంత మాత్రాన ఈ కులాలు తమ డిమాండ్లను తెరమీదకి తీసుకురావు. ఇప్పటివరకు రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో ఏమైనా అవలక్షణాలు దొర్లాయా? రాజ్యాంగం రక్షణ సదుపాయాలు రాజ్యాంగంలోని 15 (4) (5) మరియు 16 (4) (5) ప్రకారం బీసీ కులాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా ఉంది. జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన పెడతారు? రాజ్యాంగంలోని 243 డి–(6) 243–టి–6 ప్రకారం స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. కానీ జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్ల శాతం ఎలా నిర్ణయిస్తారు? రాజ్యాంగంలోని 339–బి–ప్రకారం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ బీసీల సమగ్రాభివృద్ధికి ఏ సిఫార్సు చేయాలన్నా జనాభా లెక్కలు కావాలి. రాజ్యాంగం కల్పించిన సదుపాయాలు, రక్షణలు, రిజర్వేషన్ల కోసం జనాభా లెక్కలు అవసరం. రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి అనేక ప్రోవిజన్స్–ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే బీసీ కులాల లెక్కలు కావాలి. కోర్టు తీర్పు ప్రకారం లెక్క తీయాలి రిజర్వేషన్లు ప్రవేశపెట్టినపుడు లేదా రిజర్వేషన్లు పెంచిన ప్రతి సందర్భంలో హైకోర్టు–సుప్రీంకోర్టులు జోక్యం చేసుకొని జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెడతారని లేదా పెంచుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. మండల్ కమిషన్ కేసు సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతం నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో ప్రతీ రాష్ట్రంలో నియమించిన ప్రతి కమిషన్ జనాభా లెక్కలు తీయాలని సిఫారసు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అనేక రాష్ట్రాలు కులాల వారిగా జనాభా లెక్కలు తీశాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపు కోసం, ఇతర రిజర్వేషన్ల కోసం ఇతర అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలు బీసీ జనాభా లెక్కలు తీశాయి. కానీ వీటికి చట్టబద్ధత లేదని కోర్టులు కొట్టివేశాయి. ఈ దేశంలో అన్ని వర్గాల వివరాలను జనాభా గణన ద్వారా సేకరిస్తున్నారు. చివరకు పులులు–జంతువుల వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ బీసీ కులాల వారిగా జనాభా లేకపోవడం అన్యాయం. బీసీ జనాభా లెక్కలు సేకరిస్తే జరిగే నష్టం ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు లేదు. కేవలం ఊహాజనితంగా కులాల వారి లెక్కలు తీయడం వలన కులతత్వం పెరుగుతుందని పసలేని విమర్శలు చేస్తుంటారు. ఇది ఊహమాత్రమే; ఎందుకంటే మతాల లెక్కలు తీస్తున్నారు. మతతత్వం పెరుగుతుందా! అలాగే ఎస్సీ/ఎస్టీ కులాల వారి లెక్కలు తీయడం లేదా? ఏమైనా కులతత్వం పెరిగిందా? ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు, రిజర్వేషన్లకు, పరిపాలన సౌకర్యంకోసం కులాల వారీ లెక్కలు ఉపయోగపడుతాయి. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి జనాభా గణనలో బీసీ కులాల వారి లెక్కలు తీసే విధంగా తగు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఉంది. జనాభా గణన కాలమ్స్లో ఒక కాలమ్ పెరుగుతుంది. ఒక పైసా అదనంగా ఖర్చు కాదు. పైగా ప్రభుత్వానికి చట్టపరమైన, పాలనాపరమైన, అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి కులాల వారి కాలమ్ చేర్చాలని ప్రజలు–అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం -
‘సుప్రీం’ తీర్పునకు లోబడే ‘స్థానిక’ రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: వెనుకబడిన తరగతులకు (బీసీ) తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా చట్టాలు తీసుకువచ్చే అధికారం తమకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అందుకు అనుగుణంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1995లో పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు జరిగాయని తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా.. వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించామని, కానీ బీసీలకు మాత్రం 1995 చట్ట సవరణను అనుసరించి 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని వివరించింది. 1995లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు, 1991 జనాభా లెక్కల ప్రకారం బీసీ జనాభా ఆంధ్రప్రదేశ్లో 39 శాతం మేర ఉందని తెలిపింది. రాష్ట్ర విభజన తరువాత ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ నిర్వహించిన సర్వేలో బీసీ ఓటర్లు 48.13 శాతంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. అందువల్ల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఏ మాత్రం తప్పుకాదని.. పైగా వారి జనాభా కన్నా తక్కువ రిజర్వేషన్లే కల్పించామని స్పష్టంచేసింది. పైపెచ్చు కృష్ణమూర్తి కేసులో అధికరణ 243డి(6)కి భాష్యం చెబుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే స్థానిక సంస్థల్లో 59.85 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని సర్కారు వివరించింది. అలాగే, నిర్ణీత కాల వ్యవధిలోపు పంచాయతీ, మునిసిపాలిటీల ఎన్నికలను పూర్తిచేయడం ప్రభుత్వాల రాజ్యాంగ విధి అని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. స్థానిక సంస్థల్లో 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ఇటీవల పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించిన హైకోర్టు.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కౌంటర్ దాఖలు చేశారు. ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నిధులివ్వదు.. ‘పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ వృథా అవుతాయి. 2018–19, 2019–20 సంవత్సరాలకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రూ.4,065.79 కోట్లు కేటాయించింది. ఇందులో మొదటి వాయిదా కింద రూ.858.99 కోట్లు విడుదలయ్యాయి. పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంవల్ల రెండో వాయిదా విడుదల చేయలేదు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఎన్నికలు నిర్వహించకుంటే అవి రావు. దీంతో పంచాయతీలు తీవ్రంగా నష్టపోతాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ కొట్టేయండి.’ అని ద్వివేది తన కౌంటర్లో కోరారు. రిజర్వేషన్లలో వ్యత్యాసం ఉంది ‘పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77, బీసీలకు 34 శాతం మొత్తం కలిపి 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించాం. అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 50 శాతం రిజర్వేషన్లు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దాటొచ్చునని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. విధాన నిర్ణాయక వ్యవస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించడంవల్లే రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయి. గత పాతికేళ్లుగా రిజర్వేషన్లు 50 శాతం దాటుతూనే ఉన్నాయి. విద్యా, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న తీర్పును రాజకీయాలకు వర్తింపచేయడానికి వీల్లేదు. రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది.’ అని ద్వివేది తన కౌంటర్లో వివరించారు. అంత జనాభా ఉన్నా.. చట్ట ప్రకారమే నడుచుకున్నాం అలాగే, ‘ఎక్కువ ఓటర్లు ఉన్న వర్గాలకు వాస్తవ అధికారాన్ని నిరాకరిస్తే, అది నిజమైన ప్రజాస్వామ్యం కాదని కూడా ‘సుప్రీం’ తెలిపింది. దీని ప్రకారం జనాభాలో వారి దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. అందుకనుగుణంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 1995లో చట్ట సవరణ జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు వారి వారి జనాభా ప్రకారం ప్రాతినిధ్యం కల్పిస్తున్నప్పటికీ, బీసీలకు మాత్రం జరగడంలేదు. తాజాగా బీసీల జనాభాను తేల్చకుండా వారి రిజర్వేషన్లు తేల్చడం సరికాదని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ, మేం బీసీల లెక్కలు తేల్చాం. ఆ ఓటర్లు 48.13 శాతం ఉన్నప్పటికీ, చట్ట నిబంధనలకు లోబడి వారికి 34 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చాం’ అని గోపాలకృష్ణ ద్వివేది తన కౌంటర్లో పేర్కొన్నారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్తో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో వందలాది మంది బీసీలు జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ‘ఓట్లు బీసీలవి.. సీట్లు అగ్రకులాలకా?’అంటూ నినదించారు. ధర్నాను ఉద్దేశించి ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం 30 ఏళ్లుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదని పేర్కొన్నారు. 16 రాష్ట్రాల నుంచి బీసీలకు ప్రాతినిధ్యమే లేదని వాపోయారు. ఇది ప్రజాస్వామ్యం కాదని, ధనస్వామ్యమని ఆరోపించారు. పార్లమెంట్లో 96 మంది బీసీ సభ్యులున్నా బీసీ రిజర్వేషన్లపై మాట్లాడకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. బీసీల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర సామాజిక, న్యాయ మంత్రి థావర్చంద్ గెహ్లాట్ను బీసీ సంఘాల నేతలు కలిశారు. కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.1,050 కోట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ జేఏసీ చైర్మన్ నీరడి భూపేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
షెడ్యూల్ ప్రకారమే ‘స్థానిక’ ఎన్నికలు
పిటిషనర్: రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు. కానీ అంతకంటే ఎక్కువ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం సరికాదు. అడ్వొకేట్ జనరల్: రిజర్వేషన్లు 50 శాతం దాటుతుండటంపై దాఖలైన వ్యాజ్యాన్ని గతంలో ఇదే ధర్మాసనం కొట్టివేసింది. చట్టాన్ని అనుసరించే ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైకోర్టు: షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సిందే. నిలిపివేసే ప్రసక్తే లేదు. సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం దాటడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మంథాట సీతారామమూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ చట్టంలోని 9, 15, 152, 153, 180, 181 సెక్షన్లను సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న జారీ చేసిన జీవో 176ని కూడా ఆయన సవాలు చేశారు. ఈ జీవోను సవాలు చేస్తూ మరో రెండు వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. వీటిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. బీసీలకు రిజర్వేషన్లు ప్రభుత్వ విచక్షణే పిటిషనర్ ప్రతాప్రెడ్డి తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని కె.కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంలో తప్పులేదని, అయితే బీసీలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటాయన్నారు. ప్రభుత్వం శాస్త్రీయ అధ్యయనం, బీసీ జనాభా గణన లాంటి వాటిని తేల్చిన తరువాత రిజర్వేషన్లు కల్పిస్తే అభ్యంతరం లేదని నివేదించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం సరికాదన్నారు. గతంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా రిజర్వేషన్లు 50 శాతానికి లోబడే ఎన్నికలు నిర్వహించాలని చెప్పిందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత పూర్తిస్థాయి విచారణ జరుపుతామని పేర్కొంది. ఎన్నికలను నిలుపుదల చేసే ప్రసక్తే లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనికి ప్రణతి స్పందిస్తూ ఎన్నికలను ఆపాలని తాము కోరడం లేదని, కేవలం రిజర్వేషన్లు 50 శాతానికి మాత్రమే పరిమితం చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. జీవో 176ని సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని సుప్రీంకోర్టు చెప్పిన తరువాత అమలు చేసి తీరాల్సిందేనన్నారు. అయితే ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోందన్నారు. చట్ట ప్రకారమే ఇలా చేస్తున్నామని చెబుతోందని, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పంచాయితీరాజ్ చట్ట నిబంధనలు చెల్లవన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించేలా ఏవైనా చట్టాలు ఉంటే వాటిని సవరించుకోవాలని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ధర్మాసనానికి నివేదించారు. చట్ట ప్రకారమే రిజర్వేషన్లు... రిజర్వేషన్లు 50 శాతం దాటుతుండటంపై ఇప్పటికే పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ఒక వ్యాజ్యాన్ని ఇదే ధర్మాసనం కొట్టి వేసిందని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. మరో వ్యాజ్యంలో ధర్మాసనం నోటీసులు జారీ చేసి, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిందన్నారు. చట్టాన్ని అనుసరించే జీవో 176 జారీ అయిందని తెలిపారు. ధర్మాసనం ఆదేశాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పిటిషనర్లు చివరి దశలో కోర్టుకు వచ్చారని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుంటే ఎన్నికల నోటిఫికేషన్ వల్ల తమ వ్యాజ్యాలు నిరర్థకమవుతాయని, ఈ విషయం కోర్టుకు తెలుసని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొనగా తమకు చాలా విషయాలు తెలుసని, స్థానిక సంస్థల గడువు ముగిసి ఏడాదిన్నర దాటినా కూడా ఎన్నికలు నిర్వహించని విషయం కూడా తమకు తెలుసని ధర్మాసనం ఒకింత ఘాటుగా వ్యాఖ్యానిస్తూ దీనిపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
బీసీలకు 31 శాతం!
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై కొంత స్పష్టత వచ్చింది. బీసీలకు 30–31 శాతం, ఎస్సీలకు 13–14 శాతం, ఎస్టీలకు 4–5 శాతం మేయర్, చైర్మన్ స్థానాలు రిజర్వుకానున్నాయి. మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్ల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వుకానున్న చైర్మన్/మేయర్ల స్థానాలను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఆదివారం ఉదయం తన కార్యాలయంలో డ్రా పద్ధతిలో ఎంపిక చేసి ప్రకటించనున్నారు. దీంతో మున్సిపాలిటీలు యూనిట్గా, మున్సిపల్ కార్పొరేషన్లు యూనిట్గా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వుకానున్న చైర్మన్, మేయర్ స్థానాలకు సంబంధించిన కచ్చితమైన రిజర్వేషన్ల లెక్కలపై స్పష్టత రానుంది. నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటినీ యూనిట్గా తీసుకుని చైర్మన్ స్థానాలకు, మున్సిపల్ కార్పొరేషన్లన్నింటినీ యూనిట్గా తీసుకుని మేయర్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్/మేయర్ స్థానాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండగా, 16–18 స్థానాలు ఎస్సీలకు, 4–5 స్థానాలు ఎస్టీలకు, 37–39 స్థానాలు బీసీలకు, మిగిలిన స్థానాలు జనరల్కు రిజర్వు కానున్నాయి. అదే విధంగా 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనుండగా, ఎస్సీ లకు 1–2, ఎస్టీలకు 1, బీసీలకు 3–4 మేయర్ స్థానాలు రిజర్వయ్యే అవకాశాలున్నాయి. వార్డులు/డివిజన్లవారీగా రిజర్వేషన్లు... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వుకానున్న వార్డులు, డివిజన్ల సంఖ్యను ప్రకటిస్తూ శనివారం శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీని యూనిట్గా పరిగణించి స్థానిక వార్డుల రిజర్వేషన్లను, మున్సిపల్ కార్పొరేషన్ను యూనిట్గా తీసుకుని డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఒక్కో పురపాలికలో స్థానికంగా నివసించే ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో కలుపుకుని మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా మిగిలిన స్థానాలను బీసీలకు కేటాయిస్తారు. ఎన్నికలు జరగనున్న 120 మున్సిపాలిటీల్లో మొత్తం 2,727 వార్డులుండగా, ఎస్సీలకు 386, ఎస్టీలకు 159, బీసీలకు 802 వార్డులను కేటాయించారు. ఎన్నికలు జరుగనున్న 10 మున్సిపల్ కార్పొరేషన్లలో 385 డివిజన్లుండగా, ఎస్సీలకు 49, ఎస్టీలకు 12, బీసీలకు 131 స్థానాలు వచ్చాయి. చాలా పురపాలికల్లో ఎస్టీలు ఒకరిద్దరు మాత్రమే ఉన్నా నిబంధనల ప్రకారం వారికి కనీసం ఒక వార్డు/డివిజన్ను కేటాయించారు. దీంతో ఎస్టీలకు సగటున 4.50 శాతం వరకు వార్డు/డివిజన్ స్థానాలు రిజర్వయ్యాయని అధికారవర్గాలు తెలిపాయి. అదే విధంగా సగటున బీసీలకు 31 శాతం, ఎస్సీలకు 14 శాతం వార్డు/డివిజన్ స్థానాలు రిజర్వయ్యాయని ఓ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు కానున్న వార్డులు/డివిజన్లను స్థానిక జిల్లా కలెక్టర్లు ఆదివారం ఉదయం డ్రా పద్దతిలో ఎంపిక చేయనున్నారు. ఈ నెల 7న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా, 22న పోలింగ్ జరుగనుంది. 25న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. -
సమైక్య ఉద్యమం
సాక్షి, హైదరాబాద్ : జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, అదే ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్రంలో బీసీ రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావడం లేదని, నిర్దేశిత 28% రిజర్వేషన్లు తప్పనిసరి చేయాల్సి ఉంటే 6–11% మాత్రమే అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కలి్పంచిన హక్కులను సాధించుకునేందుకు బీసీలు చేపడుతున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు. బుధవారం సరూర్నగర్ స్టేడియంలో జరి గిన జాతీయ ఓబీసీ మహాసభలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీసీ ఉద్యమకారులు పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీసీలంతా కలిసికట్టుగా రిజర్వేషన్ ఉద్యమాలు చేపట్టాలన్నారు. జాతీయ బీసీ సదస్సు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. బీసీలకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీలకు రూ.1000 కోట్లు కేటాయించిందని, ఖర్చు విషయాన్ని పక్కనపెడితే బీసీల పట్ల కేంద్రం కంటే ఉదారంగా రాష్ట్రం వ్యవహరిస్తుందన్నారు. కేటాయించిన నిధులను తర్వాతైనా ఖర్చు చేయాల్సిందేనన్నారు. రాజ్యాంగం కలి్పంచిన హక్కులన్నీ సాధించుకునే వరకు ఉద్యమాన్ని ఆపొద్దని పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు అన్నారు. జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలు ఐక్యంగా పోరాడితేనే డిమాండ్లు సాధించుకోవచ్చని అన్నారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు వినతులు ఇచ్చే స్థాయిలో ఉంటే.. అతి తక్కువ జనాభా ఉన్న వర్గాలు మాత్రం పరిపాలించే స్థాయిలో ఉన్నాయని మహారాష్ట్ర మంత్రి మహదేవ జనార్దన అన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని, ప్రతి బీసీ ఉద్యమకారుడిగా ఎదగడంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని అన్నారు. బీసీ జనగణన చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఈ ప్రక్రియ పూర్తి చేసి వివరాలను బహిర్గతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ డిక్లరేషన్ ఏమైంది?: జస్టిస్ ఈశ్వరయ్య రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్ చేపట్టాలని జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ‘ఒక్క సంతకంతో ఈ డిమాండ్లన్నీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ.. దాని ఊసేలేదు. బీసీ డిక్లరేషన్ అమలు కావటం లేదు. దేశవ్యాప్తంగా బీసీల జనాభాను తేల్చడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఉద్యమం చేస్తేనే హక్కులు రక్షించబడతాయి. పాఠశాల విద్యను జాతీయం చేయాలి. ప్రాథమిక ఆరోగ్య విధానం మెరుగుపర్చాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కలి్పంచాలి. క్రిమిలేయర్ను వెంటనే తొలగించాలి. బీసీల అభ్యున్నతికి పలు కమిషన్లు ఇచ్చిన సూచనలు, రిపోర్టులు తదితర పూర్తిస్థాయి సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ను ప్రారంభిస్తున్నాం’అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేసిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. రాజ్యాధికారంతోనే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. బడుగు, బలహీనవర్గాల నుంచి చట్టసభలకు ఎన్నికైతేనే వారి డిమాండ్లను ప్రభుత్వానికి చెప్పే అవకాశం వస్తుందన్నారు. వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులంతా ఐక్యంగా ఉద్యమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బీసీల సంక్షేమానికి కేంద్రం పలు సంక్షేమ పథకాలను తీసుకొచి్చందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు దేవేందర్ గౌడ్, బూర నర్సయ్య గౌడ్, సినీనటుడు ఆర్.నారాయణ మూర్తి పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సుకు మహారాష్ట్ర, కేరళ, పాండిచేరీ, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 18 రాష్ట్రాల ఓబీసీ నాయకులు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. చదువుతోనే చైతన్యం వస్తుందని, బీసీలంతా తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేలా ప్రోత్సహించాలని సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. జాతీయ ఓబీసీ మహాసభ ముఖ్యమైన తీర్మానాలివే! కులాల వారీగా బీసీ జనాభాను ప్రభుత్వం బహిర్గతం చేయాలి వెనుకబడిన తరగతుల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ వర్గాలకు చెందిన వారికే ఈ శాఖ పగ్గాలు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన కేటాయించాలి బీసీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి బీసీ రిజర్వేషన్లకున్న క్రిమిలేయర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కలి్పంచాలి ఎస్సీ, ఎస్టీల మాదిరిగా పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థులకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వ విభాగాల్లో ఉన్నత స్థానాల్లోని పోస్టుల్లోనూ బీసీ రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలి బీసీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలకు భారతరత్న ఇవ్వాలి -
బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తే రాజకీయ సునామీనే..
సాక్షి, ఖమ్మం: బీసీలకు రిజర్వేషన్ తగ్గిస్తే రాజకీయ సునామీ సృష్టిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గింపును నిరసిస్తూ బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేకల సుగుణారావు అధ్యక్షతన ఆదివారం ఖమ్మం బైపాస్రోడ్లోని ఓ హోటల్లో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడు, మహారాష్ట్రలో, ఏపీలో 60 శాతం పైగా రిజర్వేషన్ అమలు చేస్తుంటే, అక్కడ లేని నిబంధన తెలంగాణలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీసీలపై తీవ్రమైన రాజకీయ వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు. 34 శాతం ఇస్తున్న రిజర్వేషన్లు సరపోవని, వాటిని 52శాతం పెంచాలని తాము డిమాండ్ చేస్తుంటే 22 శాతం తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో 18 జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీ సభ్యుడు కూడా బీసీలు లేరని అన్నారు. 1980 సర్పంచ్ పదవులు సైతం కోల్పోయామన్నారు. 32 జెడ్పీ చైర్మన్ సీట్లలో బీసీలకు ఆరు మాత్రమే వచ్చాయని తెలిపారు. మహబూబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నాగర్కర్నూల్ తదితర జిల్లాల్లో ఒక్క ఎంపీపీ కూడా బీసీలకు రాలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది బీసీలు ఉండాల్సి ఉండగా, 22 మంది మంది మాత్రమే కొనసాగుతున్నారని వివరించారు. ఇది బీసీలను రాజకీయంగా సమాధి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికారం సాధించుకునే దిశగా బీసీలు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్ తగ్గించడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ తగ్గించడం వలన అత్యధికంగా నష్టపోయింది ఖమ్మం జిల్లా బీసీలేనన్నారు. 583 సర్పంచ్ పదవులు జిల్లాలో ఉంటే 240 మంది బీసీ సర్పంచ్లు ఎన్నిక కావాల్సింది, కేవలం 58 మంది మాత్రమే ఎన్నికయ్యారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లు తమ పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు. సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు, బీజేపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్ల వెంకటనర్సయ్య, టీజేఎస్ నాయకులు సోమయ్య, బీసీటీయూ రాష్ట్ర అధక్షుడు సుంకర శ్రీనివాస్, పంచవృత్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వినయ్కుమార్, వెంకటరమణ, విజయకుమార్, గాంధి, మామిడి వెంకటేశ్వర్లు, సోమన్నగౌడ్, రజకసంఘం నాయకులు సీతారామయ్య, లిక్కి కృష్ణారావు, శెట్టిరంగారావు, యాకలక్ష్మి, డాక్టర్ కేవీ.కృష్ణారావు, పాల్వంచ రామారావు, రామ్మూర్తి, శ్రీనివాస్, బచ్చల పద్మాచారి, ఆవుల అశోక్ పాల్గొన్నారు. -
ఒకటి అడిగితే సీఎం జగన్ రెండు చేస్తున్నారు..
సాక్షి, తాడేపల్లి: దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టించారని బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో బీసీల పార్టీలుగా చెప్పుకునే వాళ్లంతా బీసీలను మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్.కృష్ణయ్య సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిపారు. ఈ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లు పెట్టారు. కేంద్రం ఆ బిల్లును పెండింగ్లో పెట్టినా బీసీ బిల్లు కోసం పోరాడతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. చదవండి: బీసీ బిల్లుకు కేంద్రం నో బడ్జెట్లో కూడా బీసీలకు అత్యధికంగా రూ.15వేల కోట్ల నిధులు కేటాయించారు. అమ్మ ఒడి, విద్యార్థులకు రూ.20వేల మెస్ ఛార్జీలు, ప్రతి బీసీ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలను అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలాగైతే ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో బీసీల జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే వైఎస్ జగన్ ప్రతి పథకంలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే అత్యధికంగా లబ్ది చేకూరేలా చేశారు. మంత్రివర్గంలో 60శాతం పదవులే కాకుండా డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇచ్చారు. బీసీల కోసం నేను ఒకటి అడిగితే రెండు చేస్తున్నారు. సీఎం జగన్ వల్ల నాకు పోరాటం చేయడానికి సబ్జెక్టే లేకుండా పోయింది’ అని అన్నారు. కాగా చట్టసభల్లో ఓబీసీల జనాభా నిష్పత్తికి అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదిస్తూ రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ‘ప్రైవేట్’బిల్లుపై జూన్ 21న సభలో సుదీర్ఘ చర్చ జరిగిన విషయం తెలిసిందే. -
కీలక బిల్లుపై ఓటింగ్కు విజయిసాయి రెడ్డి డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై శుక్రవారం వాడీవేడీ చర్చ జరిగింది. ఆయన ప్రతిపాదించిన బిల్లుకు మెజారిటీ రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి. బిల్లుపై ఓటింగ్ జరపాలని తొలుత విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. దానికి కాంగ్రెస్ మిత్రపక్షాలతో సహా అనేక పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే బిల్లుపై స్పందించిన కేంద్రన్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనిని నిరాకరించిన విజయసాయి రెడ్డి.. ఎట్టిపరిస్థితుల్లో కూడా బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. తాను ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు అభ్యంతరం తెలపని ప్రభుత్వం.. ఓటింగ్ సమయంలో అడ్డుచెప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. బిల్లును మరింత సమగ్రంగా ప్రవేశపెడతామని హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 60 శాతం పదవులు వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చామని రాజ్యసభలో ప్రస్తావించారు. అయితే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు అయినందున సభలో సగం మంది సభ్యులు ఉండాలని సభ వైస్ ఛైర్మన్, సభ నాయకుడు వివరించారు. దీంతో బిల్లుపై ఓటింగ్ సాధ్యం కాదని మంత్రి రవిశంకర్ ప్రకటించారు. కేంద్రమంత్రి తీరుతో అసంతృప్తి వ్యక్తం చేసిన.. విజయసాయి రెడ్డి దానికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై మరింత పోరాటం కొనసాగిస్తామన్నారు. -
కీలక బిల్లు ప్రవేశపెట్టిన విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక బిల్లును ప్రవేశపెట్టారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ.. రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. సభలో దీనిపై చర్చ ప్రారంభించిన ఆయన.. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎస్పీ, ఎస్టీ తరహాలోనే వెనుకబడిన వర్గాలైన బీసీలకు కూడా సమాన హక్కులను కల్పించాలన్నారు. అదే విధంగా బీసీలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడానికి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. స్కిల్ డెవలెప్మెంట్ శాఖ కింద ఉన్న నిధులను వృత్తిపరమైన కులాలకు అందజేయాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు. కాగా విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాగా అంతకుముందు సభలో ప్రసంగించిన విజయసాయి రెడ్డి మరో మూడు ప్రైవేటు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. నేర శిక్షాస్మృతి సవరణ బిల్లు 2018, జనన మరణ రిజిస్ట్రేషన్ల సవరణ బిల్లు 2018, ది అన్ ఫైర్ టర్మ్స ఇన్ కాంట్రాక్ట్ బిల్లు 2018లను సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్ అనుమతితో ఆయన సభలో సంబంధిత బిల్లులపై ప్రసంగించారు. -
జూన్ చివర్లో ‘పుర’ పోరు!
సాక్షి, హైదరాబాద్: పురపోరుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియగానే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. జూన్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సంకేతాలిచ్చిన నేపథ్యంలో పట్టణ, పురపాలకశాఖ ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టింది. ఆలోపే కొత్త పురపాలక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుండటంతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని భావించిన కేసీఆర్ సర్కారు.. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరు కార్పొరేషన్లు, 136 మున్సిపాలిటీల్లో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట పురపాలక సంఘాలు మినహా మిగతా వాటి పాలకవర్గాల పదవీకాలం జూలై ఒకటితో ముగియనుంది. ఈ నెలాఖరుకు ముసాయిదా... పురపాలక చట్టం ముసాయిదాపై కుస్తీ పడుతున్న ప్రభుత్వం.. ఈ నెలాఖరుకు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించింది. మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు, పురపాలకశాఖ మాజీ డైరెక్టర్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), పురపాలక శాఖలు కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేసిన యంత్రాంగం.. పౌర సేవలు, పట్టణ ప్రణాళిక, ప్రజాప్రతినిధుల బాధ్యతపై చట్టంలో స్పష్టత ఇవ్వాలని నిర్ణయించింది. కొత్త మున్సిపల్ చట్టం తెచ్చాకే పురపోరుకు వెళ్లనున్నట్లు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో నయా చట్టానికి ఆమోదముద్ర వేసే దిశగా ఆలోచన చేస్తోంది. నూతన చట్టం మనుగడలోకి వచ్చాక వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి వచ్చే నెలాఖర్లో లేదా జూలై మొదటి వారంలో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వడివడిగా వార్డుల విభజన! వార్డుల పునర్విభజన ప్రక్రియపై పురపాలకశాఖ అంతర్గత కసరత్తును ప్రారంభించింది. ఎన్నికలపై ప్రభుత్వం సంకేతాలివ్వడం, కొత్త చట్టంలో పొందుపరిచే అంశాలపై కూడా స్పష్టత ఉండటంతో దానికి అనుగుణంగా వార్డుల డీలిమిటేషన్ను చేపడుతోంది. చట్టానికి ఆమోదముద్ర పడటమే తరువాయి ఎన్నికలకు వెళ్లడానికి అడ్డంకులు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వార్డుల విభజనలో శాస్త్రీయత పాటించలేదు. ఒక్కో వార్డులో 1,500 నుంచి 15 వేల వరకు జనాభా వరకు ఉంది. దీంతో తాజా చట్టంలోనూ వార్డుల డీలిమిటేషన్కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను పొందుపరచనున్నారు. వార్డుల్లోని జనాభా ఒకే తరహాలో ఉండేలా శాస్త్రీయంగా విభజించనున్నారు. అలాగే మున్సిపాలిటీల గ్రేడింగ్పైనా స్పష్టత ఇవ్వనున్నారు. గతంలో ఐదు గ్రేడ్లుగా మున్సిపాలిటీలను వర్గీకరించారు. సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3 మున్సిపాలిటీలు ఉండేవి. వాటిని గతేడాది మున్సిపల్ చట్ట సవరణలో తొలగించగా తాజాగా మళ్లీ గ్రేడింగ్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా మూడు గ్రేడ్లకే పరిమితం చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ గ్రేడ్లకు అనుగుణంగా పురపాలికల్లో వార్డుల సంఖ్య ఉండనుంది. బీసీల రిజర్వేషన్లే అసలు సమస్య... స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లలో ప్రధానంగా రెండు సామాజికవర్గాలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయన్న అభిప్రాయంతో మిగిలిన బీసీ వర్గాలు ఉన్నాయి. దీనికి సంబంధించి హైకోర్టు బీసీ రిజర్వేషన్లను అన్ని కులాలవారీగా విభజించి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు అమలు కాలేదు. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పును సమర్థించింది. అయినా ఈ రిజర్వేషన్లు అమలు కాలేదంటూ ఇటీవలే మళ్లీ ఆ వర్గాలు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఈ రిజర్వేషన్ల అంశం మరోసారి బయటకు వస్తే ఎన్నికలు మరికొంతకాలం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
‘స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలి’
హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల సమస్య పరిష్కారమయ్యే వరకూ స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 22% నుంచి 34% వరకు పెంచిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బీసీ భవన్లో శనివారం చెరుకుల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్లు లెక్కించడంలో అన్యాయం చేస్తున్నారని, దీనిపై అధికార పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోరుమెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా బీసీ రిజర్వేషన్లు యథాతథంగా అమలు జరపొచ్చని, దీనిపై సీఎం అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో చర్చలు జరిపాలని కోరారు. సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ పాల్గొన్నారు. -
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు చట్ట సభలు, స్థానిక సంస్థల్లో 50 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ డిమాండ్ చేశారు. చట్ట సభలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో ఆదివారం ఇందిరాపార్క్లోని ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు ఏళ్లుగా అన్యాయం జరుగుతున్నా శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుతూ హక్కుల కోసం పోరాడుతున్నామని గుర్తుచేశారు. బీసీల హక్కుల గురించి అంతర్జాతీయ వేదికలకు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. త్వరలో దేశంలోని 29 రాష్ట్రాల్లో పర్యటించి బలమైన బీసీ ఉద్యమాన్ని తయారు చేస్తామని వెల్లడించారు. బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎన్నికల్లో బీసీలంతా జగన్ వెంటే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీసీలంతా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి వెంటే నడుస్తారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. జగన్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో 41 మంది బీసీలకు, ఎంపీ అభ్యర్థుల్లో ఏడుగురు బీసీలకు చోటు కల్పించడం హర్షించదగ్గ పరిణామం అని అన్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీ మేరకు టికెట్లను కేటాయించడంతో మాట తప్పడు మడమ తిప్పడు అని మరోసారి రుజువైందని కృష్ణయ్య అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్కి తాము పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నామని ఉద్ఘాటించారు. ఏపీ సీఎం చంద్రబాబు దుర్మార్గుడు అని.. అతడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు. -
బీసీలకు 94 ఎంపీపీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల రిజర్వేషన్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. మొత్తం 32 జిల్లా ప్రజాపరిషత్ల పరిధిలోని 535 మండల ప్రజాపరిషత్ (రాష్ట్రంలోని గ్రామీణ రెవెన్యూ మండలాలు)లలో 33 మండలాలు షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్నాయి. మిగతా నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని 502 మండలాల్లో 50 శాతం అంటే 251 మండలాల్లోని ఎంపీపీ స్థానాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వాటిలో ఎస్టీలకు 59 రిజర్వ్కాగా, ఎస్సీలకు 98, బీసీలకు 94 రిజర్వ్ అయ్యాయి. ఈ కేటగిరిలన్నింటిలోనూ మహిళలకు 50 శాతం స్థానాలు రిజర్వ్ చేశారు. మిగతా 251 అన్ రిజర్వ్డ్గా పరిగణిస్తుండగా అందులోనూ మహిళలకు 50 శాతం ఎంపీపీ స్థానాలు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ కేటగిరీలో మహిళలకు 125, పురుషులు/మహిళలు పోటీపడే విధంగా 126 ఎంపీపీ స్థానాలు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని వివిధ మండలాలవారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన ఈ వర్గాల ఎంపీపీ స్థానాలు రిజర్వ్ చేశాక ఓటర్ల జాబితా ఆధారంగా బీసీలకు ఎంపీపీ స్థానాలు కేటాయించారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్డు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఎంపీపీ స్థానాల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 32 జిల్లాల్లోని మండలాలవారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు సందర్భంగా ఈ లెక్కలు తేలాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ కుమారీ ప్రసాద్ ఎంపీపీ స్థానాల్లో రిజర్వేషన్లను ఖరారు చేశారు. మహిళలకు 267 ఎంపీపీ స్థానాలు రిజర్వ్ అన్ని కేటగిరిల్లో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించాలన్న నిబంధన నేపథ్యంలో వివిధ ఎంపీపీల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు సంబంధించి మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాలు కలుపుకుని ఎస్టీ, ఎస్సీ, బీసీలకు సంబంధించి మొత్తం 142 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు. షెడ్యూల్డ్ ఏరియాల మండలాల్లోని ఎంపీపీల్లో మహిళలకు 16, నాన్ షెడ్యూల్డ్ మండలాల్లో 30 ఎంపీపీలు ఎస్టీ మహిళలకు, 49 ఎస్సీ మహిళలకు, 47 బీసీ మహిళలకు ఎంపీపీ అధ్యక్ష స్థానాలు రిజర్వయ్యాయి. అంతేకాకుండా అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 125 ఎంపీపీ స్థానాలు మహిళలకు కేటాయించారు. మొత్తం కలిపి మహిళలకు 267 ఎంపీపీ అధ్యక్ష స్థానాలు ఖరారయ్యాయి. ఇవే కాకుండా మిగతా అన్ రిజర్వ్డ్ ఎంపీపీ అధ్యక్ష స్థానాల్లోనూ పురుషులతో మహిళలు పోటీ పడే అవకాశాలున్నాయి. పునర్విభజనతో మారిన పలు మండలాల లెక్కలు... జిల్లా, మండల పరిషత్ల పునర్విభజన సందర్భంగా షెడ్యూల్డ్ మండలాలుగా ఉన్న బయ్యారం, గార్ల, గంగారంలను సరిగ్గా లెక్కించ లేదు. తాజాగా దాన్ని సరిచేయడంతో వాటిని షెడ్యూల్డ్ మండలాల జాబితాలో చేర్చారు. గతంలో జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో చేర్చడంతో జనగామ జిల్లా నుంచి ఆ మండలాన్ని మినహాయిం చారు. దీంతో ఆ జిల్లాలో మండలాల సంఖ్య 12కు తగ్గింది. కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో బీసీలకు మరో ఎంపీపీ స్థానాన్ని అదనంగా కేటాయించారు. ఆ మేరకు ఆ జిల్లాలో అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఒక స్థానం తగ్గింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ రిజర్వేషన్లలో మార్పుల కారణంగా మహిళా రిజర్వేషన్లలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో చోటుచేసుకున్న మార్పుల గురించి పీఆర్ కమిషనర్ తెలియజేశారు. -
శరద్పవార్తో బీసీ నేతల భేటీ..
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా రాబోయే యూపీఏ ప్రభుత్వం కచ్చితమైన హామీ ఇస్తుందని, ఇందుకు తగ్గట్టుగా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ వాగ్దానాన్ని చేరుస్తామని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ హామీ ఇచ్చినట్టు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం ఇక్కడ శరద్ పవార్ను ఆయన నివాసంలో బీసీ నాయ కులు కలిశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర బీసీ సంఘాల నేతలను ఆహ్వానించి బీసీ సమస్యలపై పవార్ అరగంట సేపు చర్చలు జరిపారని కృష్ణయ్య వివరించారు. అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టి బీసీలకు అన్యాయం చేస్తున్నారని పవార్ దృష్టికి తీసుకెళ్లారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇస్తే తప్ప ఈ కులాలకు న్యా యం జరగదన్నారు. దీనిపై పవార్ స్పందిస్తూ బీసీలకు అన్యాయం జరిగిందని, బీసీల పక్షాన నిలబడతానని హామీనిచ్చినట్టు తెలిపారు. బీసీల డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్ట డానికి అంగీకరించారన్నారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, రవీందర్, నీల వెంకటేశ్, భూపేశ్ సాగర్, తాండూరు గోపీనాథ్ పాల్గొన్నారు. -
ఏం చేసారని బీసీ సభలు నిర్వహిస్తున్నారు?
-
నమ్మలేం బాబూ..!
-
‘నిబంధనలకు అనుగుణంగానే పంచాయతీరాజ్ ఆర్డినెన్స్’
సాక్షి, న్యూఢిల్లీ : పంచాయతీ రాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల ముందు పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను కుదిస్తూ జారీ చేసిన ఈ ఆర్డినెన్స్ను రద్దు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ను రద్దు చేయాలని కృష్ణయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లు 50 శాతం నిబంధనను దాటలేదు కదా అని కృష్ణయ్య తరపు న్యాయవాదిని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. నిబంధనలకు అనుగుణంగానే ఆర్డినెన్స్ ఉన్నందున జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
ఆర్డినెన్స్ ప్రతులు చించిన బీసీ నేతలు
హైదరాబాద్: 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 22 శాతంకు తగ్గించి ఆగమేఘాలపై ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేయడం హేయకరమైన చర్య అని బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి కన్వీనర్ జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. సోమవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్ వద్ద ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రతులను చించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీసీల ఓట్లతో గద్దెనెక్కిన కేసీఆర్ 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 22 శాతంకు తగ్గించి మాకు బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీసీలను కలచివేస్తుందన్నారు. పంచాయతీలన్నీ ఏకగ్రీవం కావాలని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56 శాతం రిజర్వేషన్లను కల్పించినట్లయితే కేటీఆర్ అన్న మాటను మేము ఆహ్వానించేవాళ్లమని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తామంతా వ్యతిరేకంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో బీసీ నేతలు పాల్గొన్నారు. -
సమైక్యంగా ఉద్యమిద్దాం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలతోనే బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆగిపోదని, భవిష్యత్తులో విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ల కోత తప్పదని పలువురు నాయకులు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు, హక్కులకై పార్టీలకతీతంగా జెండాలు పక్కనపెట్టి బీసీలు సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకుని టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని, ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజలను చైతన్యం చేయా లని బీసీ సంఘాలు, కుల సంఘాలను కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపును నిరసిస్తూ తెలంగాణ జన సమితి బీసీ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద నిరాహా రదీక్షలు నిర్వహించారు. దీక్షలను ప్రారంభించిన జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని చెప్తున్న సీఎం, పంచాయతీ ఎన్ని కల్లో ఇప్పటివరకు అమలు అవుతున్న 34% రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు 50% దాటవద్దనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీసీ సంఘాలు, కుల సంఘాలు ఎవరి సంఘం వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప బీసీలను సంఘటితం చేద్దా మనే చిత్తశుద్ధి కనబడడంలేదని వాపోయారు. టీజే ఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ, రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా బీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఈ తగ్గింపు పంచాయతీ ఎన్నికలకే పరిమితం కాదని, రానున్న అన్ని ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందన్నారు. రిజర్వేషన్లు ఆత్మగౌరవ హక్కుగా గుర్తించి దాన్ని కాపాడుకునేందుకు బీసీలు ఉద్యమించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, మంత్రివర్గం లేకుండానే బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడం శోచనీయమన్నారు. కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్లు తగ్గించారని.. కోమటిరెడ్డి, సంపత్కుమార్ల శాసనసభ సభ్య త్వ రద్దుపై రూ. 50 లక్షలు ఖర్చుచేసి, పెద్దపెద్ద అడ్వొకేట్లతో కోర్టులో వాదించిన ప్రభుత్వం రిజర్వేష న్ల తగ్గింపుపై మాత్రం స్థానిక అడ్వొకేట్లతోనే సరిపె ట్టిందన్నారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు తగ్గించే ఆర్డినెన్స్పైనే తొలి సంతకం చేయడం ద్రోహం చేయడమేనన్నారు. ఆర్డినెన్స్ తేవడం దుర్మార్గం: దాసోజు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్కుమార్ మాట్లాడుతూ దళితులు సామాజిక అంటరానితనానికి గురవుతుంటే, బీసీలు రాజకీయ అం టరానితనానికి గురవుతున్నారన్నారు. అసెంబ్లీలో, అఖిలపక్షంతో, కుల, బీసీ సంఘాలతో చర్చించకుండా బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తేవడం దుర్మార్గమన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు ఎందుకుండకూడదని అన్న కేసీఆర్ బీసీ రిజర్వేషన్లు 22 శాతంకు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం అన్యాయమన్నారు. సీపీఐ నాయకులు సుధాకర్, కాంగ్రెస్ నాయకులు వినయ్కుమార్, సీపీఐ (ఎంఎల్) నాయకురాలు ఝాన్సీ, టీజేఎస్ నాయకులు గాదె ఇన్నయ్య, కె.దిలీప్కుమార్, పీఎల్ విశ్వేశ్వర్రావు, బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ నాయకులు ఎదగకుండా చేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్ : బీసీ నాయకులను ఎదగకుండా చేసే కుట్రలో భాగంగానే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గింపునకు నిరసనగా తెలంగాణ జనసమితి ధర్మాచౌక వద్ద ఒక రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో పాటు బీసీ నేత మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రస్తుత రిజర్వేషన్లే.. ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కొనసాగుతాయన్నారు. రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే రాజకీయ వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రిజర్వేషన్లు ఉండాలని, బీసీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలపై ఉన్న కసితోనే కేసీఆర్.. రిజర్వేషన్లు తగ్గించారని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం నుంచి 22 శాతం తగ్గించడం అన్యాయమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు జరిపించిందని గుర్తు చేశారు. జాతిని అమ్ముకుని టీఆర్ఎస్ బీసీ నేతలు రిజర్వేషన్లపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేయాలన్నారు. ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం కాదని, బడి పిల్లలకు బడిలు కట్టివ్వాలని సూచించారు. రిజర్వేషన్లు తగ్గించడం వలన 1500 మంది బీసీలు సర్పంచ్ అయ్యే అవకాశం కోల్పోయారన్నారు. అన్ని పార్టీలు బీసీల రిజర్వేషన్ల ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని కుల సంఘాల నాయకులు ఉద్యమించాలని, ప్రపంచంలో చాలా మంది నేతలను చూసామని, కేసీఆర్ అంత కన్నా గొప్పవాడేమి కాదన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
బెర్త్లు ఎవరికి?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్లో పదవుల ముచ్చట్లు మొదలయ్యాయి. శాసనసభ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలనుంచి టికెట్లు ఆశించి భంగపడిన నేతలను శాసన మండలిలో ఏర్పడనున్న ఖాళీలు ఊరిస్తున్నాయి. ఎన్నికల ముందు అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసేందుకు ఎమ్మెల్సీ ఆశలు కల్పించారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం చెప్పినట్టే వినడానికి పలువురు నాయకులు రాజీపడ్డారు. ఇప్పుడు శాసన సభ ఎన్నికలు ముగియడం, అనూహ్యమైన ఫలితాలు టీఆర్ఎస్కు రావడం, తమ తమ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపులో తమవంతు కృషి ఉండడం వంటి కారణాల నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉమ్మడి నల్లగొండనుంచి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత కర్నె ప్రభాకర్, నకిరేకల్ నియోజకవర్గంనుంచి మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి పూల రవీందర్ ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వీరంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న పూల రవీందర్ స్వతంత్ర ఎమ్మెల్సీ అయినా, ఆయన టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్నారు. ఇక, స్థానికసంస్థల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా పనిచేసినా, ఇటీవల ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగుస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు జిల్లానుంచే రెండు ఖాళీలు ఉన్నాయి. ఇవే కాకుండా గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావాల్సిన స్థానాలు మరికొన్ని ఉన్నాయి. ఆశగా ఎదురుచూపులు వివిధ సందర్భాల్లో పార్టీ నాయకత్వం పలువురు నాయకులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని హామీలు ఇచ్చింది. ఆ సమయం ఇప్పుడు రావడంతో హామీలు పొందిన నేతలంతా తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. స్థానిక సంస్థల నియోజకవర్గానికి పోటీ చేసి ఎన్నిక కావాల్సిందే. పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పదవీ కాలం మరో ఆరు నెలలు ఉంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల సభ్యులు ఓటర్లుగా మండలి స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, కేవలం ఆరు నెలల గడువే మిగిలి ఉండడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతుందా..? లేక, స్థానిక సంస్థలకు కొత్త పాలకవర్గాలు వచ్చాక జరుగుతుందా..? అన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ పదవీ కాలం మార్చితో ముగియనుండగా, మరోమారు పూల రవీందర్ టికెట్ ఆశిస్తున్నా రు. ప్రస్తుతానికి ఆ పార్టీకి చెందిన ఉపాధ్యాయ నేతలెవరి పేర్లూ టీచర్ ఎమ్మెల్సీ పదవి కోసం తెరపైకి రాలేదు. ఇక, గవర్నర్ కోటా, ఎమ్మెల్యే కోటాలో తమకు అవకాశం దక్కుతుందా, లేదా అన్న చర్చ కొందరు నేతల్లో మొదలైంది. రేసులో వేనేపల్లి ... వేముల ! కోదాడ నియోజకవర్గం నుంచి చివరి నిమిషం దాకా టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేక పోతున్నామని, మరో విధంగా ఆయన సేవలను వినియోగించుకుంటామని టికెట్ల ఖరారు సమయంలో పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని చెబుతున్నారు. నామినేషన్ల ఆఖరి రోజు అభ్యర్థిత్వం ఖరారైన బొల్లం మల్లయ్య యాదవ్ గెలుపులో వేనేపల్లి కృషి ఉందని, ఆయన ఎమ్మెల్సీ రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే మాదిరిగా, నకిరేకల్ నియోజకవర్గంనుంచి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఎమ్మెల్సీ పదవి రేసులో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి గెలిపిస్తే.. వేముల వీరేశాన్ని ఎమ్మెల్యే కంటే పెద్ద పదవిలో చూస్తారని ఎన్నికల ప్రచార సభలో పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో వేముల ఓటమి పాలయ్యారు. పార్టీలో సంస్థాగతంగా వివిధ సమీకరణలు, అవసరాల రీత్యా వేముల పేరును ఎమ్మెల్సీ పదవికి పరిశీలించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డికి గతంలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీ నెరవేరలేదు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్న ఆయన నల్లగొండ లోక్సభస్థానం నుంచి ఈసారి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన పేరును పరిశీలిస్తారా..? లేదా అన్న చర్చ జరుగుతోంది. సాగర్ నుంచి టికెట్ ఆశించిన ఎంసీ కోటిరెడ్డి, నల్లగొండ నియోజకవర్గం నాయకుడు చాడా కిషన్ రెడ్డి తదితరులు కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నవారి జాబితాలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఉమ్మడి జిల్లాలో ఒకరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ మందికి చోటు కల్పించే అవకాశాల్లేవని, ఈ లెక్కన మరికొందరిని స్థానిక సంస్థల కోటా జరిగే ఎన్నిక వరకు వెయిటింగ్లో పెట్టే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘గుత్తా’కు చోటు దక్కేనా ? నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి సీఎం కేసీఆర్ కేబినెట్లో బెర్తును ఆశిస్తున్నారు. ఆయనను శాసన మండలికి తీసుకుని మంత్రి పదవి కట్టబెడతారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. ఆయన పార్టీలో చేరే ముందు ఇదే హామీ ఇచ్చారని, గత ప్రభుత్వంలో అవకాశం కల్పించలేక పోయినందున, ఈసారి ఎమ్మెల్సీగా తీసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో గుత్తా ఎన్నికల బాధ్యతలు చూసిన దేవరకొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. దేవరకొండలో టీఆర్ఎస్కు ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజారిటీ లభించింది. ఈ రెండు స్థానాలతో పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనూ ఆయన కొంత బాధ్యత మోశారు. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకుని మండలిలో గుత్తాకు చోట దక్కుతుందా..? లేదా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. -
ఆమెకు అందలం
జెడ్పీ సెంటర్, మహబూబ్నగర్ : మహిళలు ఇంటికే పరిమితం కాకుండా రాజకీయాల్లో రాణించడం ద్వారా సమస్యల పరిష్కారం సులువవుతుంది.. అంతేకాకుండా సాధికారత కూడా సాధ్యమవుతుంది.. ఇదే భావనతో ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు కేటాయించడంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నారీమణులు సిద్ధమవుతున్నారు. ఈనెలలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించగా.. జనరల్ స్థానాల్లో వారు పోటీ చేసేందుకు వెసలుబాటు ఉంది. తద్వారా మహబూబ్నగర్ జిల్లాలో అతివలకు కేటాయించిన 359 స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లో కూడా వారు పోటీకి గెలిస్తే మహిళా సర్పంచ్ స్థానాల సంఖ్యే ఎక్కువగా ఉండనుంది. 26 మండలాల్లో 359 స్థానాల కేటాయింపు మహబూబ్నగర్ జిల్లాలో 26 మండలాలు ఉండగా.. 721 గ్రామపంచాయితీల్లో ఎన్నికల జరగనున్నాయి. ఇందులో 359 గ్రామపంచాయితీలు మహిళలకు రిజర్వేషన్ కావడంతో పోటీకి సిద్ధమవుతున్నారు. నూతన పంచాయితీ రాజ్ చట్టం ద్వారా మహిళలకు పెద్దపీట దక్కగా.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల్లో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించారు. అత్యధికంగా జిల్లాలో నవాబుపేట మండలంలో 27 స్థానాలకు మహిళలకు రిజర్వ్ కాగా, ఆ తర్వాత గండీడ్లో 25, మద్దూరులో 24, జడ్చర్లలో 23, మక్తల్లో 21, కోయిల్కొండలో 20 స్థానాలు దక్కాయి. అత్యల్పంగా మూసాపేట, కృష్ణా మండలాల్లో ఏడు చొప్పున స్థానాలకు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఇక మిగిలిన స్థానాల్లో కూడా పురుషులతో పాటు పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతివల ఆనందం పంచాయితీ ఎన్నికల్లో సగం స్థానాలు దక్కడంతో నారీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం మహిళలపై శ్రద్ధ కనబర్చి ఈ నిర్ణయాన్ని తీసుకుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజకీయంగా మహిళలు ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. కలిసొచ్చిన రిజర్వేషన్ను సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల్లోని పలువురు మహిళలు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధికారత పంచాయతీల్లో రిజర్వేషన్ కారణంగా వేలాది మంది మహళలు రాజకీయం రంగంలోకి వస్తున్నారు. నాయకత్వం వహించాలని, రాజకీయాల్లో రాణించాలనే తపన ఉన్న వారికి ఈ రిజర్వేషన్లు వరంగా మారాయి. సర్పంచ్లు గా, వార్డు మెంబర్లుగా గెలిచిన పలువురు ఇప్పటికే ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ మేరకు వారి స్ఫూర్తి, కలిసొ చ్చిన రిజర్వేషన్లు ఉపయోగించుకునేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. సమస్యలు కూడా... చట్ట ప్రకారం మహిళలకు పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్ అందుతున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉంటం లేదనే విమర్శలున్నాయి. మహిళా రిజర్వేషన్ వచ్చిన చోట అప్పటికే ప్రజాప్రతినిధులుగా, రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్న వారు తమ కుటుంబం నుంచి మహిళను పోటీకి దింపి గెలిపించాక మళ్లీ తామే పెత్తనం చెలాయిస్తుండడం గమనార్హం. అయితే, సొంత తెలివితేటలు, కుటుంబ సభ్యుల సహకారం మాత్రమే తీసుకుంటూ గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్న వారు కూడా ఉన్నారు. రాజకీయంగా రాణించేందుకు అవకాశం పంచాయితీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో రాజకీయంగా రాణించేందుకు ఎంతో దోహదపడుతుంది. ఇంటికే పరిమితమైన మహిళలు పలువురు రాజకీయల్లో రాణించేందుకు అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. రాజకీయాల్లో ఎదగాలంటే పల్లె స్థాయిలోనే మొదటి అడుగు పడాలి. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. – తిరుపతమ్మ, పీలేరు -
మోగిన పంచాయతీ నగరా
సాక్షి, వరంగల్ రూరల్: పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను మంగళవారం విడుదల చేశారు. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21, 25, 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి ప్రకటించారు. జిల్లాలోని 16 మండలాల్లో 401 గ్రామ పంచాయతీలు, 3,544 వార్డులు ఉన్నా యి. మొత్తం ఓటర్లు 4,64,199 మంది ఉండగా మహిళా ఓటర్లు 2,33,052, పురుషులు 2,31,138, ఇతరులు 9 మంది ఉన్నారు. అందులో బీసీలు 2,71,027, ఎస్సీలు 81,557, ఎస్టీ ఓటర్లు 72,363, జనరల్ 39,242 మంది ఉన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి ఎస్సీలకు 75, ఎస్టీలకు 101, బీసీలకు 69, అన్రిజర్వ్డ్కు 156 గ్రామపంచాయతీలు కేటాయించా రు. అన్ని కేటగిరీల్లోనూ 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించారు. ఈ ప్రక్రియనంతా డిసెంబర్ 29న పూర్తి చేశారు. మూడు విడతల్లో.. జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 21న మొదటి విడతలో 145 గ్రామపంచాయతీలు, 1,264 వార్డులకు, ఈ నెల 25న రెండో విడతలో 136 గ్రామపంచాయతీలు, 1,210 వార్డులకు, ఈ నెల 30న మూడో విడతలో 120 గ్రామ పంచాయతీలు, 1,070 వార్డులకు ఎన్నికలకు జరగనున్నాయి. మొదటి విడత.. మొదటి విడతకు ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 10న స్క్రూట్నీ, 11న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. గుర్తుల కేటాయింపు తర్వాత జనవరి 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. రెండో విడత రెండో విడత ఎన్నికలకు ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 14న స్క్రూట్నీ, 15న ఉపసంహరణ ఉంటుంది. జనవరి 25న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మూడో విడత మూడో విడతకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19న స్క్రూట్నీ, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. జనవరి 30న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం ఎన్నికలు.. సాయంత్రం ఫలితాలు.. గ్రామపంచాయతీ ఎన్నికలను ఎప్పటిలాగే ఉదయం నిర్వహించి సాయంత్రం ఫలితాలను ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ను ప్రారంభించి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ను నిర్వహిస్తారు. మధ్నాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ప్రకటిస్తారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. గ్రామంలోని వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వార్డుల వారీగానే ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. వార్డుల లెక్కింపు పూర్తయిన తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించి అప్పటికప్పుడే ఫలితాలను ప్రకటిస్తారు. పూర్తిగా బ్యాలెట్ పేపర్లతో జరుగనున్న ఎన్నికలు కావడంతో కొన్ని గ్రామాల్లో ఓట్ల లెక్కింపు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఫలితంపై పోటీలో ఉన్న అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తే రీకౌంటింగ్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్కు రూ.2 వేలు డిపాజిట్.. జనరల్ స్థానంలో గ్రామపంచాయతీలో సర్పంచ్గా పోటీ చేసే వారు రూ.2 వేలు, వార్డు మెంబ ర్కు రూ.500, రిజర్వేషన్ అయిన గ్రామాల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు రూ.1,000, వార్డు మెంబర్ స్థానాలకు రూ.250 డిపాజిట్ చెల్లించా ల్సి ఉంటుంది. ఐదు వేలకు మించి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.5 లక్షలు, వార్డు మెంబర్ అభ్యర్థులు రూ.50 వేలకు మించి ఖర్చు చేయొద్దు. 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.5 లక్షలు, వార్డు మెంబర్ అభ్యర్థులు రూ.30 వేలకు మించి ఖర్చు చేయొద్దు అని రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు విధించింది. తొలిసారిగా ‘నోటా’ ఎన్నికల్లో అనేక సంస్కరణలు ప్రవేశపెడుతున్న ఎన్నికల సంఘం తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటాను ప్రవేశపెట్టింది. ఇది బ్యాలెట్ పేపర్లో చివరి స్థానంలో ఉంటుంది. సర్పంచ్, వార్డు ఎన్నికల్లో ఒక్క ఓటుతోనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ సారి నోటా ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. మండలం పేరు జీపీలు వార్డులు చెన్నారావుపేట 30 258 నెక్కొండ 39 340 ఆత్మకూరు 16 152 దామెర 14 132 గీసుకొండ 21 188 మొత్తం 401 3,544 మండలం పేరు జీపీలు వార్డులు పరకాల 10 94 నడికుడ 14 138 శాయంపేట 24 212 నల్లబెల్లి 29 252 ఖానాపురం 20 178 రాయపర్తి 39 336 -
పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మంగళవారం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ను ప్రభుత్వం 34 శాతం నుంచి 22శాతానికి తగ్గించిందని, ఈ నేపథ్యంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల మూడో తేదీన (గురువారం) తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ అంశంపై కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. -
బీసీల లెక్కలు తేల్చాకే ‘పంచాయతీ’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకొని అసభ్యకర భాషలో విమర్శిస్తున్నారని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. సుప్రీంకోర్టుకు బీసీ జనాభా లెక్కలు సమర్పించి రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడి ఆదర్శ్నగర్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ద్వారా జరిగే మార్పులు ఏమీ ఉండవని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు తీవ్ర ప్రభావం చూపిందన్నారు. తెలంగాణ అమరులు, ఉద్యమకారుల సంక్షేమం గురించి కేసీఆర్ ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. వివిధ పత్రికలు, చానెళ్లను చెప్పుచేతల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో యాజమాన్యాలను బెదిరించడం అప్రజాస్వామికమన్నారు. సుధాకర్ సమక్షంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధికార ప్రతినిధి కాసుల కృష్ణ ఇంటి పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఇంటి పార్టీయేనని, అందుకే ఈ పార్టీలో చేరుతున్నానని కాసుల కృష్ణ తెలిపారు. సమావేశంలో ఇంటి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొమ్మాట వెంకటేశ్వర్లు, బుర్ర శ్రీనివాస్గౌడ్, నేతలు కొమురయ్య, హరీశ్యాదవ్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పంచాయతీ’పై రాద్ధాంతం ఎందుకు?: కరుణాకర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం తగదని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 22.79 శాతానికి పరిమితం చేయడాన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. ఆదివారం ఇక్కడ ఆదర్శనగర్లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నిరకాల రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించకుండా ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తమిళనాడులో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రిజర్వేషన్లున్నాయని, బీసీలకు ఒక్క శాతం కూడా రిజర్వేషన్లు లేవని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓసీలకు అన్యాయం జరగకుండా ఓసీలు అత్యధిక జనాభా ఉన్న గ్రామాలను ఇతర వర్గాలకు కేటాయించకుండా జనరల్ స్థానాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం నాయకులు రాజశేఖర్రెడ్డి, విశ్వేశ్వర్, ప్రవీణ్ కుమార్, విజయానంద్ పాల్గొన్నారు -
బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ రద్దు చేయాలి
హైదరాబాద్: పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ తగ్గింపు ఆర్డినెన్స్ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. 34 శాతం ఉన్న రిజర్వేషన్ 22కు తగ్గించడం హేయమైన చర్య అని విమర్శించారు. బీసీలను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆదివారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్పై 15 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. అఖిలపక్ష నాయకులు, న్యాయనిపుణులతో 10 నిమిషాలు మాట్లాడే సమయం కూడా సీఎంకు లేదా అని ప్రశ్నించారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని, దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు వి.జి.ఆర్. నారగోని మాట్లాడుతూ కేసీఆర్ బీసీలను దుర్మార్గమైన పరిస్ధితుల్లోకి నెట్టివేస్తున్నారని విమర్శించారు. 94 పంచాయతీరాజ్ చట్టంలో 34 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఉందని, ఈ హక్కును తీసేసి కేసీఆర్ బీసీల ద్రోహిగా మారారని సామాజికవేత్త ఉ.సాంబశివరావు అన్నారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు ఎ.ఎల్.మల్లయ్య, లెల్లెల బాలకృష్ణ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రామగౌడ్, ఓయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జాజుల లింగం, ప్రొఫెసర్ వెంకటేశ్, ఎం.జీతయ్య, ఎం. రాజేందర్, డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలి..
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్సును ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష పార్టీలు, 112 బీసీ కులసంఘాలు సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశాయి. ఆదివారం ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ నాయకత్వంలో జరిగిన భేటీకి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాం హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో ఉన్న పెండింగ్ ఇంటీరియం స్టే ఆర్డర్ను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని, దీనికోసం సీఎం అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో చర్చించాలని అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. బీసీలపై కేసీఆర్కు చిన్నచూపు: ఉత్తమ్ పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గించడం సీఎం కేసీఆర్కు బీసీల పట్ల ఉన్న చిన్నచూపును తెలియజేస్తోంది. బీసీల సంక్షేమం కోసం తామే అన్నీ చేసినట్లు కేసీఆర్ మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమైంది కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడం లేదు. బీసీల రాజకీయ ఎదుగుదలను అణగదొక్కడానికి అర్ధరాత్రి పంచాయతీరాజ్ రిజర్వేషన్ల చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం సరైంది కాదు. మంత్రి వర్గ నిర్మాణం జరగకముందే, ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయకుండా కొత్త ప్రభుత్వం రాకుండా ఆర్డినెన్సు ఎలా జారీ చేస్తారు. ప్రపంచంలోనే అద్భుతంగా జరిగిందని చెప్పుకునే సమగ్ర సర్వేలో బీసీల జనాభా 51 శాతం ఉందని తేలినా కూడా జనాభా ప్రాతిపదికన ఎందుకు రిజర్వేషన్లు కల్పించడం లేదు. రాష్ట్రం ఏర్పడ్డాక బీసీలకు రూ.25 కోట్లు ఖర్చు పెడతామన్న కేసీఆర్ ఐదేళ్లలో 10 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారు. బీసీలకు అన్యాయం: కోదండరాం సంక్షేమంలేని అభివృద్ధి ప్రజాస్వామ్యానికి పనికిరాదు. అందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వాలు రిజర్వేషన్లను రూపకల్పన చేయాలి. కానీ, రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. బీసీ రిజర్వేషన్లు లెక్కించడంలో అన్యాయం చేశారు. బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీచేసిన ఆర్డినెన్సు ఉపసంహరించుకోవాలి. గత 30 ఏళ్లుగా 34 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. అప్పుడు లేని అవరోధాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి. ఎన్ని త్యాగాలు, పోరాటాలు చేసైనా ఈ రిజర్వేషన్లు కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలపై ఉంది. దీనికోసం పటిష్టమైన కార్యాచరణను రూపొందించి గ్రామాలవారీగా తమ నిరసనలు తెలియజేస్తాం. ఈ సదస్సులో లేవనెత్తిన అన్ని అంశాలను కరపత్రంగా తయారు చేసి ఊరూరా పంచుతాం. బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచకపోతే కేసీఆర్ బీసీల ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు. బీసీలపై ప్రభుత్వం కుట్రపూరిత చర్యలు: ఆర్.కృష్ణయ్య ప్రభుత్వం బీసీలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. జాతికి అన్యాయం జరిగితే తెగించి పోరాడుతాం. జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 56 శాతానికి పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం సుప్రీంకోర్టును సాకుగా చూపుతూ తగ్గించడం అన్యాయం. సుప్రీంతీర్పు కొత్తగా వచ్చింది కాదు. 2010లోనే ఆ తీర్పు వచ్చింది. తీర్పు వచ్చిన తర్వాత 2013లో గ్రామ పంచాయతీ, 2014లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 34 శాతంతో జరపలేదా? ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిజర్వేషన్లపై వేసిన అప్పీల్ను ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పడం లేదు. రెండు కోట్ల బీసీల గొంతుకోస్తామంటే ఊరుకునేది లేదు. బీసీలకు అన్యాయం జరిగితే సహించేదిలేదు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు అభిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మంత్రిమండలితో సమావేశం ఏర్పాటు చేసి ఆర్డినెన్సు జారీ చేయాలి. కానీ, అలా చేయడం లేదు. బీసీలందరూ మేలుకోకపోతే 34 శాతం రిజర్వేషన్లను సాధించుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకపోతే జీవితకాలంలో రాజకీయంగా ఎదగలేరు. తెలంగాణలోని అన్ని బీసీవర్గాలు కలసికట్టుగా పోరాటం చేసి రిజర్వేషన్లు కాపాడుకోవాలి. -
గందరగోళ ‘పంచాయతీ’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ఎట్టకేలకు సర్పంచ్ స్థానాలను కేటగిరీల వారీగా ఖరారు చేసినా.. వార్డుల విభజన మాత్రం కొలిక్కిరాలేదు. మార్గదర్శకాల అమలులో స్పష్టతలేకపోవడం.. ఫార్ములాను పాటించకపోవడంతో వార్డుల రిజ ర్వేషన్ల వ్యవహారం గందరగోళంగా మారింది. ముఖ్యంగా మహిళలకు కేటాయించే సీట్ల సంఖ్య నిర్దేశిత కోటాను మించిపోవడంతో యంత్రాంగం తలపట్టుకుంది. శనివారంలోపు గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డుల రిజర్వేషన్ల జాబితాను నివేదించాలని ప్రభు త్వం ఆదేశించింది. దీంతో మూడు రోజులుగా రిజర్వేషన్ల ఖరారుపై ఆర్డీఓ, ఎంపీడీఓ, పంచాయతీ అధికారులు కుస్తీ పడుతున్నారు. అయితే, ప్రతి కేటగిరీలోనూ 50శాతం స్థానాలను మహిళలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో రిజర్వేషన్లను 50శాతానికే పరిమితం చేయాలని ఆదేశించింది. ఇది రిజర్వేషన్ల ఖరారులో యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. జనరల్ స్థానాలను లాటరీ పద్ధతిలో ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నా కొన్ని మండలాల్లో మూడేసి స్థానాలుంటే మొదటి రెండింటిని స్త్రీలకు కేటాయించినట్లు తెలిసింది. దీంతో ఆయా మండలాల్లో నిర్దేశిత 50శాతం కంటే అధికంగా మహిళలకు రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఉదాహరణకు మంచాల మండలంలో మొత్తం 208 వార్డులుండగా.. ఇందులో జనరల్ 87, మహిళలకు 121 స్థానాలు దక్కాయి. దీంతో మహిళలకు 50శాతం కంటే అధికంగా సీట్లు లభిస్తున్నాయి. అలాగే మరో మండలంలోనూ ఇదే విచిత్రం జరిగింది. ఆ మండలంలో 232 వార్డులు ఉండగా.. జనరల్ 96, స్త్రీలకు 136 వార్డులు ఖరారు కావడంతో యంత్రాంగం తలపట్టుకుంది. వార్డుల విభజన ప్రక్రియను ఎంపీడీఓ, ఈఓపీఆర్డీల కనుసన్నల్లో జరుగుతున్నాయి. అయితే, ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా వ్యవహరించకపోవడంతో వార్డుల విభజనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉన్నతాధికారులు కూడా సందేహాలను నివృత్తి చేసేందుకు చొరవ చూపకపోవడంతో వార్డుల రిజర్వేషన్ల ఖరారు పూర్తికాలేదు. రిజర్వేషన్ల ఖరారులో ఎస్సీ, ఎస్టీలకు జనాభా, బీసీలకు ఓటర్లను ప్రామాణికంగా తీసుకోవాలని, వార్డులకు పంచాయతీని యూనిట్గా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సూత్రం ప్రకారం జనసంఖ్యను ఎగువ నుంచి దిగువకు లెక్కకట్టాలని తేల్చింది. ఈ సూత్రీకరణను ఆర్థంచేసుకోవడంలో పొరపాటు జరగడంతో మొత్తం ప్రక్రియకే ఎసరు తెచ్చిపెట్టింది. -
మండలాలు ఓకే..
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): గ్రామపంచాయతీ రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పంచాయతీ ఏ వర్గానికి రిజర్వ్ అయిందనే విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పటికే జిల్లా యూనిట్గా రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసిన విషయం విదితమే. ఇక జిల్లా స్థాయిలో మండలాల వారీగా రిజర్వేషన్ల సంఖ్యను అధికారులు వెల్లడించినా.. జీపీల వారీగా మాత్రం రిజర్వేషన్ల ఖరారుపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. దీంతో ప్రజల్లోనే కాకుండా ఆశావహులు తమ గ్రామ సర్పంచ్ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతుందనే అంశంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం 721 గ్రామపంచాయతీలు జిల్లాలో పాతవి, కొత్తవి కలుపుకుని మొత్తం 733 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో 12 జీపీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయగా.. మిగిలిన 721 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా యూనిట్గా ప్రభుత్వం ఇటీవల రిజర్వేషన్లు వెల్లడించారు. ఇందులో భాగంగా 307 స్థానాలను జనరల్కు, 170 స్థానాలను బీసీలకు రిజర్వ్ చేయగా.. కొత్త పంచాయతీలుగా ఏర్పడిన 107 తండాలు వారికే రిజర్వ్ చేశారు. అలాగే, ఎస్సీలకు 107 స్థానాలు రిజర్వ్ చేసిన విషయం విదితమే. ఇక మైదాన ప్రాంతంలోనూ 30 జీపీలను ఎస్టీలకు రిజర్వ్ చేస్తూ నిర్ణయించారు. మండలాల రిజర్వేషన్లు ఇలా... జిల్లా యూనిట్గా ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రకారంఅధికారులు మండలాల వారీగా రిజర్వేషన్ల వివరాలు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా లోని కృష్ణా, మాగనూర్, మక్తల్, నర్వ మం డలాల్లో ఎస్టీలకు ఒక్క స్థానం కూడా దక్కడం లేదు. ఇక దేవరకద్ర మండలంలో 100 శాతం ఎస్టీలు ఉన్న జీపీలు లేకపోగా.. మైదా న ప్రాంతానికి సంబంధించి మాత్రం ఒక్క స్థానం ఎస్టీలకు దక్కనుంది. అలాగే, అడ్డాకుల మండలంలోనూ జీపీగా మారిన తండా ఒక్కటే ఉండగా అది ఎస్టీలకు దక్కనుంది. అయితే, మైదాన ప్రాంత జీపీల్లో మాత్రం ఎస్టీలకు ఏ ఒక్కటీ రిజర్వ్ కాలేదు. ఇంకా బాలానగర్ మండలంలో 37 జీపీలు ఉండగా.. అత్యధికంగా 17 జీపీలు గిరిజనులకు రిజర్వ్ చేశారు. అలాగే, ఎస్సీలకు సంబంధించి దామరగిద్ద, జడ్చర్ల, మ ద్దూర్, నారాయణపేట, నవాబ్పేట, ఊట్కూరు మండలాల్లో ఆరేసి స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఈ కేటగిరీలో అతి తక్కువగా కృష్ణా, మూసాపేట మండలాల్లో అతి తక్కువగా రెండేసి స్థానాలు దక్క నున్నాయి. అలాగే, బీసీల విషయానికొస్తే మక్తల్ మండలంలో ఎక్కువగా 15 స్థానాలు రిజర్వ్ అ య్యాయి. జనరల్ కేటగిరీని పరిశీలిస్తే నవాబుపేట మండలంలో 22 స్థానాలు రిజర్వ్ చేశారు. మొత్తం గా అన్ని కేటగిరీలు కలిపి 359 స్థానాలు స్త్రీలకు రిజర్వ్ చేయగా.. 362 స్థానాలను జనరల్ కేటగిరీకి కేటాయించారు. ఈ స్థానాల్లో స్త్రీ, పురుషుల్లో ఎవరైనా పోటీ చేసే అవకాశముంటుంది. నేడు గ్రామాల వారీగా... జిల్లాలో మొత్తం 721 గ్రామపంచాయతీలు ఉండగా ఏ గ్రామం ఎవరికి రిజర్వ్ అవుతుందనే అంశం శనివారం తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సోమవారం జిల్లా యూనిట్గా ప్రభుత్వం రిజర్వేషన్లు వెల్లడించగా.. అధికారులు తీవ్ర కసరత్తు అనంతరం మండలాల వారీగా రిజర్వేషన్లను శుక్రవారం ప్రకటించారు. ఇక గ్రామాల వారీగా రిజర్వేషన్లు ఖరారుపై శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు అధికారులు కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు శనివారం ఈ వివరాలనువ వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. పీఓ, ఏపీఓలకు ఎన్నికల శిక్షణ ఓ పక్క రిజర్వేషన్లపై కసరత్తు చేస్తున్న అధికారులు.. మరోపక్క ఎన్నికల నిర్వహణపై కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగా పీఓ, ఏపీఓలుగా గుర్తించిన ఉద్యోగులు నాలుగు రోజుల పాటు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇచ్చే శిక్షణ కొనసాగుతోంది. మాస్టర్ ట్రెయినర్లు నర్సింగ్రావు, గోపాల్నాయక్, మొగులప్ప, నటరాజ్.. బ్యాలెట్ బాక్స్ సీలింగ్, బ్యాలెట్ పేపర్ ఎలా వాడాలి, పోలింగ్ కేంద్రంలో అనుసరించాల్సిన పద్దతులు, ఓటర్లతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 31వ తేదీ వరకు కొనసాగనుంది. మూడు విడతల్లో ఎన్నికలు జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. ప్రతీ విడతలతో 7 నుంచి 8 మండలాల్లోని జీపీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ వెలువడిన 15 రోజుల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారులకు మార్గదర్శకాలు అందాయి. -
రిజర్వేషన్లు తగ్గిస్తే ‘పంచాయితే’
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గిస్తే ఊరుకోబోమని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. తక్షణమే బీసీల రిజర్వేషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు యథావిధిగా 34 శాతంగా అమలు చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండాలంటే రాష్ట్ర కేబినెట్ తీర్మానం ప్రకారం వెంటనే బీసీ జనగణన నిర్వహించి బీసీల జనాభా లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషిని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, కాసాని జ్ఞానేశ్వర్, లెఫ్ట్, ఇంటిపార్టీ నేతలు కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి బీసీలను రాజకీయంగా అణచివేసే ప్రక్రియను టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిందని ఆరోపించారు. బీసీ జనగణన లెక్కలు లేకపోవడంతో కోర్టు తీర్పులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వస్తున్నాయని, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లను యథావిధిగా అమలు చేయాలని అన్నారు. ఎల్.రమణ మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు రావడంతో తెలంగాణలో దొరల, పటేళ్ల రాజ్యం తగ్గిందని, ఇప్పుడు ఆ రిజర్వేషన్లు తగ్గించి మళ్లీ పెత్తందారీ వ్యవస్థ పెరిగేలా చూస్తున్నారని వాపోయారు. దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రిజర్వేషన్లు తగ్గిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీల రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు... పొన్నాల, వీహెచ్ మాట్లాడుతూ బీసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఎవరికీ రిజర్వేషన్లు తగ్గించకుండా బీసీల మాత్రమే ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. గొర్రెలు, బర్రెలు కాయడానికే బీసీలుండాలని కేసీఆర్ భావిస్తున్నారా.. అని ప్రశ్నించారు. కలెక్టరేట్ల ముట్టడికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ మద్దతు ప్రకటించారని తెలిపారు. జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ రెండో సారి సీఎం అయ్యాక ప్రధాని నరేంద్రమోదీని కలసి 16 డిమాండ్లు అడిగినప్పుడు బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. దీనిపై కనీసం చర్చకు రాకపోవడం బీసీలను మోసం చేయడమేనన్నారు. శనివారం జరిగే రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి యథా తథంగా ఉంటుందన్నారు. జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు దామాషా ప్రకారం పెంచేదిపోయి తగ్గించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాండురంగాచారి, టీజేపీ నేత ప్రకాశ్, బీసీ నేతలు ఎస్. దుర్గయ్య, తాటికొండ విక్రంగౌడ్, గొడుగు మహేశ్, కొటికే రాము, కొప్పుల చందు, లక్ష్మణ్, రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఏ గ్రామం ఎవరికో..?
ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ వస్తుందో నేటితో తేలిపోనుంది. గురువారం అధికారులు లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వ్డ్ గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రానుంది. ఇప్పటికే అధికారులకు ఏ విధంగా రిజర్వేషన్ కేటాయించాలో కలెక్టర్ అవగాహన కల్పించారు. దీంతో ఆశావహులు ఆసక్తిగా గమనిస్తున్నారు. తమకు అనుకూలంగా వస్తుందా..? రాదా..? అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సాక్షి, మెదక్: జిల్లాలో పంచాయతీ ఎన్నికలపై చర్చ ఊపందుకుంది. ఇప్పటికే పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ ధర్మారెడ్డి పర్యవేక్షణలో డీపీఓ, ఆర్డీఓలు రిజర్వేషన్లపై కసరత్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రం రిజర్వేషన్లపై అమలులో పాటించాల్సిన మార్గదర్శకాల గురించి కలెక్టర్ ఆర్డీఓలు, ఎంపీడీఓలకు అవగాహన కల్పించారు. లాటరీ పద్ధతిలో మహిళా రిర్వేషన్లను ఖరారు చేయనున్నారు. అలాగే జనాభా ప్రాతిపదికన మండల యూనిట్గా ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లను చేపట్టనున్నారు. నేడో, రేపో గ్రామాల వారీగా పంచాయతీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆశావహుల్లో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. జిల్లాలోని 20 మండలాల్లో మొత్తం 469 పంచాయతీలున్నాయి. ఇందులో 236 గ్రామాలను మహిళలకు రిజర్వు చేశారు. వందశాతం ఎస్టీ జనాభా ఉన్న 63 పంచాయతీలను, జనాభా ప్రాతిపదికన అదనంగా మరో 17 గ్రామాలను ఎస్టీలకు రిజర్వు చేశారు. దీంతో ఎస్టీలకు కేటాయించిన స్థానాల సంఖ్య 80కి చేరింది. ఎస్సీలకు 66, బీసీలకు 120 పంచాయతీలను రిజర్వు చేశారు. జనరల్ కేటగిరిలో 233 పంచాయతీలను ఉంచారు. 2011 జనాభా ఆధారంగా మండలం యూనిట్గా ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలంటూ ప్రభుత్వం అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా కలెక్టర్ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో గురువారం అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. డీపీఓ హనూక్, ఆర్డీఓలు వీరబ్రహ్మాచారి, వెంకటేశ్వర్లు, శ్యాంప్రకాశ్లు రిజర్వేషన్ల ప్రక్రియపై కసరత్తు చేపట్టారు. లాటరీ పద్ధతిలో మహిళలకు రిజర్వు చేసిన పంచాయతీలను ఎంపిక చేశారు. జనాభా ఆధారంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ పంచాయతీల రిజర్వేషన్లను నేడు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు వివరాలు ప్రకటించనున్నారు. గత ఎన్నికలో కంటే బీసీలకు తక్కువ పంచాయతీలు రిజర్వు కానున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల శాతం తగ్గటమే ఇందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు. ఓటర్ల లెక్క తేలింది.. జిల్లాలో ఓటర్ల లెక్క కూడా తేలింది. మొత్తం పంచాయతీల్లో 4,63,405 మంది ఓటర్లున్నారు. ఇందులో బీసీ ఓటర్లు 2,97,091 మంది ఉండగా ఎస్సీ ఓటర్లు 77,741, ఎస్టీ ఓటర్లు 50,451 మంది ఉన్నారు. బీసీ ఓటర్లులో మహిళలు 1,52,161 ఉండగా పురుషులు1,44,920 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లలో మహిళలు 25,738 మంది ఉండగా పురుషులు 24,713 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లలో మహిళలు 40,576 ఉండగా పురుషులు 37,163 మంది ఉన్నట్లు తేలింది. ఓటర్ల సవరణలో భాగంగా జిల్లాలో 15,096 మంది ఓట్లు తొలగించగా 1,784 మంది ఓటర్ల పేర్లు, చిరునామాలు సవరించారు. ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య కొంత మేర పెరిగే అవకాశం ఉంది. జనవరి 25వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. దీంతో ఎన్నికలు నిర్వహించే సమయానికి ఓటర్ల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రస్తుతమున్న 34 శాతం రిజర్వేషన్లను యథాతధంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఏం నాయకులు డిమాండ్ చేశారు. అలాగే బీసీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలన్నారు. ఈ రెండు డిమాండ్ల సాధన కోసం గురువారం లక్డీకపూల్లోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎంబీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య, బీసీ సబ్ప్లాన్ రాష్ట్ర కార్యదర్శి కిల్లె గోపాల్ మాట్లాడుతూ.. జనాభాలో 53 శాతం ఉన్న బీసీలకు భిన్నంగా రిజర్వేషన్లు నిర్వహించడం అవమానిండమేనని అన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. దీన్ని కాదని 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి కుదించడమేంటని ప్రశ్నించారు. అనాలోచిత నిర్ణయంతో సీఎం కేసీఆర్ బీసీల ద్రోహిగా మారారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను తగ్గించిన ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎంబీసీలు తదితర సంచార జాతులకు స్థానిక సంస్థల్లో అవకాశాలు కల్పించేందుకు వీలుగా బీసీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలంతా ఏకమై సీఎం కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ డీఎస్ లోకేశ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భూపాల్, జిల్లా కోర్ కమిటీ సభ్యులు పి.యాదయ్య, ఎం.చంద్రమోహన్, డి.రాంచందర్, నాయకులు ఇ.నర్సింహ, ఎన్.రాజు, డి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: బీసీలకు జనాభా ప్రాతిపది కన రిజర్వేషన్ల కేటా యింపు విషయంలో బీసీ సంఘాలు చేస్తున్న పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. జనాభా ప్రాతిపది కన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని గురువారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పంచాయతీ ఎన్నిక ల్లో బీసీలకు కేవలం 22 శాతం రిజర్వేషన్లు కేటా యించారని, దీని వల్ల రాష్ట్రంలోని అనేక గ్రామా ల్లో బీసీలకు పంచాయతీల్లో రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీసీలలో కూడా ఏ, బీ, సీ, డీ, ఈ విభజన ప్రకారం కులాల గణన చేయాల్సి ఉందని, ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా 34 శాతం ఉన్న రిజర్వేషన్లను కేవలం 22 శాతానికి పరిమితం చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి బీసీలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు చేయనున్న నిరవధిక పోరాటాల లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాలు పం చుకోవాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. -
ఆమోదమే తరువాయి!
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రం యూనిట్గా రిజర్వేషన్ శాతాలను ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిర్ణయిం చింది. ఈ శాతాలకు అనుగుణంగా జిల్లాలో కేటగిరీల వారీగా కేటాయించాల్సిన సర్పంచ్ స్థానాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలకు గాను, 74 పంచాయతీలను షెడ్యూల్ ఏరియా పంచాయతీలుగా ఎస్టీలకు కేటాయించింది. మిగతా 573 పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్ల గణాంకాలకు అనుగుణంగా ఆయా కేటగిరీలకు మండలాల వారీగా నిర్ణయించాల్సి ఉంది. మండలాల వారీగా ఏయే కేటగిరీలకు ఎన్ని స్థానాలు రిజర్వు చేయాలనే అంశంపై జిల్లా పంచాయతీ అధికారులు కసరత్తు పూర్తి చేసి కలెక్టర్ ఆమోదం కోసం పంపించారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలకు గాను వంద శాతం గిరిజన జనాభా ఉన్న 74 పంచాయతీలను షెడ్యూలు పంచాయతీలుగా పేర్కొంటూ సర్పంచ్ పదవులను ఎస్టీలకు కేటాయించారు. మిగతా 573 పంచాయతీలను నాన్ షెడ్యూలు పంచాయతీలుగా పేర్కొంటూ.. సర్పంచ్ పదవులను రిజర్వు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. నాన్ షెడ్యూల్డ్ పంచాయతీల్లో ఎస్టీలకు 19, ఎస్సీలకు 129, బీసీలకు 138 సర్పంచ్ పదవులతో పాటు, అన్ రిజర్వుడు కేటగిరీలో 278 మందికి కేటాయించాల్సిందిగా ఆదేశించింది. ప్రతీ కేటగిరీలోనూ మహిళల రిజర్వేషన్ కోటా 50శాతం ఉండాలని ఆదేశించింది. దీంతో జిల్లాను యూనిట్గా తీసుకుని తిరిగి మండలాల వారీగా సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్ కోటాను జిల్లా పంచాయతీ విభాగం నిర్ణయించింది. మండలాల వారీగా ఏయే కేటగిరీలకు ఎన్ని స్థానాలు కేటాయిం చాలనే అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం కలెక్టర్ ఆమోదం కోసం పంపారు. గురువారం ఉదయం ఈ ప్రతిపాదనలను కలెక్టర్ ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కలెక్టర్ ఆమోదించిన తర్వాత సంబంధిత ఆర్డీఓల పర్యవేక్షణలో ఈ నెల 29వ తేదీలోగా మండలాలు, కేటగిరీల వారీగా సర్పంచ్ పదవుల రిజర్వేషన్లపై స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే జిల్లాలోని 5,778 గ్రామ పంచాయతీ వార్డులకు గాను, 74 షెడ్యూల్డు పంచాయతీల్లోని వార్డులను మినహాయించి మిగతా వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేయడంపైనా అధికారులు సన్నద్ధమవుతున్నారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు మండలాన్ని యూనిట్గా తీసుకుని, గ్రామ పంచాయతీలో ఏయే కేటగిరీలకు ఎన్ని వార్డులు కేటాయించాలనే కోణంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 29 నాటికి కేటగిరీల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లపై స్పష్టత రానుంది. రొటేషన్ కథ మళ్లీ మొదటికి..! పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు నాలుగు పర్యాయాలు సాధారణ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పంచాయతీలకు తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండగా, 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం త్వరలో జరిగే ఎన్నికలను తొలి సాధారణ పంచాయతీ ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. దీంతో గత నాలుగు ఎన్నికల్లో జరిగిన రొటేషన్ విధానంతో సంబంధం లేకుండా, ఈసారి జరిగే ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను తాజాగా నిర్ణయిస్తున్నారు. దీంతో గత నాలుగు పర్యాయాలు పంచాయతీ ఏ కేటగిరీకి రిజర్వు అయ్యిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. మరోవైపు కొత్తగా వందకు పైగా పంచాయతీలు ఏర్పడటంతో.. గత రిజర్వేషన్లతో ఏ మాత్రం పొంతన లేకుండా.. ప్రస్తుత రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల శాతం కూడా తగ్గడంతో సర్పంచ్ పదవుల రిజర్వేషన్లలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో మాత్రం గత నాలుగు పర్యాయాలు జరిగిన రొటేషన్ రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తూ, తమ పంచాయతీ ఏ కేటగిరీకి కేటాయించే అవకాశం ఉందనే కోణంలో ఔత్సాహికులు లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 29 నాటికి పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై స్పష్టత రానుండగా, వివిధ పార్టీల నేతలు, ఔత్సాహికులు రిజర్వేషన్ల ఖరారుపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. -
పల్లె పోరుకు కసరత్తు
నిజామాబాద్అర్బన్/మోర్తాడ్: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగంగా కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంది నియామకంతో పాటు శిక్షణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. సుమారు 12 వేల మంది.. ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రీసైడింగ్, సహాయ ప్రీసైడింగ్ పోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. జిల్లాలో మొత్తం 4,932 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందుకు గాను 12,580 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్ నిర్వహించే సిబ్బంది స్టేజీ–2 అధికారులుగా ఉంటారు. వీరు పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు వంటివి చేపడతారు. ఇందుకు అనుగుణంగా సిబ్బందిని కేటాయిస్తారు. 200 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రంలో ఇద్దరు, 200 నుంచి 400 వరకు ఓట్లు ఉండే పోలింగ్ కేంద్రంలో ముగ్గురు, 400 నుంచి 650 ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రంలో నలుగురు పోలింగ్ సిబ్బంది ఉంటారు. 650 ఓటర్ల కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే అదనంగా మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే పోలింగ్ అధికారులకు ఒక దఫా శిక్షణ కార్యక్రమం పూర్తయింది. స్టేజీ–2 అధికారులకు జనవరి 2వ తేదీ వరకు శిక్షణనివ్వనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే శిక్షణ పూర్తికానుంది. ప్రతి గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు నోడల్ అధికారులను నియమించారు. 11 విభాగాలకు చెందిన జిల్లాలోని వివిధ అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. ఈసారైనా ఓట్లు ఉండేనా..? శాసనసభ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు దూమారం లేపింది. సుమారు జిల్లా వ్యాప్తంగా 10 నుంచి 20 వేల వరకు ఓట్లు గల్లంతయ్యాయి. చాలా మంది ఓటర్లు ఓటు హక్కును కోల్పోయారు. ఈసారైనా ఓటర్ల జాబితా సమగ్రంగా ఉంటుందా.. గ్రామీణ పోరులోనైనా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత వారం నుంచి జిల్లా వ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు 530 పంచాయతీలకు 4,932 వార్డులకు రిజర్వేషన్ల విధానం అమలులోకి వచ్చింది. మొత్తం 530 జీపీల్లో 267 గ్రామ పంచాయతీలు మహిళలకు, 263 జనరల్కు రిజర్వ్ అయ్యాయి. ఇక, వంద శాతం గిరిజనులు ఉన్న 71 పంచాయతీలను వారికే కేటాయించారు. మిగతా చోట్ల 31 కలిపి మొత్తం ఎస్టీలకు 102 జీపీలు రిజర్వ్ అయ్యాయి. ఇక, ఎస్సీలకు–101, బీసీలకు–98 గ్రామ పంచాయతీలను కేటాయించారు. ఇక, గ్రామాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది. శుక్రవారం లోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో అధికార యంత్రాంగం అదే పనిలో నిమగ్నమైంది. గురువారం దాదాపు ఈ ప్రక్రియను పూర్తి, ఈ నెల 29న గెజిట్ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రా పద్ధతిలో మహిళలకు రిజర్వ్.. మహిళలకు కేటాయించిన పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను డ్రా పద్ధతిలో చేపట్టనున్నారు. స్థానిక సంస్థలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించడంతో జిల్లాలో మొత్తం 267 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులు వారికే దక్కనున్నాయి. అయితే, మహిళలకు కేటాయించే సర్పంచ్ స్థానాల విషయంలో అధికారులు గతంలో రొటేషన్ పద్ధతి పాటించే వారు. అయితే, ఈసారి అలా కాకుండా డ్రా పద్ధతి ద్వారా రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. -
కేసీఆర్ బీసీలకు వెన్నుపోటు పొడిచారు
-
ఎన్నిక.. ఏకగ్రీవం!
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ మంచి ఊపు మీద ఉంది. అదే ఊపును సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జిల్లా టీఆర్ఎస్ నాయకత్వానికి మంచి బలాన్ని ఇచ్చాయి. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన 2001 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ కూడా ఇంత మెజార్టీ స్థానాలను ‘గులాబీ’లు దక్కించుకోలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా లోని 14 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 13 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఉత్సాహంలో ఉన్న టీఆర్ఎస్ నాయకత్వం త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను కూడా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని.. ఇందులో అత్యధికం ఏకగ్రీవం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కేడర్లో ఉత్సాహాన్ని నింపేలా... టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలిచిన నేపథ్యంలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. ఈ సమావేశాలు దాదాపుగా పూర్తికావొచ్చాయి. ఈ సందర్భంగా గెలుపునకు సహకరించిన శ్రేణులకు కృతజ్ఞతలు చెబుతూనే సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు తీసుకోవాలని జాగ్రత్తలను వివరిస్తున్నారు. అంతేకాకుండా ఆరు నెలలు కష్టపడి పని చేస్తే మంచి భవిష్యత్ ఉంటుందంటూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఏకగ్రీవంపై దృష్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ అదే ఊపును పంచాయతీ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. మండల నాయకత్వానికి సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. జిల్లాలో 721 గ్రామపంచాయతీలు ఉండగా.. జిల్లా యూనిట్గా ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ మేరకు 721 పంచాయతీలకు గాను 307 జనరల్కు కేటాయించారు. బీసీలకు 170 స్థానాలు, ఎస్సీలకు 107 స్థానాలు, వంద శాతం గిరిజనుల జనాభా ఉండి జీపీలుగా మారిన 107 తండాలను కలుపుకుని 137 స్థానాల ను ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. ఈ మేరకు ఇందులోఅత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిన నేపథ్యంలో... ఆ ఓటమి నుంచి కోలుకోకముందే గ్రామపంచాయతీ ఎన్నికలు వచ్చేశాయి. దీంతో కాంగ్రెస్ తేరుకునే లోగా సర్పంచ్ స్థానాలను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకునే విధంగా స్థానిక నాయకత్వాన్ని ఎమ్మెల్యేలు సమాయత్తం చేస్తున్నారు. 29న జిల్లాకు కేటీఆర్ టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి న విషయం విదితమే. గత నాలుగన్నరేళ్ల క్రితం తొలిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. సంస్థాగతంగా బలోపేతంపై పెద్దగా దృష్టి సారించలేదని పార్టీ నాయకులే స్వయంగా ఒప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. తన కుమారుడైన కేటీఆర్ను పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో పార్టీ సమావేశాలు ఏర్పాటుచేసి దిశానిర్దేశం చేస్తున్న కేటీఆర్... ఈనెల 29న మహబూ బ్నగర్కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన మహబూబ్నగర్ నియోజకర్గ పా ర్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని రానున్న గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో సత్తా చాటేలా పార్టీ శ్రేణులకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అలాగే, లోక్సభ ఎన్నికల్లో గెలుపునకు వ్యూహరచన చేయనున్నారని తెలుస్తోంది. -
29న తేలనున్న పంచాయతీ
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠ మరో రెండురోజుల్లో వీడనుంది. ఈనెల 28న జనాభా, ఓటర్ల ప్రాతిపదికన ఆయా పంచాయతీల వివరాలను పూర్తి చేసి 29న ప్రకటించనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్ల కోటాను ప్రభుత్వం ఖరారు చేయగా, తదనుగుణంగా జరుగుతున్న కసరత్తును 28న పూర్తి చేసి, రిజర్వేషన్ కేటగిరీల వారీగా కేటాయించిన పంచాయతీలు, వార్డుల వివరాలను ప్రకటించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని 1508 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఎస్టీ జనాభా గల ఏజెన్సీ ప్రాంతంలోని 60 జీపీలలో ఎస్టీలే సర్పంచులుగా, వార్డు సభ్యులుగా పోటీ చేయాల్సి ఉంటుంది. ఇక షెడ్యూల్ ఏరియా పరిధిలోని 445 జీపీల్లో ఎస్సీ వర్గానికి చెందిన వారే సర్పంచులుగా పోటీ చేయాల్సి ఉంటుంది. ఆయా పంచాయతీల్లో వందశాతం ఎస్సీలే ఉంటే వార్డు సభ్యులుగా కూడా ఎస్సీలే పోటీ చేస్తారు. ఒకవేళా ఇతర కులాలు కూడా షెడ్యూల్డ్ ఏరియా పంచాయతీల్లో నివసిస్తూ ఉంటే 50 శాతం వార్డులను ఎస్సీలకు కేటాయించి, మిగతా 50 శాతాన్ని ప్రభుత్వ రిజర్వేషన్ విధానం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్ రిజర్వుడ్ స్థానాలుగా వార్డుల విభజన జరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయా జిల్లాల ఆర్డీవోలు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో మునిగిపోయారు. 1,003 జీపీల సర్పంచులకే రిజర్వేషన్ విధానం ఉమ్మడి జిల్లాలోని 1508 గ్రామపంచాయతీల్లో వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న 60 పంచాయతీలు, షెడ్యూల్డ్ ఏరియాలోని 445 జీపీలు కలిపి 505 స్థానాల్లో సర్పంచులకు రిజర్వేషన్ ఉండదు. వాటిని ఎస్టీ, ఎస్సీలకే కేటాయిస్తారు. మిగతా 1,003 పంచాయతీల్లో 50 శాతం అన్ రిజర్వుడ్ కేటగిరీ కింద 503 జీపీలను ఇప్పటికే నిర్ణయించా రు. మిగతా 500 పంచాయతీలను ఎస్టీలకు 6.68 శాతం, ఎస్సీలకు 20.53 శాతం, బీసీలకు 22.79 శాతం కింద రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. ఈ ప్రకారం ఎవరెవరెకి ఎన్ని సర్పంచు స్థానాలు కేటాయిస్తారనే విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే అవి ఏవేవీ అనే విషయంపై కసరత్తు శరవేగంగా సాగుతుంది. ఎస్సీ, ఎస్టీలను జనాభా ప్రాతిపదికన, బీసీలను ఓటర్ల జాబితా ప్రకారం నిర్ణయించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఈసారి ప్రకటించిన రిజర్వేషన్ విధానం మరో విడత ఎన్నికలకు కూడా కొనసాగనుంది. మహిళలకు లాటరీ పద్ధతిన రిజర్వేషన్ లాటరీ విధానమే... స్థానిక సంస్థల ఎన్నికలల్లో 50 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలనే నిర్ణయం మేరకు ఆ సంఖ్యను కూడా ఖరారు చేశారు. జిల్లాల వారీగా ఆదిలాబాద్లో 467 జీపీల్లో 234 మహిళలకు కేటాయించారు. కుమురంభీంలోని 334 జీపీల్లో 166, మంచిర్యాలలోని 311లో 154, నిర్మల్లోని 396 జీపీల్లో 199 మహిళలకు కేటాయించారు. అయితే ఏయే పంచాయతీలు, వార్డులు మహిళలకు కేటాయించాలన్న అంశంపై అధికారుల వ ద్ద నిర్ధిష్ట గైడ్లైన్స్ లేవు. ఇదే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లడంతో పురోగతి లభించింది. మహిళా ఓటర్ల సంఖ్యలో ఎక్కువగా ఉన్న పంచాయతీల నుంచి (డిసెండింగ్ ఆర్డర్లో) లాటరీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తదనుగుణంగానే జీపీలు, వార్డులను కేటాయించాలని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కలెక్టర్ నేతత్వంలో ఆర్డీఓలు లాటరీ విధానంలో ఆయా జీపీ లను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. 29లోపు కసరత్తు పూర్తి.. గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను ఈనెల 29లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు అధికారులు కసరత్తును ముమ్మరం చేశా రు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కలెక్టర్ ద్వా రా ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తారు. ఈ నివేదికలను ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపిన వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ పరిధిలోని గ్రామపంచాయతీలకు ఒక్కో విడతలో ఎన్నికలను నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. తుది దశలో.. పంచాయతీలకు రిజర్వేషన్ల వర్తింపుపై యం త్రాంగం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్ని మండలాలకు సంబంధించి కేటగిరీల వారీగా రిజర్వేషన్ల సంఖ్యను కలెక్టర్ ఖరారు చే యగా.. పంచాయతీల వారీగా వార్డుల రిజర్వేష న్ల సంఖ్యను ఆర్డీవోలు ఫైనల్ చేసినట్లు తెలిసింది. జీపీలకు ఆయా కేటగిరీల కింద రిజర్వ్ చేసే అం శం ఆర్డీవోల పరిధిలో ఉంది. ఇదే తరహాలో వా ర్డులను సంబంధిత ఎంపీడీవోలు కేటగిరీల వా రీగా రిజర్వ్ చేయనున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. బేసి సంఖ్య ఉంటే ఎలా.. ఆయా జీపీల్లో వార్డులు బేసి సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మహిళా కోటా కింద 50 శాతం వార్డులు పోగా అన్రిజర్వ్డ్ కింద ఒక వా ర్డు అదనంగా మిగులుతోంది. ఈ స్థానాన్ని మహిళలకు రిజర్వ్ చేయాలా.. లేక జనరల్కు కేటా యించాలా? అనే అంశంపై అధికారుల వద్ద స్పష్టత లేదు. ఉదాహరణ కు ఒక పంచాయతీలో 23 వార్డులు ఉంటే.. మహిళలకు 50 శాతం కోటా కింద 11.5 వార్డులను కేటాయించడం అసాధ్యం. అంటే మహిళలకు 11 లేదా 12 కేటాయించాల్సి ఉంటుంది. ఇలా బేసి అంకెగా మిగులుతున్న వార్డుని ఎవరికి కేటా యించాలని ప్రభుత్వాన్ని యంత్రాంగం కోరినట్లు తెలిసింది. దీనిపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత వార్డుల రిజర్వ్ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. -
ఇదీ రిజర్వేషన్ లెక్క..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చకచకా జరుగుతోంది. రెండు రోజుల క్రితమే జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జీపీలను కేటాయించారు. బుధవారం సర్పంచ్ల రిజర్వేషన్ కోటాను అధికారులు తేల్చారు. ఈ లెక్కన ఏన్కూరు మండలంలోని 25 గ్రామ పంచాయతీలు, కామేపల్లి మండలంలోని 24 జీపీలు షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి వచ్చాయి. ఈ క్రమంలో ఇక్కడ గిరిజన అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జిల్లాలోని ఎన్ని గ్రామ పంచాయతీలు ఏ కేటగిరీలోకి వస్తాయో ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలు ఉండగా.. 50 శాతం జీపీలను మహిళలకు రిజర్వు చేశారు. దీని ప్రకారం 292జీపీలలో మహిళలు పోటీచేయాల్సి ఉంటుంది. మొత్తం జీపీల్లో 99 ఏజెన్సీ ప్రాంతంలో ఉండగా.. 11గ్రామ పంచాయతీలు పూర్తిగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిని ఎస్టీలకు రిజర్వు చేశారు. ఇక మిగిలిన 474 గ్రామ పంచాయతీల్లో ఎస్టీలకు 59, ఎస్సీలకు 120, బీసీలకు 58 జీపీలను కేటాయించారు. ఇక మిగిలిన 237 గ్రామ పంచాయతీల్లో ఇతరులు పోటీ చేయనున్నారు. షెడ్యూల్డ్ పరిధిలోని 99 జీపీలు ఇలా.. ఏజెన్సీ పరిధిలోని 99 గ్రామ పంచాయతీలకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులు ప్రకటించారు. ఇవి ఏయే మండలాల పరిధిలో ఉంటాయనేది అధికారులు తేల్చారు. దీంతో ఏన్కూరు మండలంలోని 25 గ్రామ పంచాయతీలు షెడ్యూల్డ్ పరిధిలోకి వచ్చాయి. అలాగే కామేపల్లి మండలంలోని 24 జీపీలు కూడా షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి వచ్చాయి. సింగరేణి మండలంలోని 41 గ్రామ పంచాయతీల్లో 39 షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి వచ్చాయి. సత్తుపల్లి మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో మూడు జీపీలు షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి, పెనుబల్లి మండలంలోని 33 గ్రామ పంచాయతీల్లో 8 జీపీలు షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి కేటాయించారు. అలాగే 100 శాతం గిరిజనులున్న గ్రామ పంచాయతీల్లో కొణిజర్లలో ఒకటి, కూసుమంచిలో మూడు, నేలకొండపల్లిలో ఒకటి, రఘునాథపాలెంలో 2, తిరుమలాయపాలెంలో 3, వేంసూరులో ఒక గ్రామ పంచాయతీలను కేటాయించారు. -
‘బీసీల అణచివేతకు ప్రభుత్వం కుట్ర’
హైదరాబాద్: పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి బీసీల నాయకత్వాన్ని అణచివేసేం దుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బుధవారం బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్ (ప్రెస్క్లబ్)లో 12 బీసీ సంఘాల ప్రతినిధులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 2010లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాకు గా చూపిస్తూ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయాలని చూస్తోందన్నారు. పంచాయతీరాజ్ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగ్గించిన బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఈ నెల 28న అన్ని జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎమ్మార్వో ఆఫీసుల ఎదుట ధర్నాలు చేయాలన్నారు. అదేరోజు అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో కుల, బీసీ సం ఘాలతో రౌండ్టేబుల్ సదస్సులు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై బీజేపీ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడం పట్ల బీజేపీ మండిపడింది. గతంలో ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీసీలను కూడా మోసం చేసిందని పేర్కొంది. బుధవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్ల తగ్గింపును ఖండిస్తున్నామని, ప్రభుత్వం జారీ చేసిన పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ జనాభా గణన తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించినా.. బీసీలకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా టీఆర్ఎస్ చేస్తున్న మోసాన్ని గమనించాలన్నారు. బీసీ రిజర్వేషన్లు సక్రమంగా లేకపోవడం వల్ల వందల గ్రామపంచాయతీల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు... ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఓట్ల కోసం గొర్రెలు, బర్రెలు అంటూ బీసీలను రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లలో న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ తిరుగుతున్నారని, ఈ ఫ్రంట్లు.. టెంట్లు.. వారి కుటుంబం కోసమేనని విమర్శించారు. గతంలో ఇలాంటి ఫ్రంట్లన్నీ విఫలమయ్యాయని, కేసీఆర్ ప్రయత్నాలు కూడా అంతేనన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మ«ధ్యనేనని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం మోదీ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 22 లక్షల ఓట్ల గల్లంతుకు కారణమైన వారిపై చర్యలు చేపట్టే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. తాము గతంలో చెప్పినట్లు రజాకార్ల రాజ్యం వస్తుందని, అందుకు హైదరాబాద్లోని గ్లోబల్ ఆస్పత్రి ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ రాంచందర్రావు మాట్లాడుతూ, ఓట్ల గల్లంతుపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు చేపట్టాలంటూ ఈ నెల 27న లక్ష్మణ్ నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవనున్నట్లు తెలిపారు. -
మూకుమ్మడిగా ఉద్యమిద్దాం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోటాను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేయడంపై అన్ని రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేష న్లు పెంచాల్సి ఉండగా, అనూహ్యంగా తగ్గించడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. వెనుకబడిన తరగతులను అణగదొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని.. అందువల్ల రిజర్వేషన్ల సాధనలకు మూకుమ్మడిగా ఉద్యమించాలని నిర్ణయించాయి. ఇంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 34% శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయగా.. ప్రస్తుతం దీన్ని 22 శాతానికే కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆర్డినెన్సు సైతం జారీ చేసి రిజర్వేషన్లు ఖరారు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం మాసబ్ట్యాంక్లోని గోల్కొండ హోటల్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మూడ్రోజుల కార్యాచరణను ఖరారు చేశారు. ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చెపట్టాలని నిర్ణయించాయి. ఈ నెల 28న అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషిలను కలిసి పరిస్థితిని వివరించి రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేస్తారు. ఈ నెల 29న జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నారు. పార్టీలకతీతంగా ఉద్యమించాలి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అమలు సంగతి సరే.. పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయం. ఈ నిర్ణయంతో బీసీలు తీవ్రంగా నష్టపోతారు. నాయకుడిగా ఎదిగేందుకు దారిచూపే పంచాయతీ ఎన్నికల్లోనే బీసీలకు అవకాశాలు తగ్గితే వారి అభివృద్ధి కష్టమే. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ను కోరినా ఆయన స్పందించలేదు. బీసీ రిజర్వేషన్లు తగ్గితే ఊరుకోం. కచ్చితంగా పోరాడతాం. పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తాం. – ఎల్.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు కులసంఘాలే ఓడించాయి బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలని అన్ని కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈమేరకు బీజేపీ ఏ పార్టీ ఇవ్వనన్ని సీట్లను బీసీలకు కేటాయించింది. కానీ ఆ బీసీ అభ్యర్థులను ఓడించింది బీసీ కుల సంఘాల నేతలే. వీరంతా తీర్మానించుకుని టీఆర్ఎస్ను గెలిపిస్తే.. బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలకతీతంగా బీసీలంతా కలిసికట్టుగా ఉంటేనే న్యాయం జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడైన లెక్కలను సర్కారు బయటపెట్టడం లేదు. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు ఏనాడూ చెప్పలేదు. జనగణన వివరాలను సమర్పిస్తే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని కోర్టులే స్పష్టం చేశాయి. కలిసి పోరాడకుంటే బీసీలకు తీవ్ర అన్యాయం తప్పదు. – డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వానివి కుంటిసాకులు బీసీ జనాభా ఎంతుందో ప్రభుత్వం చెప్పడం లేదు. కానీ రిజర్వేషన్లు మాత్రం అడ్డదిడ్డంగా తగ్గించింది. జనగణన లేనందునే 50% రిజర్వేషన్లు మించొద్దని కోర్టు చెప్పింది. వివరాలు సమర్పిస్తే పెంచొద్దని కోర్టులు చెప్పవు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కుంటి సాకులు చెబుతున్న ప్రభుత్వం.. కోర్టు ఆర్డర్ను బూచిగా చూపి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లు అమలు చేస్తోంది. ముందుగా జనగణన చేసి వివరాలు వెల్లడించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలి. 2016లో ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసి.. రిజర్వేషన్లపై స్టే తెచ్చుకోవచ్చు. ఆమేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఒక్కరోజులో సమగ్ర కుటుంబ సర్వే చేసిన కేసీఆర్ బీసీల లెక్కలు ఎందుకు చెప్పడం లేదు. బీసీలకు ప్రభుత్వం ద్రోహం చేస్తోంది. అన్ని పార్టీలు కలిసి ప్రధానికి వివరిస్తే రాజ్యాంగ సవరణ చేసే అవకాశం ఉంటుంది. – జస్టిస్ వి. ఈశ్వరయ్య న్యాయ పోరాటం చేద్దాం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం న్యాయపోరాటం చేయాలి. అదేవిధంగా రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు చేయాలి. పాలనను గాలికొదిలేసిన సీఎం కేసీఆర్ పొరుగురాష్ట్రాల చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఇలా రాష్ట్రాలు పట్టుకుని సీఎం ఎందుకు తిరుగుతున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆర్డినెన్సును ఉపసంహరించుకున్న తర్వాత పర్యటనలు చేసుకోవాలి. – పొన్నాల – పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు సర్కారు కళ్లు తెరిపిద్దాం బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డి నె న్స్ జారీ చేయడాన్ని ఖండిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్రెడ్డి స్టే తెచ్చి ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు కూడా స్టే తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలి. అన్ని పార్టీలు ఐక్యంగా ఉద్యమించి ప్రభుత్వం కళ్లు తెరిపించాలి. – చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం చెబుతుంది. ఈ విధమైన రిజ ర్వేషన్ల ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. వీటిని సాధించుకునేందుకు పార్టీలకతీ తంగా ఉద్యమం చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కనీస విలువనివ్వడం లేదు. – చెన్నయ్య, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రిజర్వేషన్ల కోసం కలిసి పోరాడదాం బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు, సం ఘాలు ఒకే వేదిక ద్వారా పోరాడాలి. కాసాని జ్ఞానేశ్వర్, ఆర్.కృష్ణయ్య తదితరులంతా కలిసిరావాలి. ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వనందుకు రాష్ట్ర బం ద్కు పిలుపునిచ్చి తర్వాత ఉపసంహరించుకోవడంలా బీసీ ఉద్యమాన్ని నడపొద్దు. బీసీ రిజర్వేషన్లను పంచాయతీలతోపాటు.. చట్టసభల్లోనూ అమలుచేసుకునేలా ఐక్యంగా ఉద్యమిద్దాం. – జాజుల శ్రీనివాస్గౌడ్ -
బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుదాం..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ పలు రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు బుధవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించాయి.ఈ సందర్భంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 28న సీఎస్కు వినతి పత్రం అందించాలని నిర్ణయించారు. 29న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లల ముట్టడికి పిలుపునిచ్చినట్లు నేతలు వెల్లడించారు. గోల్కొండ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీసీల ఓట్లతో గెలిచి వారికే వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జన గణన చేసి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కులసంఘాలు ఎమ్మెల్యేల గెలుపునకు తీర్మానం చేశాయని, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలనే నిలదీయండని అన్నారు. ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి.. బీసీల రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. రిజర్వేషన్లను తగించి బీసీలను తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గెలవాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చాడా మండిపడ్డారు. రిజర్వేషన్లు తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేసని ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానిని ఎందుకు కలుస్తున్నారు.. బీసీల రిజర్వేషన్ల సాధన కోసం న్యాయపోరాటంతో పాటు ఉద్యమాలను కూడా ఉదృతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని ఎందకు కలుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 1200 మంది బీసీలకు అన్యాయం జరిగింది.. బీసీల రిజర్వేషన్లను తగ్గించడంతో 1200 మంది బీసీలు పోటీకి దూరమైయ్యారని టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్లు అమలు చేసి తీరాలని, జంతర్ మంతర్ వద్ద ధర్మాకు తన వంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. పార్టీలకతీతంగా బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్తో పాటు పలువురు బీసీ సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. -
మహిళా రిజర్వేషన్కు లాటరీ విధానం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల కేటాయింపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జిల్లా మొత్తంగా ఏ కేటగిరీకి ఎన్ని పంచాయతీలనేది స్పష్టం కావడంతో.. ఇక ఏ పంచాయతీ ఏ కేటగిరీకి కేటాయిస్తారోనని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పంచాయతీలు, వార్డులకు రిజర్వేషన్ వర్తింపుపై కసరత్తు చేస్తున్న యంత్రాంగం బుధవారం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కలెక్టర్ నుంచి ఆర్డీఓలకు ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది. అయితే రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలన్న అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత లేదు. ప్రధానంగా ఏ ప్రాతిపదికన పంచాయతీలు, వార్డులు మహిళలకు కేటాయించాలన్న విషయమై అధికారులు దృష్టిపెట్టారు. తాజాగా దీనిపై మార్గదర్శకాలు వెలువడ్డాయి. ప్రభు త్వం నోటిఫికేషన్ విడుదల చేయగానే రిజర్వేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. లాటరీ విధానమే... స్థానిక సంస్థల్లో 50 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని కోర్టు తీర్పు మహిళా రిజర్వేషన్కు లాటరీ విధానం! చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని 560 గ్రామ పంచాయతీల్లో 280 జీపీలు మహిళా కోటాలోకి వెళ్లాయి. అయితే ఏయే పంచాయతీలు, వార్డులు మహిళలకు కేటాయించాలన్న అంశంపై అధికారుల వద్ద నిర్ధిష్ట గైడ్లైన్స్ లేవు. ఇదే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం కాస్త పురోగతి లభించింది. మహిళలకు లాటరీ విధానంలో జీపీలు, వార్డులను కేటాయించాలని స్పష్టతనిచ్చింది. కలెక్టర్ నేతృత్వంలో ఆర్డీఓలు లాటరీ విధానంలో ఆయా జీపీలను మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. తుది దశలో.. పంచాయతీలకు రిజర్వేషన్ల వర్తింపుపై యంత్రాంగం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్ని మండలాలకు సంబంధించి కేటగిరీల వారీగా రిజర్వేషన్ల సంఖ్యను కలెక్టర్ ఖరారు చేయగా.. పంచాయతీల వారీగా వార్డుల రిజర్వేషన్ల సంఖ్యను ఆర్డీఓలు ఫైనల్ చేసినట్లు తెలిసింది. జీపీలకు ఆయా కేటగిరీల కింద రిజర్వ్ చేసే అంశం ఆర్డీఓల పరిధిలో ఉంది. ఇదే తరహాలో వార్డులను సంబంధిత ఎంపీడీఓలు కేటగిరీల వారీగా రిజర్వ్ చేయనున్నారు. ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. బేసి సంఖ్య ఉంటే ఎలా.. ఆయా జీపీల్లో వార్డులు బేసి సంఖ్యలో ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మహిళా కోటా కింద 50 శాతం వార్డులుపోగా అన్రిజర్వ్ కింద ఒక వార్డు అదనంగా మిగులుతోంది. ఈ స్థానాన్ని మహిళలకు రిజర్వ్ చేయాలా.. లేక జనరల్కు కేటాయించాలా? అనే అంశంపై అధికారుల వద్ద స్పష్టత లేదు. ఉదాహరణకు ఒక పంచాయతీలో 23 వార్డులు ఉంటే.. మహిళలకు 50 శాతం కోటా కింద 11.5 వార్డులను కేటాయించడం అసాధ్యం. అంటే మహిళలకు 11 లేదా 12 కేటాయించాల్సి ఉంటుంది. ఇలా బేసి అంకెగా మిగులుతున్న వార్డుని ఎవరికి కేటాయించాలని ప్రభుత్వాన్ని యంత్రాంగం కోరినట్లు తెలిసింది. దీనిపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత వార్డుల రిజర్వ్ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. -
ఏ సర్పంచ్ స్థానం ఏ కేటగిరికో..?
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రకటనపై ఆశావహుల్లో ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. సర్పంచ్లు, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్ల కోటాలను ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏ కేటగిరికి కేటాయిస్తారనే అంశంపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తే సర్పంచ్గా పోటీ చేయాలని గ్రామాల్లో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని గ్రామాల్లోని ఆయా కుల సంఘాల నాయకులను మచ్చిక చేసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా తమకు అనుకూలంగా రిజర్వేషన్లు ప్రకటించాలని ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో అధికారులపై ఒత్తిడి చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు. కసరత్తు ముమ్మరం.. జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 71 గ్రామ పంచాయతీల్లో వంద శాతం గిరిజనులు ఉండగా, ఆ జీపీలను వారికే కేటాయించారు. మిగిలిన 459లో ఎస్సీలకు 20.53 శాతం, ఎస్టీలకు 6.68 శాతం, బీసీలకు 22.79 శాతం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను సర్కారు ఖరారు చేసిన విషయం విదితమే. ఈ లెక్కన జిల్లాలో 459 సర్పంచ్ స్థానాల్లో ఎస్సీలకు 101 స్థానాలు, ఎస్టీలకు 31 స్థానాలు, బీసీలకు 98 స్థానాలు కేటాయించారు. ఈ మూడు కేటగిరీల్లో 50 శాతం స్థానాలు మహిళలకే దక్కనున్నాయి. మిగిలిన 229 స్థానాల్లో జనరల్ స్థానాలుంటాయి. ఏ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం ఏ కేటగిరికి కేటాయించాలనే అంశంపై జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటా సంఖ్యను ఆయా మండలాల వారీగా జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారు. ఏ గ్రామ పంచాయతీని ఏ కేటగిరికి రిజర్వు చేయాలనే అంశాన్ని ఆర్డీవోలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే, ఏ వార్డును ఏ కేటగిరికి కేటాయించాలనే అంశంపై ఆయా మండలాల ఎంపీడీవోలు నిర్ణయిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ జనాభా, బీసీల్లో ఓటర్ల సంఖ్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఈ రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారని, రొటేషన్ పద్ధతిలో ఎంపిక ఉంటుందని.. ఇలా అనేక ప్రచారాలు జరిగాయి. కానీ జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. ఈ నెల 29లోపు కసరత్తు పూర్తి.. గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను ఈ నెల 29లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు అధికారులు కసరత్తును ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తారు. ఈ నివేదికలను ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపిన వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ పరిధిలోని గ్రామపంచాయతీలకు ఒక్కో విడతలో ఎన్నికలను నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. -
మండల కోటా ఖరారు
నల్లగొండ : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండల రిజరేషన్లను మంగళవారం రాత్రి ప్రకటించారు. ఇప్పటికే పంచాయతీరాజ్ రాష్ట్ర శాఖ జిల్లాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే.జిల్లాకు కేటాయించిన రిజర్వేషన్ల ఆధారంగా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, డీపీఓ శ్రీకాంత్లు మంగళవారం రాత్రి జిల్లాలోని 31 మండలాలకు గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు కేటాయించారు. మండలానికి ఎంతమంది ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, జనరల్ కేటగిరీకి సంబంధించిన వారు ఉన్నారనేది తేల్చారు. బుధవారం నుంచి గ్రామాల వారీగా ఆయా పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు మూ డు రోజుల్లో గ్రామాల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.జిల్లాలో మొత్తం 844 పంచాయతీలకు 100 శాతం ఎస్టీలు ఉన్న 104 గ్రామాలను వారికే రిజర్వ్ చేయగా మరో 69 పంచాయతీలు ఎస్టీ కోటాకింద కేటాయించారు. ఎస్సీలకు 136, బీసీలకు 165, జనరల్ కేటగిరీలో 370 స్థానాలను కేటాయించారు. మండలాలకు కేటాయించిన రిజర్వేషన్లు ఇలా.. అడవిదేవులపల్లి మండలంలో మొత్తం 13 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో ఎస్టీ కేటగిరీలో 5 కేటాయించగా అందులో మహిళలకు 2, జనరల్ కేటగిరీలో 3 కేటాయించారు. ఎస్సీలకు ఒకటి రిజర్వ్ కాగా అది జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేశారు. బీసీలో కేటగిరీలో ఒక్కటి కూడా కేటాయించలేదు. అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 7 స్థానాలు కేటాయించగా మహిళలకు 3, జనరల్లో 4 స్థానాలు కేటాయించారు. అనుముల(హాలియా) మండలంలో పంచాయతీలు 21, ఎస్టీ 2, ఎస్సీ 4, అందులో మహిళలు 2, జనరల్ 2 రిజర్వ్చేశారు. బీసీ 5 స్థానాలకు గాను మహిళలు 3, జనరల్ 2, అన్ రిజర్వ్డ్లో మొత్తం 10 స్థానాలకు మహిళలు 5, జనరల్కు 5 కేటాయించారు. చందంపేటలో 28 పంచాయతీలలో 100 శాతం ఎస్టీ పంచాయతీల్లో 9కి 4 మహిళలు, 5 జనరల్, ఎస్టీ కోటా కింద నాలుగు సీట్లు కేటాయించారు. అందులో 2మహిళ, 2 జనరల్ రిజర్వ్చేశారు. ఎస్సీ కోటాలో మూడు స్థానాలు కేటాయించగా 1 మహిళ, 2 జనరల్, బీసీలో 2 స్థానాలకు ఒకటి మహిళ, ఒకటి జనరల్, అన్ రిజర్వ్డ్లో 10 స్థానాలకు 5 మహిళ, 5 జనరల్ కేటాయించారు. చండూరులో 23 పంచాయతీలు ఉన్నాయి. అందులో ఎస్సీలకు నాలుగు కేటాయించగా 2 మహిళ, 2 జనరల్, బీసీలో 8 కేటాయించగా 4 మహిళ, 4 జనరల్, అన్ రిజర్వ్డ్లో 11 స్థానాలకు 5 మహిళ, 6 జనరల్కు కేటాయించారు. చింతపల్లిలో 34 పంచాయతీలకు 100 శాతం ఎస్టీ పంచాయతీలు 7 ఉన్నాయి. అందులో 4 మహిళ, 3 జనరల్, ఎస్టీ రిజర్వేషన్లో 1 స్థానం జనరల్కు కేటాయించారు. ఎస్సీ కోటాలో 5 పంచాయతీలు రిజర్వ్ కాగా 3 మహిళలు, 2 జనరల్, బీసీలో 7 కేటాయించగా, 3 మహిళ, 4 జనరల్, అన్ రిజర్వ్డ్లో 14 స్థానాలకు 7 మహిళ, 7 జనరల్కు కేటాయించారు. చిట్యాలలో 18 పంచాయతీలు ఉండగా ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్ అయ్యాయ. వీటిలో 2 మహిళలు, 2 జనరల్, బీసీలో 5 కేటాయించగా 2 మహిళ, 3 జనరల్, అన్ రిజర్వ్డ్లో 9 స్థానాలకు 4 మహిళ, 5 జనరల్కు కేటాయించారు. దామరచర్లలో 35 పంచాయతీలున్నాయి. వాటిలో 100 శాతం ఎస్టీ పంచాయతీలు 4 ఉన్నాయి. అందులో 2మహిళ, 2 జనరల్ కేటాయించారు. ఎస్టీ రిజర్వేషన్లో 10 స్థానాలు కేటాయించగా మహిళలు 5, జనరల్కు 5 రిజర్వ్ చేశారు. ఎస్సీ కోటాలో 3 పంచాయతీలు రిజర్వ్ కాగా 2 మహిళలు, 1 జనరల్, బీసీలో 2 కేటాయించగా 1 మహిళ, 1 జనరల్, అన్ రిజర్వ్డ్లో 16 స్థానాలకు 8 మహిళ, 8 జనరల్కు కేటాయించారు. దేవరకొండలో 39 పంచాయతీలకు 100 శాతం ఎస్టీ పంచాయతీలు 15 ఉన్నాయి. అందులో 7మహిళ, 8 జనరల్, ఎస్టీ రిజర్వేషన్లో 4 స్థానాలు కేటాయించగా మహిళలు 2, జనరల్కు 2 రిజర్వ్ చేశారు. ఎస్సీ కోటాలో 3 పంచాయతీలు రిజర్వ్ కాగా 1 మహిళ, 2 జనరల్, బీసీలో 5 కేటాయించగా 2 మహిళ, 3 జనరల్, అన్ రిజర్వ్డ్లో 12 స్థానాలకు 6 మహిళ, 6 జనరల్కు కేటాయించారు. గుండ్రపల్లిలో 38 పంచాయతీలున్నాయి. 100 శాతం ఎస్టీ పంచాయతీలు 11 ఉండగా అందులో 6 మహిళ, 5 జనరల్, ఎస్టీ రిజర్వేషన్లో 3 స్థానాలు కేటాయించగా మహిళలు 2, జనరల్కు 1 రిజర్వ్ చేశారు. ఎస్సీ కోటాలో 5 పంచాయతీలు రిజర్వ్ కాగా 3 మహిళ, 2 జనరల్, బీసీలో 5 కేటాయించగా 3 మహిళ, 2 జనరల్, అన్ రిజర్వ్డ్లో 14 స్థానాలకు 7 మహిళ, 7 జనరల్కు కేటాయించారు. గుర్రంపోడు మండలంలో 37 పంచాయతీలకు 100 శాతం ఎస్టీ పంచాయతీలు 2 ఉన్నాయి. అందులో 1మహిళ, 1 జనరల్ రిజర్వ్ చేశారు. ఎస్సీ కోటాలో 5 పంచాయతీలు రిజర్వ్ కాగా 3 మహిళ, 2 జనరల్, బీసీలో 13 కేటాయించగా 7 మహిళ, 6 జనరల్, అన్ రిజర్వ్డ్లో 17 స్థానాలకు 9 మహిళ, 8 జనరల్కు కేటాయింయించారు. కనగల్లో 31 పంచాయతీలు ఉన్నాయి. ఎస్సీ కోటాలో 5 పంచాయతీలు రిజర్వ్ కాగా 2 మహిళ, 3 జనరల్, బీసీలో 10 కేటాయించగా 5 మహిళ, 5 జనరల్, అన్ రిజర్వ్డ్లో 15 స్థానాలకు 7 మహిళ, 8 జనరల్కు కేటాయించారు. కట్టంగూర్ మండలంలో 22 పంచాయతీలకు ఎస్టీ రిజర్వేషన్లో 1 స్థానం మహిళలకు కేటాయించారు. ఎస్సీ కోటాలో 6 పంచాయతీలు రిజర్వ్ కాగా 3 మహిళ, 3 జనరల్, బీసీలో 4 కేటాయించగా 2 మహిళ, 2 జనరల్, అన్ రిజర్వ్డ్లో 11 స్థానాలకు 6 మహిళ, 5 జనరల్ రిజర్వ్ చేశారు. కేతేపల్లిలో 16 పంచాయతీలున్నాయి. ఎస్సీ కోటాలో 6 పంచాయతీలు రిజర్వ్ కాగా 3 మహిళ, 3 జనరల్, బీసీలో 2 కేటాయించగా 1 మహిళ, 1 జనరల్, అన్ రిజర్వ్డ్లో 8 స్థానాలకు 4మహిళ, 4 జనరల్ కేటాయించారు. కొండమల్లేపల్లిలో 26 పంచాయతీలు ఉండగా 100 శాతం ఎస్టీలు 13 స్థానాలున్నాయి. వీటిలో 6 మహిళ, 7 జనరల్ రిజర్వ్ చేశారు. ఎస్టీ రిజర్వేషన్లో 2 స్థానాలు, 1 మహిళలకు, 1 జనరల్ కేటాయించారు, ఎస్సీ కోటాలో 3 పంచాయతీలు రిజర్వ్ కాగా 2 మహిళ, 1 జనరల్, బీసీలో 1 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 7 స్థానాలకు 3 మహిళ, 4 జనరల్ కేటాయించారు. మాడుగులపల్లిలో 28 పంచాయతీలకు ఎస్టీకి 2 స్థానాలు రిజర్వ్ చేశారు. 1 మహిళ, 1జనరల్ కేటాయించారు, ఎస్సీ కోటాలో 3 పంచాయతీలు రిజర్వ్ కాగా 2 మహిళ, 1 జనరల్, బీసీలో 9 స్థానాలు, 5 మహిళ, 4 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 14 స్థానాలకు 7 మహిళ, 7 జనరల్ రిజర్వ్ చేశారు. మర్రిగూడలోని 20 పంచాయతీల్లో ఎస్టీ రిజర్వేషన్లో 2 స్థానాలకు 1 మహిళలకు, 1జనరల్ కేటాయించారు, ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్ కాగా 2 మహిళ, 2 జనరల్, బీసీలో 4 స్థానాలు, 2 మహిళ, 2 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 10 స్థానాలకు 5 మహిళ, 5 జనరల్ రిజర్వ్ చేశారు. మిర్యాలగూడ మండలంలో 64 పంచాయతీలు ఉన్నాయి. 100శాతం ఎస్టీ రిజర్వేషన్ 7 కాగా 3 మహిళ, 4 జనరల్, ఎస్టీ రిజర్వేషన్లో 8 స్థానాలు, 4 మహిళలకు, 4జనరల్ కేటాయించారు, ఎస్సీ కోటాలో 8 పంచాయతీలు రిజర్వ్ కాగా 4మహిళ, 4 జనరల్, బీసీలో 3 స్థానాలకు 1 మహిళ, 2 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 20 స్థానాలకు 10 మహిళ, 10 జనరల్ రిజర్వ్ చేశారు. మునుగోడులో 27 పంచాయతీలకు ఎస్సీ కోటాలో 6 పంచాయతీలు రిజర్వ్ కాగా 3 మహిళ, 3 జనరల్, బీసీలో 8 స్థానాలకు 4 మహిళ, 4 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 13 స్థానాలకు 6 మహిళ, 7 జనరల్ రిజర్వ్ చేశారు. నకిరేకల్లో 17 పంచాయతీలకు ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్ అయ్యాయి. 2 మహిళ, 2 జనరల్, బీసీలో 5 స్థానాలు, 2 మహిళ, 3 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 8 స్థానాలకు 4 మహిళ, 4 జనరల్. నల్లగొండలో 31 పంచాయతీలు ఉండగా ఎస్సీ కోటాలో 6 పంచాయతీలు రిజర్వ్ కాగా 3 మహిళ, 3 జనరల్, బీసీలో 10 స్థానాలు, 5 మహిళ, 5 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 15 స్థానాలకు 8 మహిళ, 7 జనరల్. నాంపల్లిలో 32 పంచాయతీలు, 100 శాతం ఎస్టీలున్నవి 4 కాగా 2 మహిళ, 2 జనరల్, ఎస్టీ కేటగిరీలో 1 జనరల్, ఎస్సీ కోటాలో 5 పంచాయతీలు రిజర్వ్ కాగా 2మహిళ, 3 జనరల్, బీసీలో 8 స్థానాలు, 4 మహిళ, 4 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 14 స్థానాలకు 7 మహిళ, 7 జనరల్ రిజర్వ్ చేశారు. నార్కట్పల్లి 29 పంచాయతీలు, ఎస్సీ కోటాలో 7 పంచాయతీలు రిజర్వ్ కాగా 3మహిళ, 4 జనరల్, బీసీలో 7 స్థానాలు, 3 మహిళ, 4 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 15 స్థానాలకు 7 మహిళ, 8 జనరల్ రిజర్వ్ చేశారు. నేరేడుగొమ్ములో 19 పంచాయతీలకు, 100 శాతం ఎస్టీలు 9 కాగా, 4 మహిళ, 5 జనరల్ కేటాయించాఉఉ. ఎస్టీ కేటగిరీలో 3 స్థానాలకు గాను 1 మహిళ, 2 జనరల్, ఎస్సీ కోటాలో జనరల్ 1, బీసీలో 1 స్థానాన్ని జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 5 స్థానాలకు 2 మహిళ, 3 జనరల్కు కేటాయించారు. తిప్పర్తిలో 26 పంచాయతీలు, ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్ కాగా 2మహిళ, 2 జనరల్, బీసీలో 9 స్థానాలు, 5 మహిళ, 4 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 13 స్థానాలకు 7 మహిళ, 6 జనరల్కు కేటాయించారు. నిడమనూర్లో 29 పంచాయతీలకు ఎస్టీ కేటగిరీలో 1 మహిళకు, ఎస్సీ కోటాలో 6 పంచాయతీలు రిజర్వ్ కాగా 3మహిళ, 3 జనరల్, బీసీలో 8 స్థానాలకు 4 మహిళ, 4 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 14 స్థానాలకు 7 మహిళ, 7 జనరల్ రిజర్వ్ చేశారు. పెద్దఅడిశర్లపల్లిలో 31 పంచాయతీలకు 100 శాతం ఎస్టీలున్నవి 5 కాగా 3 మహిళ, 2 జనరల్ కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో 5 స్థానాలు కేటాయించగా 2మహిళ, 3 జనరల్, ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్ కాగా 2మహిళ, 2 జనరల్, బీసీలో 5 స్థానాలు, 3 మహిళ, 2 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 13 స్థానాలకు 7 మహిళ, 6 జనరల్ కేటాయించారు. పెద్దవూరలో 26పంచాయతీలున్నాయి. 100 శాతం ఎస్టీలున్నవి 3 కాగా, 2 మహిళ, 1 జనరల్, ఎస్టీ కేటగిరీలో 5 స్థానాలు కేటాయించగా 3 మహిళ, 2 జనరల్, ఎస్సీ కోటాలో 3 పంచాయతీలు రిజర్వ్ కాగా 2మహిళ, 1 జనరల్, బీసీలో 4 స్థానాలు, 2 మహిళ, 2 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 11 స్థానాలకు 6 మహిళ, 5 జనరల్. శాలిగౌరారంలో 24 పంచాయతీలకు ఎస్సీ కోటాలో 7 పంచాయతీలు రిజర్వ్ కాగా 4మహిళ, 3 జనరల్, బీసీలో 5 స్థానాలు, 3 మహిళ, 2 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 12 స్థానాలకు 6 మహిళ, 5 జనరల్. తిరుమలగిరి (సాగర్)లో 34 పంచాయతీలకు 100 శాతం ఎస్టీలు 12 కాగా 6 మహిళ, 6 జనరల్, ఎస్టీ కేటగిరీలో 5 స్థానాలు కేటాయించగా 2మహిళ, 3 జనరల్, ఎస్సీ కోటాలో 3 పంచాయతీలు రిజర్వ్ కాగా 2మహిళ, 1 జనరల్, బీసీలో 3 స్థానాలు, 1 మహిళ, 2 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 11 స్థానాలకు 6 మహిళ, 5 జనరల్ కేటాయించారు. త్రిపురారంలో 32 పంచాయతీలుండగా 100 శాతం ఎస్టీలున్నవి 2. వాటిలో 1 మహిళ, 1 జనరల్, ఎస్టీ కేటగిరీలో 6 స్థానాలు కేటాయించగా 3మహిళ, 3 జనరల్, ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్ కాగా 2మహిళ, 2 జనరల్, బీసీలో 5 స్థానాలు, 3 మహిళ, 2 జనరల్కు కేటాయిం చారు. అన్ రిజర్వ్డ్లో 15 స్థానాలకు 8 మహిళ, 7 జనరల్. వేములపల్లిలో 12 పంచాయతీలు, ఎస్సీ కోటాలో 4 పంచాయతీలు రిజర్వ్ కాగా 2మహిళ, 2 జనరల్, బీసీలో 2 స్థానాలు, 1 మహిళ, 1 జనరల్కు కేటాయించారు. అన్ రిజర్వ్డ్లో 6 స్థానాలకు 3 మహిళ, 3 జనరల్కు కేటాయించారు. -
‘పంచాయతీ’ల్లో బీసీలకు అన్యాయం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గించడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మంగళవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 56 శాతం జనాభా గల బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా న్యాయమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో బీసీలకు 2,345 ఇవ్వడం దుర్మార్గమని, దీనిని బీసీలు క్షమించరన్నారు. సుప్రీంకోర్టు 2010 లోనే తీర్పు ఇచ్చినా.. అనంతరం 2013–గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే అమలు చేశారని గుర్తు చేశారు. ఈ 34 శాతం రిజర్వేషన్లు గత 30 ఏళ్లుగా కొనసాగుతున్నాయని, కొత్తగా ఇప్పుడు ఎందుకు అవరోధాలు వస్తున్నాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో చర్చలు జరిపి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టేందుకు కృషి చేయాలని కృష్ణయ్య కోరారు. ఈ నెల 28న కలెక్టరేట్ల ముట్టడి.. బీసీ రిజర్వేషన్లు 34 శాతంతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న అన్ని జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించి ధర్నాలు చేపట్టాలని బీసీ కుల సంఘాలకు కృష్ణయ్య పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 29న అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో కుల సంఘాలు, బీసీ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బీసీలకు తగ్గించిన రిజర్వేషన్లను పెంచే వరకు పోరాటం కొనసాగుతుందని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. -
బీసీ కోటా తగ్గించి ‘పంచాయతీ’కా?
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను తగ్గించి పంచాయతీ రాజ్ ఎన్నికలను నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించబోదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా బీసీ ఓటర్ల గణన చేపట్టి వారి జనాభా ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 22 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారే అంగీకరించారని, అలాంటప్పుడు ఓటర్ల జాబితా సవరించకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆర్డినెన్సు ఉపసంహరణ, ఓటర్ల జాబితా సవరణ తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీఎంకు రాసిన లేఖలోని ముఖ్యాంశాలు.. ‘సుప్రీంకోర్టు తీర్పు మేరకు బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఈ నెల 15న విడుదల చేసిన ఆర్డి నెన్స్ను కాంగ్రెస్ అంగీకరించడం లేదు. సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ రిజర్వేషన్లు తగ్గించవద్దంటూ బీసీ సామాజిక వర్గాలు ఉద్యమించిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. రాష్ట్రంలోని బీసీ జనా భా ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలి. హైకోర్టు కూడా బీసీల జనాభాను శాస్త్రీయంగా లెక్కించిన అనంతరం ప్రజల నుంచి అభ్యం తరాలను స్వీకరించిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలంది. ఈ ఏడాది జూన్ 6న హైకోర్టు ఇచ్చిన తీర్పును విస్మరించారు. బీసీ ఓటర్ల గణనకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీనికి తోడు 2018 అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు జరుపుతామని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, దాదాపు 22 లక్షల మంది అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని సీఈఓనే అంగీకరించారు. ఓటర్ల జాబితా సవరణకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ ప్రకారం 2019, ఫిబ్రవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రచురించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితా రాకుండా పంచాయతీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు. మీ నిర్ణయంతో లక్షలాది మంది తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇది ప్రజా స్వామ్యాన్ని కాలరాయడమే. బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలి. హైకోర్టు చెప్పిన విధంగా బీసీల సామాజిక పరిస్థితుల అధ్యయనం, ఓటర్ల గణనను చేపట్టి బీసీల్లో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ ప్రకారం పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి. ప్రస్తుత ఓట ర్ల జాబితాను సవరించి అకారణంగా తొలగించిన వారి పేర్లను జాబితాలో చేర్చి వారి ప్రజాస్వామిక హక్కును కాపాడాలి’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
2 కోట్ల మందితో ఉద్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే రెండు కోట్ల మందితో ఉద్యమిస్తామని అఖిలపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి కుదించడాన్ని తప్పుపడుతూ ఆదివారం ఇందిరాపార్క్ వద్ద బీసీ సంక్షేమ సంఘం మహా ధర్నా నిర్వహించింది. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రే య, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తదితరులు ఇం దులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నారని, ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్నారు. గత ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయగా.. ఈ దఫా వాటిని 23 శాతానికి కుదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ను తక్షణమే రద్దు చేసి బీసీ రిజర్వేషన్లను పెంచాలన్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందే జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఏళ్లుగా ఉద్యమించి సాధించుకున్న బీసీ రిజ ర్వేషన్లను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించినట్లు కనిపిస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే సహిం చేది లేదని, రాష్ట్రంలోని 2 కోట్ల మందితో ఉద్యమా న్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇవ్వాలని, ఇందుకు చట్టబద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నా రు. పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు ద్వారా రిజ ర్వేషన్లపై నిర్ణయం తీసుకోవచ్చన్నారు. అప్పటివరకు పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలన్నారు. ఈ ధర్నాకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఏస్ అధ్యక్షుడు కోదండరాం సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, జనార్దన్, నీల వెంకటేశ్, జి.మల్లేశ్, జైపాల్, అనంతయ్య, బీఆర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించండి
హైదరాబాద్ : పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండు, మూడు రోజుల్లో బీసీ న్యాయ నిపుణులు, మేధావులు, బీసీ, కుల సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలతో కలసి సమావేశం ఏర్పాటు చేసి శాశ్వతంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అల్టిమేటం జారీ చేసింది. లేదంటే తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తిగా బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, రాస్తారోకో వంటి కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నేతలు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టుల్లో ప్రశ్నించకుండా 9 వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఓబీసీ ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద గురువారం బీసీల మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అన్నారు. ఓబీసీ రిజర్వేషన్లు కేంద్రం, బీసీ రిజర్వేషన్లు రాష్ట్రం పరిధిలోనివని, బీసీ ముస్లిం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచి కేంద్ర ఆమోదానికి పంపడం బూటకమన్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి స్టేను పునరుద్ధరించాలని కోరారు. రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తాం: జాజుల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కుంపటి రాజుకుంటే రాయితీలు కాదని రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తామన్నారు. గతంలో ఉన్న పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకు వస్తున్నారని, బీసీలను రాజకీయంగా ఎదగకుండా చేసే కుట్రలో ఇది భాగమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఎవరితో చర్చించకుండా మొండిగా ముందుకు పోతే జైలుకు వెళ్లడానికి, అఖరికి చావడానికైనా సిద్ధమేనన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె .లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ బీసీలకు సంబంధించిన 31 అంశాలను గుర్తించి సీఎం కేసీఆర్కు నివేదిస్తే ఏడాది గడిచినా ఒక్క అంశాన్ని అమలు చేయలేదని, కేసీఆర్కు సామాజిక స్పృహలేదన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కోర్టును సాకుగా చూపుతూ 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడం శోచనీయమన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు వస్తే ఆ పార్టీలోని కేశవరావు, డి. శ్రీనివాస్ వంటి నేతలు నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు.శాసనమండలి పక్ష నేత షబ్బీర్అలీ మాట్లాడుతూ కేసీఆర్ పిట్టలదొర అని, ఎప్పుడు ఏ మాట చెబుతారో ఆయనకే తెలియదని అన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా బీసీ రిజర్వేషన్ల పరిరక్షణకు పోరాడాలన్నారు. కార్యక్రమంలో సాంబశివరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, టీటీడీపీ నేతలు కూన వెంటేష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు జి.భరత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 23న భారీ ధర్నా: కృష్ణయ్య హైదరాబాద్: గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 23%కు తగ్గిస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల తగ్గింపు ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఈ నెల 23న భారీ ధర్నాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యానగర్ బీసీ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత పాతికేళ్లుగా 34% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, అప్పుడులేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. 34% రిజర్వేషన్ల ప్రకారమే... ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలను 34% రిజర్వేషన్ల ప్రకారమే జరపాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 34% నుంచి 56% వరకు పెంచాలని బీసీలు డిమాండ్ చేస్తుంటే కోర్టులు, ప్రభుత్వాలు రిజర్వేషన్లను 23%కి తగ్గించాలనుకోవడం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కొత్తేమీ కాదని, ఈ తీర్పు ఇచ్చిన తరువాత కూడా 2013లో గ్రామపంచాయతీ ఎన్నికలు, 2014లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించారని వివరించారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, జైపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలు తీవ్రంగా నష్టపోతారని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని చెప్పారు. గతంలో 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగినప్పటికీ... తాజా తీర్పుతో రిజర్వేషన్ల శాతం 50 శాతం మించకూడదని, దీంతో బీసీ రిజర్వేషన్లు 30 శాతం కూడా దాటవని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గిస్తున్నట్లు అఫిడవిట్ దాఖలు చేసిందని, దాని ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తే అన్యాయానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా స్థానిక సంస్థల్లోనూ బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ మేరకు కృష్ణయ్య ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
బీసీ జనాభా లెక్కలు వెల్లడించాలి
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నిలుపుకోవాలంటే ముందుగా వారి జనాభా లెక్కలు వెల్లడించాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలందరికీ న్యాయం జరిగేలా ఏబీసీడీ వర్గీకరణ చేయాలన్నా జనాభా లెక్కలే ప్రామాణికమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బీసీ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు – భవిష్యత్ కార్యాచరణ’ అనే అంశంపై ఆదివారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో పలువురు బీసీ సంఘాల నేతలు, సామాజికవేత్తలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 24 ఏళ్లుగా బీసీలకు 34%గా ఉన్న రిజర్వేషన్లను 24శాతానికి కుదించడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రశ్నించలేని దుస్థితిలో బీసీ కమిషన్ ఉండటం శోచనీయమన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ఒక్కరోజులో పూర్తిచేయగలిగిన ప్రభుత్వానికి బీసీ జనాభా లెక్కలను వెలికి తీయడం ఎంతసేపని ప్రశ్నించారు. బీసీలు 52% కన్నా తక్కువగా లేరని, వారిని ఏబీసీడీలుగా వర్గీకరిస్తేనే పంచాయతీ ఎన్నికల్లో సమన్యాయం జరుగుతుందని సూచించారు. అధికారులే నిర్వీర్యం చేస్తున్నారు ఈ సమావేశంలోనే బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా ఎన్నికైన జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ...స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు, ఎన్నికల శాఖ అధికారులు రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో అడిషనల్ ఏజీపీతో వాదనలు వినిపించడం వల్లే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. న్యాయనిపుణులు, సామాజిక ఉద్యమకారులతో చర్చించి రిజర్వేషన్ల పంచాయతీకి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. రిజర్వేషన్ల పరిరక్షణకు అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. సామాజిక విశ్లేషకులు ఉ.సాంబశివరావు మాట్లాడుతూ.. బీసీ లెక్కలు లేకపోవడానికి పాలకులే కారణమన్నారు. బీసీలకు 54% రిజర్వేషన్లు ఇవ్వాలని పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కె.గణేశ్చారి, ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు నర్సింహ్మ సగర, బీసీ,ఎస్సీ,ఎస్టీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, ప్రొఫెసర్ రమ, ఎస్.లక్ష్మి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్ : బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా కేసీఆర్ అడ్డు పడుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హన్మంతరావు ఆరోపించారు. శుక్రవారమిక్కడ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఆలోచనే పంచాయతీ ఎన్నికలని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ ఉంటే కేసీఆర్ దాన్ని తగ్గించాడని ఆరోపించారు. బీసీల జనాభా 53 శాతం ఉంటే.. 33 శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమిళనాడులో ఇచ్చినట్లు తెలంగాణలో కూడా 69 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో బీసీలను సర్పంచ్లు, జడ్పీటీసీలుగా కాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ముస్లీంలకు ఎలాను రిజర్వేషన్లు పెరగవు.. బీసీలకైనా రిజర్వేషన్లు పెంచాలని కోరారు. కేసీఆర్కి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే రిజర్వేన్లు పెంచి.. 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి గురించి మీటింగ్లో చర్చించిన తరువాత కారణాలు చెప్తామని తెలిపారు. పార్టీలో కోవర్ట్లున్నారని.. ఈవీఎంల సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. -
ఇక పంచాయతి పోరు షురు...
సాక్షి, ఆసిఫాబాద్రూరల్/ఆదిలాబాద్అర్బన్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందడి ముగిసింది. రేపటితో అసెంబ్లీ అభ్యర్థుల గెలుపోటములు కూడా తేలిపోనున్నాయి. ఇక పంచాయతీ పోరుపై దృష్టి పడింది. జనవరి 10లోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గత అక్టోబర్లో ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా పంచాయతీ అధికారులు ఆదివారం పంచాయతీల వారీగా బీసీ ఓటర్ల ముసాయిదా జాబి తాను విడుదల చేశారు. ఈ జాబితాలో పేరు లేని బీసీలు సోమవారం నుంచి నమోదుతో పాటు మా ర్పులు, చేర్పులు చేసుకోవచ్చు. బీసీ ఓటర్ల జాబితా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో అందుబాటులో ఉంచారు. అధికారులు ప్రకటించిన ము సాయిదాలో బీసీ ఓటర్ల వివరాలు స్పష్టంగా ఉ న్నాయి. కాగా, ఇన్ని రోజులు ముందస్తు ఎన్నికల తో బీజీగా గడిపిన ఎన్నికల సంఘం, జిల్లా అధి కారులు ఇప్పుడు పంచాయతీపై దృష్టి పెట్టారు. 13,14న గ్రామసభలు.. ఉమ్మడి జిల్లాలో గల నాలుగు జిల్లాల పంచాయతీ అధికారుల వద్ద ఓటర్ల జాబితా అందుబాటులో ఉంది. ఆ జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,14,835 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నారు. ఆదివారం విడుదల చేసిన బీసీ ఓటర్ల ముసాయిదా జాబితా అనంతరం మార్పులు, చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించనున్నారు. ఏవైనా మార్పులు ఉన్నట్లయితే ఈ నెల 13, 14 తేదీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయం స్వీకరిస్తారు. ఈ ప్రక్రియను ఈ నెల 14 సాయంత్రంలోగా పూర్తి చేసిన 15న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు. విడుదల చేసిన జాబితాను పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తారు. అనంతరం ఆ జాబితా ప్రకారం రిజర్వేషన్లకు కేటాయింపుకు చర్యలు తీసుకుంటారని అధికారులు పేర్కొంటున్నారు. రిజర్వేషన్లపై ఆశ.. గత సర్పంచ్ల పదవీ కాలం గత ఆగస్టు 2తో ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిన విషయం తెలిసిందే. సర్పంచ్ల పదవీ ముగిసే నెల ముందే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ ఆ తర్వాత రిజర్వేషన్లపై చోటు చేసుకున్న పరిణామాలు హైకోర్టు వరకు తీసుకెళ్లాయి. ఆ సమయంలో 2019 జనవరి 10లోగా పంచాయతీలకు ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఊపిరి పీల్చుకున్న ఎన్నికల సంఘం తద్వారా వచ్చిన ముందస్తు ఎన్నికల పనుల్లో నిమగ్నమైంది. ఇప్పుడు ఆ ఎన్నికలు ముగియడంతో పంచాయతీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీసీ ఓటర్ల తయారీ జాబితా ప్రక్రియ ప్రారంభించాలని పంచాయతీ రాజ్ కమిషనర్ నుంచి ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పుడు అధికారులు జాబితాను పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. అనంతరం ఆ జాబితా ప్రకారం తాజాగా ఖరారు కానున్న రిజర్వేషన్ల కోసం జిల్లా వాసులు ఆశతో ఎదురుచూస్తున్నారు. సర్పంచ్ పదవులకు బీసీలు, ఎస్టీ, ఎస్సీలు అందరు ముందుకు రావడంతో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. 50 శాతానికి మించరాదనే సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఓటరు జాబితా ప్రదర్శన ఆసిఫాబాద్: పంచాయతీ ఎన్నికలు పురస్కరించుకొని బీసీ ఓటర్ల జాబితాను ఆదివారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించినట్లు ఈవోపీఆర్డీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించామని, సోమవారం ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామని, 12న పరిష్కరిస్తామని, 13 నుంచి 14 వరకు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి 15న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. -
‘సుప్రీం’లో తెలంగాణ సర్కారుకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 67 శాతం ఇవ్వాలన్న తెలంగాణ సర్కారు విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని స్పష్టం చేసింది. తెలంగాణలో బీసీల జనాభా అధికంగా ఉన్నందున రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే అటువంటి మినహాయింపులు ఉండబోవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కాగా, ఎస్టీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు కోసం పోరాటం చేస్తామని టీఆర్ఎస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీయిచ్చింది. ఈ అంశంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తు చేసింది. -
చట్టసభల్లో రిజర్వేషన్లతోనే బీసీల అభ్యున్నతి
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో 75 శాతానికి పైగా ఉన్న బీసీలు ఎవరికి వారే పోరాడుతుండటం వల్ల అభివృద్ధి ఫలాలు దక్కడం లేదు. బీసీలంతా సంఘటితమైతేనే ప్రజాస్వామ్య ఫలితాలు లభిస్తాయి. చట్టసభల్లో రిజర్వేషన్లతోనే బీసీల అభ్యున్నతి సాధ్యం’ అని అఖిల భారత బీసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు జస్టిస్ వి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. బీసీ సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య అధ్యక్షతన ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా వెనుబడిన వర్గాలు నేటికీ అభివృద్ధి చెందలేదన్నారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే విలువలతో కూడిన సమసమాజ స్థాపన కోసం.. దేశంలోని అన్ని రంగాల్లోనూ బీసీలకు తగినంత ప్రాతినిధ్యం ఉండాలన్న లక్ష్యంతో అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమాఖ్య రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తోందన్నారు. వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లభించాలన్న లక్ష్యంతో ‘పీపుల్స్ అజెండా–2019’కు రూపకల్పన చేశామని, ఓటుతోనే ఈ అజెండా అమలు సాధ్యమవుతుందన్నారు. ప్రాథమిక విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాలని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న నీరు, భూమి, అటవీ వనరులపై వారికే పూర్తి హక్కులు కల్పించాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ పెట్టుబడులు ప్రభుత్వమే భరించాలని జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అనంతరం బీసీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయకిరణ్ ముద్రించిన కరపత్రాలను జస్టిస్ ఈశ్వరయ్య విడుదల చేశారు. సమావేశంలో నాయకులు దువ్వారపు రామారావు, ఎంవీవీఎస్ మూర్తి, వై.కోటేశ్వరరావు, గూడూరి వెంకటేశ్వరరావు, కె.ఆల్మన్ రాజు, నమి అప్పారవు, వి.వి.గిరి, ఎన్.వి.రావు, బుద్దా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని జస్టిస్ ఈశ్వరయ్య ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
సీట్లు ఎక్కువ ఇచ్చినోళ్లకే ఓట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకే బీసీలు ఓట్లు వేస్తారని బీసీ బహిరంగసభ తేల్చిచెప్పింది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బీసీ బహిరంగసభ జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయ ణ అధ్యక్షతన జరిగిన ఈ సభకు సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఎంపీ బండారు దత్తాత్రే య, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రజాగాయకుడు గద్దర్, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నేతలు ర్యాగ అరుణ్, నీల వెంకటేశ్ తదితరు లు హాజరయ్యారు. రాజ్యాధికారమే ప్రధాన ఎజెం డాగా జరిగిన ఈ సభలో బీసీల సమగ్ర అభివృద్ధి కోసం 21 అంశాలతో తీర్మానాలు చేశారు. ఈ తీర్మాన ప్రతిని అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వనున్నామని, ఆయా పార్టీల మేనిఫెస్టోల్లో ఈ అంశాలను చేర్చినవాటికే మద్దతిస్తామని బీసీ సంఘం తెలిపింది. బీసీలను గెలిపించుకుందాం: ఆర్.కృష్ణయ్య జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్నిరంగాల్లో వాటా దక్కాలని ఆర్.కృష్ణయ్య అన్నారు. టికెట్లు పొందడానికి బీసీలకు అర్హత లేదనట్లు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని, వివక్ష చూపే పార్టీలకు బీసీలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీసీ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీల కంటే అధ్వానం: దత్తాత్రేయ ఎస్సీ, ఎస్టీల కంటే అధ్వానంగా బీసీలు బతుకుతున్నారని ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీలకు చట్టపరమైన రిజర్వేషన్లు లేకపోవడంతో ఇప్పటికీ వెనుకబడ్డారన్నారు. రన్నింగ్ బస్ దిగేశారు: జస్టిస్ చంద్రకుమార్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొందరపాటు చర్యలకు త్వరలో మూల్యం చెల్లించాల్సి వస్తుందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. బస్టాప్ రాకముందే రన్నింగ్ బస్ దిగారని, దీంతో గమ్యస్థానం పోకుండా దెబ్బతినడం ఖాయమన్నారు. బడుగులకు రాజ్యాధికారం దిశగా: తమ్మినేని బడుగులకే రాజ్యాధికారం రావాలనే దిశగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ముందుకు సాగుతోందని తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆర్.కృష్ణయ్య ఒప్పుకుంటే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామన్నారు. దొరల రాజ్యాన్ని అంతం చేయాలి: చెరుకు సామాజిక మార్పుతోనే బీసీ వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని చెరుకు సుధాకర్ అన్నారు. బీసీలు తమ ఓటుతో దొరల రాజ్యాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. మామ, అల్లుడి సంపాదన రూ.50 వేల కోట్లు: రమణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు బీసీలు చరమగీ తం పాడతారని ఎల్.రమణ అన్నారు. 20 ఏళ్ల క్రితం మంత్రి హరీశ్ హవాయి చెప్పులేసుకునే వారని, ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టుల్లో భారీగా సం పాదించారన్నారు. మామ, అల్లుళ్లు రూ.50 వేల కోట్లు సంపాదించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన బీసీ అభ్యర్థులకు పార్టీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడంలేదన్నారు. బీసీ బహిరంగసభ తీర్మానాలు ♦ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి ♦ అసెంబ్లీ, పార్లమెంటులో సీట్లను రెట్టింపు చేసి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించని కులాలకు నామినేటెడ్ పద్ధతిలో ప్రాధాన్యత ఇవ్వాలి ♦ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి ♦ రూ.20 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ ♦ బీసీలకు విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు -
ప్రభుత్వ సహకారం లేకనే!
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు న్యాయ పోరాటానికి దిగింది. రాష్ట్రంలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా నిర్దిష్ట కాల వ్యవధిలో.. బీసీలతోపాటు అన్ని రిజర్వేషన్లను ఖరారు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. గడువు ముగిసినా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంలో తమ తప్పేమీ లేదని, ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయకపోవడం వల్లే తాము ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లలేకపోతున్నామని పేర్కొంది. అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈసీ కార్యదర్శి ఎం.అశోక్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై వచ్చే వారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. మేమేం చేయాలో అన్నీ చేశాం కానీ.. ‘ఉమ్మడి రాష్ట్రంలో (2013లో) పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటి కాలపరిమితి ఈ ఏడాది ఆగస్టు 1తో ముగిసింది. ఐదేళ్ల కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (ఇ) (3) ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. వార్డుల పునర్విభజన, వార్డులు–పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ స్టేషన్ల ఖరారు ఇవన్నీ కూడా ఎన్నికల నిర్వహణలో భాగం. గ్రామ పంచాయతీలు ఖరారైన తర్వాత ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురిస్తుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఈ ఏడాది మార్చి 10న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ఆ తరువాత ఎప్పటికప్పుడు ఎన్నికల గురించి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ వచ్చాం. వార్డులు, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీ కోసం.. ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేశాం. ఆ రోజుకి 12,751 గ్రామ పంచాయతీలు, 1,13,380 వార్డులు, 1,38,624 పోలింగ్ కేంద్రాలు, 3,26,561 మంది ఎన్నికల సిబ్బంది అవసరం ఉంది. ఆ తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శుల వద్ద పలు సమావేశాలు జరిగాయి. వీలైనంత త్వరగా వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలన్న నిర్ణయం జరిగింది. ఆ తరువాత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించాం. జూన్ 23న ఎన్నికల పరిశీలకులను కూడా నియమించాం. నిర్దేశించిన గడువులోపు ఎన్నికలను పూర్తి చేయడానికి అవసరమైన అన్నీ చర్యలను మా వంతుగా చేపట్టాం. జూన్ 25 కల్లా రిజర్వేషన్లు ఖరారు చేయాలని మరోసారి ప్రభుత్వానికి సూచించాం. అయితే ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయడం గానీ, మేం ప్రతిపాదించిన షెడ్యూల్తో ఏకీభవించడం గానీ చేయలేదు. మా పరిధిలో మేం ఏం చేయాలో అన్నీ చేశాం. ఎన్నికల విషయంలో మా తప్పేమీ లేదు’అని అశోక్కుమార్ కోర్టుకు వివరించారు. బీసీ జనాభాను తేల్చిన తర్వాతే.. ఇదే సమయంలో ముందుగా బీసీ జనాభాను తేల్చి ఆ తరువాత ఎన్నికలు నిర్వహించాలని ఇదే హైకోర్టు ఈ ఏడాది జూన్ 26న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల తరువాత జూలై 6న మేం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% దాటకుండా రిజర్వేషన్లను ఖరారు చేయాలని కోరాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించని పక్షంలో.. హైకోర్టును ఆశ్రయించ వచ్చని కిషన్సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. బీసీ తరగతులు, ఉప తరగతుల గుర్తింపునకు ఎంతో సమయం పడుతుంది. ఈ అంశంపై తదుపరి న్యాయపరమైన వివాదాలు కూడా చెలరేగే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పంచాయతీల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ సమయంలో పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండటం.. రాజ్యాంగ విరుద్ధం. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. అందుకే బీసీ తరగతులతో సహా అన్ని రిజర్వేషన్లను నిర్దిష్ట కాలపరిమితిలో ఖరారు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి’అని అశోక్కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
బీసీల ప్రస్తావనేదీ..
హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో బీసీల ఆత్మగౌర వాన్ని దెబ్బతీసే విధంగా ఉం దని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పేర్కొన్నా రు. బీసీలకు ఒక్క పథకం కూడా అందులో ప్రకటిం చలేదని ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో బీసీలకు ఎలాంటి హామీలివ్వకుండా బీసీ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలంటే కేసీఆర్కు లెక్కలేదని, ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అనేక బీసీ వ్యతిరేకచర్యలకు పాల్పడ్డారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను విద్యకు దూరం చేశారని ఆరోపించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై కేంద్రంతో పోరాడుతానని చెప్పి ఒక్కసారి కూడా ప్రధానితో మాట్లాడలేదని ఆరోపించారు. జనాభా ప్రతిపాదికన ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లు పెంచి బీసీ రిజర్వేషన్లు మాత్రం తొక్కి పెట్టా రని విమర్శించారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలకు ఒక్క కొత్త భవనం కూడా నిర్మించలేదన్నారు. జనాభా ప్రకారం పంచా యతీ రాజ్ రిజర్వేషన్లు పెం చుతామని హామీ ఇచ్చి అనంతరం తగ్గించేందుకు ప్రయత్నించారన్నారు. బీసీలంటే కేసీఆర్కు ఓట్లేసే యంత్రాలుగా కనబడుతున్నారన్నారు. కేసీఆర్ తన వైఖరిని మార్చుకుని ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకిచ్చే హామీలను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశం లో బీసీ నేతలు గుజ్జ కృష్ణ, ఎర్ర సత్యనారాయణ, శారదగౌడ్, చెరకు కౌశిక్యాదవ్, జంగయ్య యాదవ్, సుమన్బాయి పాల్గొన్నారు. -
భావ విప్లవంతోనే రాజ్యాధికారం
భావ విప్లవం తోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవు తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. హన్మకొండ లోని కేయూ ఆడిటోరియంలో శనివారం రాత్రి నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల ప్రదాత బీపీ మండల్ శతజయంతి ఉత్సవాల మహాసభలో ఆయన మాట్లాడారు. కేయూ క్యాంపస్ (వరంగల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని, ఐక్యంగా రాజ్యాధికారం సాధించుకునే దిశగా ప్రయత్నించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మె ల్యే ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల ప్రధాత బీపీ మండల్ శతజయంతి ఉత్సవాల మహాసభ కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో శనివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బీపీ మండల్ పోరాటం ద్వారా సాధించుకున్న బీసీలకు 27శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఉద్యోగాల కల్పనలోను క్రిమీలేయర్ విధానాన్ని అనుసరిస్తున్నారని, దీంతో ఎంతో మంది బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభించటం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రిమీలేయర్ విధానాన్ని అమలు చేస్తుందని, దీంతో బీసీలకు నష్టం జరుగుతుందని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా.. అలాగే అమలు చేస్తున్నారని ఆరోపించారు. క్రిమీలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేయాల్సి సమయం ఆసన్నమైందన్నారు. జాతీయ బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించాలని ప్రధానీ నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లితే ఇటీవలనే చట్టబద్దత కల్పించారన్నారు. బీసీ కులాల మధ్య ఐక్యమత్యం లేకపోవడం వలనే మన ఓట్లు మనకు రావడం లేవని, తక్కువ ఓట్లు ఉన్న అగ్ర కులాల వారే అధికారంలోకి వచ్చి సీఎంలు అవుతున్నారన్నారు. ఇప్పటికైనా బీసీలు సమష్టిగా ఉండి బీసీ భావ విప్లవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. బీసీ ఉద్యోగులు చోదకశక్తిగా పనిచేస్తూ గ్రామల్లోనూ, మండలాల్లోనూ, నియోజకవర్గాల్లోను బీసీ సంఘాల కమిటీలు వేసి నాయకత్వ లక్షణాలు పెంపొందించాలన్నారు. అప్పుడే రాజ్యాధికారం సిద్దిస్తుందని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు కూడా అమలు కావడం లేదు బీసీ ఉద్యోగులకు, పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు అమలు కావాడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. పోరాడితే పోయేది బానిస సంకెళ్లు తప్ప అన్నట్లుగా బీసీలు తమ హక్కులు సాధన కోసం పోరాడాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా కలిసికట్టుగా ముందుకుకెళ్దామన్నారు.వి ద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ముత్యం వెంకన్నగౌడ్ మాట్లాడుతూ వి ద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని ప్రకటించి వర్తింపచేయాలన్నారు. సీఎండి గా బీసీని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు పత్తి మధుసూధన్రావు, తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీలారంపు రాజేందర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, తెలంగాణ విద్యావంతులవేదిక బాధ్యులు కోల జనార్ధన్, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, ఆర్టీసీ, రైల్వే, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘాల బాధ్యులు వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యుత్ ఉద్యోగ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ బీసీ లకు జరుగుతున్న అన్యాయాలను వివరిం చారు. అనంతరం బీసీల చైతన్య వేదిక కరపత్రాలను ఆవిష్కరించారు. రామలింగయ్య బృందం పాడిన పాటలు ఉత్తేజం పరిచాయి. వివిధ జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. తొలుతఅ తిథులు బీసీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
బీసీ రిజర్వేషన్ సునామి ‘మండల్’
భారత రాజ్యాంగ నిర్మాణం తర్వాత భారత సామాజిక రాజకీయాలను కదిలించివేసిన ఘనత బి.పి. మండల్కే దక్కుతుంది. రాజకీయాల్లో ఉద్యోగ, విద్య, తదితర రంగాల్లో ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కోసం మండల్ సాగించిన కృషికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. కాలం గడిచినకొద్దీ ఇది విస్తరిస్తూనే ఉంటుంది. మండల్ కమిషన్ నివేదిక లేకుండా జాతీయ బీసీ కమిషన్లు గానీ, రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు గానీ లేవు. మండల్ కమిషన్ నివేదిక లేకుండా జాతీయ బీసీ కమిషన్లు గానీ, రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు గానీ లేవు. భారత రాజకీయ, సామాజిక చరిత్ర నిర్మాణంలో మండల్ కమిషన్ నివేదిక నిర్వహించిన కీలకపాత్ర ఎవ్వరూ చెరిపివేయలేనిది. మండల్ కమిషన్ నివేదిక లేకుండా జాతీయ బీసీ కమిషన్లుగానీ, రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు గానీ లేవు. ఇటీవల 123వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్లలాగా బీసీ కమిషన్లకు కూడా రాజ్యాంగపరమైన విస్తృత అధికారాలు కల్పించారు. బీసీ కమిషన్లను నిర్మించడానికి, ఇప్పుడు 123వ రాజ్యాంగ సవరణ బిల్లుతో వాటిని పునర్నిర్మించడానికి మండల్ కమిషన్ నివేదికే ప్రాతిపదిక. ఇలా బిందే శ్వరి ప్రసాద్ మండల్ స్వాతంత్య్రానంతరం భారతీయ సామాజిక, రాజ కీయ పరిణామాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం. దేశ రాజకీయాల్లో, ఉద్య మాల్లో, బీసీల జీవితాల్లో అనేక మలుపులకు, పరిణామాలకు మండల్ కమిషన్ ఒక రాజ్యాంగంలాగా స్ఫూర్తినిస్తూ వచ్చింది. బీసీలు ఉన్నంత కాలం ఈ దేశంలో మండల్ పేరు చిరస్థాయిగా నిలిచిపో తుంది. భారత దేశంలోని ప్రజలలో ఒక భాగాన్ని ‘అదర్ బేక్ వర్డ్ క్లాసెస్’(ఆఇట) (ఇతర వెనుకబడిన కులాలు)గా మండల్ కమిషన్ నివేదిక నిర్వచించింది. ఈ నివేదిక తర్వాతే, భారతీయ రాజకీయాల్లో బలహీన వర్గాల కోసం విధివిధానంపై తీవ్రమైన చర్చ ప్రారంభమైంది. అధికారపక్షంలోనూ ప్రతిపక్ష పాత్రే! బిందేశ్వరి ప్రసాద్ మండల్ 25 ఆగస్టు 1918లో బీహార్లో యాదవ సామాజిక వర్గంలో జన్మించారు. తన 23వ యేటా జిల్లా కౌన్సిల్కి ఎన్ని కయ్యారు. 1945–51 మధ్య కాలంలో మాధేపుర డివిజన్లో జీతం తీసుకోకుండా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్గా పనిచేసారు. బి.పి. మండల్ రాజకీయ జీవితం భారత జాతీయ కాంగ్రెస్తో మొదలైంది. 1952 లో మొదటిసారి బీహార్ అసెంబ్లీకి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అధి కార పార్టీలో ఉంటూనే, బీహార్లోని బలహీనవర్గ కుర్మీలపై అగ్రవర్ణ రాజపుత్రులు దాడి చేయడాన్ని నిరసించారు. 1965లో తన నియోజక వర్గంలో భాగంగా ఉన్న గ్రామమైన పామాలో మైనారిటీలపై, దళితు లపై పోలీసులు చేస్తున్న అత్యాచారాలపై మాట్లాడాలని మండల్ భావిం చారు. కానీ అధికార పక్షంలో ఉండి ఈ అంశంపై మాట్లాడకూడదని ముఖ్యమంత్రి ఆదేశించినప్పుడు, తన మనస్సాక్షిని చంపుకోలేక ప్రతి పక్ష పాత్ర నిర్వహించడానికి సిద్ధమై సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్.ఎస్.పి)లో చేరారు. తను నమ్మిన విలువల కోసం అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి సిద్ధమయ్యారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, జయ ప్రకాష్ నారాయణ్ల స్ఫూర్తితో సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్.ఎస్.పి)లో చేరారు. ఆ క్రమంలో ఆ పార్టీ రాష్ట్ర పార్ల మెంటరీ బోర్డు ఛైర్మన్గా నియమితులయ్యారు. 1967లో జరిగిన ఎన్నికలలో సంయుక్త సోషలిస్టు పార్టీ అభ్యర్ధుల ఎంపికపై ఆయన చేసిన కృషి, ఆయన ప్రచారం వల్ల, 1962లో కేవలం 7 సీట్లు మాత్రమే కలిగి ఉన్న ఆ పార్టీకి 1967లో 69 సీట్లు వచ్చాయి. ఆ విధంగా బీహార్లో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. మండల్ పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకున్నారు. బిహార్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసారు. పార్టీలో, ప్రభుత్వంలో విభేదాలు రావడం, కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వడంవల్ల 1968 ఫిబ్రవరి 1న మండల్, బీహార్ రాష్ట్ర రెండవ బీసీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నప్పటికీ రాజీ పడకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అవినీతిపై అయ్యర్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదికను బహిరంగపర్చవద్దంటూ నాటి ప్రధాని ఇందిర స్వయంగా ఒత్తిడి తీసుకు వచ్చినా నిరాకరించారు. దాంతో మండల్ ప్రభుత్వంపై అవి శ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అలా 30 రోజులకే మండల్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ‘ఓట్లను సంపాదించడానికి కులపరమైన విజ్ఞప్తిని సహించవచ్చు కానీ ప్రభుత్వాల నిర్ణయాల్లో ఏ కుల తత్వాన్ని సహించవద్ద’ని తన మంత్రులకు బోధించిన మండల్ తన ప్రభుత్వంలో, పరిపాలనలో కులతత్వాన్ని ప్రదర్శించకుండా పాలిం చారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత మండల్ 1967 మార్చి 5న సోషిత్ దళ్ (అణగారిన ప్రజల పార్టీ)ని స్థాపించారు. 1967 నుండి 1970 వరకు లోక్సభ సభ్యునిగా పని చేశారు. 1972లో శాసన సభకు తిరిగి ఎన్నికయ్యారు. 1972లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి పాండే, మిథిలా యూనివర్సిటీ పేరుతో అందులో కింది ఉద్యోగి నుంచి వైస్ ఛాన్సలర్ దాకా ఒకే కులం వారిని నింపాలని చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. మండల్ కమిషన్తో రాజకీయాల్లో మూలమలుపు బి.పి.మండల్ 1974లో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో నడుస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 1977లో జనతా పార్టీ తరపున లోక్సభకి ఎన్నికై 1979 వరకు కొనసాగారు. మండల్ సోషలిస్ట్ రాజకీయ చింత నాపరుడిగా పని చేసారు. 1978 డిసెంబరులో ప్రధా నమంత్రి మొరార్జీ దేశాయ్ బి.పి. మండల్ ఛైర్మన్గా, బీసీలకు రిజర్వేషన్ల కోసం ఐదు గురు సభ్యులతో కమిషన్ వేశారు. మండల్ కమిషన్ నివేదికను 1980 డిసెంబర్ 31న రాష్ట్రపతికి సమర్పించారు. రెండు సంవత్సరాలు పనిచేసి తన నివేదికను సమర్పించినట్లు పైకి కనిపించినప్పటికీ... ఆ కాలంలో అనేక శాసనసభలకు, పార్లమెంటుకు ఎన్నికలు జరిగే ఒత్తిడి మధ్య ప్రజలు, ప్రభుత్వాలు, పార్టీలు తలమునకలై ఉన్న నేపథ్యంలో అనేక కష్టాల కోర్చి సమాచారం సేకరించి కేవలం 10 నెలల్లో ఈ నివేదికను తయారు చేయడం మాటలు కాదు. దేశంలోని 52 శాతం భారతీయుల గురించి, వారి ప్రాతినిధ్యం, అభివృద్ధి, విద్య, ఉద్యోగ అవకాశాల గురించి చట్టసభల్లో వారి ప్రాతి నిధ్యం గురించి స్పష్టంగా సూచించిన ‘మండల్ కమిషన్’ రిపోర్టు భారతదేశ రాజకీయాల్లోనే ఒక కొత్త మలుపు. భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో ఓబీ సీల అభ్యర్ధులకు 27 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని మండల్ తన నివేదికలో సిఫారసు చేశారు. మండల్ కమిషన్ సిఫారసుల అమలును, 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టులలో కేసులు నడిచాయి. ఇంద్రసహాని కేసు పేరున ప్రసిద్ధమైన ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు అనేక కోణా లను పరిశీలించి తన తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వానికి అనేక సూచనలను, ఆదేశాలను జారీ చేసింది. వాటిని అనుసరించి 1993 నుంచి కేంద్రంలో, రాష్ట్రాల్లో శాశ్వత ప్రాతిపదికపై బీసీ కమిషన్లు ఏర్పడుతూ వస్తున్నాయి. చివరకు 27 శాతం బీసీ రిజర్వేషన్లను ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు అమలులోకి తీసుకువచ్చారు. భారత రాజకీయాల్లో అనేక సంచలనాత్మక మార్పులకు మండల్ కమిషన్ సిఫారసులు కేంద్ర మయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి విద్యాసంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మానవవనరుల శాఖ మంత్రి అర్జున్ సింగ్ ప్రయత్నించినప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేక, ఆందో ళనలు మొదలయ్యాయి. దాంతో 27 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఆయా విద్యాసంస్థల్లో 27 శాతం సీట్లను అదనంగా పెంచి సామర స్యంగా సమస్యను పరిష్కరించే కృషి చేశారు. అయితే రాజకీయంగా చట్టసభల్లో రిజర్వేషన్లు ఇంకా సాధ్యం కావడం లేదు. ఈ లక్ష్యసాధన కోసం ఓబీసీలు దశాబ్దాలుగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. చెక్కుచెదరని రాజ్యాంగ స్ఫూర్తి భారత రాజ్యాంగ నిర్మాణం తర్వాత భారత సామాజిక రాజకీయాలను కదిలించివేసిన బి.పి. మండల్ 1982 ఏప్రిల్ 13న మరణించారు. రాజకీయరంగం ద్వారా సంఘసంస్కరణలు తీసుకురావడానికి, సామా జిక ఉద్యమాల ద్వారా రాజకీయ సంస్కరణలను తీసుకురావడానికి, రాజకీయాల్లో ఉద్యోగ, విద్య, తదితర రంగాల్లో ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కోసం మహాత్మా జ్యోతిబాఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్, రాంమనోహర్ లోహియా, బిందేశ్వరి ప్రసాద్ మండల్ చేసిన కృషి చరిత్రాత్మకమైనది. భారత రాజ్యాంగంలో ఆయా సామాజిక వర్గాలకు రక్షణలు, ప్రత్యేక కృషి గురించిన ఆర్టికల్స్ చేర్చడం, ప్రణాళికలు, పథకాలు చేప ట్టడంలో వీరి కృషి మహోన్నతమైనది. ఆయన శత జయంతి సంద ర్భంగా మండల్ కమిషన్ నివేదిక తెలుగు అనువాదం పూర్తిచేయడం జరిగింది. మండల్ ప్రాధాన్యత, మండల్ కమిషన్ ప్రాధాన్యత.. కాలం గడిచినకొద్దీ విస్తరిస్తూనే ఉంటాయి. భారతీయ రాజకీయ, సామాజిక చరిత్ర నిర్మాణంలో మండల్ కమిషన్ నివేదిక నిర్వహించిన కీలకపాత్ర ఎవ్వరూ చెరిపివేయలేనిది. బీసీ కమిషన్లకు రాజ్యాంగ ప్రతిపత్తి ఇవ్వడం అందుకు ఒక ప్రతీక. (ఆగస్ట్ 25న బిందేశ్వరి ప్రసాద్ మండల్ శతజయంతి సందర్భంగా) బి.ఎస్.రాములు వ్యాసకర్త ఛైర్మన్, తెలంగాణ బి.సి. కమిషన్, సామాజిక తత్వవేత్త ‘ మొబైల్ : 83319 66987 -
బీసీ బిల్లుకు రాహుల్గాంధీ సానుకూలం: కృష్ణయ్య
హైదరాబాద్: చట్ట సభల్లో బీసీలకు రిజ ర్వేషన్లు కల్పించేందుకు 2019లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు బీసీ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వెల్లడిం చారు. పార్లమెంటులో బీసీ బిల్లును ఆమోదిం చేందుకు రాహుల్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరు లతో మాట్లాడారు. ఈ విషయంపై మంగళ వారం రాహుల్గాంధీతో ప్రత్యేకంగా చర్చించా మని అందుకు ఆయన తనకు స్పష్టమై న హామీ ఇచ్చారని తెలిపారు. రాహుల్ను కలసిన విషయంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ప్రధానంగా బీసీ బిల్లుపైనే ఇరువురం చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. -
బీసీ సమస్యలపై అసెంబ్లీ పెట్టండి
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, పంచాయతీ ఎన్నికలపై చర్చించడానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సచివాలయంలో కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల తర్వాత వర్షాకాల సమావేశాలు పెట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. బీసీలు 54 శాతం దాటినా దాని ప్రకారం రిజర్వేషన్ల కేటాయింపుల్లో ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడంతో మధ్యలోనే చదువు మానుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలన్నారు. గతేడాది 119 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తామని సీఎం అనేక సార్లు ప్రకటన చేశారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే బీసీలందరికీ స్టయిపండ్ మంజూరు చేయాలన్నారు. సమావేశంలో బీసీ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోట్ల శ్రీనివాస్, విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలి: కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పిం చాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. న్యాయస్థానాలు పదే పదే బీసీల రిజర్వేషన్లను తగ్గించాలని తీర్పులను ఇస్తున్నాయని, వీటిని అధిగమించాలంటే వెంటనే రిజర్వేషన్ల విషయంలో పార్లమెంట్ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని తెలిపారు. బీసీలకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లు రాకపోవడం వల్ల చట్ట సభల్లో చాలా కులాల ప్రాతినిధ్యం తగ్గడం లేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ల చట్ట బద్ధతకు మద్దతు ఇవ్వాల్సిందిగా దేశంలోని 36 రాజకీయ పార్టీలకు లేఖలు కూడా రాసినట్లు తెలిపారు. -
హైకోర్టు ఆదేశాలపై సుప్రీంలో పిటిషన్
-
‘బీసీ రిజర్వేషన్లపై శాశ్వత పరిష్కారం కావాలి’
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై శాశ్వత పరిష్కారం చూపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, సంఘం ప్రతినిధులు గుజ్జకృష్ణ, జైపాల్, రాజ్ కిరణ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తేనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు దాటొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపిందని, ఈ సందర్భంలో సుప్రీంకోర్టు నుంచి స్టే కోసం కాకుండా శాశ్వతంగా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. -
‘స్థానికం’లో బీసీ కోటా తగ్గదు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో 34 శాతానికి తగ్గకుండా చూడాలని మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది. రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేయాలని నిర్ణయించింది. బీసీ జనాభా గణన, నెలాఖరులో పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత పరిపాలన పరంగా చేసే ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ‘స్థానిక’రిజర్వేషన్లపై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్రావు, కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డితోపాటు బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న ప్రత్యేకంగా హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్రావు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్రావులతో పలు అంశాలపై ఉపసంఘం చర్చించింది. హైకోర్టు తీర్పు, బీసీ గణన, పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. జూపల్లి మాట్లాడుతూ.. ‘సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. రిజర్వేషన్లపై, బీసీ గణన అంశాలపై కొందరు కోర్టును ఆశ్రయించారు’అని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉపసంఘానికి వివరించారు. కొందరు కోర్టుకెళ్లడంతో చిక్కులు: మంత్రులు సమావేశం అనంతరం మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జోగు రామన్న మీడియాతో మాట్లాడారు. ‘2013 ఎన్నికల సందర్భంగా 61 శాతం రిజర్వేషన్లు కల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ రిజర్వేషన్లు 50 శాతం మించొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించాం. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలను సకాలంలో నిర్వహించడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యం. కానీ ఎన్నికలపై కొందరు కోర్టుల్లో కేసులు వేయడంతో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జూలై 31తో పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగుస్తోంది. ఆ తర్వాత ప్రత్యేక అధికారులకు అప్పగించాలా? పాలక వర్గాలకు అప్పగించాలా? కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. బీసీ జనాభా గణనపై హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలన్నదీ ఆ భేటీలోనే నిర్ణయిస్తాం. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది’అని తెలిపారు. \ -
52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అసమర్థత కారణంగానే బీసీలకు రిజర్వేషన్లు దక్కటం లేదని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించటంలో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని కేసీఆర్ అనటం బట్ట కాల్చి మీదెయ్యటమేనని, ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని వెంటనే సవరించి బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. ‘నేను అన్యాయం చేస్తా కోర్టులు కూడా న్యాయం చెయ్యొద్దు అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. 1999లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే పెట్టడం ఎలా న్యాయం అవుతుంది? కుల గణన చేయకుండా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? తెలంగాణలో 52 శాతం బీసీలు ఉన్నారని సమగ్ర సర్వేలో మీరే చెప్పి ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్లు చాలని ఎలా అంటారు? మిగిలిన 18 శాతం వారికి అక్కర్లేదా?’ అని శ్రవణ్ ప్రశ్నించారు. కోర్టులో మీ వ్యవహారాన్ని తప్పుబడుతున్న సందర్భంగానైనా కళ్లు తెరవాలని సూచించారు. సీఎం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత బీసీ సంఘాల మీద ఉందని అభిప్రాయపడ్డారు. 52 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్దతు ఉందని, ఇదే విషయాన్ని ఉత్తమ్కుమార్ రెడ్డి అనేక వేదికల మీద ప్రకటించారని తెలిపారు. కోర్టుకు కులాల వెనుకబాటుతనం గురించి సరిగా వివరిస్తే న్యాయం చేయెద్దని అంటారా అని ప్రశ్నించారు. బీసీలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఉద్యమంలో.. రాష్ట్రం వస్తే అస్తిత్వం వస్తాదని పోరాడిన చిన్న చిన్న కులాలకు రిజర్వేషన్లు అక్కర్లేదా అని ప్రశ్నించారు. రాజకీయ అంటరానితనం అనుభవిస్తున్న తాను ఈ కేసు వేసినట్టు తెలిపారు. -
బీసీల రాజ్యాధికారం కోసం సుదీర్ఘ పోరాటం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఓబీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జాతీయ ప్రెసిడెంట్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, పొన్నాల లక్ష్మయ్య, టీడీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. బీసీల రాజ్యాధికారం కోసం సుదీర్ఘ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు. లోక్ సభలో బీసీలపై బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల కోసం కేంద్ర మంత్రులకు 2వేల లేఖలు రాశానని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం 11 సంవత్సరాలు పోరాటం చేశానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు. బీసీల కోసం ప్రత్యేక పార్టీ అవసరం లేదు.. ప్రతి పార్టీలో బీసీ నేతలు ఉన్నారన్నారు. జ్యోతిరావు పూలే బీసీల కోసం గొప్ప పోరాటం చేశారని తెలిపారు. పూలే విగ్రహాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసి, ఆయన భవనాలు కట్టించాలని కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. బీసీ భవన్ కోసం ఏర్పాటు చేసిని స్థలాలను బీసీ నాయకులే కబ్జా చేశారని పేర్కొన్నారు. కొంతమంది నేతలు రాజ్యాధికారం మా రక్తంలోనే ఉంది అన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్లు మాత్రమే బీసీలవి అధికారం మాత్రం ఎవరిదో అన్నట్లు ఉందన్నారు. కేసీఆర్ క్యాబినెట్లో ఎంత మంది బీసీలన్నారో చెప్పాలని ప్రశ్నించారు. టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్.రమణ మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం కోసం పోరాటం చెయ్యాలని అన్నారు. బీసీల ఓట్లను ఇతర నేతలు ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసుకొని వాటిని మన కోసం మన వైపు మళ్లించుకోవాలని రమణ పేర్కొన్నారు. బీసీ కులాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చెయ్యాలన్నారు.బీసీలకు అధికారం వచ్చేందుకు నా వంతు కృషిచేస్తానని రమణ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఓబీసీల అధికారం కోసం కృషిచేస్తున్న ఈశ్వరయ్యకు అభినందనలు తెలిపారు. బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా.. ఐకమత్యం లేదని, ఓబీసీలను దేశంలో చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఓబీసీ బిల్లు బీజేపీ ఆధ్వర్యంలో లోక్సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో మాత్రం పాస్ కాదని తెలిపారు. టీటీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి.. కానీ రాను రాను ఒకరిపై ఒకరు అజమాయిషీ చలాయించడం జరుగుతుందని అన్నారు. ఓటు హక్కు అనే విషయంపై సుదీర్ఘమైన చర్చ జరిగిన తరువాతే ఓటు హక్కును కల్పించారని తెలిపారు. ఈ రోజుల్లో కొంత మంది రాజుల తరహాలో ప్రవర్తిస్తున్నారు.. కానీ గతంలో ప్రతి ఒక్కరు అధికారులే, నాయకులేనని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజ్యాంగానికి లోబడే పని చెయ్యాలి.. కానీ ఎవ్వరూ రాజ్యాంగానికి లోబడి పనిచెయ్యడం లేదన్నారు. -
పంచాయతీ ఎన్నికల్లో వర్గీకరణ పాటించాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారికి కేటాయించే రిజర్వేషన్లను ఏబీసీడీ గ్రూప్లుగా కేటాయించాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షులు మద్దికుంట లింగం నాయీ డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీసీ సంఘాలు, ఎంబీసీ సంఘాల నాయకులు చేపట్టిన పోరాటానికి తెలంగాణ రాష్ట్ర నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. శనివారం బషీర్బాగ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగాల్లో అమల్లు చేస్తున్నట్టుగానే ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్లు కేటగిరివారీగా అమలుచేయాలన్నారు. ఏబీసీడీలు గ్రూపులుగా రిజర్వేషన్లు కేటాయించినపుడే నాయీ బ్రాహ్మణులు, రజకులు, తదితర అట్టడుగు స్ధాయిలో ఉన్న వెనుకబడిన కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. మైనారిటీ బీసీ కులాలు రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సామాజిక న్యాయసూత్రాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంబీసీ కులాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణ వృత్తిని తమవారు తప్ప ఇతర కుల, మతస్తులు చేపట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. నాయీ బ్రాహ్మణులపై దాడుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మహేష్ చంద్ర, రాష్ట్ర ప్రచార కార్యదర్శి తేలుకంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం’
సాక్షి, హైదరాబాద్ : చట్ట సభలు, గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తప్పుడు లెక్కలు చూపి పంచాయతీ ఎన్నికల్లో బీసీలను మరింత అణిచివేసే ధోరణిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్దంగా అణగారిన వర్గాలకు న్యాయం చేసేలా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 52శాతం అని చెప్పి.. ఇప్పుడు 34శాతం అని తప్పుడు లెక్కలు చూపుతూ బీసీలకు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అన్నికులాల గణాంకాలను ఇంటింటికి తిరిగి మరోసారి సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఏ,బీ,సీ,డీ ఈ ప్రాతిపదికగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తే బీసీలకు అన్యాయం జరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారికంగా బీసీల రిజర్వేషన్ శాతాన్ని విడుదల చేయాలన్నారు. న్యాయం కోసమై బీసీ కులాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. -
బీసీ రిజర్వేషన్లు 54 శాతానికి పెంచండి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 34 శాతం నుంచి 54 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. శుక్రవారం బీసీ భవన్లో జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు ఉంటాయని మంత్రి జూపల్లి చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 54 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన, న్యాయపరమైన, చట్ట పరమైన అవరోధాలు లేవని తేల్చి చెప్పారు. సకలజనుల సర్వే, ఇటీవల ప్రభుత్వం జరిపిన జనాభా లెక్కల ప్రకారం బీసీలు 54 శాతం ఉన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని పల్లె గోడల మీద రాసిన విషయం గుర్తులేదా అని ధ్వజమెత్తారు. రాజకీయ రిజర్వేషన్లకు సీలింగ్, మెరిట్ లేదని వివరించారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, కోట్ల శ్రీనివాస్, కె.నర్సింహగౌడ్, వన్నాడి రమ్య తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీలో 50శాతం రిజర్వేషన్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్లో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు బహిరంగలేఖ రాశారు. బీసీ జనాభా 56 శాతానికిపైగా ఉంటే రిజర్వేషన్ల ఫలాలు, సంక్షేమ పథకాలు, బడ్జెట్లో నిధులు మాత్రం దామాషా పద్ధతిలో అందడం లేదని దీంతో బీసీలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వారి అభ్యున్నతికి అవరోధంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. 2011లో యూపీఏ ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సకలజనుల సర్వే ద్వారా జనాభా లెక్కలు సేకరించినప్పటికీ వాటిని ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదన్నారు. 1932లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే జనాభా లెక్కలు కులాల వారీగా సేకరించిందని, ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని గుర్తు చేశారు. -
15న చలో నల్లగొండ
సాక్షి, హైదరాబాద్ : రాజకీయ పార్టీలు, నేతలు పదవుల కోసం, అభివృద్ధి కోసం బీసీలను తాకట్టు పెడితే చరిత్ర క్షేమించదని బీసీ జాతీయ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. పార్లమెంటులో 36 రాజకీయ పార్టీలున్నా ఏ ఒక్క పార్టీ బీసీల పక్షాన పోరాడటానికి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో విద్యానగర్లోని బీసీ భవనంలో బీసీల చైతన్య పోరు గర్జన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంటులో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ పెట్టాలన్న డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15న నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో 56 శాతంగా జనాభా ఉన్న బీసీలకు 70 ఏళ్లుగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు పెట్టే వరకు పార్టీలకతీతంగా బలమైన ఉద్యమాలు చేయడానికి బీసీలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ర్యాగ అరుణ్, భూఫేస్, సాగర్, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో మాదే గెలుపు
సాక్షి ప్రతినిధి, వరంగల్/ఆత్మకూరు: వచ్చే ఎన్నికల్లో 80 సీట్లలో విజయం సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం వరంగల్, పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘మంత్రి కేటీఆర్ చేసిన సవాల్ను స్వీకరిస్తున్నా. మీడియా ఎదుట బదులు చెబుతున్నా. కాంగ్రెస్... టీఆర్ఎస్ మాదిరి కుటుంబ పార్టీ కాదు ఏకపక్షంగా నిర్ణయాలు ప్రకటించడానికి. అయినా చెబుతున్నా. రాబోయే సాధారణ ఎన్నికల్లో 80 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా’’అని స్పష్టంచేశారు. బయటకు బంగారు తెలంగాణ అని చెబుతూ లోపల బంగారు కుటుంబం నిర్మించుకుంటున్నారని సీఎంను విమర్శించారు. రాష్ట్రంలో అహంకారం, అసహనంతో నిర్మించిన పోలీస్ రాజ్యంలో నలుగురి పాలన నడుస్తోందంటూ దుయ్యబట్టారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులో ఆరు శాతం కమీషన్ సీఎం కుటుంబం తీసుకుంటున్నది నిజమో కాదో చెప్పాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్రావులు నేలపై నడవడం లేదని, అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. నిజాం సైతం ఇలాంటి జీవితం గడపలేదన్నారు. బీసీ సబ్ప్లాన్పై సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ముస్లింల మాదిరి బీసీ ఏ నుంచి డీ వరకు రిజర్వేషన్ల శాతంపై పెంచాలంటే సమాధానం ఇవ్వడం లేదని ఉత్తమ్ పేర్కొన్నారు. సర్కారు తప్పులు ఎత్తి చూపుతామని భయపడే సీఎం.. స్పీకర్ మధుసూదనాచారితో కుట్రపన్ని తమను అసెంబ్లీ నుంచి బయటకు పంపారన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ, వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, మిర్చి, పసుపు, పత్తి పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. త్వరలో కాంగ్రెస్ మీడియా మీడియాలో తాము మాట్లాడే నిజాలు చిన్నగా.. కేసీఆర్ మాట్లాడే అబద్ధాలు పెద్దగా వస్తున్నాయని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. రాబోయే రెండు మూడు నెలల్లో కాంగ్రెస్కు సొంత మీడియా అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. రాబోయే 15 రోజుల్లో పార్టీ పరంగా గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల బూత్ కమిటీలను నియమించాలని నేతలకు సూచించారు. బూత్స్థాయిలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని, పార్టీ పటిష్టతకు పని చేయాలన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతంలోనే సామాజిక న్యాయం ఉందని, పార్టీ కోసం కష్టపడి పని చేసే వాళ్లందరికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తేవాలన్నారు. కేటీఆర్ మాటల్ని కేసీఆరే నమ్మడం లేదు: రేవంత్ మంత్రి కేటీఆర్ మాటలను ఆయన తండ్రే నమ్మడం లేదని ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అన్నారు. కేటీఆర్ విసిరిన రాజకీయ సవాల్ను సీఎం కేసీఆర్తో చెప్పిస్తే స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించిన 12,000 కోట్లలో రూ.4 వేల కోట్లను గ్రామాల్లోని పార్టీ కార్యకర్తల ఖాతాల్లో వేసేందుకు పన్నాగం వేశారన్నారు. కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ లేదు: వీహెచ్ కాంగ్రెస్ పార్టీ లేకుండా దేశంలో ఏ ఫ్రంట్ ఏర్పడలేదని సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. సీఎం కేసీఆర్ తన కొడుకును సీఎం చేయడానికే థర్డ్ ఫ్రంట్ను ఎత్తుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం పక్క రాష్ట్రం పోరాడుతుంటే విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. గజ్వేల్లో పోటీకి సిద్ధమా: సర్వే ఉత్తమ్ అమాయకుడని, కేసీఆర్ తరహాలో తిమ్మిని బమ్మి చేయలేని ఉత్తముడని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 101 సీట్లలో గెలుస్తామని సర్వే రిపోర్టులు వచ్చినా కేవలం 80 అనే చెబుతున్నాడని పేర్కొన్నారు. ఉత్తమ్కు బచ్చా అయిన కేటీఆర్తో సవాల్ ఏంటీ, దమ్ముంటే కేసీఆర్ సవాల్కు రావాలన్నారు. గజ్వేల్లో సీఎం రాజీనామా చేస్తే అక్కడ్నుంచి ఉత్తమ్ పోటీ చేసి, భారీ మెజార్టీతో గెలుస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు గీతారెడ్డి, సంపత్కుమార్, షబ్బీర్ అలీ, బలరాంనాయక్, పొన్నం ప్రభాకర్, మల్లురవి, నంది ఎల్లయ్య, పొంగులేటి సుధాకర్రెడ్డి, రాంమోహన్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి యాత్ర రద్దు ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఐత సత్యం మృతి కారణంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించాల్సిన ప్రజా చైతన్య యాత్రను రద్దు చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రకటించారు. ఏప్రిల్ 8న జరగాల్సిన డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల బస్సుయాత్ర యథావిధిగా కొనసాగుతుందన్నారు. -
బీసీ కమిషన్ చైర్మన్ రాజీనామా
సాక్షి, అమరావతి: బీసీ కమిషన్ చైర్మన్ కేఎల్ మంజునాథ్ తన పదవికి రాజీనామా చేశారు. తాను నిర్వర్తించాల్సిన పని పూర్తయినందున పదవి నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపించారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుతో పూర్తిగా విసిగిపోయి ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం బీసీ కమిషన్కు అప్పగించింది. ఈ కమిషన్కు కేఎల్ మంజునాథ్ను చైర్మన్గా నియమించింది. అన్ని జిల్లాల్లోనూ బీసీ కమిషన్ పర్యటించింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు పరిశీలించి, నివేదికను రూపొందించింది. నివేదికను కమిషన్ చైర్మన్ అధికారికంగా పంపించకముందే ఇది ముఖ్యమంత్రి చేతుల్లోకి వెళ్లింది. కమిషన్ సభ్యుల్లో తమకు అనుకూలురైన కొందరి చేత నివేదిక కాపీని చంద్రబాబు తెప్పించుకున్నారు. బీసీ కమిషన్కు ఏమాత్రం విలువ ఇవ్వకుండా తన ఇష్టప్రకారమే వ్యవహరించారు. దీంతో కమిషన్ చైర్మన్ మంజునాథ్ కినుక వహించారు. అప్పటి నుంచి కార్యాలయానికి కూడా రాలేదు. ముఖ్యమంత్రి నుంచి అవమానాలు ఎదురుకావడంతోపాటు ఆయన కనుసన్నల్లో పనిచేస్తున్న కమిషన్ సభ్యులు తనను లక్ష్యపెట్టకపోవడంతో మంజునాథ్ ఆవేదనకు గురై చివరకు పదవి నుంచి తప్పుకున్నట్లు సమాచారం. విలువ లేని కమిషన్కు చైర్మన్గా కొనసాగడం వ్యర్థమని ఆయన నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. నాకు కొన్ని విలువలు ఉన్నాయి: మంజునాథ్ పని లేకుండా జీతం తీసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే బీసీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశానని కేఎల్ మంజునాథ్ చెప్పారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. తనకు కొన్ని విలువలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీసీ కమిషన్ పని డిసెంబర్లోనే పూర్తయిందని, అప్పటివరకే జీతం తీసుకున్నానని వెల్లడించారు. రెండేళ్లపాటు విధి నిర్వహణలో ఉన్నట్లు తెలిపారు. నివేదికను ప్రభు త్వానికి ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించగా... తాను మెంబర్ సెక్రటరీ కి ఇచ్చానని, అంటే తన పని పూర్తయినట్లేనని పేర్కొన్నారు. కమిషన్ సభ్యులు కొనసాగుతారా? వారు కూడా రాజీనామా చేస్తారా? అని అడగ్గా... ఆ విషయం నాకు తెలియదన్నారు. వారు కొనసాగాలనుకుంటే కొనసాగవచ్చని చెప్పారు. -
కోటా పెంపుపై టీఆర్ఎస్ పోరు
సాక్షి, న్యూఢిల్లీ: జనాభా దామాషా ప్రకారం ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల కోటా పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆయా రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ శుక్రవారం పార్లమెంట్లో టీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలన్నీ బలాన్ని సమకూర్చగా టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే మాత్రం వెల్లో ఉండి తమ పోరాటాన్ని కొనసాగించాయి. 50 శాతానికి మించి రిజర్వేషన్లను పెంచుకునేందుకు రాష్ట్రాలకు అధికారం కట్టబెట్టాలని, ఒక దేశంలో ఒకే విధానం ఉండాలని టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. అంతకుముందు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఎంపీలు కె.కేశవరావు, జితేందర్రెడ్డి, కవిత, బి.వినోద్కుమార్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్రెడ్డి, పసునూరి దయాకర్ పాల్గొన్నారు. జితేందర్రెడ్డి మాట్లాడుతూ.. ‘ఒక దేశంలో ఒకే విధానం ఉండాలి. తమిళనాడులో రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి వేరే రాష్ట్రాల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో ఎందుకు పెట్టరు. ఉపాధి హామీ పథకంలో కోట్లాది రూపాయలు వ్యర్థంగా పోతున్నందున ఈ పథ కాన్ని రైతులతో అనుసంధానం చేయండి. గిట్టుబాటు ధర కోసం రెండు వారాలుగా మేం పట్టుబడుతున్నాం. కానీ ప్రభుత్వం స్పందించట్లేదు’అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడటమే తప్పు అన్నట్లు అశోక్గజపతి రాజు, వై.ఎస్.చౌదరి గురువారం సభలో మాట్లాడటం నచ్చలేదని వినోద్ కుమార్ అన్నారు. -
ఎమర్జెన్సీని తలపించేలా కేసీఆర్ పాలన
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వతీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేదని శాసనసభలో బీజేపీ పక్షనేత జి.కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులతో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలిపే పరిస్థితులు లేవు. కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాల్లో ప్రభుత్వంపై తీవ్ర నిరాశ, బాధ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కాళ్లకు ఇనుప సంకెళ్లు వేశారు. ఇప్పుడు రైతుల చేతులకు బంగారు సంకెళ్లు వేస్తున్నారు. వర్గీకరణపై పోరాడిన మంద కృష్ణను రెండుసార్లు జైలుకు పంపారు. మీడియా గొంతు నొక్కేస్తున్నారు. కలాలకు, కళాకారులకు సంకెళ్లు వేస్తున్నారు. ఇలా చేసి బంగారు తెలంగాణ సాధిస్తారా?’అని ప్రశ్నించారు. నేతల భాషపైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని పరోక్షంగా సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. రైతులకు పావలా వడ్డీకి రుణాలివ్వాల్సిన అవసరం ఉందని, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు అరకొర నిధులతో పనులు జరగక ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్ల కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాడటం అభినందనీయం, మద్దతు కూడా తెలుపుతున్నామని కృష్ణయ్య స్పష్టం చేశారు. ఎస్టీ రిజర్వేషన్లను ఒక జీవో ద్వారా రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉందని, దీనిపై అధికారులతో చర్చించి వీలై నంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో పోరాడండి
సాక్షి, హైదరాబాద్: గిరిజన, మైనార్టీల రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనను స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. అదేవిధంగా 52 శాతం జనాభా ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పెంచేలా కృషి చేయాలని కోరారు. శుక్రవారం పలు బీసీ సంఘాలు నిర్వహించిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు టీఆర్ఎస్ ఎంపీలు పోరాడాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల పెంపునకు టీఆర్ఎస్ ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ పదోన్నతుల్లో రిజర్వేషన్లకు కేంద్రంపై ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, అవసరమైతే అఖిలపక్ష పార్టీలను ఢిల్లీ తీసుకెళ్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని ఫ్యాప్సీ ఆడిటోరియంలో జరిగిన బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బీసీ పదోన్నతుల్లో రిజర్వేషన్ల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. బీసీ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు కల్పిస్తామని హామీనిచ్చారు. బీసీలకు విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన వాటా దక్కాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. బీసీలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి బిక్కి అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. క్రీమీలేయర్ను తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. బీసీ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తుందని హామీనిచ్చారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో బీసీ కమిషన్ బిల్లు ఆమోదించి చట్టం తీసుకొస్తామని మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విషయంలో వచ్చే నెలలో కేంద్రమంత్రితో సమావేశమవుతానని తెలిపారు. బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, బీసీ కమిషన్ చైర్మన్ రాములు, సభ్యులు కృష్ణమోహన్రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. -
‘చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు’
సాక్షి, పెద్దపల్లి : చట్టసభల్లో బీసీలకు తగిన స్థానాలు లేవని, రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ సంఘాల ఫెడరేషన్లకు బడ్జెట్లో రూ.500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు కేటాయించాలని కోరారు. బీసీ కార్పొరేషన్కు రూ. 2 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు రూ. 2 వేల కోట్ల నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ పథకం కింద బీసీలకు రూ. 2 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఫిబ్రవరి 3న అఖిలపక్ష భేటీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టే అంశంపై ఫిబ్రవరి 3న సోమాజిగూడ ప్రెస్క్లబ్లో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేం దుకు పార్టీలు సహకరించాలన్నారు. సమావేశానికి రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. -
చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లు
-
బీసీ రిజర్వేషన్లు సాధిస్తేనే విజయం
హైదరాబాద్: చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల సాధనే అసలు విజయమని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన బుధ వారం ‘అసెంబ్లీ సమావేశాల్లో బీసీ డిమాండ్లపై చర్చ’అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ... బీసీ ఫెడరేషన్లు ఉంటాయని సీఎం కేసీఆర్హామీ ఇచ్చారని, వాటికి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు పొందితేనే అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ.. బీసీలంతా పార్టీలకతీతంగా ఐకమత్యంగా ఉండాలని, బీసీలు ఏ రంగంలో ఉన్నా వారిని ప్రోత్సహించాలన్నారు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి: జాజుల ఇప్పటి వరకూ అసెంబ్లీలో అడుగుపెట్టని కులాలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లోనూ జనా భా ఆధారంగా బీసీలకు వాటాను కల్పించాలన్నారు. సమావేశంలో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్, ఎంబీసీ కులాల అధ్యక్షుడు దాసన్న, గంగపుత్ర సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.ఎల్ మల్లయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గణేశ్ చారి, తెలంగాణ సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు నర్సింహ్మ సాగర్, బోయ వాల్మీకి సంఘం అధ్యక్షుడు గోపి, బీసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటక కమిషన్ ఆదర్శనీయం
విశ్లేషణ బీసీల రిజర్వేషన్లు, సామాజిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం కోసం కర్ణాటక బీసీ కమిషన్ చేసిన కృషి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శనీయంగా నిలుస్తోంది. బీసీ జనాభా గణనలో పూర్తి పారదర్శకతను ప్రదర్శించిన దాని పనితీరు తెలంగాణ బీసీ కమిషన్కు కూడా మార్గదర్శకమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లు, సామాజిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయవలసిందిగా బీసీ కమిషన్ను ఆదేశించింది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తమిళనాడు తరహాలో తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న దృఢనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే బీసీ(ఇ) గ్రాఫ్లో ఉన్న ముస్లింలకు 12% రిజ ర్వేషన్లను ప్రకటించారు. అలాగే బీసీలకు అన్ని రంగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలన్న తలంపులో ఉన్నారు. కర్ణాటకలో బీసీ కమిషన్ చేస్తున్న పనివిధానాన్ని, బీసీల రిజర్వేషన్ల కోసం చేస్తున్న కృషిని అధ్యయనం చేసేందుకు సెప్టెంబర్ 11,12 తేదీలలో బీసీ కమిషన్ కర్ణాటకకు వెళ్లింది. కర్ణాటక బీసీ కమిషన చైర్మన్ కాంతా రాజాతో, కమిటీ సభ్యులతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించింది. ఆ రాష్ట్ర కమిషన్ అనుభవాలు, వాళ్లకెదురైన సవాళ్లను తెలంగాణ బీసీ కమిషన్ తెలుసుకుంది. కర్ణాటక బీసీ కమిషన్ ఆ రాష్ట్రంలోని అన్ని వర్గాల, కులాల సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ఎంతో శ్రమించింది. ఇందుకోసం ఆ రాష్ట్ర కమిషన్ మునుపటి బీసీ కమిషన్లు చేసిన కృషిని, పురోగతిని సమీక్షించింది. ప్రధానంగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు కమిషన్ వేసే ప్రతి అడుగులో జాగ్రత్తలు తీసుకుంది. బీసీ కమిషన్ చేసే అధ్యయనాన్ని సవాల్ చేస్తూ కొందరు విమర్శలు చేశారు. కానీ కూడా దీక్షతో కర్ణాటక బీసీ కమిషన్ తన నివేదికను పూర్తిచేసింది. కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ సామాజిక, విద్యారంగాలలో మొత్తం కర్ణాటకలోని అన్ని కుటుంబాల దగ్గరకు వెళ్లి సర్వే చేసింది. ఈ సర్వేని 2015లో చేపట్టారు. ఈ సర్వేలో సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికపరంగా బీసీల స్థితిగతులు ఎలాగున్నాయో సమగ్రంగా సమాచారాన్ని సేకరించింది. మొత్తం సమగ్ర కుటుంబ సర్వేకు కమిషన్ తయారుచేసిన ధరఖాస్తుఫామ్ల రూపకల్పనకు ఎంతో శ్రమించారు. జనాభా గణనకు ఈ సర్వే ఫామ్ ప్రాణంలాంటిది. ఇందులో 55 ప్రశ్నలతో ఫామ్ 3ను తయారు చేశారు. ఈ ఫామ్లో సర్వేకు సంబంధించి కులాల వారీగా కోడ్నెంబర్లు ఇచ్చారు. ఒక వేళ కమిషన్ దృష్టికి రాని కులాలు ఉంటే వాటిపేర్లను ఆ ధరఖాస్తు ద్వారా ఆ లిస్టులో రాతపూర్వకంగా రాయిం చారు. ఫామ్ 3లో 55 ప్రశ్నలను ఆ నేపథ్యంలోనే తయారు చేశారు. సామాజిక, విద్యా, ఆర్థిక, రాజకీయపరమైన వెనుకబాటుతనాలపైన కూడా ప్రశ్నలున్నాయి. ఫామ్ 3లో 1 నుంచి 30 ప్రశ్నల వరకు వ్యక్తిగత సమాచారం, చదువు, వృత్తి, ఉద్యోగం, ఓటర్కార్డు, ఆధార్కార్డు, వ్యవసాయం, రాజకీయం, సామాజిక అంశాలపై ప్రశ్నలున్నాయి. 40% నుంచి 55% వరకు కుటుంబ వివరాలు, ఏ కుటుంబానికి ఎంత ఆస్తి ఉంది? తదితర వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ సర్వే అంతా ఎన్యుమరేటర్స్ ద్వారా చేశారు. వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చి దానిపై సంతకం చేయాలి. ఆ వ్యక్తిగత సమాచారంతో పాటు ల్యాండ్ఫోన్, సెల్ నెంబర్లను కూడా ఈ దరఖాస్తుపై రికార్డు చేశారు. ఇలా తీసుకున్న సమాచారం సరైనదని రూఢీగా చెప్పగలగాలి. అందుకే ఫామ్ 3ను తయారు చేయటం జరిగింది. ఈ సర్వే ద్వారా సమాజాన్ని విభజిస్తున్నారని, కమిషన్ చేపట్టిన జనాభాగణన సక్రమంగా లేదని కూడా కొందరు ఆరోపణలు చేశారు. వీటన్నింటికీ సమాధానంగా కమిషన్ ఫామ్ 3ను ఆధారంగా నిలిపింది. 3 దశల్లో పని విస్తరణ: జనాభా గణనకు, గడపగడప సర్వేను చేపట్టడం కర్ణాటక కమిషన్కు కత్తిమీద సాముగా మారింది. దీనికోసం అపాయింట్మెంట్, ట్రైనింగ్, ఫీల్డ్ వర్క్ అన్న మూడు దశలలో పనిచేశారు జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్లు, కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈఓలు జిల్లాల్లో జరిగే సమగ్ర కుటుంబ సర్వేకు అగ్రభాగాన నిలిచారు. ఎన్యుమరేటర్లకు ప్రత్యేక శిక్షణ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిం చిన జనాభాలెక్కల సమాచార సేకరణలో అనుభవమున్న వ్యక్తులను ఎన్యుమరేటర్లుగా నియమించుకోవటంతో పాటు వీరికి ప్రత్యేక శిక్షణనివ్వాలి. వీరిని గైడ్ చేసేందుకు రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో శిక్షణాకార్యక్రమాలు చేపట్టారు. జనాభా గణనలో టీచర్లే కీలకం: మనదేశంలో జనాభాగణన విషయంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. ఒక ఎన్యుమరేటర్కు 120 నుంచి 130 కుటుంబాల వరకు సర్వే చేయాలి. కర్ణాటకలో మొత్తం 1 కోటి 33 లక్షల కుటుంబాలున్నాయి. వీరి కుటుంబాల నుంచి సమాచారం సేకరించేందుకు 1.60 లక్షల మంది ఎన్యుమరేటర్లను ఎంచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన కులగణనను 2015 ఏప్రిల్ 11 నుంచి 30 వరకు కర్ణాటకలో 20 రోజుల్లోనే పూర్తి చేశారు. గ్రామాల్లో కులవృత్తి ద్వారా చేస్తున్న పని, కులానికి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ఈ వర్గాలవారు ఉత్సాహంగా ముందుకొచ్చారు. బెంగుళూరు, మైసూరు, వంటి ప్రధాన పట్టణాలల్లో 3 సార్లు ప్రత్యేకంగా సర్వేచేశారు. సర్వే ఫామ్ల కోసం నిపుణుల కమిటీ: 1,2,3 సర్వేఫామ్లు తయారు చేయటానికి కమిషన్ మేధావులతో సమావేశాలు జరిపి నిపుణుల కమిటీలను వేసింది. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఏఏ కులాలు ఎలా వెనుకబడివున్నాయో సమగ్ర సమాచారం సేకరించాలని నిపుణుల కమిటీ కర్ణాటక కమిషన్కు సూచిం చింది. అర్బన్స్లమ్లు, రూరల్ స్లమ్లతో పాటు బాగా వెనుకబడిన వర్గాలు, సంచారజాతులపై 7 నుంచి 8 వరకు ప్రశ్నలు రూపొందిం చారు. ఈ సూచనలతోపాటు వెనుకబాటుతనాన్ని ఎలా తేల్చిచెప్పాలన్న దానిపై కర్ణాటక కమిషన్ ప్రజాభిప్రాయసేకరణను కూడా చేపట్టింది. ప్రాథమిక డేటా, సెకండరీ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ డేటా ఈ రెండిం టిని క్రాస్చెక్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ డేటా కోసం పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు సమగ్ర సమాచారం తీసుకోవాలి. సెక్రటేరియట్ దగ్గర నుంచి వివిధ ప్రభుత్వశాఖల నుంచి అన్ని రకాల ఉద్యోగుల సమాచారాన్ని సేకరించాలి. ఇలా సేకరించిన సమాచారంతో ప్రాథమిక డేటాను సెకండరీ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ డేటాతో లెక్కకట్టి చూడాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో జరిపిన సర్వేకు బలం చేకూరుతుంది. ఇలా కర్ణాటక బీసీ కమిషన్ చేసిన కృషికి తుది రూపం వచ్చింది. 2015లో దేవరాజ్ ఆర్స్ జయంతి సందర్భంగా కర్ణాటక బీసీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికనిచ్చింది. ఇపుడు బీసీల కోసం చేసిన సమగ్రమైన నివేదికను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. కర్ణాటక బీసీ కమిషన్ బీసీల జనగణనకోసం చేసిన సర్వే తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలకూ శాస్త్రీయ ప్రాతిపదికను కల్పిస్తోంది. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
ఓబీసీ వర్గీకరణతోనే సరైన న్యాయం
సాక్షి, హైదరాబాద్: ఓబీసీ వర్గీకరణతోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారాం అన్నారు. ఆదివారం లక్డీకాపూల్లో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ ప్రతినిధుల సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయన్నారు. వర్గీకరణపై త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ఓబీసీల డిమాండ్లు స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘానికి సూచించారు. బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించేందుకు కృషి చేస్తున్నామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ జనాభాలో బీసీలే అధికంగా ఉన్నారని, వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. -
ఏకాభిప్రాయంతోనే బీసీ రిజర్వేషన్లు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సాక్షి, హైదరాబాద్: అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు సాధ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధుల బృందం వెంకయ్యనాయుడును కలసి బీసీల సమస్యలపై వినతిపత్రం సమర్పించింది. ఈసందర్భంగా చట్ట సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు. బీసీలకు కూడా అట్రాసిటీ యాక్టును తీసుకురావాలని, ఉద్యోగాల భర్తీలో క్రీమీలేయర్ను ఎత్తివేయాలని కోరారు. ఈ డిమాండ్లపై వెంకయ్యనాయుడు స్పందిస్తూ...జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వాలని నిర్ణయించిందని ఈమేరకు పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పాసవుతుందన్నారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల నుంచి ఏకాభిప్రాయం కోసం త్వరలో కార్యాచరణ సిద్ధం చేస్తామని ఉపరాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. -
'రెడ్లు కూడా బీసీల్లో కలపమంటారు'
అమరావతి: ఎవరిని పడితే వాళ్లను బీసీలో చేరుస్తామంటే ఒప్పుకోబోమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీల్లో చేరడానికి అవసరమైన అర్హతలు ఉంటేనే అంగీకరిస్తామని స్పష్టం చేశారు.అందరిని కలుపుకుంటూ పోతే ఇవాళ కాపులు... రేపు రెడ్లు కూడా బీసీ లో కలపమంటారని ఆయన వ్యాఖ్యానించారు. కాపులకు విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లకు తమ సంఘం అంగీకరించబోదన్నారు. ఆ డిమాండ్ తమకు అభ్యంతరకరమని చెప్పారు. ఒక్కసారి బీసీలో చేరితే ఒక్కొక్కటి అమలు చేసేస్తారని, కనుక ఎలా చేస్తారో ప్రభుత్వం తమతో చర్చించాలని కోరారు. నేతల ప్రకటనలు ఏవైనా చేస్తారు.. అవన్నీ జరగాలంటే చాలా సాంకేతిక సమస్యలు వస్తాయని అన్నారు. విద్య, ఉపాధి, చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇందుకు అవసరమైన కసరత్తు జరుగుతోందని, ఏపీలో కూడా పెంచాలని సీఎం చంద్రబాబును కోరుతున్నామన్నారు. బీసీలకు టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. బీసీల ప్రధాన డిమాండ్లను అమలు చేసేందుకు చంద్రబాబు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి మోదీకి చంద్రబాబు సన్నిహితుడు కనుక ఆయనే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఏపీలో బీసీ కార్పొరేషన్ నిధులు అర్హులకు అందడం లేదని చెప్పారు. -
మేమెంతో.. మాకంత ఇవ్వాల్సిందే
బీసీల జనాభాకు తగినట్లు రిజర్వేషన్లు పెంచాలి ► ‘సాక్షి’తో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ► దామాషా పద్ధతిన రిజర్వేషన్లకు సుప్రీం ఎప్పుడో ఓకే చెప్పింది ► పాలకులకు చిత్తశుద్ధి లేకనే అమలు కావడం లేదు ► నేడు హైదరాబాద్లో ‘బీసీల సమర శంఖారావం’ సభ సాక్షి, నల్లగొండ: వెనుకబడిన కులాలకు (బీసీలకు) కూడా జనాభా దామాషా పద్ధతిన విద్య, ఉద్యో గాల్లో రిజర్వేషన్లు అమలు చేయా లని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఎంతశాతం మంది బీసీలు ఉన్నారో అంతశాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిం దేనని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని.. బీసీ సబ్ప్లాన్ చట్టాన్ని తీసుకురావాలని కోరా రు. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాం డ్తో ఆదివారం హైదరాబాద్లో ‘బీసీల సమర శంఖారావం’ సభ జరుగ నుంది. ఈ నేపథ్యంలో జాజుల శ్రీనివాస్గౌడ్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. శ్రీనివాస్ గౌడ్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. సుప్రీంకోర్టు సూచించినా.. ‘‘బీసీ కులాలకు జనాభా దామాషా పద్ధతిన రిజర్వే షన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. ఆయా కులాల జనా భాకు తగినట్టు విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రాతి నిధ్యం లభించని పక్షంలో.. ఈ రిజర్వేషన్లు వారిపై సామాజిక వివక్షను నిర్మూలిస్తాయని, పాలనలో బీసీ వర్గాల ప్రాతినిధ్యా న్ని పెంచేందుకు దోహదపడతాయనీ అభిప్రాయ పడింది. ఈ సూచనలను అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జనాభా లెక్కలే ఆటంకం బీసీ రిజర్వేషన్ల పెంపునకు జనాభా లెక్కలే ఆటం కంగా మారాయి. 1930 దశకంలో బ్రిటిష్ పాలకులు గణించిన తర్వాత ఇప్పటివరకూ బీసీల లెక్కలు తీయలేదు. 2011లో కులాల వారీగా దేశవ్యాప్త గణన చేసినా వాటిని అధికారికంగా బయటపెట్టడం లేదు. 2014లో తెలంగాణ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో చివరి నిమిషంలో కులం అంశాన్ని చేర్చి లెక్కలు తీశారు. కానీ ఆ లెక్కలను కూడా బయటపెట్టలేదు. దేశంలో జంతువులకు లెక్కలుం టాయి కానీ.. బీసీలకు లేకపోవడం దురదృష్టకరం. అందువల్లే బీసీల రిజర్వేషన్ల పెంపు సాధ్యం కావడం లేదు. 1986లో బీసీల రిజర్వేషన్లు 44శాతానికి పెంచుతూ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడు రిజరే ్వషన్ వ్యతిరేకులు కొందరు కోర్టుకెళ్లారు. అప్పుడు కూడా బీసీల జనాభా లెక్కలు లేవనే కోర్టు ఎన్టీఆర్ సర్కారు నిర్ణయాన్ని కొట్టివేసింది. శాస్త్రీయం గా లెక్కలు తీసుకుని బీసీల రిజర్వేషన్లు పెంచవ చ్చని సూచించింది. కానీ ఇప్పటివరకు రాష్ట్రంలో అలాంటి ప్రయత్నం జరగలేదు. బీసీలు, ఎంబీసీలు, సంచార జాతులకు సమాన ప్రాతినిధ్యం లేకపోవ డానికి కారణం కూడా ఇదే. అరశాతం కూడా పెంచరా? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు 10 శాతానికి, బీసీ–ఈలోని మైనార్టీలకు 12 శాతానికి రిజర్వేషన్లు పెంచింది. దానిపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ 54 శాతం జనాభా ఉన్న బీసీ ఏ, బీ, సీ, డీలకు అర శాతమైనా పెంచలేదు. బీసీ కమిషన్ వేసినప్పుడు తమిళనాడు తరహాలో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ చెప్పడంతో సంబురపడ్డాం. కానీ అలాంటి ప్రయత్నమేదీ జరగ డం లేదు. అందువల్ల మురళీధర్రావు, అనంతరా మన్, జస్టిస్ దాల్వ సుబ్రమణ్యం కమిషన్ల నివేదికల మేరకు జనాభా దామాషా పద్ధతిన బీసీ రిజర్వేషన్ల ను పెంచాలి. ఇందుకు ప్రస్తుత బీసీ కమిషన్ గడువును 3 నెలలకు కుదించాలి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి చట్టం చేయాలి. సబ్ప్లాన్కు చట్టం చేయాలి సమర శంఖారావం సభలో బీసీలకు రిజర్వేషన్ల పెంపుతో పాటు పలు అంశాలనూ ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాం. ఈ సభకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, బీసీ వర్గాలకు చెందిన విపక్ష పార్టీల అ«ధ్యక్షులూ వస్తున్నారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపాలి. అఖిలపక్షంతో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్లలో ప్రమోషన్లు ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నుంచి బీసీలను మినహాయించాలి. బీసీ సబ్ప్లాన్కు రూ.20వేల కోట్లు కేటాయించాలి. దీని అమలుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి చట్టం రూపొందించాలి. -
బీసీ వర్గీకరణలో మార్పులుంటాయి!
♦ ‘సాక్షి’తో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు ♦ జనాభా ప్రాతిపదికన అంటే 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది ♦ బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాల్సి ఉంటుంది ♦ ప్రస్తుతం బీసీలకు కేటాయింపు 27%గా ఉన్నా లబ్ధి పొందుతున్నది 11% ♦ పలు కులాలు అత్యధికంగా లబ్ధిపొందాయనే అభిప్రాయముంది ♦ వాటికి ప్రాధాన్యం తగ్గించేలా ప్రతిపాదనలు ఉంటాయి ♦ కొన్ని ఆదివాసీ కులాలకూ తాత్కాలికంగా బీసీల్లో చోటు ♦ దీంతో బీసీ వర్గీకరణలో మార్పులు చేర్పులు ఉంటాయి ♦ వివరాలు సేకరించేందుకు ప్రత్యేక నమూనా.. 6 నెలల్లో నివేదిక ఇస్తాం ♦ తమ అధ్యయనంలో ఎంబీసీలపైనా స్పష్టత వస్తుందని వెల్లడి సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపుపై బీసీ కమిషన్ అధ్యయ నాన్ని వేగవంతం చేసింది. ప్రభుత్వంలోని ప్రతిశాఖతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఆయా శాఖల్లో కులాల వారీగా ఉన్న బీసీ ఉద్యోగులు, ఆయా శాఖల పరిధిలో వివిధ పథకాల కింద లబ్ధి పొందుతున్నవారి సంఖ్యపై పరిశీలన జరుపుతోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేసేం దుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శుక్ర వారం బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు తమ అధ్యయనం వివరాలను ‘సాక్షి’కి వెల్ల డించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కులాలపై సమగ్ర అధ్యయనం.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండడం మంచిదే. ఆ లక్ష్యంతోనే ప్రభుత్వం బీసీల సమగ్ర అధ్యయనానికి ఆదేశించింది. బీసీల్లో ఏ,బీ,సీ,డీ వర్గీకరణలోని కులాలపై సమగ్ర అధ్యయనం చేస్తాం. జీవన స్థితిగతులు, సామాజిక, ఆర్థిక పరిస్థితి, విద్య, ఆరోగ్యం, సమాజంలో వివక్ష తదితర అంశాలపై లోతుగా పరిశీలన చేస్తాం. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు, సంపద పెరిగేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై ప్రభుత్వానికి సూచనలు చేస్తాం. ఆరు నెలల్లో మా నివేదిక సమర్పిస్తాం. ప్రత్యేక కార్యాచరణతో.. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ప్రత్యేక కార్యచ రణ రూపొందిస్తున్నాం. వివరాలు సేకరిం చేందుకు 8 పేజీలతో కూడిన పత్రాన్ని రూపొందించాం. దాన్ని నాలుగు పేజీలకు కుదించి, అన్ని వివరాలు వచ్చేలా కొత్త నమూనా తయారు చేస్తున్నాం. ప్రతి కుటుం బంలో వయసు వారీగా సభ్యులు, వారిలో నైపుణ్యాలు, ప్రభు త్వ పథకాల లబ్ధి, ఉద్యో గాలు, నిరుద్యోగం, జీవన స్థితిగతులు, కులవృత్తులు తదితర విధాలుగా పరిశీలన చేస్తాం. ఎంబీసీల జాబితా కూడా.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కులాల కోసం ప్రత్యేకంగా ఎంబీసీ కార్పొ రేషన్ ఏర్పాటు చేసింది. దాని పరిధిలోకి వచ్చే కులాల జాబితా కూడా సిద్ధం చేస్తాం. కానీ ఇది కేవలం ఆర్థిక చేయూతనిచ్చే పథకాలకు మాత్రమే వర్తిస్తుంది. అన్ని వర్గాల అభిప్రాయాలూ తీసుకుంటాం అధ్యయనంలో భాగంగా అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తాం. కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, మేధావు లు, కవులు, కళాకారులు, యువజన సంఘాలు, సామాన్యుల నుంచి వినతు లు తీసుకునేందుకు ప్రత్యే కంగా సమయం కేటాయి స్తాం. ఆన్లైన్ విధానం లోనూ వినతులు తీసుకు నేలా సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి కులానికి 10 పేజీ లతో మొత్తంగా 1,500 పేజీల నివేదిక ఇవ్వాలని యోచిస్తున్నాం. న్యాయపరమైన చిక్కులతోనే.. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వ హించి, పూర్తి వివరాలు సేకరించింది. కానీ నిబంధ నల ప్రకారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జనాభా లెక్కల విభాగానికి సంబంధించిన గణాంకాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. సమగ్ర సర్వే వివరాలు తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశముంది. ప్రస్తుతం కేటగిరీల వారీగా జనాభా లెక్కలు ఉన్నాయి. దీంతో కులాల వారీగా వివ రాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. 2011 జనగణ న ఆధారంగా పరిశీలన చేపట్టాలని భావిస్తున్నాం. 85 శాతానికి చేరుతాయి 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లు. ప్రస్తుతం 4 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నాం. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 85 శాతం దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలు ఉన్నారు. అందులో బీసీలు 52 శాతం నుంచి 55 శాతం వరకు ఉన్నట్లు అంచనా. అంటే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేపడితే రాష్ట్రంలో 85 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా పరిశీలన పూర్తయితే రిజర్వేషన్లు ఏమేరకు ఇవ్వాలో స్పష్టత వస్తుంది. కేంద్రం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నా.. వాస్తవంగా 11 శాతం బీసీలు మాత్రమే లబ్ధిపొందుతున్నారు. ఇతర కులాలు ఆ వాటాను దక్కించుకుంటున్నాయి. లబ్ధి పొందిన కులాలు కింది వరుసలోకి.. వెనుకబడిన తరగతుల్లో 113 కులాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 25 కులాలు అత్యధికంగా లబ్ధి పొందాయనే అభిప్రాయా లున్నాయి. ఈ అంశంపై పరిశీలన చేస్తాం. అత్యధికంగా లబ్ధి పొంది నట్లు గుర్తిస్తే.. ఆ కులాలను కిందవరుసలో చేర్చుతాం. వాస్తవానికి ఆయా కులాలను బీసీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ.. బీసీల్లోనే ఉంచుతూ ప్రాధాన్యతను తగ్గించాలని యోచిస్తున్నాం. మరోవైపు కొన్ని ఆదివాసీ కులాలు ఏ జాబితా లోనూ నమోదు కాలేదు. వారిని ఎస్సీ, ఎస్టీల్లో చేర్చడం దీర్ఘకాల ప్రక్రియ. కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా అవసరం. అందువల్ల అలాంటి కులాలను బీసీల్లో కలపాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో వర్గీకరణలోనూ మార్పులు చేర్పులు జరుగుతాయి. -
చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి