Ramagundam
-
కోల్ కారిడార్కు లైన్క్లియర్!
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లూ ప్రతిపాదనలకే పరిమితమైన కోల్ కారిడార్ ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ఇటీవల అందిన డీపీఆర్ను పరిశీలించిన రైల్వే బోర్డు, దీనిని సాధ్యమయ్యే ప్రాజెక్టుగా తేల్చటంతో తుది ఆమోదం లభించే కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ(సీసీఈఏ)కి చేరింది. ఇక్కడ ఆమోదం లభిస్తే.. కేంద్ర బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించే అవకాశం ఉంది. 207.80 కి.మీ. నిడివితో ఉండే ఈ కారిడార్ నిర్మాణానికి రూ.3997 కోట్లు ఖర్చవుతుందని డీపీఆర్లో పొందుపరిచారు. 1999లో తొలుత ఈ లైన్కు ప్రతిపాదించగా, తిరిగి 2013లో మరోసారి రూ.1112 కోట్ల నిర్మాణ అంచనాతో ప్రతిపాదనను పునరుద్ధరించారు. చివరకు గతేడాది అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రైళ్ల ట్రాఫిక్ సాంద్రత 140 శాతంగా ఉండటంతో.... ప్రస్తుతం రామగుండం నుంచి మణుగూరుకు వరంగల్–మహబూబాబాద్–డోర్నకల్–కారేపల్లి–పాండురంగాపురం మీదుగా రైల్వేలైన్ ఉంది. ఈ మార్గంలో మణుగూరు వెళ్లాలంటే 287 కి.మీ. ప్రయాణించాలి. ఈ మార్గంలో డోర్నకల్ జంక్షన్ వరకు విజయవాడ, విశాఖపట్నం మార్గం కావటంతో ప్రయాణికుల రైళ్లు అధికంగా తిరుగుతాయి. రామగుండం నుంచి బొగ్గులోడుతో గూడ్సు రైళ్లు అధికంగా తిరుగుతాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల ట్రాఫిక్ సాంద్రత 140 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో రామగుండం–మణుగూరు మధ్య నేరుగా ప్రత్యామ్నాయ రైలు మార్గం అవసరమని నిర్ణయించారు. కొత్త మార్గంలో ప్రయాణిస్తే 80 కి.మీ. నిడివి తగ్గుతుంది. దీంతో సమయంతోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. అన్నింటికి మించి రైలు ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గి ఇటు ప్రయాణికుల రైళ్లు, అటు సరుకు రవాణా రైళ్లు వేగంగా గమ్యం చేరతాయి. కోల్మైన్ టూ పవర్ప్లాంట్స్.. రామగుండం నుంచి పెద్ద ఎత్తున బొగ్గు వివిధ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరఫరా అవుతుంది. ప్రస్తుతం సరైన రైలు మార్గం లేక రోడ్డు ద్వారా తరలిస్తున్నారు. రోడ్లు పాడవటంతోపాటు ఖర్చు కూడా అధికంగా ఉంటోంది. రైల్వేలైన్ అందుబాటులో ఉంటే..మణుగూరులో ఉన్న భద్రాద్రి పవర్ప్లాంట్కు బొగ్గు తరలింపు సులభవుతుంది. దీంతోపాటు కాకతీయ, పాల్వంచ పవర్ప్లాంట్లకు దగ్గరి దారి అవుతుంది. ఇక కొత్తగూడెం నుంచి ఒడిశాలోని మల్కన్గిరికి కొత్తలైన్ నిర్మిస్తోంది. అక్కడి పారిశ్రామిక వాడతో ఈ కొత్త మార్గం అనుసంధానం కానుంది. వెరసి పారిశ్రామిక పురోగతికి కూడా ఇది దోహదం చేయనుంది. పర్యాటక ప్రాంతాల అనుసంధానం.. పర్యాటకులు అధికంగా వచ్చే ప్రాంతాలతో కొత్త మార్గం నిర్మించనున్నారు. కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోట గుళ్లు, లక్నవరం, బొగత జలపాతం ప్రాంతాల మీదుగా సాగుతుంది. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులకు ఇది ఎంతో వీలుగా ఉంటుంది. పర్యాటకంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ అటవీ ప్రాంతాలు కావటంతో సరైన రవాణా వ్యవస్థ లేదు. లక్షల మంది వచ్చే మేడారం జాతర సందర్భంలో భక్తులు ఆ ప్రాంతానికి చేరేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైలుమార్గం అందుబాటులోకి వస్తే, ప్రత్యేక రైళ్లు నడపటం ద్వారా లక్షల మందిని సులభంగా తరలించే వీలు కలుగుతుంది. గిరిజిన ప్రాంత ప్రయాణికులకు.. గిరిజన ప్రాంతాలకు సరైన రైలు మార్గం లేదన్న వెలితి కూడా దీనితో తీరుతుంది. రాఘవాపురం, మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి లాంటి ప్రాంతాలవాసులకు ఈ రైలు మార్గం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కొత్త మార్గంలో దాదాపు 13 వరకు స్టేషన్లు ఉండే అవకాశముంది. ఉత్తర భారత్ వైపు వెళ్లే రైళ్లను ఎక్కువగా నడిపేందుకు ఇది ప్రత్యామ్నాయ లింకు మార్గంగా ఉపయోగపడుతుంది. ఢిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాల ప్రయాణ సమయాన్ని ఇది తగ్గిస్తుంది. రైటప్: కొత్తగా నిర్మించే రైల్వే లైన్ మార్గం ఇలా.. -
రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని సింగరేణిలో ప్రమాదం కారణంగా ఓ కార్మికుడు మృతిచెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో గని కార్మికుడు సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోయి చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్.వివరాల ప్రకారం.. రామగుండం సింగరేణి సంస్థ 7 ఎల్ఈపీ గని వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఇసుక బంకర్లో హెడ్ ఓవర్ మెన్ సత్యనారాయణ దుర్మరణం చెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోవడంతో ఆయన మృతిచెందాడు. ఈ నేపథ్యంలో సింగరేణి రెస్క్యూ టీం.. బంకర్ నుండి మృతదేహాన్ని బయటకి తీసేందుకు ప్రయత్నిస్తోంది.మరోవైపు.. గని పరిసరాల్లోనే ఉన్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది ఆయన హామీ ఇచ్చారు. -
ఊగిసలాటకు తెరపడేదెప్పుడో!
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని జీవితకాలం ముగిసిన బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల కొత్త పవర్ ప్లాంట్ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇటీవల రామగుండంలో పర్యటించి ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు. సుమారు రూ.10 వేల కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నెలకొల్పేందుకు నిర్ణయించారు. అయితే, జెన్కో, సింగరేణి సంయుక్త భాగస్వామ్యంలో గణాంకాలు తేలకపోవడంతో ప్లాంట్ పనుల్లో జాప్యమవుతోందని ఉద్యోగులు అంటున్నారు.డీపీఆర్ కోసం..పెద్దమొత్తంలో పెట్టుబడి భరించే అవకాశం లేదని సింగరేణి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ(జెన్కో) సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను సింగరేణితో కలిసి వారంలోగా రూపొందించాలని జెన్కోకు రాష్ట్ర ఇంధనశాఖ గత సెప్టెంబర్లో ఆదేశాలు జారీచేసింది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను నెలలోగా తయారు చేయాలని జెన్కోకు సూచించింది. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం డిజిగ్ అనే సంస్థ డీపీఆర్ తయారు చేసేందుకు ప్లాంట్ను సందర్శించింది. పాత విద్యుత్ కేంద్రాన్ని తొలగించేందుకు వివిధ విభాగాలకు చెందిన ఇంజనీర్లను జెన్కో ప్రత్యేకంగా నియమించినట్టు విశ్వసనీయ సమాచారం.1971 నుంచి బీ–థర్మల్లో విద్యుత్ ఉత్పత్తిఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బొగ్గు, నీరు అందుబాటులో ఉండటంతో రామగుండంలో 1965 జూలై 19న అప్పటి సీఎం కాసు బ్రçహ్మానందరెడ్డి 62.5 మెగావాట్ల సామర్థ్యం గల బీ–థర్మల్ పవర్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. 1971లో ఇది విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ప్లాంట్ నిర్మాణానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.14.80 కోట్లు ఖర్చు చేసింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) నిబంధనల ప్రకారం 1996 వరకే ఈ ప్లాంట్ను నడిపించాల్సి ఉంది.కానీ, దాని జీవితకాలం పొడిగిస్తూ వచ్చారు. మరోవైపు కొన్నేళ్లుగా ప్లాంట్లో బాయిలర్ ట్యూబ్స్ లీక్కావడం, మిల్స్, టర్బైన్ విభాగాల్లో తరచూ సమస్యలు తలెత్తడంతో గుదిబండగా మారింది. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. తరచూ షట్డౌన్ కావడం, ఆ తర్వాత పునరుద్ధరించేందుకు ప్రతీసారి బాయిలర్ మండించేందుకు సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుండటంతో నిర్వహణ భారమైంది. అంతేకాదు.. దాని జీవితకాలం ముగియటంతో ప్లాంట్ను మూసి వేశారు.భాగస్వామ్యంపై పీటముడిపాత ప్లాంట్ పరిధిలో 560 ఎకరాల స్థలం, అనుభవం కలిగిన ఇంజనీర్లు, శ్రామిక శక్తి ఉన్న జెన్కోను కాదని, సింగరేణి భాగస్వామ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయడాన్ని జెన్కో ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. గతనెలలో వివిధ రూపాల్లో నిరసన తెలియజేశారు. అయినా, ప్రభుత్వం సింగరేణి భాగస్వామ్యంతో నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. మరోవైపు.. జెన్కో 76 శాతం, సింగరేణి 24 శాతం వాటాతో ప్లాంట్ నిర్మించేందుకు జెన్కో ఇంజనీర్లు సముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే, సింగరేణి సంస్థ తమకు 50 శాతం వాటా ఇవ్వాలని ఉన్నతస్థాయి సమావేశంలో పట్టుబట్టినట్టు సమాచారం. భాగస్వామ్యం లెక్కలు తేలి రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరితేనే కొత్త ప్లాంట్ శంకుస్థాపనకు అవకాశం ఉంటుంది. అప్పుడే జెన్కో పాలకమండలి పాత ప్లాంట్ను మూసివేసినట్టుగా ఆమోదం తెలిపే అవకాశాలుంటాయని జెన్కో ఉద్యోగులు చెబుతున్నారు. జెన్కో, సింగరేణి సీఎండీల మధ్య సయోధ్య కుదుర్చేంచేందుకు ఉపముఖ్యమంత్రి సాయంతో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ప్రయత్నాలు చేశారు. మధ్యేమార్గంగా నిర్ణయానికి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు సిద్ధమయ్యేలా చూడాలని ఆయన సూచించారు. -
కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్ : వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సెక్రటేరియట్ మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడారు. కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్హైదరాబాద్- విజయవాడ రోడ్ల విస్తరణకు కేంద్రం అంగీకారంనారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాంమూసీ ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారుమూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్,బీజేపీలు రాజకీయం చేస్తున్నాయిరేపు వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారువరంగల్కు ఎయిర్ పోర్ట్ 1999 నుంచి వింటున్నాం...కానీ ఏర్పాటు జరగలేదు. ఇప్పుడు ఆ కల సాకారం అయ్యిందిఎయిర్ పోర్ట్ పనులను 8 నెలల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాంమొదటి ఏడాది లోపే విమానాల రాకపోకలు ప్రారంభమయ్యేలా పనులు పూర్తి చేస్తాంఏడాదిన్నర కాలంలోనే తిరుపతి, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లాంటి పట్టణాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయబోతున్నాం.భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్హైదరబాద్తో పాటు మరో మూడు ఎయిర్పోర్ట్లను వచ్చే నాలుగేళ్లలో సాధించుకుంటాంహైదరాబాద్ - విజయవాడ 6 లైన్ రోడ్డు వచ్చే జనవరిలో డీపీఆర్ పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు మొదలు పెట్టే ప్రయత్నం చేస్తాంఉప్పల్ ఫ్లైఓవర్ పనులు ఆలస్యంపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తిఫ్లైఓవర్ నిర్మాణాలు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా 30 శాతం పనులు మాత్రమే అయ్యాయికేంద్రంతో మాట్లాడి వచ్చే ఏడాదిన్నర లోపు ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాంవర్షాలు పడితే ఫ్లైఓవర్ కింద చాల మంది మరణించారు.. గత ప్రభుత్వం పట్టించుకోలేదురీజినల్ రింగ్ రోడ్డు పనులపై 2018లో బీఆర్ఎస్ ప్రకటన చేసింది. కానీ పనులు పూర్తి కాలేదురీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణ పనులు వచ్చే నెలలో మొదలు పెడతాంశ్రీశైలం ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తాం -
హైదరాబాద్కు ఆక్సిజన్ ఆగనున్నదా?
దామగుండం... గత పక్షం రోజులుగా తెలంగాణలో ఈ పేరు కలకలం రేపుతోంది. విశ్వనగరం హైదరాబాద్కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రక్షిత అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దేశ రక్షణ శాఖ ఆధ్వర్యంలో భారత నావికాదళానికిసంబంధించి ‘లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్’ను నిర్మించడానికి 2900 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ అటవీభూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ అడవిలో ఇప్పుడు ఈ రాడార్ కేంద్రం నిర్మాణానికి 12 లక్షల అద్భుతమైన వృక్షాలను నేలమట్టం చేయబోతున్నారు.2007లోనే రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం భారత నావికా దళం అధికారులు వచ్చి సర్వే చేసుకొని వెళ్లారు. అయితే అటవీ భూముల బదలాయింపులకు కావలసిన గ్రామ సభలు, పంచా యతీ తీర్మానాలు వంటి ప్రక్రియలన్నీ గత పదేళ్ల ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని అంటు న్నారు. అయితే పర్యావరణ ప్రేమి కులు వేసిన ప్రజావాజ్యాలతో కోర్టులో స్టే ఉండడంతో భూమి బదలాయింపు మాత్రం జరగలేదు. కాగా గత జన వరి 24న రాష్ట్ర ప్రభుత్వం, నావికా దళానికి భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయడంతో ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. ఈ విషయాన్ని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు వెలుగులోకి తేవడంతో మళ్లీ ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవాదులు సంఘ టితం అవుతున్నారు. దామగుండం సముద్ర తీరప్రాంతానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉంది. కాగా ఇంతకంటే దగ్గర, ఇంతకంటే మెరుగైన ప్రాంతాలు సముద్ర తీరప్రాంతానికి దగ్గరగా దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదే వికారాబాద్ జిల్లాలో ఎన్నో ఎకరాల ఖాళీ భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాలు వీటిని పరిశీలించకుండా ఈ పచ్చని అటవీభూమిని నావికా దళానికి అప్పజెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.అటవీప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న 20 గ్రామాలు, దాదాపు 60 వేల మంది ప్రజలు అడవిని కోల్పోతున్నందుకు, పశువులకు మేత భూములు పోతున్నందుకు బాధపడుతున్నారు. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అడవిలో 500 రకాల వైవిధ్యమైన చెట్లు, 150 రకాల ఔషధ వృక్షాలు నేల కూలుతున్నాయి. వీటితో పాటు ఎంతో అరుదైన చుక్కల జింకలు, తోడేళ్లు, ఆసియాలోనే అతిపెద్ద జింక అయిన నీల్ గాయ్, అడవిపందులు, పెద్ద కొమ్ముల సాంబార్ జింకలు, చింకారా జాతిజింకల వంటి జంతువులతో పాటు వేల రకాల పక్షులు తమ ఆవాసాన్ని కోల్పోతున్నాయి. దీనితో పాటు ఈ రాడార్ స్టేషన్ వలన వెలువడే రేడియేషన్ ప్రభావంతో చుట్టుప్రక్కల ప్రజలకు కంటి చూపు సమస్యలు, సొమాటిక్ లక్షణాలు, ఆందోళన, నిద్ర లేమి, మానసిక రుగ్మతలు, సంతానలేమి, వంధత్వం, చర్మ సమస్యలు, అవయవాల పనితీరుపై ప్రభావం, ఎలక్ట్రికల్ షాక్ వంటి సమ స్యలు పొంచివున్నాయి. దామగుండం అడవిని ఆనుకునే ఉన్న వికారాబాద్ అనంతగిరి అడవులే మూసీ నదికి జన్మస్థలం. ఈ నది ఇక్కడి నుంచే మొదలై విశ్వనగరం హైదరాబాద్ మీదుగా దాదాపు 240 కిలోమీటర్లు ప్రవహించి, నల్లగొండ జిల్లా వజీరాబాద్ సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం వల్ల మూసీ నదీ పరివాహక ప్రాంతానికి, ఆ నదితో పాటు పుట్టిన ఈసా, కాగ్నా నదుల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడింది.ఈ దామగుండం అటవీప్రాంతం విశ్వనగరం హైదరాబాద్కు కేవలం 75 కిలోమీటర్ల దూరంలోఉంది. రాజధాని నగరానికి ప్రధాన ఆక్సిజన్ వనరులు కూడా ఇక్కడ విస్తరించి ఉన్న అడవులే. ఇప్పుడు 2,900 ఎకరాలలో పచ్చదనం కోల్పోవడం అంటే విశ్వనగరానికి ఆక్సిజన్ సిలిండర్ తీసివేస్తున్నట్లే! ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో సమగ్ర పరి జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలను, ఆ యా పంచాయతీ పెద్దలను గ్రామ సభలు, తీర్మా నాల పేరుతో తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే మోసం చేస్తుంటే వారు ఎవరికి చెప్పుకోగలరు? ఇప్పుడీ దామగుండం పరిరక్షణ పర్యావరణ బాధ్యత స్థానిక ప్రజలే తేల్చుకోవాలి. వారికి సరియైన దిశానిర్దేశం చేయా ల్సిన బాధ్యత పర్యావరణ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులపై ఎంతైనా ఉంది.– మోతె రవికాంత్ ‘ సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ అధ్యక్షులు -
చెల్లికి ఫోన్ చేసి.. బావను చంపేసిన అన్న
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ప్రేమపెళ్లి వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది. ‘నిన్ను చూడాలని ఉంది చెల్లీ.. సద్దుల బతుకమ్మకు మీ ఇంటికి వస్తున్నా’అని తన చెల్లికి ఫోన్ చేశాడు ఓ అన్న. నిజమేనని నమ్మిన ఆ చెల్లి.. తన భర్తను ఎదురు పంపించింది. అయితే అన్నతోపాటే, ఆమె మాజీ భర్త ఇంటికి చేరుకున్నారు. వచ్చీరాగానే చెల్లిని ఓ గదిలో బంధించిన అన్న.. బయట గడియపెట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో చెల్లి భర్తపై దాడిచేసి చంపేశాడు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏసీపీ రమేశ్ కథనం ప్రకారం.. యైటింక్లయిన్కాలనీలోని హనుమాన్నగర్కు చెందిన వడ్డాది వినయ్కుమార్(25) గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్కావెంజర్గా పనిచేస్తున్నాడు. అదే ఏరియాకు చెందిన ఇద్దరు పిల్లలున్న ఓ వివాహితతో అతడికి పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకోగా, రెండు కుటుంబాలు అంగీకరించలేదు. వన్టౌన్ పోలీస్స్టేషన్లో పంచాయితీ సాగుతుండగానే వినయ్ ఆ వివాహితను పెళ్లి చేసుకున్నాడు. యైటింక్లయిన్కాలనీ హనుమాన్నగర్లో ఇంట్లో ఇద్దరూ అద్దెకు ఉంటున్నారు. అయితే తమ కొడుకు ఇష్టాన్ని కాదనలేక వినయ్ తల్లిదండ్రులు అద్దె ఉంటున్న ఇంటి వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.చదవండి: కట్టుకున్నోడే కాలయముడయ్యాడుఅయితే సద్దుల బతుకమ్మ వేడుకను సాకుగా తీసుకున్న ఆ వివాహిత సోదరుడు.. ఆమెకు ఫోన్చేసి చూడాలని ఉందన్నాడు. అడ్రస్ తెలియదని, వినయ్ను తన వద్దకు పంపించాలని కోరాడు. ఇది నిజమని నమ్మిన ఆమె వినయ్కు విషయం చెప్పి తన అన్నను తీసుకురమ్మని పురమాయించింది. వినయ్ వివాహిత అన్నను తీసుకొని ఇంటికొచ్చాడు. ఆయన వెంట మాజీ భర్త కూడా వచ్చాడు. ఇంటికి రాగానే వివాహిత అన్న, మాజీ భర్త వినయ్పై విచక్షణా రహితంగా దాడిచేశారు. కత్తితో పొడిచి హత్య చేశారు. ఏసీపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ ప్రసాద్రావుతో కలిసి వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మిన్నంటిన రోదనలుకాగా కాలనీలో ఒక వైపు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా మరో వైపు హత్య జరగడంతో సంచలనంగా మారింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ఏకైక కుమారుడు హత్యకు గురికావడంతో ఆ కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ప్రేమపెళ్లే తన కుమారున్ని పొట్టనబెట్టుకుందని మతుని తండ్రి కుమార్ రోధిస్తూ వెల్లడించారు. -
రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్: భట్టి విక్రమార్క
సాక్షి,పెద్దపల్లిజిల్లా: రామగుండంలో 800 మెగావాట్ల జెన్కో పవర్ప్లాంట్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం(ఆగస్టు31) భట్టి విక్రమార్క రామగుండం ప్రాంతంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రామగుండంలో ఇప్పటికే ఉన్న పాత జెన్కో పవర్ప్లాంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ‘భవిష్యత్తులో సింగరేణి సంస్థ, జెన్కో సహకారంతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్న పాత ప్లాంటు 50 ఏళ్లుగా రాష్ట్రానికి వెలుగులు ఇచ్చింది. ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో నేను ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ ప్రభుత్వంలో ప్లాంటు ప్రారంభించి మాట నిలబెట్టుకుంటా. వీలైనంత త్వరగా ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తాం’అని భట్టి తెలిపారు. -
తల్లీ సాహితీ.. మాకు దిక్కెవరమ్మా..!
జ్యోతినగర్(రాముండం): ‘అమ్మా సాహితీ.. మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా తల్లీ.. నీవు చక్కగా చదువుకుని భవిష్యత్లో ఎంతో ఎదగాలని ఆశించాం.. కానీ మమ్మల్ని ఇలా విడిచి వెళ్తావని అనుకోలేదమ్మా’ అని ఆ తల్లి లక్ష్మి రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ఎన్టీపీసీ ఆపరేషన్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న మల్లెపల్లి రాజలింగు–లక్ష్మి దంపతులకు సాత్విక, సాహితి కుమార్తెలు ఉన్నారు. పర్మినెంట్ టౌన్షిప్లో నివాసం ఉంటున్నారు. పెద్దకుమార్తె సాత్విక డిగ్రీ చదువుతోంది. చిన్నకుమార్తె సాహితి(15) ఎన్టీపీసీ పీటీఎస్లోని సెయింట్ క్లేర్ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి సాహితి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే టౌన్షిప్లోని ధన్వంతరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఆస్పత్రికి రెఫర్ చేశారు. అయితే, అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాహితి సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆమె మృతికి సంతాప సూచకంగా హైస్కూల్కు సెలవు ప్రకటించారు.వైద్యులపై గుర్తింపు సంఘం గరం?సాహితి గుండెపోటుతో మృతి చెందడంతో వైద్య బృందంపై ఉద్యోగ గుర్తింపు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినిని ఆస్పత్రిలో చేర్పిస్తే సరైన వైద్యం అందించ లేదని ఆరోపించారు. ప్రథమ చికిత్స సైతం తూతూమంత్రంగా చేసి కరీంనగర్కు రెఫర్ చేశారని ధ్వజమెత్తారు. ప్రమాదకర పరిస్థితిలో ఉన్న విద్యార్థినికి చికిత్స అందించడంతో ఆస్పత్రి వర్గాలు విఫలమయ్యాయని విమర్శించారు. జాతీయ రంగ సంస్థ ఎన్టీపీసీ ఆస్పత్రిలో సరైన సమయంలో సరైన వైద్యం అందకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గుండెపోటు వచ్చిన విద్యార్థినిని కరీంనగర్కు రెఫర్ చేయడంతో ఆమెకు సరైన సమయంలో చికిత్స అందకపోవడంతోనే మృతి చెందిందని ఆరోపించారు. వైద్యుల తీరుపై యాజమాన్యం విచారణ చేపట్టాలని వారు కోరారు. -
రామగుండం ఓపెన్కాస్ట్లో ప్రమాదం, ఇద్దరు మృతి
పెద్దపల్లి, సాక్షి: రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓసీపీ-2లో పైప్లైన్ లీకేజీని అరికట్టేందుకు నలుగురు కార్మికులు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీదపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక మృతి చెందారు. మృతులు ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్గా గుర్తించారు. మృతదేహాలను గోదావరి ఖని ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ప్రమాదం గురించి తెలియగానే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ -2 గనిలో పైప్లైన్ మరమ్మత్తులు చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఒక ప్రకటన విడుదల చేశారాయన. .. వర్షాకాలం గనుల్లో నిలిచిపోయే నీటిని తోడి వేసేందుకు అవసరమైన పంపులు, వాటర్ పైప్లైన్ల మరమ్మత్తుల సందర్భంగా ఈ ఘటన జరిగిందని తెలిసింది. కార్మికుల భద్రత విషయంలో అలసత్వానికి తావు లేకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులకు సూచిస్తున్నాను’’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. -
అంతలో వెళ్లమని.. ఇంతలో ఆగమని..
సాక్షి, హైదరాబాద్: రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేతపై రాజకీయ రగడ జరుగుతోంది. 1971లో 62.5 మెగావాట్ల విద్యుదుత్పత్తితో ప్రారంభమైన ఈ విద్యుత్ కేంద్రం జీవితకాలం ఎప్పుడో ముగిసింది. అయినా మరమ్మతులు చేస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. సాంకేతిక సమస్యలతో గత నెల 4వ తేదీ నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇకపై మరమ్మతులు చేసినా ఫలితం ఉండదనే భావనకు జెన్కో వచ్చింది. అక్కడున్న 65 మంది ఇంజనీర్లు, 230 మంది అపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓ అండ్ ఎం) సిబ్బంది, మరో 40 మంది అకౌంట్స్, పీఎంజీ విభాగాల్లో పనిచేస్తుండగా, జూన్ 4 నుంచి వీరికి పనిలేకుండా పోయింది. అక్కడి సబ్స్టేషన్, ఇతర అత్యవసర వ్యవస్థల నిర్వహణకు అవసరమైన సిబ్బంది మినహా మిగిలిన ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులకు విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాలకు బదిలీ చేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది.తొలిదఫాలో 44 మంది ఇంజనీర్లు, నలుగురు కెమిస్ట్లను నిర్మాణదశలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డెప్యూటేషన్పై బదిలీ చేస్తూ గత నెలలో జెన్కో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే ఒత్తిడితో రెండురోజులకే ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మరో ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు నెలకు రూ.4 కోట్లకు పైగా వ్యయం అవుతుండగా, ఉత్పత్తి నిలిచిపోయి ఉద్యోగులందరూ ఖాళీగా ఉండడంతో జెన్కోకు ఆర్థికంగా భారంగా మారింది. కొత్త విద్యుత్ కేంద్రంనిర్మించే వరకు వారిని అక్కడే కొనసాగించాలని ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్టు చర్చ జరుగుతుండగా, కొత్త కేంద్రం నిర్మాణానికి 4 నుంచి 8 ఏళ్లు పట్టనుందని జెన్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నా...రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ భారంగా మారినా స్థానికంగా వస్తున్న రాజకీయ ఒత్తిళ్లతో గత ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నారు. 2019 మార్చి 31లోగా ఈ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) గతంలో ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో గడువును 2029 వరకు పొడిగించింది. 62.5 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి జరగడం లేదు. గరిష్టంగా 45 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, అధిక బొగ్గు వినియోగిస్తుండడంతో ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదు. కాలుష్యం సైతం అనుమతించిన స్థాయికి మించి జరుగుతోంది. దాదాపుగా రూ.2 కోట్లు ఖర్చు చేసి బయటి నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతులు నిర్వహిస్తే 15 రోజుల్లో ఉత్పత్తిని ప్రారంభించి మరికొన్ని రోజుల పాటు నెట్టుకు రావొచ్చని, పూర్తిస్థాయిలో మరమ్మతుల నిర్వహ ణకు కనీసం రూ.30కోట్లకు పైగా ఖర్చు అవుతుందని జెన్కో వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా ఎంత కాలం పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి నెల కొంది. ఈ నేపథ్యంలో జెన్కో ఆర్థిక ప్రయోజనాల రీత్యా ఈ విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయక తప్పని పరిస్థితి నెలకొంది. ‘సూపర్ క్రిటికల్’ నిర్మాణ బాధ్యతపై జెన్కో అభ్యంతరంరామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో అక్కడే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై జెన్కో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. కొత్త విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ఆధ్వ ర్యంలోనే నిర్మించాలని కోరుతున్నారు. వాస్తవా నికి నైజాం ప్రభుత్వం 1931లో రామగుండంలో ఏ–థర్మల్, బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణా నికి 3000 ఎకరాలు కేటాయించింది. ఏ– థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని గతంలోనే మూసివే యగా, ఇందుకు సంబంధించిన స్థలంలో దాదాపు 1200 ఎకరాలను 90వ దశకం మధ్యలో బీపీఎల్ అనే సంస్థకు కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక బీ–థర్మల్ కేంద్రానికి దాదాపు 700 ఎకరాల స్థలం ఉండగా, కబ్జాలు పోగా 550 ఎకరాలే మిగిలాయి. 800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఈ స్థలం సరిపోదు. బీపీఎల్కు కేటాయించిన స్థలంలో కొంత స్థలాన్ని జెన్కోకు అప్పగిస్తే కొత్త విద్యుత్ కేంద్రం నిర్మించుకుంటామని జెన్కో ఉద్యోగులు కోరుతున్నారు. -
మూసివేత దిశగా రామగుండం బీ– థర్మల్ విద్యుత్ కేంద్రం?
రామగుండం: నిర్వహణ భారం..జీవితకాలం ముగియడంతో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 62.5 మెగావాట్ల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. వారంరోజులు క్రితం 38 మంది ఇంజనీర్లు, ఐదుగురు సబ్ ఇంజనీర్లు, ఒకరు సీనియర్ కెమిస్ట్, నలుగురు కెమిస్ట్లను యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)కు డిప్యుటేషన్ పేరిట బదిలీ చేశారు. దీంతో మూసివేత తప్పదనే ప్రచారం జరుగుతోంది. యూనిట్ ట్రిప్ అయినా... ఈ నెల 4వ తేదీన యూనిట్లోని మిల్స్ విభాగంలో సాంకేతిక సమస్యతో తలెత్తింది. దీంతో యూనిట్ ట్రిప్ అయ్యి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ సౌధ నుంచి అనుమతులు రాకపోవడంతో పునరుద్ధరణ చేపట్టలేదు. పదిరోజులుగా ఖాళీగా ఉంటున్న ఇంజనీర్లు, ఉద్యోగులను యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్ తదితర జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. 1965లో ప్లాంట్ ప్రారంభం » అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కాసు బ్రహా్మనందరెడ్డి 1965 జూలై 19న రామగుండంలో 62.5 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారు. కరెంట్ ఉత్పత్తితోపాటు పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధిస్తూ రికార్డులు నమోదు చేసింది. అయితే విద్యుత్ కేంద్రం స్థాపించి ఆరు దశాబ్దాలు కావడంతో నిర్వహణ భారంగా మారింది. » బాయిలర్, టర్బయిన్, మిల్స్, ట్రాన్స్ఫార్మర్ తదితర విభాగాల్లో ఏడాదిగా తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో తరచూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. » ఈ జనవరి నుంచి సమస్య మరింత జటిలమైంది. కాలం చెల్లిన విద్యుత్ కేంద్రం కావడంతో విడిభాగాల లభ్యత లేదు. పాతవాటితోనే సర్దుబాటు చేసి విద్యుత్ కేంద్రాన్ని ఉత్పత్తి దశలోకి తీసుకొస్తున్నారు. » సాంకేతిక సమస్యలతో మళ్లీమళ్లీ ట్రిప్పవుతూనే ఉంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు రూ.25 లక్షలకుపైగా వ్యయం అవుతోంది. ఆదాయం కన్నా వ్యయమే అధికంగా ఉండడంతో మూసివేతే పరిష్కారమని భావిస్తున్నట్టు సమాచారం. ∙వాస్తవానికి థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవితకాలం 25 ఏళ్లే. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ జీవితకాలం ఎప్పుడో ముగిసిపోయింది. కొత్త ప్లాంటు ఏర్పాటు తప్పనిసరిరామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలోనే 800 మెగావాట్ల సామర్ధ్యం గల కొత్త విద్యుత్ కేంద్రం స్థాపిస్తాం. అప్పటివరకు పాత విద్యుత్ కేంద్రాన్ని కొనసాగించాలని ఎనర్జీ సెక్రటరీ రిజ్వీ, డైరెక్టర్లను కలిసి విన్నవించా. అత్యధిక సంఖ్యలో ఇంజనీర్లు ఉండడంతో కొందరిని యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలకు డిప్యుటేషన్పై బదిలీ చేస్తున్నారు. – మక్కాన్సింగ్ ఠాకూర్, రామగుండం, ఎమ్మెల్యే -
కరెంట్ కొంటారా .. లేదా ?
సాక్షి, హైదరాబాద్: రామగుండంలోని రెండో థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై నేషనల్ థర్మల్ పవర్కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమ్మతి తెలపకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు ఆ విద్యుత్ను సరఫరా చేస్తామని హెచ్చిరించింది. రెండో విడత విద్యుత్ కేంద్ర నిర్మాణంలో పురోగతిపై సమాచార హక్కుచట్టం కింద జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ వివరాలు కోరగా, ఎన్టీపీసీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఎన్టీపీసీ విధించిన గడువు ముగిసినా, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేయలేదు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధనశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. మూడు లేఖలు రాసినా స్పందించని రాష్ట్రం తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇవ్వగా, తొలి విడత కింద రామగుండంలో 1600(2గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంటేనే కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు అందిస్తాయి. తొలి విడత ప్రాజెక్టులోని 1600 మెగావాట్ల విద్యుత్లో 85 శాతం కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎన్టీపీసీతో ఒప్పందం(పీపీఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ఆధారంగానే బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించి తొలి విడత విద్యుత్ కేంద్రాన్ని ఎన్టీపీసీ నిర్మించింది. రెండో విడత కింద 2400 (3గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి ఎన్టీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన రుణాల సమీకరణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గతేడాది అక్టోబర్ 5న లేఖ రాసింది. స్పందన లేకపోవడంతో మళ్లీ గత జనవరి 9న రెండోసారి లేఖ రాసింది. అయినా స్పందన లేకపోవడంతో జనవరి 29న మూడోసారి రాసిన లేఖలో 12రోజుల్లోగా అనగా, గత ఫిబ్రవరి 10లోగా సమ్మతి తెలపాలని అల్టిమేటం జారీ చేసింది. సమ్మతి తెలపని పక్షంలో తెలంగాణ రెండో విడత ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా లేదని భావించి ఇతరులకు ఆ విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ ఆసక్తి చూపిస్తే తొలి ఏడాది యూనిట్కు రూ.4.12 చొప్పున విద్యుత్ విక్రయిస్తామని తెలిపింది. దేశంలో గణనీయంగా పెరిగిన విద్యుత్ డిమాండ్కు తగ్గట్టూ విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, సత్వరంగా ఒప్పందం చేసుకోవాలని సూచించింది. తొలి విడత ప్రాజెక్టు వ్యయం రూ.11,572 కోట్లు రెండో విడత ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్టుకు ఆమోదం లభించిందని, టెక్నికల్ స్టడీ పురోగతిలో ఉందని ఎన్టీపీసీ తెలిపింది. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నీటి కేటాయింపులు చేసిందని వెల్లడించింది. శక్తి పాలసీ కింద ఈ ప్రాజెక్టుకు సింగరేణి బొగ్గు కేటాయిస్తూ గత జనవరి 3న స్టాండింగ్ లింకేజీ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. 1600 మెగావాట్ల తొలి విడత ప్రాజెక్టు నిర్మాణానికి గత జనవరి 31 వరకు రూ.11,572 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది. -
రామగుండంలో సీ అండ్ టీ ట్రాక్పై తప్పిన ప్రమాదం
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలోని క్యారేజ్&వాగన్ (C&W) ట్రాక్పై తప్పిన ప్రమాదం. లూప్ లైన్లో నిలిచి ఉన్న మిషన్ను గూడ్స్ రైలు భోగీలు ఢీకొట్టాయి. గూడ్స్ రైలు నుంచి లింకు ఊడిపోవడంతో 8 భోగీలు వేరు అయ్యాయి. కిందకు విడిపోయిన భోగీలు వేగంగా వెళ్లాయి. యూటీ మిషన్ను ఢీకొట్టడంతో ట్రాక్ ఎండ్ గోడపైకి యూటీ మిషన్ దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఆపరేటర్ మిషన్లో నిద్రిస్తున్నాడు. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి ఆపరేటర్ బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
‘నాన్నా.. వేధింపులు భరించలేకపోతున్నా.. చావుతోనే నాకు విముక్తి’
సాక్షి, రామగుండం(పెద్దపల్లి): ‘నాన్నా.. కట్నం వేధింపులు భరించలేకపోతున్నా.. చావుతోనే నాకు విముక్తి.. అందుకే నా బాబుతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నా.. (రియల్లీ ఐ వాంట్ టూ డై విత్ మై బేబీ) నన్ను క్షమించండి’అంటూ ఓ వివాహిత తండ్రికి మెసేజ్ పంపి ఆత్మ హత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్ కథనం ప్రకారం.. రామగుండం రైల్వేస్టేషన్ ఏరియా భరత్నగర్కు చెందిన మాణిక్యాల సదానందరెడ్డి కూతురు ధనశ్రీ.. అదే కాలనీకి చెందిన దండుగుల రాకేశ్ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు కాదనడంతో వారిని ఎదిరించిన ధనశ్రీ గతేడాది మేలో రాకేశ్ను ఆదర్శ వివాహం చేసుకుంది. అయితే, కొంతకాలం తర్వాత ధనశ్రీకి పుట్టింటితో సఖ్యత కుదిరింది. రెండు కుటుంబాలు కలిసి పోయాయి. అయితే పెళ్లి తర్వాత రాకేశ్ ఏ నిచేయకుండా నిత్యం మద్యం తాగడం, కట్నం తేవాలని భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు బాధితురాలు మొరపెట్టుకోగా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించి రూ.50 వేలను ధనశ్రీ అత్తింటి వారికి అప్పగించారు. ధనశ్రీ కూడా ఇంటివద్ద ట్యూషన్లు చెబుతూ కొంత ఆదాయం సంపాదిస్తోంది. ఇలా సాఫీగానే సాగిన క్రమంలో వారికి కుమారుడు (4 నెలలు) పుట్టాడు. అయినప్పటికీ రాకేశ్ ప్రవర్తనలో మార్పురాలేదు. భర్త మద్యం తాగి కట్నం కోసం వేధించడం, అత్తామామల సూటిపోటి మాటలతో ధనశ్రీ విసిగిపోయింది. ఆదివారం తన తల్లిగారింటికి వెళ్లి అత్తింటి వేధింపులపై వారితో మొరపెట్టుకుంది. వారు సర్దిచెప్పగా సాయంత్రానికి తిరిగి అత్తగారింటికి వచి్చన ధనశ్రీ.. గదిలో ఎవరూ లేని సమయంలో తాను బిడ్డతో కలిసి చనిపోతున్నానంటూ తండ్రికి ఫోన్లో మెసేజ్ పెట్టింది. తొలుత బాబుతో కలిసి ఉరివేసుకోవాలని అనుకున్నా.. బిడ్డపై మమకారంతో బాబును వదిలేసి తానే దూలానికి చీరతో ఉరి వేసుకుంది. చప్పుడు కావడంతో గదిలోకి వచ్చిన కు టుంబ సభ్యులు.. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ధనశ్రీని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రవీకరించారు. తన కూతురు మృతికి ఆమె అత్తింటివారే కారణమని సదా నందరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రామగుండం విద్యుత్ కేంద్రంలో మంటలు
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 50 ఏళ్ల నాటి బీ–థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో టర్బయిన్, బాయిలర్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. నిప్పురవ్వలు ఎగసిపడటంతో... రామగుండంలోని బీ–థర్మల్ విద్యుత్ కేంద్రంలో కాలం చెల్లిన పరిజ్ఞానం వినియోగిస్తు న్నారు. ఇందులోని మిల్స్ నుంచి బాయిలర్లోకి బొగ్గును డంపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో వివిధ యంత్రాలు, కంట్రోల్ రూం వరకు బొగ్గుపొడి (కోల్డస్ట్) వెదజల్లి నట్లుగా నిండిపోతూ ఉంటుంది. అయితే బాయిలర్ ప్రాంగణంలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని, నిప్పురవ్వలు బొగ్గుపొడిపై పడటంతో మంటలు చెలరేగి సమీపంలోని రబ్బర్ కేబుల్స్కు అంటుకొని విద్యుత్ కేంద్రం ట్రిప్ అయిందని అధికారులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో ఫైరింజిన్ ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని చెప్పారు. పునరుద్ధరించిన కొన్ని గంటల్లోనే ట్రిప్.. ఈ కేంద్రంలో సెప్టెంబర్ 12 నుంచి వార్షిక మరమ్మతులు ప్రారంభించిన అధికారులు వాటిని నెల రోజుల్లో పూర్తిచేసి విద్యుత్ కేంద్రాన్ని తిరిగి ఉత్పత్తి దశలోకి తీసుకురావాలనుకున్నా పరిస్థితులు అనుకూలించక 45 రోజులు పట్టింది. ఈ నెల 20న అర్ధరాత్రి ఉత్పత్తి దశలోకి తీసుకురాగా కొన్ని గంటలపాటు విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఈ క్రమంలోనే భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మరోసారి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మళ్లీ పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు కనీసం 10 రోజులపైనే పడుతుందని అధికారులు అంటున్నారు. మరోవైపు ఆస్తి నష్టం వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాధారణంగా విద్యుత్ కేంద్రం జీవితకాలం 25 ఏళ్లుకాగా బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థాపించి సుమారు 50 ఏళ్లు గడుస్తోంది. విద్యుత్ సౌధకు చెందిన పలువురు నిపుణులు ఇటీవల ఈ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి 2029 వరకు దీన్ని కొనసాగించేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. -
Karimnagar: విమానం ఎగిరేనా? ఏళ్లుగా పరిష్కారం నోచుకొని సమస్యలు ఇవే..
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 31,12,283 లక్షల మంది ఓటర్లు ఈసారి ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్ల సంఖ్య రాష్ట్రం మొత్తం ఓటర్లలో 10వ శాతం కావడం గమనార్హం. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కరీంనగర్.. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం నుంచే తన ఘనత చాటుకుంటోంది. రాజకీయంగా ప్రభావం చేయగలిగిన ఈ జిల్లాలో కొన్ని సమస్యలు ఏళ్లుగా పరిష్కారం నోచుకోకుండా మిగిలిపోయాయి. గోదా‘వర్రీ’ పెద్దపల్లి జిల్లాలో ప్రవహించే గోదావరి నదీజలాలు కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నాయి. రామగుండం కార్పొరేషన్ డ్రైనేజీ నీరు, రసాయనాలను నేరుగా నీటిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీల నిర్మాణంతో ఏడాది పొడువునా నీరు నిల్వ ఉంటుంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో రోజుకు సుమారు 70మిలియన్ లీటర్ల నీటిని ప్రజలు వినియోగిస్తున్నారు. అందులోంచి రోజుకు 40మిలియన్ లీటర్ల మురుగు గోదావరిలో కలుస్తుంది. ఆదాయపన్ను, మారుపేర్లు, ప్రైవేటీకరణ భూతం రామగుండం సింగరేణిలో రెండున్నర దశాబ్దాల కాలంగా మారుపేర్ల మార్పిడికి చట్టబద్ధత కోసం కోసం కార్మికులుఎదురుచూస్తున్నారు. గతంలో ఈ సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చినా ఇంకా అమలుకు నోచుకోలేదు. మరోవైపు తమకు ఆదాయపు పన్ను మినహాయించాలని డిమాండ్ కోరుతున్నారు. అలాగే కోల్ బ్లాకులను ప్రైవేటు పరం చేయవద్దని కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. విమానం ఎగిరేనా..? 1980లో కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా వచ్చేందుకు 294 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మా ణం చేపట్టారు. 21 సీట్ల సామర్థ్యం ఉన్న చిన్న విమానాలు రాకపోకలు సాగించేవి. 2009లో దీన్ని రామగుండం ఎయిర్పోర్టు పేరిట అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు నడిచినా అవి అటకెక్కాయి. 2016లో ఉడాన్ పథకంలో భాగంగా 2020లో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో పలు భౌగోళిక సర్వేలు నిర్వహించినా అడుగు ముందుకు పడలేదు. నాలుగోసారి నిర్వాసితులు.. కరీంనగర్ జిల్లాలో అదనపు టీఎంసీ కాలువ పనుల్లో భాగంగా రామడుగు, గంగాధర మండలాల్లో పలువురు నిర్వాసితులు నాలుగోసారి భూమిని కోల్పోతున్నారు. ఎవరైనా ఒకసారి కోల్పోవడం సాధారణం, రెండుసార్లు కోల్పోవడమే అరుదు. కానీ, ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి పనుల వల్ల ఈ మండలాల్లో కొన్ని గ్రామాలవారు నాలుగు తరాలుగా నిర్వాసితులుగా మారిపోయారు. ఈఎస్ఐ ఆస్పత్రి కావాలి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షలాది మంది బీడీ కారి్మకులు ఉన్నారు. మున్సిపల్, పలు పరిశ్రమల్లో పనిచేసేవారికి ప్రతి నెలా వేతనం నుంచి ఈఎస్ఐ కట్ అవుతుంది. కానీ, ఈఎస్ఐ ఆస్పత్రి ఉమ్మడి జిల్లాలో రామగుండంలో ఉంది. అసలు రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అత్యవసరాల్లో శస్త్రచికిత్స సమయంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలవుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని లక్షలాది మంది కార్మికులు కోరుతున్నారు. తెలంగాణలో కొన్ని రాజకీయ కుటుంబాల ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది. వాటిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురించి ముందుగా తెలుసుకోవాలి. అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1962 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు నిర్వహిస్తే, 1994లో అసద్ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికీ కొనసాగగుతున్నారు. 1999 నుంచి అసద్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తున్నారు. ఆ రకంగా అరవై ఒక్క సంవత్సరాలుగా ఒవైసీ కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం విశేషం. ఆ కుటుంబం పదిమార్లు లోక్సభకు సలావుద్దీన్ 1962 నుంచి అయిదుసార్లు శాసనసభకు, ఆరుసార్లు ఎంపీగా హైదరాబాద్ నుంచి గెలుపొందారు. అసద్ రెండుసార్లు చార్మినార్ నుంచి అసెంబ్లీకి, తదుపరి 2004 నుంచి నాలుగుసార్లు హైదరాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక అక్బరుద్దీన్ ఒవైసీ చంద్రాయణగుట్ట నుంచి 1999 నుంచి వరుసగా అయిదు సార్లు గెలిచారు. 1999 లో తండ్రి లోక్సభకు, ఇద్దరు కుమారులు అసెంబ్లీకి ఎన్నికవడం ఒక ప్రత్యేకత. సలావుద్దీన్, అసద్ కలిసి ఇంతవరకు పదిసార్లు లోక్సభకు ఎన్నికయ్యారన్నమాట. తండ్రి, ఇద్దరు కుమారులు కలిసి పన్నేండుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. చదవండి: -
పని పూర్తి చేసే సంస్కృతి మాది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శంకుస్థాపన చేస్తే ఆ పనిని కచ్చితంగా పూర్తి చేయాలనే సంస్కృతిని తమ ప్రభుత్వం పాటిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కీలకమని.. ఉత్పత్తి, సరఫరా నిరంతరాయంగా ఉంటే పరిశ్రమల వృద్ధికి ఆలంబన అవుతుందని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్ను ప్రస్తుతం ప్రారంభించుకున్నామని, త్వరలో రెండో యూనిట్ సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్లో అధిక భాగం తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. ధర్మాబాద్– మనోహరాబాద్– మహబూబ్నగర్– కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణతో రైళ్ల సరాసరి వేగం, రాష్ట్రంలో కనెక్టివిటీ మరింత పెరుగుతాయని చెప్పారు. మనోహరాబాద్– సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్తో పరిశ్రమలు, వ్యాపారానికి తోడ్పాటు అందుతుందన్నారు. ఇక ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాల నాణ్యత కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తీసుకొచ్చామని.. తెలంగాణలోని 20 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వివరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలంగాణలో 50 పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అరి్వంద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పసుపు రైతుల సన్మానం పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో పసుపు రైతులు నిజామాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. పసుపు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేక దండ వేసి, పసుపు మొక్కలను అందించారు. మోదీ ఆ మొక్కలను పైకెత్తి ప్రదర్శించారు. తెలుగులో ప్రారంభించి.. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులారా..’అని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ.. మోదీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి భరతమాత వేషధారణలో వచ్చిన విషయాన్ని చూసి.. ‘‘ఓ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చింది. ఆ చిన్నారికి నా తరఫున అభినందనలు..’’అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. ప్రధాని మోదీ నిజామాబాద్లోని సభా స్థలిలో విడిగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై సభను ఉద్దేశిస్తూ రాజకీయ ప్రసంగం చేశారు. తొలి వేదికపై ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలివీ.. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్లో 800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 20 జిల్లా ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్లకు శంకుస్థాపన. ∙మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు సర్వీస్కు పచ్చజెండా.. ధర్మాబాద్ – మనోహరాబాద్ – మహబూబ్నగర్ – కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పనుల ప్రారంభం -
రామగుండం: ఇక్కడి తీర్పు విలక్షణం.. ఈసారి కార్మికుల కన్ను ఎవరిపై?
రాష్ట్రంలోనే విలక్షణమైన తీర్పు వస్తూ ఉంటుంది. కోల్ బెల్ట్ ప్రాంతమైన పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఓటర్ల తీర్పు అంతుపట్టకుండా ఉంటుంది. కార్మికులు ఎవరిని పాపం అంటే వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఇక్కడ కార్మిక నాడి ఎవరికీ అంతుపట్టదు. 2004 వరకు మేడారం నియోజకవర్గం 2009లో రామగుండం నియోజకవర్గంగా మారింది. ► 2009లో జనరల్ సీట్గా మారిన రామగుండం నియోజకవర్గంలో 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణను కార్మికులు గెలిపించుకున్నారు. ఇండిపెండెంట్గా గెలిచిన సత్యనారాయణ.. రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరిన సత్యనారాయణ 2014లో టీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవకాశం దక్కించుకున్నారు. ► 2018 ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థిగా కోరుకంటి చందర్ సత్యనారాయణపై వెయ్యి ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రామగుండం నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. రామగుండం ముఖచిత్రం రామగుండం నియోజకవర్గంలో గతంలో రామగుండం కార్పొరేషన్తో పాటు రామగుండం మండలం ఉండేది. కొత్తజిల్లాల విభజన తర్వాత రామగుండం కార్పోరేషన్తో పాటు అంతర్గాం మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి . ► రామగుండం కార్పోరేషన్లో 50 డివిజన్లు, పాలకుర్తి అంతార్గం రామగుండం లో 2018 ఆగస్టు వరకు లక్ష 61 వేల 850 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇందులో పురుషులు 83,458, స్తీలు 78,368 కాగా గత ఎన్నికల్లో రెండు లక్షల 20 వేల పైచిలుకు ఉంటే అందులో 60 వేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం లక్ష 61 వేల 850 మంది మాత్రమే ఓట్లు ఉన్నాయి. సామాజిక వర్గాల రామగుండం నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో పద్మశాలి గౌడ కాపు పెరిక ముదిరాజ్ చాకలి కులస్తులు ఉన్నారు.ఇందులో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారే బలంగా ఉన్నప్పటికీ ఐక్యత లేకపోవడంతో ఓట్ల శాతం తక్కువగా నమోదవుతున్నాయి. ఎమ్మెల్యే బలం బలహీనతలు ప్రజల్లో ఉద్యమకారునిగా మంచి పేరు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాలు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎమ్మెల్యేలు ఇరకాటంలోకి నెట్టు తున్నాయి. ఇసుక దందా బూడిద దందా తో పాటు అనేక అవినీతి ఆరోపణలు రావడంతో జనంలో ఎమ్మెల్యే పై వ్యతిరేకత ఉంది. పార్టీలో మొదటి నుండి పని చేసిన ఉద్యమకారులను ద్వితీయ శ్రేణి నాయకులను తొక్క పెడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు కందుల సంధ్యారాణి, మిర్యాల రాజిరెడ్డి, పాతిపెల్లి ఎల్లయ్య, కొంకటి లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు ఎమ్మెల్యే కింద ఉన్న కొంతమంది చోటా మోటా నాయకులు ఎమ్మెల్యేల తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ రావడం వల్ల సప్తగిరి కాలనీ, న్యూ మారేడుపల్లి ప్రధాన సమస్యగా మారాయి. నీటిలో ఇండ్లు మునిగిన గాని ఇప్పటివరకి సమస్య సమస్యగానే ఉంది.పనులు ఎక్కడ వేసిన గొంగలి లా ఉన్నాయి. బీఆర్.ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలు వ్యతిరేక వర్గీయులు పోరాటాలు ఈసారి ఎమ్మెల్యేకు మైనస్గా మారే అవకాశం. ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకు కాంగ్రెస్ రంగంలోకి దిగుతుంది. ప్రధానంగా బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండవచ్చు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు! బీఆర్ఎస్ కోరుకంటి చందర్ కాంగ్రెస్ పార్టీ రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ జనక్ ప్రసాద్ ( ఐ.ఎన్.టి.యు. సి.) బీజెపి సోమరపు సత్యనారాయణ (మాజీ ఆర్టీసీ చైర్మన్) కౌశిక్ హరి కాసిపేట లింగయ్య (మాజీ ఎమ్మెల్యే) భౌగోళిక పరిస్థితులు: రామగుండం నియోజకవర్గంలో రాముని గుండాలు ఇక్కడ ప్రత్యేకం జనగామ శివారులో 500 సంవత్సారాల క్రితం ఉన్నా త్రిలింగ రాజరాజేశ్వర స్వామి మూడు లింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకం. -
నెలాఖరులోగా గ్రిడ్కు ‘సూపర్ థర్మల్’!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న 1,600 (2 *800) మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి దశలోని 800 మెగావాట్ల యూనిట్ను ఈ నెలాఖరులో గా గ్రిడ్కు అనుసంధానం చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. తొలి యూనిట్ ద్వారా గత రెండు వారాలుగా 650 మెగావాట్ల వరకు నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కొత్తగా నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరు, సామర్థ్యం పరీక్షల్లో భాగంగా నిరంతరంగా 72 గంటల పాటు పూర్తి స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాణిజ్యపరమైన ఉత్పత్తికి అర్హత సాధించిన తేదీ(కమర్షియల్ ఆపరేటింగ్ డేట్/సీఓడీ)ని ప్రకటిస్తారు. సీఓడీ ప్రకటన తర్వాత విద్యుత్ కేంద్రాన్ని గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 800 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యంతో తొ లి యూనిట్లో విద్యుదుత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ ఏ ర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ను 27 నుంచి గ్రిడ్కు సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎల్డీసీ) నుంచి ఇటీవల స్లాట్లను పొందింది. అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరులోగా తొలి యూనిట్ సీఓడీ ప్రకటన ప్రక్రియ పూర్తి చేసుకుని గ్రిడ్కు అనుసంధానం కానుంది. వచ్చే అక్టోబర్లో రెండో యూనిట్కు సీఓడీ ప్రక్రియ నిర్వహించాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణంలో మూడున్నరేళ్ల జాప్యం ! ఎన్టీపీసీ తొలి యూనిట్ నుంచి జూన్ 2020, రెండో యూనిట్ నుంచి నవంబర్ 2020 నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్ గడువును 2023 మార్చి, రెండో యూనిట్ గడువును జూలై 2023కు పొడిగించారు. యూనిట్–1 నిర్మా ణం దాదాపు 8 నెలల కిందటే పూర్తయింది. కాగా, బాయిలర్లోని రీహీటర్ ట్యూబ్స్కు పగుళ్లు రావడంతో గత డిసెంబర్లో జరగాల్సిన సీఓడీ ప్రక్రియను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరమ్మతుల్లో భా గంగా ట్యూబ్స్కు పగుళ్లు వచ్చి న చోట కట్ చేసి వెల్డింగ్తో మళ్లీఅతికించారు. ఏకంగా 7,500 చోట్లలో వెల్డింగ్ చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం ఇచి్చన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాల్సి ఉండగా, తొలి దశ కింద 1,600 మెగా వాట్ల కేంద్రాన్ని నిర్మి స్తున్న విషయం తెలిసిందే. రూ.10,599 కోట్ల అంచనా వ్య యంతో తొలి దశ ప్రాజెక్టును చేపట్టగా, గత మార్చి నాటికి రూ.10,437 కోట్ల వ్య యం జరిగింది. పనుల్లో జాప్యంతో అంచనా వ్యయా న్ని రూ.10,998 కోట్లకు పెంచారు. డిస్కంలకు ఊరట..! ఎన్టీపీసీ తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే నిరంతరం పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు వీలుపడుతుంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరిగే వేళల్లో అవసరమైన అదనపు విద్యుత్ను రాష్ట్ర పంపిణీ సంస్థ (డిస్కం)లు అధిక ధరలతో పవర్ ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే విద్యుత్ కొనుగోళ్ల భారం కొంత వరకు తగ్గుతుందని అధికారులు చెపుతున్నారు. -
కేటీఆర్ పేషీలో ‘రామగుండం’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. టికెట్ల లొల్లి ముదురుతోంది. అధికార పక్షం బీఆర్ఎస్లో నిజయోకవర్గాల వారీగా అసమ్మతి సెగలు ఒక్కొక్కటి బయటపడతున్నాయి. రాజధానికి చేరి.. అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండం అసమ్మతి నేతలు మంత్రి కేటీఆర్తో శుక్రవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ కేటీఆర్ పేషీలోనే గంటల తరబడి వీళ్ల సమావేశం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై అసమ్మతి నేతలు కేటీఆర్కు ఫిర్యాదు చేశారు. కోరుగంటి చందర్కు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దని కేటీఆర్కు చెప్పారు వాళ్లు. కావాలనుకుంటే జిల్లా అధ్యక్షునిగా కోరుకంటి కొనసాగినా పర్వాలేదని.. కానీ, ఎమ్మెల్యే టికెట్ మాత్రం వేరేవాళ్లకు ఇవ్వాలని అసమ్మతి నేతలు కేటీఆర్ను కోరారు. ఈ తరుణంలో అధ్యక్షుడిగా కోరుకంటి ఉంటే మీకు ఓకేనా? అని అసమ్మతి నేతల్ని కేటీఆర్ అడగడం గమనార్హం. అయితే.. కలిసి పనిచేయాలా? వద్దా? అనేది కోరుకంటిపై ఆధారపడి ఉంటుందని అసమ్మతి నేతలు కేటీఆర్కు బదులిచ్చినట్లు సమాచారం. అంతేకాదు అధిష్టాన నిర్ణయంపైనే తమ రాజకీయ భవిష్యత్ ఉంటుందని కూడా వాళ్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘పార్టీకి నష్టం కలిగించే పనులు చేయొద్దంటూ అసంతృప్తి నేతలకు సూచిస్తూనే.. సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టికెట్ ఇస్తాం. ఎమ్మెల్యే కాబట్టి ఆయనతో మాట్లాడితే నాకు ఆయన దగ్గర అనుకుంటే ఎలా?’’ అని అసమ్మతి నేతలను ఆయన ప్రశ్నించారు. అయితే.. ఎమ్మెల్యే తమపై కేసులు పెట్టి వేధించాడని నేతలు చెప్పగా.. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే కేసులు పెట్టి వేధించిన విషయం తనకు తెలువదన్న కేటీఆర్ వాళ్లతో అన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్స్ పెట్టొద్దని ఆయన అసమ్మతి నేతలకు సూచించారు. ఇక.. అసమ్మతి నేతలతో పాటు ఎమ్మెల్యే కోరుకంటి చందర్తోనూ కేటీఆర్ భేటీ అయ్యి ఈ పరిణామాలపై చర్చించారు. ఆపై ‘‘నేను చెప్పాల్సింది చెప్పిన.. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసమే పనిచేస్తా.. అంటూ ఎమ్మెల్యే కోరుకంటి వ్యాఖ్యానించడం గమనార్హం. కేటీఆర్తో భేటీ అనంతరం.. మంత్రి కొప్పుల ఈశ్వర్తోనూ రామగుండం అసమ్మతి నేతలు భేటీ కావడం గమనార్హం. ఇదీ చదవండి: తెలంగాణలో కులగజ్జి, మతపిచ్చి లేదు -
గులాబీ కోటలో కొత్త టెన్షన్.. ఆ ఐదు సెగ్మెంట్లలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రత్యర్థులకు ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. కానీ ఇప్పుడు పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. ముఖ్యంగా అయిదు సెగ్మెంట్లలో గులాబీ పార్టీ నేతలు కుమ్ములాడుకుంటున్నారు. ప్రతిపక్షాలు లేని కొరతను సొంత పార్టీ వారే తీరుస్తున్నారు. నియోజకవర్గాల్లో రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఇంతకీ ఆ ఐదు సెగ్మెంట్ల కథేంటీ... ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లో గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. రామగుండం నియోజకవర్గంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై గెలిచిన కోరుకంటి చందర్ తర్వాతి కాలంలో కారెక్కి విహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చందర్కు సీటిస్తే మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆయన వ్యతిరేకులు గులాబీ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు కోరుకంటి చందర్కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయాలంటూ ఆశయసాధన పేరుతో యాత్ర చేస్తున్న అసమ్మతి నేతలు ఎమ్మెల్యే ఫోటోను మాత్రం పెట్టలేదు. మరోవైపు ఎమ్మెల్యే వర్గం కూడా పాదయాత్ర నిర్వహించగా.. రెండు వర్గాలు రామగుండంలో వీధిపోరాటానికి దిగాయి. చదవండి: డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ నిర్వేదంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్న కొలువై ఉన్న వేములవాడలోనూ గులాబీ పార్టీలో గ్రూప్లు ఏర్పడి కుమ్ములాడుకుంటున్నాయి. నియోజకవర్గంలో రెండు పార్టీ ఆఫీసులతో భిన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు టిక్కెట్కు చల్మెడ లక్ష్మీనర్సింహారావు అడ్డుపడుతున్నారు. కొద్దికాలంగా రమేష్ బాబు వర్సెస్ చల్మెడ ఎపిసోడ్ వేములవాడ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చాయి. ఇద్దరి మధ్యా ఉప్పునిప్పూ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి రమేష్ బాబు టికెట్కు గండి కొట్టి.. చల్మెడకే కన్ఫర్మ్ అనే టాక్ వేములవాడలో చాలా రోజులుగా నడుస్తోంది. టికెట్ రాదేమోనన్న నిర్వేదంతో పాటు.. పార్టీలోని ప్రత్యర్థులపై అక్కసు, ఆక్రోశమూ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు మాటల్లో కనిపిస్తోంది. తనను ధిక్కరించిన ఈటల రాజేందర్కు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈటలతో యుద్ధానికి పంపిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ కేసీఆర్ ఆశల్ని తుంచేస్తున్నారు. కౌశిక్రెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జ్గా తొలగించాలంటూ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వంటివారు మీడియా ముందుకు రావడం.. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తే.. మరింత రెబల్గా సమ్మిరెడ్డి మాట్లాడిన తీరు ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితిని కళ్లకు కడుతోంది. అంతేకాదు కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కౌశిక్కు వ్యతిరేకంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో హుజూరాబాద్లో అభ్యర్థెవ్వరన్న ప్రశ్నలతో పాటు.. ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా.. మిగిలిన వర్గాలు ఎంతవరకూ మద్దతిస్తాయన్నది కూడా సందేహమే. ఇక పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరుపై కూడా పార్టీలో అంతర్గతంగా అసహనం వ్యక్తమవుతోంది. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రాజయ్య ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ ప్రెస్మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి తీరుపై అలిగి ఆయన కీలక అనుచరుడైన ఉప్పు రాజ్ కుమార్ పార్టీనుంచే బయటకు వెళ్ళిపోయాడు. అయితే అతణ్ని బ్రతిమాలి మళ్ళీ పార్టీలోకి తీసుకువచ్చారు. చదవండి: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ... స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్ రావు కూడా ఈసారి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డీతో ఎమ్మెల్సీ భానుప్రసాద్కు సఖ్యత లేకపోవడం వల్ల ఆయనకు ప్రత్యర్థులు పెరిగిపోతున్నారు. ఈసారి బీసీలకే పెద్దపెల్లి టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి రావడంతో పాటు.. సామాజిక సమీకరణలు కూడా పార్టీకి తలబొప్పి కట్టిస్తున్నాయి. జూలపల్లి జెడ్పీటీసి లక్ష్మణ్ కేసీఆర్ సేవాదళం పేరుతో కార్యక్రమాలు చేస్తూ.. ఎమ్మెల్యే దాసరిపై కనిపించని యుద్ధం చేస్తున్నారు. జూలపల్లి జడ్పీటీసీ కూడా పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. పైకి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ అని ప్రచారం జరుగుతున్నా..వెనుక పెద్ద పెద్ద గోతులు తవ్వుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎవ్వరినీ కలుపుకుపోలేని ఆయన తీరు, అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు టిక్కెట్ వస్తుందా, రాదా అనే చర్చ జరుగుతోంది. రవిశంకర్కు టిక్కెట్ ఇస్తే పార్టీ పరంగానే మద్దతు లభించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా చొప్పదండిలో పోటీకి రెండు మూడు పేర్లను నియోజకవర్గ నేతలు తెరపైకి తెస్తున్నారు. మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. క్యాడర్ బలంగా ఉన్నా.. లీడర్స్ మధ్య సమన్వయం లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఇక్కడి గులాబీ కోటకు ప్రమాదమే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి గులాబీ బాస్ తన కోటకు మరమ్మతులు చేస్తారా? రాబోయే ప్రమాదాన్ని నివారిస్తారా? వేచి చూడాల్సిందే. -
రామగుండం బొగ్గుగనిలో ప్రమాదం.. సింగరేణి కార్మికుడు మృతి!
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని బొగ్గుగనిలో ప్రమాదం చోటుచేసుకుంది. వెల్డింగ్ పనులు చేస్తుండగా సిలిండర్ పేలి కార్మికుడు మృతిచెందాడు. వివరాల ప్రకారం.. రామగుండం ఆర్జీ3 పరిధిలోని ఓసీపీ-1 గనిలో పేలుడు సంభవించింది. గనిలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు జయంత్ కుమార్ మృతి చెందినట్టు సమాచారం. దీంతో, మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. -
అభివృద్ధి మంత్రం.. రాజకీయ తంత్రం
రామగుండం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఓ వైపు అధికార టీఆర్ఎస్పై పదునైన విమర్శలతో రాజకీయ అస్త్రాలు సంధిస్తూనే.. మరోవైపు అభివృద్ధి మంత్రాన్ని బలంగా చాటుతూ ద్విముఖ వ్యూహంతో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన సాగింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేయడంతోపాటు.. రాష్ట్రంలో అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనకు చరమగీతం పాడే దిశగా ముందుకు సాగాలని పార్టీ కేడర్కు మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు స్పష్టంగా కనిపిస్తోందనీ చెప్పారు. ఇదే సమయంలో కేంద్రంపై, తనపై, బీజేపీపై చేస్తున్న రాజకీయ దాడులకు తగినరీతిలో సమాధానం చెప్తామన్నారు. రాబోయే రోజుల్లో యుద్ధం రసవత్తరం కాబోతోందంటూ రాజకీయపరమైన హెచ్చరికలూ చేశారు. మూఢ నమ్మకాలను విమర్శిస్తూ.. గతంలో ఐఎస్బీ స్నాతకోత్సవం కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ.. టీఆర్ఎస్ సర్కార్, ప్రభుత్వ అధినేతపై సునిశిత విమర్శలు చేయడంతోపాటు మూఢ నమ్మకాలను నమ్ముకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. తాజాగా శనివారం బేగంపేట సభలోనూ మూఢ నమ్మకాల అంశాన్ని లేవనెత్తారు. గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడుండాలి, ఎలా ఉండాలన్న విషయంలోనూ మూఢ నమ్మకాలను పాటించడం బాధాకరమన్నారు. రామగుండం సభలో ఒకవైపు కేంద్రం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూనే.. సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నారంటూ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకునే దిశలో పరుగులు పెడుతోందని.. నిర్దేశించుకున్న లక్ష్యాలు పెద్దవైనందున కేంద్రం నూతన పోకడలతో ముందుకు సాగుతోందని రామగుండంలో అభివృద్ధి మంత్రం జపించారు. ప్రజలు ఆశీర్వదించాలంటూ.. గత ఎనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో రాజకీయాలకు అతీతంగా చాలా చేశామని.. రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలున్నాయా, ప్రతిపక్ష సర్కార్లున్నాయా అన్న పక్షపాతం లేకుండా అభివృద్ధికి తోడ్పడ్డామన్నారు. తెలంగాణలో వివిధ రంగాల్లో కేంద్రం సాయంతో వచ్చిన ప్రగతే దీనికి నిదర్శనమంటూ ఆకట్టుకున్నారు. తెలంగాణను అభివృద్ధిపథంలో మరింత ముందుకు తీసుకెళతామని, ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. -
సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు : ప్రధాని మోదీ
-
రామగుండం వేదికగా రైతులకు శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ
(రామగుండం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘‘తెలంగాణలో కొందరు రాజకీయ స్వార్థంతో వదంతులు పుట్టిస్తున్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్ధాలు వారికే ఇబ్బంది అవుతాయని తెలియదేమో. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51%, కేంద్రం వాటా 49%. అలాంటప్పుడు కేంద్రం ఎలా విక్రయిస్తుంది? ఏమైనా చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన ఏదీ కేంద్రం వద్ద లేదు. ఇలా అబద్ధాలు చెప్పేవారిని హైదరాబాద్లోనే ఉంచండి..’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నకిలీ ఎరువులు, బ్లాక్ మార్కెటింగ్ వంటి సమస్యల నుంచి రైతులను గట్టెక్కించేందుకు దేశవ్యాప్తంగా ఒకేలా ‘భారత్’ బ్రాండ్తో యూరియాను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. శనివారం రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ను జాతికి అంకితం చేసిన సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ మాట్లాడారు. ‘ఈ సభకు విచ్చేసిన రైతులు, సోదర, సోదరీమణులకు నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తర్వాత హిందీలో మాట్లాడారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రామగుండం నేల నుంచి యావత్ తెలంగాణకు నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ భాగస్వాములైన రైతులకు స్వాగతం. ఇక్కడ ప్రారంభించిన ఎరువుల ఫ్యాక్టరీ, రైలు, రోడ్డు మార్గాలతో వ్యవసాయం, వాణిజ్య వ్యాపార రంగాలు అభివృద్ధి చెంది.. తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైతులు, యువతకు ఎంతో మేలు కలుగుతుంది. ఆర్థిక పరిపుష్టి సాధిస్తాం. మూడు జాతీయ రహదారుల విస్తరణతో చెరుకు, పసుపు, ఇతర రైతులకు మేలు చేకూరుతుంది. ఒకే బ్రాండ్ యూరియాతో.. దశాబ్దాలుగా వివిధ బ్రాండ్ల పేరిట నకిలీ ఎరువులు, నల్ల బజారులో విక్రయాలతో దేశంలోని రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. దీనికి పరిష్కారంగా ఇక నుంచి దేశంలో కేవలం ఒకే ‘భారత్’ బ్రాండ్ యూరియాను నాణ్యత, తక్కువ ధరతో కేంద్రం అందుబాటులోకి తెస్తోంది. రామగుండం ప్లాంట్ ద్వారా తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల రైతులకు ఎరువుల సరఫరా జరుగుతుంది. రామగుండం ప్రాంతంలో రవాణా, లాజిస్టిక్ రంగాలు అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ భారత్లో పెంచలేదు. ప్రతి యూరియా బస్తాపై రూ.1,472, డీఏపీ బస్తాపై రూ.2,500 కేంద్రం సబ్సిడీగా అందిస్తోంది. ఎరువుల కోసం 8 ఏళ్లలో దాదాపు రూ.10 లక్షల కోట్లు, ఈ ఏడాది రెండున్నర లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నాం. శరవేగంగా అభివృద్ధి కరోనా, యుద్ధాలు, ఇతర ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉద్భవించే దిశగా వేగంగా పరుగులు పెడుతోంది. ఇంతకుముందటి 30 ఏళ్లతో పోలిస్తే గత 8 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో ఎక్కువగా అభివృద్ధి సాధించింది. ఎనిమిదేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతే ఇందుకు సాక్ష్యం. దేశంలో పాలన తీరు మారింది. సర్కారీ ప్రక్రియలు, ఆలోచనలు మారాయి. మౌలిక సదుపాయాలు వృద్ధి చెందాయి. దేశాభివృద్ధికి దోహదపడే మరో ముఖ్యమైన అంశం రవాణా సదుపాయాల పెంపు. అందుకే అన్ని రాష్ట్రాల్లో రహదారులు, రైల్వే, ఎయిర్ వే, వాటర్ వే అభివృద్ధి పనులు చేపట్టాం. గత ఎనిమిదేళ్లలో రెట్టింపైన జాతీయ రహదారుల కనెక్టివిటీ.. అన్ని రంగాల్లో వృద్ధికి మార్గం సుగమం చేసింది. భద్రాద్రి–సత్తుపల్లి రైల్వేలైన్ను రూ.990 కోట్లతో నాలుగేళ్లలో పూర్తి చేశాం. తక్కువ ఖర్చుతో బొగ్గు రవాణా వల్ల విద్యుత్ రంగంలో, వ్యాపార రంగంలో అనేక లాభాలు కలుగుతాయి. జాతీయ రహదారుల విస్తరణ ద్వారా హైదరాబాద్–వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్సై్టల్ పార్క్, పసుపు, మిర్చి రైతులకు ప్రయోజనం కలుగుతుంది..’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒక రైలు మార్గం.. మూడు హైవేలు శనివారం రామగుండం ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో ప్రజల సమక్షంలో రిమోట్ కంట్రోల్ ద్వారా ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్, భద్రాచలం– సత్తుపల్లి కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో రూ.2,268 కోట్లతో నూతనంగా విస్తరిస్తున్న మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు (హైవే నంబర్ 765డీజీ), బోధన్ నుంచి బాసర మీదుగా భైంసా వరకు (హైవే నంబర్ 161 బీబీ), సిరోంచ నుంచి మహదేవ్పూర్ వరకు (హైవే నంబర్ 353 సి) మూడు నేషనల్ హైవేల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్లో ఉన్న కొందరికి ఈ రాత్రి నిద్రపట్టదేమో! ‘రామగుండం సభకు భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరుకావడంతో హైదరాబాద్లో కొందరికి ఇవాళ నిద్ర పట్టదేమో’ అని టీఆర్ఎస్ పెద్దలను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని, తెలంగాణ అభివృద్ధి కోసం మీ అందరి ఆశీర్వాదం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
RFCL ప్లాంట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
-
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్న తెలంగాణ అభివృద్ధి ఆగదు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం.. మూడు నేషనల్ హైవేలకు గ్రీన్సిగ్నల్
సాక్షి, పెద్దపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. రూ.6,338 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగింది. ఈ క్రమంలోనే భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వేలైన్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. కాగా, రూ.990 కోట్లతో 54.10 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు. అలాగే, మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి, బోధన్-బాసర-భైంసా, సిరోంచా-మహదేవ్పూర్ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇక, రూ.2,268 కోట్లతో మూడు జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగనున్నాయి. -
‘సింగరేణి ప్రైవేటీకరణతో కేంద్రానికి సంబంధం లేదు’
సాక్షి, పెద్దపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘ఈ ఫ్యాక్టరీతో ఎరువుల కొరత తీరుతుంది. యూరియా బస్తాపై కేంద్రం రూ. 1470 సబ్సిడీ ఇస్తోంది. 2014లో ధాన్యానికి మద్దతు ధర రూ. 1360 ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రూ.2040కి ధరను మోదీ పెంచారు. గతంలో తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు రూ. 3404 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు 26వేల కోట్లు కేటాయించాము. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తూ రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తాము. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సింగరేణి ప్రైవేటీకరణతో కేంద్రానికి సంబంధం లేదు. ప్రతీ గ్రామానికి మోదీ ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టే.. గ్రామీణ ప్రాంతాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. రైతుల అకౌంట్లలో ఏడాదికి రూ. 6వేలు జమ చేస్తున్నాము’ అని అన్నారు. -
RFCL ప్లాంట్ ను సందర్శించిన ప్రధాని మోదీ
-
పేదలను లూటీ చేసే ఎవరినీ వదలం: ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: ‘అవినీతి, కుటుంబ పాలన అనేవి ప్రజాస్వామ్యానికి మొదటి శత్రువులు. తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. పేదలను లూటీ చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోం. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజలను దోచుకునే వారెవరినీ వదిలిపెట్టబోనని నేను ఎర్రకోట సాక్షిగా ప్రమాణం చేశా. అవినీతిపరులు దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు కూటమిగా మారే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఇదంతా చూస్తున్నారు. వారికి అంతా అర్థమవుతోంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తెలంగాణ పేరుతో వచ్చిన కొందరు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. తెలంగాణలో అవినీతి, కుటుంబపాలన రాజ్య మేలుతోందని.. దీనిని అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కు అవకాశం ఇవ్వాలని.. అన్ని వర్గాలను, అన్ని రంగాలను అభివృద్ధి చేసి చూపిస్తామని పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీ.. బేగంపేటలో బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. టీఆర్ఎస్, కేసీఆర్ల పేర్ల ను ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించా రు. ప్రసంగం వివరాలు మోదీ మాటల్లోనే.. ‘తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టం. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు భారతమాత సేవ కోసం నిష్టతో కృషి చేస్తున్నారు. వారికి నా అభినందనలు. తెలంగాణతో బీజేపీకి బలమైన అనుబంధం ఉంది. 1984లో బీజేపీకి పార్లమెంటులో కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచి, బీజేపీకి అండగా నిలిచినదే. ఇప్పుడు బీజేపీ పార్లమెంటులో మూడు వందలకు పైగా సీట్లతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు పలు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ప్రజలకు సంక్షేమ రాజ్యాన్ని అందిస్తోంది. త్వరలో తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇక్కడి ప్రజల మద్దతును చూస్తే తెలుస్తోంది. తెలంగాణ ప్రజలకు విశ్వాస ఘాతుకం చేశారు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధిలో ఇంకా వెనుకబడి ఉంది. అవినీతిమయమై కుటుంబ పాలనలో చిక్కుకుంది. తెలంగాణ పేరుతో ముందుకొచ్చిన కొందరే అభివృద్ధి చెందారు. వారు విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ అవినీతిని, కుటుంబ పాలనను అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. మునుగోడులో ఓటర్లు ఇచ్చిన మద్దతుతో తెలంగాణలో కమల వికాసం ఖాయమనిపిస్తోంది. తెలంగాణ ప్రజల్లో బీజేపీ పట్ల పెరిగిన ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. మూఢ నమ్మకాల ప్రభుత్వాన్ని తరిమేద్దాం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మూఢ నమ్మకాలను ప్రభుత్వాలు పాటించడం బాధాకరంగా ఉంది. మూఢ నమ్మకాలను పాటిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కార్యాలయాలు ఎక్కడుండాలి? ఎవరెవరిని మంత్రులు చేయాలి? ఎవరిని మంత్రివర్గం నుంచి తీసేయాలి అని చూస్తోంది. ఈ తంతును దేశప్రజలంతా గమనిస్తున్నారు. అవినీతి, కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికి ప్రధాన విరోధులు. బీజేపీలో కుటుంబ పాలన లేదు. మూఢ నమ్మకాలు లేవు. అవినీతి, అక్రమాలు లేవు. ప్రజలను దోచుకుకునే వారెవరినీ వదిలిపెట్టబోనని నేను ఎర్రకోట సాక్షిగా ప్రమాణం చేశాను. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇళ్లు ఇవ్వలేకపోయాం పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. పలు రాష్ట్రాల్లో పథకాన్ని విజయవంతంగా అమలు చేసినా తెలంగాణలో ఇక్కడి ప్రభుత్వం వైఖరి కారణంగా చేయలేకపోయాం. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఒక్కరికీ పీఎం ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వలేదు. ఇక డబుల్ బెడ్రూం ఇళ్లు ఎవరికి ఇచ్చారో ప్రజలకు తెలుసు. ఇక దేశంలోని ఏ వ్యక్తి ఆకలితో చనిపోవద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసి ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. తెలంగాణలో ఏకంగా 2 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నాం. ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేసి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశాం. నన్ను తిట్టడమే వారి పని తెలంగాణలో అధికారంలో ఉన్నవారు మోదీని, బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కొత్త తిట్లు వెతికి మరీ తిడుతున్నారు. ప్రజలకు మేలు జరుగుతుందంటే, ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయంటే.. బీజేపీని, నన్ను ఎన్ని తిట్లు తిట్టినా భరిస్తాం.. పెద్దగా పట్టించుకోబోం. కానీ తెలంగాణ ప్రజలను తిడితే.. వారికి అన్యాయం చేస్తే.. వారి కలలను, ఆశలను వమ్ముచేస్తే ఊరుకునేది లేదు. ఇతర పార్టీల నాయకులు తిట్టే తిట్లకు బీజేపీ కార్యకర్తలెవరూ నిరాశ పడొద్దు. ప్రజల సమస్యలు తీరుతాయంటే.. ప్రాంతం అభివృద్ధి జరుగుతుందంటే తిట్లు తిట్టినా పట్టించుకోకుండా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు కదలండి. ప్రతివార్డులో ప్రతి ఇంటి తలుపుతట్టండి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో, లేదో తెలుసుకొండి. అందని వారికి లబ్ధి చేకూర్చే పనిలో నిమగ్నం కండి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
బేగంపేట సభా వేదికపై ప్రధాని మోదీ
-
హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు: ప్రధాని మోదీ
PM Modi RFCL Visit: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రామగుండం పర్యటన అప్డేట్స్ 04: 39 PM రామగుండం బహిరంగ సభలో మోదీ ప్రసంగం ►సోదర, సోదరీమణులకు నమస్కారాలంటూ ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు ►ఈ సభకు వచ్చిన రైతులందరికీ నమస్కారాలు ►70 నియోజకవర్గాల్లో రైతు సోదరులు ప్రసంగం వింటున్నారు ►ఈ ఒక్కరోజే 10 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం ►రైల్వేలు, రోడ్ల విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ►గత రెండున్నరేళ్లుగా కరోనాతో పోరాడుతున్నాం ►సంక్షోభంలోనూ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాం ►కష్టకాలంలోనూ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం ►గత 8 ఏళ్లలో దేశం రూపురేఖలు మారిపోయాయి ►అభివృద్ధి పనుల మంజూరులో వేగం పెంచాం ►నిరంతరం అభివృద్ధి కోసమే తపిస్తున్నాం ►ఎరువులు కోసం గతంలో విదేశాలపై ఆధారపడేవాళ్లం ►రైతులు లైన్లలో నిలబడేవాళ్లు, లాఠీ దెబ్బలు తినేవారు ►ఇప్పుడు ఈ ఫ్యాక్టరీతో ఎరువులు కొరత తీరుతుంది ►ఎరువులు కోసం గతంలో విదేశాలపై ఆధారపడేవాళ్లం ►టెక్నాలజీ అప్గ్రేడ్ కాకపోవడంతో గతంలో ఈ కంపెనీ మూతపడింది ►కొత్త టెక్నాలజీతో కంపెనీ పునఃప్రారంభమయింది ►సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు. ►బొగ్గు గనులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ►హైదరాబాద్ నుంచి కొందరు రెచ్చగొడుతున్నారు ►పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ►సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే ►కేంద్రం వాటా 49 శాతం మాత్రమే ►ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి ఉండదు 04: 22 PM భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వేలైన్ను ప్రారంభించిన ప్రధాని భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వేలైన్ను వర్చువల్గా ప్రధాని మోదీ ప్రారంభించారు. కాగా, రూ.990 కోట్లతో 54.10 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు. అలాగే, మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి, బోధన్-బాసర-భైంసా, సిరోంచా-మహదేవ్పూర్ హైవే విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇక, రూ.2,268 కోట్లతో మూడు జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగనున్నాయి. 04: 07 PM ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ను ప్రధాని మోదీ సందర్శించారు. ఆయన వెంట గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఉన్నారు. ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. రూ.6,338 కోట్లతో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగింది. 03: 49 PM ► రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పరిశీలించిన ప్రధాని మోదీ 03: 09 PM ► రామగుండం చేరుకున్న ప్రధాని మోదీ 2:47 PM ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం బయలుదేరారు. కాసేపట్లో రామగుండం చేరుకోనున్నారు. 2:28 PM రామగుండం బయల్దేరిన ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం బయలుదేరారు. కాసేపట్లో RFCL(Ramagundam Fertilizers and Chemicals Limited) ప్లాంట్ సందర్శించి.. జాతికి అంకితం చేస్తారు. వర్చువల్గా.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్- సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వే లైన్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 1:20PM బేగంపేట సభావేదిక.. ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ ►భారత్ మాతాకీ జై అంటూ మోదీ ప్రసంగం ప్రారంభం ►తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషకరంగా ఉంది ►తెలంగాణ బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు ►తెలంగాణ కార్యకర్తలతో నేనెంతో ప్రభావితం అయ్యాను ►మీరు ఒక యుద్ధం చేస్తున్నారు..ఒక పోరాటం చేస్తున్నారు ►తెలంగాణ పేరుతో కొందరు అధికారం పొంది తమ జేబులు నింపుకుంటున్నారు ►తెలంగాణలో త్వరలోనే అంధకారం పోతుంది ►తెలంగాణకు త్వరలోనే సూర్యోదయం రాబోతుంది ►తెలంగాణలో ప్రతిభావంతులను వెనుకబడేస్తున్నారు ►తెలంగాణ ప్రజలకు మీ నాయకులు అన్యాయం చేస్తున్నారు ►ఎప్పుడు చీకటి కమ్ముకుంటుందో.. నాలుగు దిక్కుల నుంచి చిమ్మచీకట్లు ముసురుకుంటాయో అటువంటి సమయంలోనే కమలం వికసిస్తుంది ►బీజేపీ కార్యకర్తల పోరాటంతో తెలంగాణలో చీకట్లు తొలగిపోవడం ప్రారంభమైంది ►మునుగోడులో బీజేపీ కార్యకర్తల పోరాటం ఎంతో అభినందనీయం ►గత కొన్ని రోజులుగా జరిగిన ఉప ఎన్నికల్లో ఒకే విషయం స్పష్టమవుతోంది ►కష్టకాలంలో కూడా మా పార్టీని తెలంగాణ ప్రజలు వదిలిపెట్టలేదు ►1984లో బీజేపీ కేవలం ఇద్దరు ఎంపీలే ఉన్నప్పుడు.. తెలంగాణలో హన్మకొండ నుంచి జంగారెడ్డిని గెలిపించారు ►హైదరాబాద్ ఇన్ఫరేషన్ టెక్నాలజీకి కోట లాంటింది ►తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మూడ నమ్మకాలను ప్రోత్సహిస్తోంది ►తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోస్తాం ►కొందరు భయంతో మోదీని బూతులు తిడుతున్నారు ►ఆ బూతులను నేను పట్టించుకోను ►బీజేపీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ►నన్ను తిట్టినా పట్టించుకోను కానీ..తెలంగాణ ప్రజలను తిడితే ఊరుకునేది లేదు ►తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే సహించేది లేదు ►పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ►తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటే ప్రతిఫలం తప్పదు ►తెలంగాణలో ప్రధానిమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించకుండా అడ్డుకున్నారు ►డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇళ్లు ఇస్తామని మోసం చేశారు ►బీజేపీ యువకుల పార్టీ.. పేదలకు అనుకూలంగా పాలన చేసే పార్టీ ►తెలంగాణను కుటుంబ పాలన, అవినీతి నుంచి విముక్తి చేయడం మా బాధ్యత 1:14 PM కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పీచ్ ►తెలంగాణ ప్రభుత్వానికి కనీస మర్యాద లేదు ►ప్రధాని తెలంగాణకు వస్తే ప్రభుత్వం మర్యాద పాటించలేదు ►దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు ►సీఎం కేసీఆర్ది నిజాం రాజ్యాంగం ►సీఎం కేసీఆర్ వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతోంది ►తెలంగాణ ముఖ్యమంత్రికి అభివృద్ధి పట్టదు ►తెలంగాణ.. కుటుంబ పాలనలో బందీ అయ్యింది ►రాష్ట్రంలో కుటుంబ, రాచరిక పాలన నడుస్తోంది 01:12 PM ► షెడ్యూల్ కంటే ముందుగానే ప్రధాని మోదీ హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ బయట బీజేపీ ఏర్పాటు చేసిన స్వాగత సభ వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీ. కార్యక్రమంలో వేదికపై మంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్, డాక్టర్ లక్ష్మణ్, రాజగోపాల్రెడ్డి, పొంగులేటి, డీకే అరుణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీరాముడు-మోదీతో కూడిన ఓ చిత్రపటాన్ని ప్రధాని మోదీకి బహూకరించిన బీజేపీ శ్రేణులు. 12:49 PM ► బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, మంత్రి తలసాని, బీజేపీ శ్రేణులు 12:46 PM ► కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి ప్రధాని మోదీ 12:40 PM ► ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు గవర్నర్ తమిళిసై బేగంపేటకు చేరుకున్నారు. ► ప్రధాని మోదీ రాక నేపథ్యంలో.. బేగంపేట ఎయిర్పోర్ట్కు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున్న చేరుకుంటున్నాయి. ► తెలంగాణలోని రామగుండం పర్యటనలో భాగంగా.. దేశంలో వ్యవసాయ రంగానికి కావాల్సిన యూరియా డిమాండ్ను తీర్చేందుకు పునరుద్ధరించిన ఆర్ఎఫ్సీఎల్(రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్) ప్లాంటును ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఈ పరిశ్రమ ఉత్పత్తి చేయనుంది. ► రామగుండం వేదికగానే.. దాదాపు రూ.1000 కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్ను దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. ► దాదాపు రూ.9,000 కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో ఎన్హెచ్ 765 డీజీకి చెందిన మెదక్–సిద్దిపేట–ఎల్కతుర్తి సెక్షన్, ఎన్ హెచ్ 161 బీబీకి చెందిన బోధన్– బాసర–భైంసా సెక్షన్, ఎన్హెచ్ 353సీకి చెందిన సిరోంచా– మహాదేవపూర్ సెక్షన్లున్నాయి. ► తెలంగాణలోని రామగుండం పర్యటన కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్కు ముందుగా చేరుకుంటారు. ► ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బేగంపేట పరిసరాల్లో 1,500 మంది పోలీసులను మోహరించారు. మరో 100 కేంద్ర బలగాలు నిఘా నిర్వహిస్తున్నాయి. ► ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. హైదరాబాద్ బేగంపేట పరిసరాల్లో మధ్యాహ్నాం 12 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ► ఆంధ్రప్రదేశ్లో పర్యటన ముగించుకుని హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీ.. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించనున్నారు. ఆపై అక్కడి నుంచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 12:25 PM ► ఏపీ విశాఖలో ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. హైదరాబాద్కు ప్రయాణం అయ్యారు. పర్యటన సాగేదిలా.. ► ముందుగా బేగంపేట ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. ► ఎయిర్ పోర్ట్ బయట ఏర్పాటు చేసిన స్వాగత సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ► ఆపై రామగుండం బయలుదేరతారు. ► RFCL(Ramagundam Fertilizers and Chemicals Limited) ప్లాంట్ సందర్శించి.. జాతికి అంకితం చేస్తారు. ► వర్చువల్గా.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వే స్టేషన్- సత్తుపల్లి వరకు నిర్మించిన రైల్వే లైన్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ► అనంతరం రామగుండంలో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. ► కార్యక్రమం ముగించుకుని.. రామగుండం నుంచి హైదరాబాద్కు బయలుదేరుతారు. ► సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని.. ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు -
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే మోదీ పర్యటనపై పలు చోట్ల నిరసనలు, నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీలు వంటివి కనిపించాయి. అయితే, ఇదంతా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ కుట్రగా ఆరోపించింది బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో పర్యటన ముగించుకుని మధ్యాహ్నానికి తెలంగాణ చేరుకోనున్న మోదీ.. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రానికి సుడిగాలి పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై మోదీ ఎలాంటి కామెంట్స్ చేస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణలో మోదీ పర్యటన వివరాలు.. ► మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. ► మధ్యాహ్నం 1.40 నుంచి 2 గంటల వరకు ఎయిర్ పోర్ట్ బయట పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తారు. ► 2.15 గంటలకు రామగుండం బయలుదేరతారు. ► 3.30 నుంచి 4 గంటలకు RFCL ప్లాంట్ సందర్శిస్తారు. ► 4.15 నుంచి 5.15 వరకు రామగుండంలో నిర్వహించే సభలో మాట్లాడతారు. ► 5.30కు రామగుండం నుంచి బేగంపేట బయలుదేరుతారు మోదీ. ► 6.35కు బేగంపేట చేరుకుంటారు. ► 6.40కి బేగంపేట నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు మోదీ. ఇదీ చూడండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. 'మునుగోడు' వేడి చల్లారకముందే.. -
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రామగుండంలో భారీ ఏర్పాట్లు
-
Telangana: రామగుండానికి ప్రధాని.. 2,500 మందితో భారీ బందోబస్తు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సనత్నగర్: రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ఎరువుల కర్మాగా రాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పెద్దపల్లి జిల్లా రామ గుండానికి రానున్నారు. శనివారం సాయంత్రం ఆయన ఎరువుల ప్రాజెక్టును జాతికి అంకితం చేయడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా రామగుండం కమిషనరేట్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రెండురోజుల ముందు నుంచి దేశ అత్యున్నత భద్రతా విభాగం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సభా ప్రాంగణాలు, పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. ప్రధాని విచ్చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం కావడంతోపాటు మూడు రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఈ కర్మాగారం ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, సివిల్, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, ఏఆర్ తదితర విభాగాల నుంచి 2,500 మందికిపైగా పోలీసు అధికారులు బందోబస్తులో పాల్గొంటున్నారు. చకాచకా ఏర్పాట్లు బహిరంగ సభ నిర్వహించే వేదిక వద్ద ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యవేక్షిస్తున్నారు. లక్షమందిని తరలించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, పర్యటనలో సీఎంను ఆహ్వానించే క్రమంలో ప్రొటోకాల్ పాటించలేదని టీఆర్ఎస్ నిరసనలకు సిద్ధమవుతుండగా, సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కమ్యూనిస్టులు సైతం ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఏయే ప్రాజెక్టులు ప్రారంభిస్తారంటే... ► దేశంలో వ్యవసాయ రంగానికి కావాల్సిన యూరియా డిమాండ్ను తీర్చేందుకు పునరుద్ధరించిన ఆర్ఎఫ్సీఎల్ ప్లాంటును మోదీ జాతికి అంకితం చేస్తారు. ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఈ పరిశ్రమ ఉత్పత్తి చేయనుంది. ► దాదాపు రూ.1000 కోట్లతో నిర్మించిన భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్ను దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. ► దాదాపు రూ.9,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో ఎన్హెచ్ 765 డీజీకి చెందిన మెదక్–సిద్దిపేట–ఎల్కతుర్తి సెక్షన్, ఎన్ హెచ్ 161 బీబీకి చెందిన బోధన్– బాసర–భైంసా సెక్షన్, ఎన్హెచ్ 353సీకి చెందిన సిరోంచా– మహాదేవపూర్ సెక్షన్లున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు.. ప్రధాని శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ స్వాగతం పలుకుతారు. ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి మోదీ 20 నిమిషాల పాటు ప్రసంగించే అవకాశం ఉంది. ఆ తర్వాత 2.15 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రామగుండం బయలుదేరతారు. ఒకవేళ హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటే భద్రతా సిబ్బంది ముందస్తుగా ఎయిర్పోర్ట్ నుంచి రామగుండం వరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. బేగంపేట మార్గంలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ విభాగం పేర్కొంది. చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. -
RFCL: వెయ్యి ఎకరాల విస్తీర్ణం.. 5 రాష్ట్రాలకు బాసట.. సగం వాటా తెలంగాణకే
సాక్షి, కరీంనగర్: తెలంగాణ సిగలో మరో మణిహారంగా నిలవనున్న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని (ఆర్ఎఫ్సీఎల్) శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అడుగడుగునా ఏర్పడిన అవాంతరాలను అధిగమిస్తూ పునరుద్ధరించిన ఆర్ఎఫ్సీఎల్ జోరుగా ఉత్పత్తి కొనసాగిస్తూ తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల రైతులకు బాసటగా నిలుస్తోంది. దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మూతపడిన ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించి 2015లో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా రామగుండంలో మూతపడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) కర్మాగారాన్ని కేంద్రప్రభుత్వం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) పేరుతో పునరుద్ధరించింది. 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ చేతులమీదుగా ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక గత మార్చి 22 నుంచి వాణిజ్యకార్యకలాపాలు ప్రారంభించారు. ఉత్పత్తిలో సగం వాటా తెలంగాణ రాష్ట్ర అవసరాలకే కేటాయించనున్నారు. వేప నూనె, విదేశీ సాంకేతికతతో.. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆర్ఎఫ్సీఎల్ ప్రాజెక్టు విలువ రూ.6,338.16 కోట్లు కాగా, వార్షిక ఉత్పత్తి లక్ష్యం 12.75 లక్షల మెట్రిక్ టన్నులు. ఆర్ఎఫ్సీఎల్ అమ్మోనియాను డెన్మార్క్ దేశానికి చెందిన హల్టోర్ కంపెనీ, యూరియాను ఇటలీ దేశానికి చెందిన సాయ్పేయ్ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తోంది. గ్యాస్ను ఇంధనంగా మార్చి నీటి నుంచి ఆవిరి ఉత్పత్తి చేసి, వేపనూనెతో యూరియా, అమ్మోనియా తయారుచేయడం ఆర్ఎఫ్సీఎల్ ప్రత్యేకత. చదవండి: మోదీ పర్యటన.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..! -
ప్రధాని పర్యటనపై టీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
తెలంగాణ పాలిటిక్స్లో హీటెక్కిస్తున్న మోదీ టూర్
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో మరింత పొలిటిలక్ హీట్ పుట్టిస్తోంది. పీఎం మోదీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే, పర్యటనలో భాగంగా మోదీ.. బేగంపేట ఎయిర్పోర్ట్ బయట రాజకీయ ప్రసంగం చేసే అవకాశం ఉంది. ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే.. - నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు మోదీ చేసుకుంటారు. - 1.40 నుంచి 2 గంటల వరకు ఎయిర్పోర్ట్ బయట పబ్లిక్ మీటింగ్ (అనధికార సమావేశం) - 2.15 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రామగుండం బయలుదేరుతారు. - 3.30 నుంచి 4 గంటలకు RFCL ప్లాంట్ సందర్శిస్తారు. - 4.15 నుంచి 5.15 గంటల వరకు రామగుండంలో సభ - 5.30 గంటలకు రామగుండం నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు బయలుదేరుతారు. - 6.35 గంటలకు బేగంపేట చేరుకుంటారు. - 6.40 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక, ప్రధాని పర్యటన సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్ బయట మోదీ పబ్లిక్ మీటింగ్ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పరిశీలిస్తున్నారు. గత పర్యటనల్లో భాగంగా ప్రధాని మోదీ.. ఐబీఎం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో బేగంపేట ఎయిర్పోర్ట్ బయట ప్రధాని మాట్లాడారు. సమతా మూర్తి విగ్రహం ప్రారంభానికి విచ్చేసిన సందర్భంగా మోదీ ప్రసంగించారు. అలాగే, హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంలో ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడారు. -
రైతు ప్రయోజనాలే లక్ష్యంగా మోదీ తెలంగాణ పర్యటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో భాగంగా రామగుండంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సాధించిన ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోదీ వివరించనున్నారు. ఈ నెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. 8 ఏళ్ల కాలంలో దేశంలో తమ ప్రభుత్వం వివిధ రంగాల్లో తీసుకొచ్చిన పలు విప్లవాత్మక విధానాలు, తద్వారా పొందిన ఫలితాలను వివరిస్తారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, రైతు అనుకూల విధానాలతో రైతాంగానికి చేకూరిన మే లును వివరిస్తారని బీజేపీ వర్గాల సమాచారం. రామగుండం సభలో టీఆర్ఎస్ సర్కార్పై విమర్శలతో పాటు బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోదాహరణంగా వివరిస్తారని చెబుతున్నారు. కేంద్రం అమ లు చేస్తున్న పలు పథకాలు ముఖ్యంగా రైతులకు మేలు చేకూర్చే వాటిని టీఆర్ఎస్ సర్కార్ అమలు చేయకపోవడం, దీంతో జరుగుతున్న నష్టాన్ని వివరిస్తారని తెలిసింది. ఈ ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు ఎరువులు సరఫరా కానున్నాయి. తద్వారా రోడ్లు, రైల్వే, అనుబంధ పరిశ్రమలు బలోపేతమై ఈ రాష్ట్రాల్లోని ప్రజలకు అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. 3 దశాబ్దాల తర్వాత ప్రధాని సభ.. మోదీ సభ విజయవంతం చేయడం కోసం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి జనసమీకరణకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం నడుం బిగించింది. ఈ ప్రాంతంలో చాలా ఏళ్ల తర్వాత ప్రధాని సభ జరుగుతుండటంతో దానిని సక్సెస్ చేసేందుకు కార్యాచరణను రూపొందించుకున్నారు. గతంలో ఎన్టీపీసీ పరిశ్రమ శంకుస్థాపనకు అప్పటి ప్రధాని మొరార్జీదేశాయ్, ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో మరో కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రధాని అధికారిక పర్యటనకు వస్తుండటం.. సభ నిర్వహిస్తుండటంతో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి భారీగా ప్రజలు, కార్యకర్తలను సమీకరించాలని నిర్ణయించారు. 2016, ఆగస్ట్ 7న ఈ ఎరువుల ఫ్యాక్టరీకి మోదీ శంకు స్థాపన చేసిన విషయం తెలిసిందే. ఏయే ప్రాజెక్టులు ప్రారంభిస్తారు? రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం అక్కడ నిర్వహించే సభలోనే రూ.9,500 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన భద్రాచలం రోడ్డు, సత్తుపల్లి రైలు లైన్లు కూడా జాతికి అంకితం -
ప్రొటోకాల్ వివాదం.. టీఆర్ఎస్ వాదనను ఖండించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ను ఆహ్వానించలేదన్న టీఆర్ఎస్ వాదనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. రామగుండం కార్యక్రమానికి కేసీఆర్ను ఆహ్వానించామని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు సీఎం ముఖ్య కార్యదర్శికి ఎరువుల ఫ్యాక్టరీ సీఈవో లేఖ అందజేశారని కేంద్రం స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్కు రాసిన లేఖను కేంద్రమంత్రి మాండవీయ విడుదల చేశారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుల మధ్య దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ప్రొటోకాల్ రగడ మరోమారు తెరమీదకు వచ్చింది. గతంలో ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు సీఎంను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని మండిపడిన టీఆర్ఎస్.. ఇప్పుడు రామగుండం కార్యక్రమం విషయంలోనూ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక మలుపు -
Telangana: మళ్లీ ప్రొటోకాల్ రగడ!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుల మధ్య దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ప్రొటోకాల్ రగడ మరోమారు తెరమీదకు వచ్చింది. గతంలో ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు సీఎంను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించారని మండిపడిన టీఆర్ఎస్.. ఇప్పుడు రామగుండం కార్యక్రమం విషయంలోనూ తీవ్ర విమర్శలు గుప్పించింది. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసే నిమిత్తం ప్రధాని మోదీ ఈ నెల 12న రాష్ట్రానికి వస్తున్నారు. దీనికి ఆహ్వానం విషయంలో వివాదం మొదలైంది. రామగుండం ఫ్యాక్టరీలో తెలంగాణ రాష్ట్రం కూడా అధికారిక భాగస్వామిగా ఉన్నా.. మోదీ ప్రభుత్వం కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం కేసీఆర్కు నామమాత్రంగా ఆహ్వానం పంపడం ద్వారా తెలంగాణ ప్రజలను కేంద్ర ప్రభుత్వం అవమానిస్తోందని మండిపడింది. ఆహ్వాన పత్రంలో ప్రధాని మోదీ తర్వాత సీఎం హోదాలో కేసీఆర్ పేరు ఉండాలని.. కానీ ప్రొటోకాల్ పాటించలేదని ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. దీనితోపాటు 2020 నవంబర్లో భారత్ బయోటెక్ సందర్శన కోసం అధికారికంగా హైదరాబాద్కు వచ్చిన ప్రధాని మోదీ.. ప్రొటోకాల్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ను అవమానించారని టీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఉత్త చేతులతోనే వస్తారా.. ఏమైనా తెస్తారా? ఇక మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో కీలక అంశాలపై నిలదీయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పలు అంశాలపై ప్రశ్నలు, నిలదీతలతో ట్విట్టర్లో వరుస ట్వీట్లు మొదలుపెట్టింది. ‘‘మోదీ గారూ.. తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తారా? ఏమైనా తెస్తారా? తెలంగాణకు చేసిన అన్యాయాలపై ఏం చెప్తారు? విభజన చట్టం హామీల సంగతేంటి? నీతి ఆయోగ్ చెప్పిన నిధులిచ్చేది ఎప్పుడని తెలంగాణ సమాజం నిగ్గదీసి అడుగుతోంది..’’ అని పేర్కొంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో 2021 మార్చిలోనే ఉత్పత్తి మొదలైందని, ఇప్పటివరకు 10 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేసిందని గుర్తు చేసింది. ‘‘మోదీ తెలంగాణకు వస్తున్నారు. మొన్న సర్కారును కూల్చే కుట్ర బయటపడింది. నిన్న మునుగోడులో బీజేపీ ఓడిపోయింది. అయినా అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టినట్టు రెండేండ్ల క్రితమే పునః ప్రారంభమైన ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం పేరిట మాయ చేసేందుకే మోదీ వస్తున్నారు..’’ అని టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకునేందుకు మోదీ ఉత్సాహం చూపుతున్నారని ఎద్దేవా చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎర, మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు, ఇతర అంశాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య విమర్శల యుద్ధం సాగుతుండగా.. ఇప్పుడు మోదీ పర్యటన, ప్రోటోకాల్ రగడ మరింత ఆజ్యం పోసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాని టూర్కు కేసీఆర్ దూరమే! 2020 నవంబర్లో హైదరాబాద్లోని భారత్ బయోటెక్లో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ను ఆహ్వానించలేదు. దానితో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ప్రధాని కరోనా వ్యాక్సిన్లకు సంబంధించిన అధికారిక కార్యక్రమం కోసం హైదరాబాద్కు వచ్చి సీఎంను పిలవకపోవడం/సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని టీఆర్ఎస్ అప్పట్లోనే తీవ్రంగా మండిపడింది. ఆ తర్వాత ప్రధాని మోదీ పలుమార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చినా స్వాగత కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ►ఈ ఏడాది ఫిబ్రవరి 5న సమతామూర్తి విగ్రహావిష్కరణ, ఇక్రిశాట్ కార్యక్రమాలకు వచ్చిన ప్రధానిని ఆహ్వానించే బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు అప్పగించారు. కేసీఆర్ వెళ్లలేదు. ►ఈ ఏడాది మేలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవానికి మోదీ వచ్చినా కేసీఆర్ ఆహ్వానం పలకలేదు. ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. ►జూలై రెండున బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోదీ హైదరాబాద్కు రాగా కేసీఆర్ దూరంగా ఉన్నారు. అదే రోజున విపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ స్వయంగా ఎదురెళ్లి భారీ స్వాగతం పలికారు. ►ఇవేకాదు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన పలు వీడియో కాన్ఫరెన్స్ సమావేశాల్లో కూడా సీఎం హోదాలో కేసీఆర్ పాల్గొనలేదు. మంత్రులు, ఉన్నతాధికారులే హాజరయ్యారు. ►ఈ నేపథ్యంలో ఈ నెల 12న రామగుండంలో ప్రధాని మోదీ హాజరయ్యే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: ఫాంహౌస్ ఎపిసోడ్లో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఈ నెల 12న ప్రధాని మోదీ ప్రారంభించే రామగుండం ఎరువుల కర్మాగారం కార్యక్రమం ఆహ్వానంలో కనీస ప్రొటోకాల్ పాటించకుండా తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. pic.twitter.com/jYpX0GTT8q — TRS Party (@trspartyonline) November 8, 2022 అయ్యా ప్రధాని మోదీ గారు తెలంగాణకు ఉత్త చేతులతోనే వస్తారా.. ఏమైనా తెస్తారా? తెలంగాణకు చేసిన అన్యాయాలపై ఏం చెప్తారు? విభజన చట్టం హామీల అమలు సంగతేమిటి? నీతి ఆయోగ్ చెప్పిన నిధులు ఇచ్చేది ఎప్పుడు? అని నిగ్గదీసి అడుగుతున్నది తెలంగాణ సమాజం. pic.twitter.com/ZOBTjGDeUA — TRS Party (@trspartyonline) November 8, 2022 -
ఈ నెల 12న ప్రధాని మోదీ సభ దద్ధరిల్లాలి: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా రామగుండంలో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. భారీగా జనసమీకరణ చేసి మోదీ సభను విజయవంతం చేయాలని భావిస్తోంది. శనివారం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నేతలతో మోదీ పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్లపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ‘మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఈ సభకు పెద్దసంఖ్యలో రైతులను తరలించాలి. జన సమీకరణ, సభ విజయవంతానికి జిల్లాల నాయకులు సమన్వయంతో పనిచేయాలి. అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలివచ్చేలా ర్యాలీలు నిర్వహించాలి. ముఖ్యంగా రూ.6,120 కోట్ల వ్యయంతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించడంవల్ల రైతులకు కలిగే ప్రయోజాలను వివరించాలి’అని నాయకులకు ఆదేశించారు. మోదీ ప్రభుత్వం రైతు ప్రయోజనాల విషయంలో రాజీ పడటం లేదని ప్రజలకు చెప్పాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ.. ఆ భారం రైతులపై పడకూడదనే ఉద్దేశంతో ఏటా వేలాది కోట్లు ఖర్చు పెట్టి సబ్సిడీపై ఎరువులు అందిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు సోయం బాపూరావు, ఈటల రాజేందర్, జి.వివేక్, జి.విజయరామారావు, సుద్దాల దేవయ్య, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్, ఎస్.కుమార్, మనోహర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. మునుగోడులో గెలుస్తాం: బండి మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి విజయం సాధించడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ధీమా వ్యక్తంచేశారు. ఈ ఎన్నిక సందర్భంగా అధికార టీఆర్ఎస్ పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. ఒక ఉపఎన్నిక సీటు గెలిచేందుకు రూ.వేయి కోట్లకు పైగా ఖర్చు చేశారని, మద్యం ఏరులై పారించారని మండిపడ్డారు. 12న ప్రధాని మోదీ రామగుండం సభ ఏర్పాట్లపై శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మునుగోడు అంశం ప్రస్తావనకు రాగా సంజయ్ పై విధంగా స్పందించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, పోలీస్ కమిషనర్, జిల్లా ఎస్పీ టీఆర్ఎస్ తొత్తులుగా మారారని ఆరోపించారు. ‘ఏడేళ్లుగా ఒకే పోస్టింగ్లో ఉన్న పోలీస్ కమిషనర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తలా పనిచేశారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి కేసులు నమోదు చేశారు. ఇన్ని చేసినా ప్రజలు మనవైపే ఉన్నారు’అని సంజయ్ తెలిపారు. చదవండి: జాతీయ బరిలో బీఆర్ఎస్.. ‘ఫామ్హౌస్’ ఫైల్స్పై దేశవ్యాప్తంగా ప్రచారం -
పిల్లలను లాలిస్తూ పాడిన పాటే.. బాధను మరిపిస్తోంది!
బెల్లంపల్లి: ఆ ఖాకీ చొక్క హృదయంలో అంతులేని వేదన ఉంది. ఇద్దరు పిల్లలు దివ్యాంగులుగా జన్మించడం వేదనకు గురి చేసింది. ఆ వేదనను దిగమింగి పిల్లల సంతోషం కోసం పాడడం మొదలైంది. పాటలు వింటూ పిల్లలు వైకల్యాన్ని మరిచి ఆనందంతో కేరింతలు కొట్టేవారు. కొన్నేళ్లలోనే ఇద్దరు పిల్లలు దూరం కావడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆ బాధను మరిచిపోవడానికి పాటలు పాడుతూనే ఉన్నాడు. ఆ గాయకుడైన పోలీసు అధికారి రామగుండం పోలీసు కమిషనరేట్లోని బెల్లంపల్లి ఆర్మ్డ్ రిజర్వుడ్ ఏసీపీ చెరుకు మల్లికార్జున్. దివ్యాంగులుగా పిల్లలు.. మల్లికార్జున్, శ్యామల దంపతులకు 1996లో తొలి సంతానంగా సాహితీ దివ్యాంగురాలిగా జన్మించింది. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా పరిస్థితిలో మార్పు రాలేదు. మంచం, కుర్చీకి పరిమితమై ఉండేది. కొద్దిగా మాట్లాడడం తప్పా భూమిపై అడుగు కదిపేది కాదు. తల్లిదండ్రులు ఆమెకు సపర్యలు చేస్తూ అల్లారు ముద్దుగా చూసుకున్నారు. 2001లో రెండో సంతానంగా మగ బిడ్డ జన్మించాడు. విధి ఆ దంపతులకు పరీక్ష పెట్టింది. హర్షిత్ కూడా మానసిక, శారీరక వైకల్యంతో జన్మించడంతో మల్లికార్జున్ దంపతుల దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లల ఆనందం కోసం.. పిల్లలను లాలిస్తూ మల్లికార్జున్ ఓ పాట పాడారు. అంతే ఆ ఇద్దరు పిల్లల మోములో ఆనందం తొణికిసలాడింది. అప్పటి నుంచి మల్లికార్జున్ పదే పదే పాటలు పాడుతుండడంతో ఆ చిన్నారులు వైకల్యాన్ని మరిచి కేరింతలు కొట్టేవారు. వారి సంతోషం కోసం సినిమా పాటలు నేర్చుకుని ఆలపించేవాడు. ఆ తీరుగా ఏళ్లపాటు కొనసాగగా ఆ చిన్నారుల సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. 18 ఏళ్ల వయస్సులో హర్షిత్ 2019లో, కూతురు సాహితీ ఇరవై నాలుగేళ్ల వయస్సు వచ్చాక 2020లో దూరమయ్యారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. పిల్లల మరణంతో కుంగిపోయిన మల్లికార్జున్ను చూసిన తోటి సహోద్యోగులు ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ వేదనను మర్చిపోవడానికి అతడిలో అంతర్లీనంగా దాగి ఉన్న గాయకుడిని తట్టి లేపారు. గతాన్ని మర్చిపోవడానికి పాటలు పాడడం ప్రారంభించాడు. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఫ్లేస్టోర్ నుంచి స్టార్ మేకర్ యాప్లో పాటలు పాడి అప్లోడ్ చేశారు. శ్రోతల నుంచి స్పందన రావడంతో డ్యూయెట్ పాటలను మేల్వర్షన్లో పాడి అప్లోడ్ చేయడం ప్రారంభించారు. నచ్చిన ఫిమేల్ సింగర్ అతడి గొంతుతో జత కలపడం, నచ్చిన ఫిమేల్ వాయిస్కు మెయిల్ వర్షన్లో మల్లికార్జున్ శృతి కలిపి డ్యూయెట్ పాటలు పాడటం మొదలు పెట్టారు. అలా ఏకంగా 3,387 పాటలు పాడి ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు. చిన్నప్పటినుంచే పాటలపై ఆసక్తి కరీంనగర్కు చెందిన చెరుకు మల్లికార్జున్ 1996లో పోలీసు శాఖలో ఆర్ముడ్ రిజర్వుడ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేశారు. అంతకుముందు 1994–95లో మెడికల్ రిప్రజెంటిటివ్గా పని చేశారు. 1995లో శ్యామలతో వివాహం జరిగింది. మల్లికార్జున్ 2009లో ఇన్స్పెక్టర్గా, 2019లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఏడాదిన్నర కాలంగా బెల్లంపల్లి ఆర్ముడ్ రిజర్వుడు ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పటి నుంచే పాటలపై ఆసక్తి ఉండగా చదువుకునే రోజుల్లో కళాశాలలో, పోలీసు కార్యక్రమాల్లో పాటలు పాడేవారు. (క్లిక్ చేయండి: అన్నదాతల్లో చైతన్యం తీసుకొస్తున్న ప్రవాసీయులు) బాలు గాత్రం అంటే ఎంతో ఇష్టం పిల్లల జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రస్తుతం స్టార్ మేకర్ వేదిగా పాటలు పాడుతున్నాను. పిల్లల కోసం నేర్చుకున్న పాటలు ఆ ఇద్దరు మానుండి వెళ్లిపోయాక మర్చిపోవడానికి మళ్లీ పాడడాన్ని ఎంచుకున్నాను. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం అంటే ఎంతో ఇష్టం. తుది ఊపిరి ఆగిపోయే వరకు పాటలు పాడుతూనే ఉంటాను. – మల్లికార్జున్, సీఆర్ ఏసీపీ, బెల్లంపల్లి -
పాణం తీసిన బంగారు గొలుసు
రామగుండం: బంగారు గొలుసు దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. మాటామాటా పెరగడంతో ఆ గొడవలో భర్తను భార్య ఇటుకతో తలపై కొట్టి చంపేసింది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పీటీఎస్లో శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్కలపల్లి గేటు ప్రాంతానికి చెందిన చిలుముల సుమన్ (40), పొట్యాల గ్రామానికి చెందిన స్పందన దంపతులు రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన సర్వెంట్ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల స్పందన తన బంగారు గొలుసును సోదరుడికి ఇచ్చింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరగడంతో స్పందన ఇటుకతో సుమన్ తలపై బాదింది. దీంతో సుమన్ రక్తం మడుగులో పడి విగతజీవిగా మారాడు. -
కీలక ముందడుగు.. తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేపట్టిన మణుగూరు – రామగుండం రైల్వేలైను నిర్మాణంలో కీలక అడుగు పడింది. దీంతో రాబోయే బడ్జెట్లో ఈ లైనుకు నిధులు మంజూరు కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. చదవండి: కేసీఆర్ ఆదిపురుష్: ఆర్జీవీ సంచలన ట్వీట్ చాన్నాళ్లుగా.. బొగ్గు, విద్యుదుత్పత్తి కేంద్రాలుగా ఉన్న మణుగూరు, రామగుండం మధ్య కొత్తగా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని రెండు దశాబ్దాల కిందట లాలూప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా సర్వే నిర్వహించారు. ఆ తర్వాత కూడా అనేక మార్లు సర్వేలు జరిగాయి. ఇరవై ఏళ్లుగా సర్వేలు తప్ప లైన్ విషయంలో మరే పురోగతి కనిపించలేదు. భద్రాచలం రోడ్డు – కొవ్వూరు రైల్వే లైన్ తరహాలోనే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలకే పరిమితమవుతుందనే సందేహాలు నెలకొన్నాయి. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు కదలిక వచ్చింది భూసామర్థ్య పరీక్షలు ఇటీవల సరుకు రవాణాకు రైల్వే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. త్వరగా సరుకు రవాణా కోసం ప్రత్యేక ట్రాక్లను సైతం నిర్మిస్తోంది. దీంతో పాటు ట్రిపుల్ ఆర్(రివర్, రైల్, రోడ్డు) కాన్సెప్్టతో సరుకు రవాణాకు గల అవకాశాలను పరిశీలిస్తోంది. ఇటు మణుగూరు, అటు రామగుండం రెండు పట్టణాలు గోదావరి నదీ తీరంలో ఉన్నాయి. ఈ రెండు పట్టణాల మధ్య రోడ్డు మార్గం ఉంది. ఇప్పుడు అదనంగా రైలు మార్గం నిర్మాణంపై కేంద్రం దృష్టి సారించి, ఇప్పటికే సర్వే పూర్తయినందున రైలు మార్గం నిర్మాణానికి రెడీ అవుతోంది. అందులో భాగంగా రైలు మార్గం వెళ్లే ప్రాంతాల్లో భూసామర్థ్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ములుగు జిల్లాలో పలు ప్రాంతాల్లో మట్టి నమూనా పరీక్షలు జరుగుతున్నాయి. ప్రయోజనాలు ప్రస్తుతం రామగుండం – కాజీపేట – డోర్నకల్ – భద్రాచలంరోడ్డు – మణుగూరు మార్గం 291 కి.మీ. నిడివితో ఉంది. కొత్త మార్గం అందుబాటులోకి వస్తే దాదాపు వంద కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అదే విధంగా భూపాలపల్లిలో ఉన్న సింగరేణి బొగ్గుగనులు, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్లకు రైలుమార్గం అందుబాటులోకి వస్తుంది. న్యూఢిల్లీ – చెన్నై గ్రాండ్ట్రంక్ లైన్లో నాగ్పూర్ – విజయవాడ సెక్షన్లో కీలక ప్రత్యామ్నాయ మార్గంగా ఈ లైన్ నిలవనుంది. రైలు మార్గం ఇలా మణుగూరు – రామగుండం కొత్త మార్గానికి సంబంధించి రామగుండం దగ్గర ఉన్న రాఘవాపురం రైల్వే స్టేషన్ నుంచి ఈ లైన్ ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి మంథని – భూపాలపల్లి – మేడారం – తాడ్వాయి – కాటాపూర్ – గోపాలపురం – రామనుజపురం మీదుగా మణుగూరుకు చేరుకుంటుంది. మొత్తంగా రాఘవాపురం నుంచి మణుగూరు వరకు 197 కి.మీ నిడివితో ఈ మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. చివరి సారిగా చేసిన సర్వేలో ఈ లైన్ నిర్మాణానికి రూ. 3,000 కోట్లు ఖర్చు కావొచ్చని అంచనా వేశారు. -
పెద్దపల్లి జిల్లాలో మావోల కలకలం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో తిరిగి పట్టు సాధించేందుకు మావోయిస్టులు మళ్లీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మావోయిస్టు వారోత్సవాల్లో పాల్గొంటున్న తెలంగాణ మావోయిస్టు నేతల్లో కొందరు రాష్ట్రంలోకి వచ్చారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, యాక్షన్ కమిటీ సభ్యుడు మంగులు అలియాస్ పాండు ఆగస్టులో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు ధ్రువీకరించగా తాజాగా పెద్దపల్లి జిల్లాలోకి మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ అలియాస్ ధర్మన్న వచ్చి వెళ్లాడన్న వార్త పోలీసు శాఖలో చర్చానీయాంశంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి)లోని శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల.. కొందరు అనుచరులతో కలసి పెద్దపల్లి జిల్లా బసంత్నగర్, ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో పర్యటించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకుగల కారణాలపై ఆరా తీస్తున్నాయి. ఈ ప్రాంతంలోని పలువురు కాంట్రాక్టర్ల నుంచి రాజిరెడ్డి భారీగా నిధులు రాబట్టాడన్న వార్తల్లో నిజానిజాలను నిర్ధారించుకొనే పనిలో ఉన్నాయి. కొందరు అనుమానితులు, కొరియర్లపై నిఘా పెట్టాయి. కంకణాలతోపాటు ఆయనతోపాటు వచ్చిన యాక్షన్ టీం సభ్యులు కుంజం మనీశ్, చెన్నూరి శ్రీను అలియాస్ హరీశ్, కొవ్వాసి రాము, రోషన్, నందు అలియాస్ వికాస్ ఫొటోలతో కూడిన పోస్టర్ను రామగుండం కమిషనరేట్ పోలీసులు విడుదల చేశారు. వారి సమాచారం అందిస్తే రూ. 5 లక్షల నగదు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ‘రామగుండం’స్కాం నిందితుల హత్యకు రెక్కీ? 2020 అక్టోబర్లో ములుగు జిల్లాలోని ముసలమ్మ గుట్టలో మావోయిస్టు పార్టీలో కొత్తగా చేరిన పలువురు యువకులకు శిక్షణ ఇస్తున్న రాజిరెడ్డి బృందం.. కూంబింగ్ చేస్తున్న టీఎస్ఎస్పీ దళానికి ఎదురైంది. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో రాజిరెడ్డి తృటిలో తప్పించుకున్నారు. దాదాపు 24 నెలల విరామం తరువాత రాజిరెడ్డి రాష్ట్రానికి రావడం.. అందులోనూ ఆయనకు నిధులు సమకూరుతున్నాయన్న సమాచారంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం కొలువుల కుంభకోణంలో నిందితులను హతమార్చేందుకు కంకణాల బృందం రెక్కీ చేసినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల కూలీలు నివసించే కాలనీలపై నిఘా పెట్టినట్లు సమాచారం. -
ఆర్ఎఫ్సీఎల్ కథ కంచికేనా..? బాధితులకు డబ్బులు అందుతాయా!
సాక్షి, కరీంనగర్: రామగుండం ఫెర్టిలైజర్స్ కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో కోట్లు దండుకున్న నలుగురు దళారులను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు డబ్బులు అందుతాయా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బాధితులతో రెండురోజులపాటు మాట్లాడి భరోసా కల్పించారు. కర్మాగారంలో శాశ్వత ఉద్యోగాల పేరుతో సుమారు రూ.45 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసిన దళారులు.. బాధితుల వద్ద ఎలాంటి పత్రాలూ లేకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం నోటిమాట ఆధారంగానే బాధితులు రూ.లక్షలు దళారుల చేతిలో పోశారు. దీంతో కార్మికుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో కొందరు “మీకు ఉద్యోగం కల్పించాం.. డబ్బులిచ్చేది లేదు..’ అని బాధితులతో గొడవకు దిగుతున్న సందర్భాలూ ఉన్నాయి. వారం క్రితం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దళారిపై పెట్రోల్ పోసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. తాజాగా శుక్రవారం ముంజ హరీశ్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు దళారులుగా ఉన్న నలుగురుపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. చదవండి: కు.ని.ఆపరేషన్తో నలుగురు మృతి.. ఇంతకూ ట్యూబెక్టమీ అంటే ఏంటి? దళారులు ఎంతమంది..? ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగ నియామకంలో ఎంతమంది దళారులు, మధ్యవర్తులు ఉన్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. కొత్త కాంట్రాక్టర్ కార్మికులను తొలగించడంతో మోసపోయామని గ్రహించిన కార్మికులు ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రమేయం ఉండడంతో అధికారులు చర్యలు చేపట్టడంలో జాప్యం చేశారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. పర్మినెంట్ హమాలి పేరుతో నగదు దండుకున్న కార్మిక సంఘం నాయకుడిపై ఇప్పటివరకూ కేసు నమోదు కాలేదు. వీరితోపాటు మరికొందరు అధికార, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ప్రచారం జపరుగుతోంది. ఎవరు చెల్లిస్తారు..? బాధితులకు ఇప్పుడు నగదు ఎవరు చెల్లిస్తారనే వ్యవహారంలో స్పష్టత లేకుండా పోయింది. రెండు రోజులుగా కోరుకంటి చందర్ తన క్యాంపు కార్యాలయంలో బాధితులతో సమావేశం నిర్వహించారు. ప్రధాన దళారులు అధికార పార్టీ నాయకులు కావడంతో బాధితులకు నగదు చెల్లించేలా కృషి చేస్తారో లేదో.. వేచి చూడాల్సి ఉంది. -
ఆందోళనలతో అట్టుడుకుతున్న రామగుండం
-
రామగుండం ఎన్టీపీసీ వద్ద ఉద్రిక్తత
జ్యోతినగర్ (రామగుండం): పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ రామగుండం కర్మాగారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 2018 నాటి ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం గేట్ సమావేశం నిర్వహించారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంస్థ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఒక దశలో కార్మికులు ప్లాంట్ గేట్పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో 30 మందికిపైగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది లాఠీచార్జి చేసి దాడిచేశారని కార్మికు లు ఎన్టీపీసీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే చందర్ సీఐఎస్ఎఫ్ లాఠీచార్జిలో గాయపడిన కాంట్రాక్టు కార్మికులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిలకుపై లాఠీచార్జి చేయడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మహమూద్ ఆలీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని వెల్లడించార. -
పెంచి, పెళ్లి చేసుకొని.. హతమార్చాడు
చిన్నతనంలో అమ్మానాన్నను కోల్పోయిన ఆ అభాగ్యురాలు.. అమ్మమ్మ ఇంట్లో పెరిగింది. అన్నీ తానై పెంచిన మేనమామను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించసాగింది. కానీ, ఆ సంసారాన్ని.. అనుమానం అనే పెనుభూతం ఆవహించింది. చివరికి.. కంటికి రెప్పలా కాపాడి కట్టుకున్నవాడే ఆమెను దారుణంగా హత్య చేశాడు. సాక్షి, పాలకుర్తి(రామగుండం): చిన్నతనంలోనే అమ్మానాన్నను కోల్పోయిన ఆ అభాగ్యురాలు అమ్మమ్మ ఇంట్లో పెరిగింది. తనను పెంచిన మేనమామలలో ఒకరిని పెళ్లి చేసుకుంది. ఆనందంగా సాగుతున్న వారి సంసార జీవితాన్ని అనుమానం అనే పెనుభూతం ఆవహించింది. చివరికి కట్టుకున్నవాడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. బసంత్నగర్ పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలంలోని ఎల్కలపల్లి గ్రామానికి చెందిన పల్లె బాపు అనే వ్యక్తికి క్రాంతి, విమల్ సంతానం. 25 ఏళ్ల క్రితం బాపుతోపాటు అతని భార్య మృతిచెందారు. దీంతో క్రాంతి, విమల్లను వారి అమ్మమ్మ అయిన రాణాపూర్ గ్రామానికి చెందిన కొల్లూరి జక్కమ్మ చేరదీసింది. తన ఇద్దరు కుమారులైన అశోక్, అజయ్ల సహకారంతో పెంచి పెద్దచేసింది. తాగుడుకు బానిసై.. డిగ్రీ వరకు చదివించిన అనంతరం తన చిన్న కుమారుడైన అజయ్తో 2015లో క్రాంతికి వివాహం జరిపించింది. అజయ్ లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ దంపతులకు నాలుగేళ్ల బాబు, రెండేళ్ల పాప ఉన్నారు. మద్యానికి బానిసై తరచూ గొడవ.. ఇప్పటిదాకా సజావుగా సాగిన క్రాంతి–అజయ్ల సంసారంలో ఇటీవల కలహాలు చోటుచేసుకున్నాయి. భార్యపై అనుమానంతో మద్యానికి బానిసైన అజయ్ తరచూ ఆమెతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రికుడైన అజయ్ రాడ్డుతో క్రాంతి తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై, అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో బసంత్నగర్ ఎస్సైలు మహేందర్యాదవ్, శివానిరెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అలువాల మారుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా నిందితుడు అజయ్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఇదీ చదవండి: కాలేజ్ వద్ద డ్రాప్ చేస్తానని నమ్మించి.. కొంచెం దూరం వెళ్లాక.. -
అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అందుబాటులోకి..
గోదావరిఖని/కందుకూరు: దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్(నీటిపై తేలియాడే) సోలార్ ప్లాంట్ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 ఎకరాల్లో రూ.423 కోట్లతో ఈ ప్లాంట్ను నెలకొల్పారు. అనంతరం జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ సందర్భంగా అధికారులు రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని కాకతీయ ఫంక్షన్హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పెద్ద డిజిటల్ డిస్ప్లే ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రారంభించిన అనంతరం ఎన్టీపీసీ సీజీఎం సునీల్ మాట్లాడుతూ ఈ ప్లాంట్ను దశలవారీగా విస్తరించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ ఆవరణలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టు స్టేజీ–1లో రెండు యూనిట్ల పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. సెప్టెంబర్ రెండోవారంలో ట్రయల్కు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. భారత్ అగ్రగామిగా నిలవాలి: కిషన్రెడ్డి. విద్యుత్ సంస్కరణలతో రానున్న 25 ఏళ్లల్లో విద్యుత్ ఉత్పాదనలో ప్రపంచ దేశాల్లోనే మనదేశం అగ్రగామిగా నిలిచేలా ప్రధాని మోదీ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య పవర్ 2047 పేరుతో పీఎం మోదీ, కేంద్ర విద్యుత్ మంత్రి రాజ్కుమార్సింగ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మండల పరిషత్ సమావేశ మందిరం నుంచి కిషన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్కు 40 శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు. బోరుబావులకు ఎలాంటి మీటర్లు పెట్టడం లేదని, అయినా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న చర్యల కారణంగా రైతులకు యూరియా బాధలు తప్పాయని చెప్పారు. కార్యక్రమంలో పవర్గ్రిడ్ ఈడీ రాజేశ్ శ్రీవాత్సవ, సీనియర్ జీఎంలు హరినారాయణ, జీవీ రావు, పీవీఎస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ ప్లాంట్
-
పెద్దపల్లి: రామగుండంలో నీటిపై తేలియాడే సోలార్ ప్రాజెక్ట్
-
30న ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ జాతికి అంకితం
జ్యోతినగర్ (రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు వద్ద రిజర్వాయర్లో నిర్మించిన 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఈనెల 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యావరణానికి అనుకూలంగా రూ.423 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ను నిర్మించారు. ప్రాజెక్టు రిజర్వాయర్లో దాదాపు 500 ఎకరాలలో దీనిని ఏర్పాటు చేశారు. ఒక్కోటి 2.5 మెగావాట్ల చొప్పున 40 బ్లాకులుగా ఈ ప్లాంట్ను విభజించారు. ఈ ప్లాంట్ వల్ల ఏడాదికి సుమారు 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి ఆవిరిని నివారించవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. కాగా, వర్చవల్ పద్ధతిలో ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నందున అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. -
దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: రామగుండం (ఎన్టీపీసీ)లో ఏర్పాటు చేసిన భారతదేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్) సౌర విద్యుత్ ప్లాంట్ శుక్రవారం నుంచి పూర్తి సామర్థ్యంతో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటికే 80 మెగావాట్ల మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నారు. తాజాగా మిగిలిన 20 మెగావాట్ల పనులను కూడా పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభించారు. ఇక్కడి థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేసే జలాశయం (500 ఎకరాల విస్తీర్ణం)పై రూ.423 కోట్ల వ్యయంతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. సాధారణంగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా భూమి అవసరం అవుతుంది. ఫ్లోటింగ్ ప్లాంట్ల ఏర్పాటుతో పెద్ద మొత్తంలో భూసేకరణ ఖర్చు తగ్గుతుంది. అలలపై తేలియాడుతూ.. ఫ్లోటింగ్ ప్లాంట్ అంటే.. ఫోటో వోల్టాయిక్ సోలార్ ప్యానెల్స్ (సౌర ఫలకాలు) మాత్రమే కాదు.. ఇన్వర్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, హెచ్టీ బ్రేకర్లు, స్కాడా వంటి పరికరాలతో ఏర్పాటైన మొత్తం సౌర విద్యుదుత్పత్తి వ్యవస్థ అంతా నీటిపైనే తేలియాడుతూ ఉంటుంది. హైడెన్సిటీ పాలిథిలీన్ మెటీరియల్తో తయారైన ఫ్లోటర్స్పై సోలార్ ప్యానెల్స్ను బిగించారు. ఒక్కొక్కటి 2.5 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 40 బ్లాకులుగా (తేలియాడే వేదికలు) విభజించి దీన్ని నిర్మించారు. ప్రతి తేలియాడే వేదిక (ఫెర్రో సిమెంట్ ఫ్లోటింగ్ ప్లాట్ఫార్మ్)పై 11,200 సోలార్ ప్యానెల్స్తో పాటు ఒక ఇన్వర్టర్, ట్రాన్స్ఫార్మర్, హెచ్టీ బ్రేకర్ ఉంటాయి. మొత్తం వ్యవస్థ నీటిపై తేలియాడుతూ ఒకేచోట ఉండేలా రిజర్వాయర్ అడుగున ఉన్న కాంక్రీట్ బ్లాకులకు లంగరు వేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ను 33 కేవీ అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా దగ్గర్లోని స్విచ్యార్డ్కు సరఫరా చేస్తారు. ప్రయోజనాలెన్నో.. ►భారీ భూసేకరణ ఖర్చు తగ్గడంతో పాటు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అన్ని రకాలుగా పర్యావరణ అనుకూలతను కలిగి ఉంటుంది. ►జలాశయంపై సౌర విద్యుత్ వ్యవస్థకు సంబం ధిం చిన బ్లాకులు తేలియాడుతూ ఉండడంతో జలాశ యంలో నీటి ఆవిరి నష్టాలు తగ్గుతాయి. అంటే ఇది జల సంరక్షణకు దోహదపడుతుందన్న మాట. ఏటా 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి ఆవిరి నష్టాలను నివారించవచ్చని ఎన్టీపీసీ అంచనా వేసింది. ►సోలార్ ప్యానెల్స్ కింద నీళ్లు ఉండడంతో వాటి పరిసరాల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి. దీంతో వాటి పని సామర్థ్యంతో పాటు ఉత్పాదకత పెరుగుతుంది. ►థర్మల్ విద్యుత్కు ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయనుండడంతో ఏటా 1.65 లక్ష టన్నుల బొగ్గు వినియోగాన్ని, 2.1 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించవచ్చు. దక్షిణాదిలో 217 మె.వా. ఫ్లోటింగ్ పవర్ రామగుండంలో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో దక్షిణాదిలో తమ ఫ్లోటింగ్ ప్లాంట్ల సామర్థ్యం 217 మెగావాట్లకు పెరిగిందని ఎన్టీపీసీ ప్రాంతీయ సంచాలకులు (దక్షిణ) నరేష్ ఆనంద్ వెల్లడించారు. కాయంకులం (కేరళ)లో 92 మెగావాట్లు, సింహాద్రి (ఏపీ)లో 25 మెగావాట్ల ఫ్లోటింగ్ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. -
అగ్ని‘గుండం’.. రామగుండంలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మంగళవారం మండిపోయింది. అత్యధికంగా రామగుండంలో 44.8డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్లో 43.8డిగ్రీలు నమోదైంది. ఇతర ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణల మీదుగా రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాగల మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
రామగుండంలో 3.74 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి
ఫెర్టిలైజర్సిటీ(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్)లో 2021–22 సంవత్సరం 3,74,728.32 టన్ను ల యూరియా ఉత్పత్తి అయిందని ఆ కర్మాగారం సీజీఎం విజయ్కుమార్ బంగార్ మంగళవారం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన ఈ కర్మాగారం వాణిజ్య ఉత్పత్తులు ప్రారంభించి ఏడాది పూర్తయింది. దేశీయంగా ఎరువుల కొరత తీర్చడమే ఆర్ఎఫ్సీఎల్ ఉద్దేశం. ఈ ప్లాంట్లో ప్రతిరోజూ 2,200 టన్నుల అమ్మో నియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. కర్మాగారం వాణిజ్య ఉత్పత్తుల్లో తెలంగాణకు 2,11,073.13, ఆంధ్రప్రదేశ్కు 1,00,321.11, కర్ణాటకకు 63,334.08 టన్నుల యూరియా సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఎరువుల కొరత తగ్గించేందుకు దేశవ్యాప్తంగా మూతపడిన ఎరువుల కర్మాగారాలను కేంద్రం పునరుద్ధరించిందని, వాటిల్లో ఆర్ఎఫ్సీఎల్ (నాటి ఎఫ్సీఐ) కూడా ఒకటని తెలిపారు. -
జూన్ నాటికి రామగుండం వైద్య కళాశాల
సాక్షి, హైదరాబాద్: గోదావరిఖనిలో నిర్మిస్తున్న రామగుండం వైద్య కళాశాల జూన్ నాటికి మొదటి సంవత్సరం విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కొత్తగా ప్రభుత్వం నిర్మిస్తున్న 8 వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు గురువారం మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కొత్తగా 8 జిల్లాల్లో వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం వీటి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల మేరకు నిర్మాణాలు ఉండాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు వైద్య కళాశాలలు ఏప్రిల్లోనే పూర్తవుతాయన్నారు. ఫస్టియర్ విద్యార్థుల కోసం భవన నిర్మాణాలు పూర్తైన చోట మెడికల్ కాలేజీ నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను టీఎస్ఎండీసీ అ«ధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈఎన్సీ గణపతి రెడ్డిని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బి కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతి రెడ్డి, సీఈ సతీశ్ పలువురు అధికారులు పాల్గొన్నారు. -
సింగరేణిలో వరుస ప్రమాదాలు..
-
ఆ ముగ్గురూ ఎక్కడ?
సాక్షి, పెద్దపల్లి/రామగిరి/గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి పరిధిలోని ఏపీఏ అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో జరిగిన ప్రమాదం నుంచి మంగళవారం ఓ కార్మికుడిని రెస్క్యూ టీం రక్షించింది. గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ప్రమాదం జరిగి 40 గంటలవుతున్నా వారి జాడ తెలియకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఏఎల్పీ బొగ్గుగనిలో 86వ లెవల్ వద్ద రూఫ్ బోల్డ్ పనులు చేస్తుండగా సోమవారం ప్రమాదం జరిగింది. ఏరియా సేఫ్టీ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్సహా మరో ఐదుగురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా ముగ్గురిని సోమవారమే బయటకు తీసుకొచ్చారు. రవీందర్ను రెస్క్యూ టీం మంగళవారం కాపాడింది. శిథిలాల కింద చిక్కుకున్న తేజ, జయరాజ్, శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు. 40 గంటలుగా నీరు, ఆహారం లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందోనని కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. బొగ్గుపెళ్లలను తొలగించడానికి చాలా సమయం పడుతోంది. గల్లంతైన వారి ఆచూ కీ బుధవారం ఉదయం కల్లా తెలియొచ్చని భావిస్తున్నారు. 4 షిఫ్టులుగా వీడిపోయి షిఫ్టుకు 100 మంది గాలింపు చేపట్టారు. ఫ్రంట్ బకెట్ లోడర్ (ఎఫ్బీఎల్) ఆపరేటర్ జాడి వెంకటేశ్, ఓవర్మేన్ పిల్లి నరేశ్, బదిలీ కార్మికుడు రవీందర్, సపోర్టుమేన్ ఎరుకల వీరయ్య ప్రమాదం నుంచి బయటపడ్డారు. బొగ్గు పెళ్లల సందులోంచి పాక్కుంటూ బయటపడ్డానని ఆయన అన్నారు. యంత్రంతో పనిచేస్తుండగా బొగ్గుపెళ్ల కూలి చీకటైందని, రెస్క్యూ సిబ్బంది అరుపులు విని యంత్రం హారన్ మోగించడంతో తనను బయటకు తీశారని జాడి వెంకటేశ్ చెప్పారు. కాళ్లు బొగ్గుపెళ్లల్లో చిక్కుకొని గాయాలయ్యాయని, నడుం పైభాగంలో దెబ్బలు లేకపోవడంతో బతకగలిగానని రవీందర్ అన్నారు. కనీస సమాచారం ఇవ్వలేదు గని ప్రమాదంలో చిక్కుకున్న డిప్యూటీ మేనేజర్ చైతన్యతేజ పరిస్థితిపై యాజమాన్యం మాకు సమాచారం ఇవ్వ లేదు. ఓ ఉద్యోగి ప్రమాదంలో చిక్కుకుంటే కుటుంబీకులకు సమాచారం ఇవ్వరా? తేజ ఇంటి పక్కన ఉండేవాళ్లు ఫోన్ చేస్తే వచ్చాం. – చైతన్య తేజ తండ్రి సీతారాములు, మామ వెంకటేశ్వర్లు ట్రైనింగ్ అయిపోతుందన్నాడు ట్రైనింగ్ ఈ రోజుతో అయిపోతుందని సోమవారం చెప్పి గనిలోకి వచ్చాడు. గని ప్రమాదంలో చిక్కుకున్నాడని టీవీలో వార్తలు చూసి ఇక్కడికి వచ్చాను. అన్నయ్య పరిస్థితిపై ఎవరిని అడిగినా చెప్పడం లేదు. రెండురోజులుగా ఇక్కడే పడిగాపులు కాస్తూ ఎదురుచూస్తున్నాం. సహాయకచర్యలు ముమ్మరంగా చేపట్టి అన్నయ్యను త్వరగా బయటకు తీసుకురావాలి. –వీటీసీ ట్రైనీ తోట శ్రీకాంత్ సోదరుడు రాకేశ్ గనిలో రెస్క్యూ బృందం సహాయక చర్యలు -
భూతగాదాలకు దంపతులు బలి
పాలకుర్తి(రామగుండం): భూతగాదాలు దంపతుల హత్యకు దారితీశాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లికి చెందిన మంచినీళ్ల వెంకటి (55), తమ్ముడు రాజయ్య మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో రాజయ్య కుమారుడు రవితేజ గురువారం పొలం వద్దకు వెళ్లి బావి నీటి విషయమై వెంకటితో ఘర్షణ పడ్డాడు. గొడ్డలితో దాడి చేయడంతో ప్రాణాలొదిలిన వెంకటిని లాక్కెళ్లి సమీపంలోని పొదల్లో పడేశాడు. పొలంలో కలుపుతీస్తున్న వెంకటి భార్య కనకమ్మ గమనించి పరుగెత్తుకుంటూ వస్తుండగా ఆమెపైనా గొడ్డలితో దాడి చేశాడు. దీంతో కనకమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. అనంతరం నిందితుడు బసంత్నగర్ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. మృతిచెందిన వెంకటి దంపతులకు కూతురు రాధ, కుమారుడు రమేష్ ఉన్నారు. రాధకు వివాహం కాగా, రమేష్ కరీంనగర్లోచదువుకుంటున్నాడు. వెంకటి గతంలో గ్రామ ఎంపీటీసీగా పనిచేశారు. పంపకాల్లో తేడాలతోనే... వెంకటి, రాజయ్యల వారసత్వ భూమిలో ఇదివరకు సబ్సిడీ బావిని తవ్వారు. భూపంపకాల అనంతరం ఆ బావిలో రాజయ్యకు వాటా లేదని వెంకటి అనడంతో వివాదం మొదలైంది. ఆరేళ్లుగా ఇరువురి మధ్య వ్యవసాయబావి, భూముల విషయమై తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వివాదం పోలీసుస్టేషన్ వరకు వెళ్లినా అది సివిల్ సమస్య కావడంలో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే రవితేజ పథకం ప్రకారం పెద్ద నాన్న, పెద్దమ్మను గొడ్డలితో నరికి చంపాడని గ్రామస్థులు భావిస్తున్నారు. కాగా, ఐదేళ్ల క్రితం ఆస్తి తగాదాల నేపథ్యంలో గ్రామానికి చెందిన కొండ గట్టయ్య దంపతులను వారి కుమారులు కల్లుగీత కత్తితో గొంతులు కోసి హత్య చేశారు. ప్రస్తుతం అదేరీతిన భూవివాదాల నేపథ్యంలో సొంత పెద్దమ్మ, పెద్దనాన్నను కుమారుడి వరసైన యువకుడు గొడ్డలితో హత్య చేసి చంపాడు. -
రామగుండం వైద్యకళాశాలకు రూ.500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రామగుండంలో వైద్యకళాశాల ఏర్పాటుకు సింగరేణి బొగ్గుగనుల సంస్థ రూ.500 కోట్లు మంజూరు చేసింది. ఈనెల 10న జరిగిన సంస్థ బోర్డు సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకోగా, తాజాగా సోమవారం కొత్తగూడెంలో జరిగిన సంస్థ 100వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదముద్ర వేసింది. రామగుండంలో వైద్యకళాశాల ఏర్పాటు చేసి స్థానికులు, కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తెస్తామని రెండేళ్ల కింద శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన సింగరేణీయుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. తాజా నిర్ణయంతో సీఎం హామీ మేరకు వైద్య కళాశా ల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇటీవల జరిగిన ఓ సమీక్షలో వైద్యకళాశాల ఏర్పాటుకు రూ. 500 కోట్లు కేటాయించాలని సీఎం సూచిం చగా, ఆ మేరకు చర్యలు తీసుకున్నట్టు సింగరేణి యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్ వంటి నగరాల్లో లభించే అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యవిభాగాలను రామగుం డంలో అందుబాటులోకి తీసుకువస్తున్నా మని వెల్లడించింది. సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబాలతోపాటు పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల ప్రజల కు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండేళ్లలో వైద్య కళాశాల, ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయాల ని నిర్ణయించారు. ఈ ప్రాంత విద్యార్థులకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులో ఉండాలన్న కార్మికుల, స్థానికుల చిరకాల కోరిక మరో రెండేళ్లలో సాకారం కానుందని సంస్థ తెలిపింది. ఈ నిర్ణయం తీసుకున్నం దుకు గాను సీఎం కేసీఆర్కు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. -
కుట్ల నొప్పి తట్టుకోలేని తల్లి.. ఉరినే భరించింది!
కోల్సిటీ (రామగుండం): పెళ్లయిన 11 ఏళ్లకు గర్భం దాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. సిజేరియనైనా కొడుకు పుట్టాడన్న ఆనందంలో నొప్పిని భరించింది. వారమైనా కుట్లు సరిగ్గా అతుక్కోకపోవడంతో ప్రసూతి వార్డులోనే ఉండాల్సి వచ్చింది. రెండుసార్లు కుట్లేసినా అతుక్కోకపోవడం, ఇన్ఫెక్షన్ తగ్గకపోవడం, మూడోసారి కుట్లేస్తామని వైద్యులు చెప్పడంతో హడలిపోయింది. ఓ పక్క నొప్పి.. మరోపక్క వైద్యుల నిర్లక్ష్యంతో మనోవేదన చెంది ఆదివారం వేకువజామున ప్రసూతి వార్డులోని బాత్రూమ్లో చున్నీతో ఉరేసుకుంది. వెంటనే గమనించి ఉరి నుంచి తప్పించిన కుటుంబీకులు వైద్యులకు సమాచారమిచ్చినా పట్టించుకోకపోవడంతో కళ్లముందే చనిపోయింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నొప్పితో తల్లడిల్లి.. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి ఉమ (29)ను ప్రసవం కోసం ఈ నెల 11న గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో మర్నాటి రాత్రి ఉమకు సిజేరియన్చేసి వైద్యులు మగబిడ్డకు పురుడు పోశారు. ఉమతో పాటు శిశువును ప్రసూతి వార్డుకు తరలించారు. ఉమ (ఫైల్) సిజేరియన్ చేసిన వైద్యులు కుట్లు సరిగా వేయలేదో ఏమోగాని అవి అతుక్కోలేదు. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చింది. 18న వైద్యులు రెండోసా రి కుట్లేశారు. అయినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. శనివారం పరిశీలించిన వైద్యులు మరోసారి కుట్లు వేయాల్సి వస్తుందన్నారు. అప్పటికే కుట్లు వేసిన ప్రాంతంలో నొప్పిగా ఉందని తల్లడిల్లిందని ఉమ తల్లి రాజేశ్వరి, అత్త మల్లమ్మ, ఆడబిడ్డ స్వప్న తెలిపారు. వేకువజామున ఉరేసుకొని.. బిడ్డను తన అత్త మల్లమ్మ వద్ద పడుకోబెట్టిన ఉమ.. ఆదివారం వేకువజామున 4.50 సమయంలో బాత్రూమ్కు వెళ్లింది. ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానంతో అత్త, ఆడపడుచు వెళ్లిచూడగా షవర్కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఉరి నుంచి తప్పించి బెడ్పైకి తరలించారు. విషయం ఆస్పత్రి సిబ్బందికి తెలిపినా ఎవరూ పట్టించుకోలేదని, అరగంటైనా వైద్యులు రాకపోవడంతో చనిపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందించి చికిత్స చేస్తే ప్రాణాలు దక్కేవని.. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఉమ తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు. బాలింత మృతికి ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే కారణమని, వాళ్ల నిర్లక్ష్యంతోనే ఇన్ఫెక్షన్ సోకిందని కుటుంబీకులు ఆందోళనకు దిగారు. డీసీహెచ్ఎస్ విచారణ ఉమ మృతిపై డీసీహెచ్ఎస్ డాక్టర్ వాసుదేవరెడ్డి ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. ఉమకు సిజేరియన్ చేసిన డాక్టర్, శనివారం రాత్రి డ్యూటీలోని డాక్టర్, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు యత్నించిందని తెలిసిన తర్వాత సిబ్బంది ఎప్పటిలోగా వెళ్లారు వంటి వివరాలను నమోదు చేసుకున్నారు. మృతురాలి భర్త సంజీవ్తో మాట్లాడారు. నివేదికను కలెక్టర్కు సమర్పిస్తామని డీసీహెచ్ఎస్ తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు వైద్యుల నిర్లక్ష్యం లేదు. డీసీహెచ్ఎస్ దర్యాప్తు చేస్తున్నారు. కొందరిలో కుట్లు మానకపోవడమనేది జరుగుతుంది. – డాక్టర్ భీష్మ, ఆర్ఎంవో నా బిడ్డను పొట్టనబెట్టుకున్నారు రెండుసార్లు కుట్లేసినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. మూడోసారి కుట్లు వేస్తామని డాక్టర్లు చెప్పారు. శనివారం రెండు గంటలు లేబర్ రూంలో డ్రెస్సింగ్ చేసి నరకం చూపించారు. లేబర్ రూం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మంట, నొప్పి అంటూ తల్లడిల్లిపోయింది. ప్రైవేట్కు తీసుకుపోవాలనుకున్నాం. ఇంతలోనే ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. – రాజేశ్వరి, మృతురాలి తల్లి -
‘కొడుకా.. ఎంత పనాయె.. నీ పిల్లలకు దిక్కెవరు బిడ్డా’
సాక్షి,రామగుండం( కరీంనగర్): ‘కొడుకా.. ఎంత పనాయె.. ప్రమాదంలో నేను చనిపోయినా బాగుండేది.. ఇప్పుడు నీ పిల్లలకు దిక్కెవరు బిడ్డా.. ’ అంటూ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి రోదన. అన్నా.. రోజు ఇద్దరం కలిసే పనికివెళ్లేవాళ్లం.. ఇప్పుడు నాకు తోడెవరు వస్తారు..’ అంటూ తమ్ముడి ఏడుపులు. ‘బిడ్డా.. అందరం సంతోషంగా ఉంటామని అనుకున్నం. ఇప్పుడు లోకాన్ని విడిచి వెళ్లావు.. ఇద్దరి పిల్లల బాగోగులు చూసుకునేదెవరు..’ అంటూ మృతురాలి తల్లిదండ్రులు కంటతడి. ఇది సోమవారం రాత్రి గంగానగర్ బ్రిడ్జి వద్ద బూడిద లారీ ఆటోపై బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయిన వారి ఇంటి వద్ద పరిస్థితి. ఏం జరిగిందో తెలియక.. కాలు ఎముక విరిగి మంచంపైనే బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న రెండేళ్ల చిన్నారి షాదియాను ఎలా ఓదార్చాలో అక్కడున్న వారితరం కాలేదు. బిక్కముఖంతో ఒకరు.. అతడి ఒడిలో కూర్చుని ఉన్న నాలుగేళ్ల షేక్ షాకీర్.. ఈ హృదయ విదారక ఘటన ముబారక్నగర్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ముబారక్నగర్కు చెందిన షేక్ హుస్సేన్కు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు షేక్ షకీల్ రామగుండం రైల్వేస్టేషన్ ఏరియాలో ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తుండేవాడు. షకీల్కు భార్య రేష్మ, కుమారుడు షేక్ షాకీర్, కూతుళ్లు షాదియా, తరున్నుం ఫాతిమా సంతానం. హుస్సేన్ సోదరి కూతురుకు వివాహం కాగా.. మంచిర్యాల జిల్లా ఇందారంలోని ఓ ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ జరుగుతోంది. ఆ కార్యక్రమానికి షేక్ షకీల్ భార్యాపిల్లలతోపాటు తండ్రి హుస్సేన్, సోదరుడు షేక్ తాజ్తో కలిసి ఆటోలో సోమవారం రాత్రి బయల్దేరారు. వీరి ఆటో గంగానగర్ వద్ద గల బ్రిడ్జి వద్దకు చేరుకోగానే.. బొగ్గు లోడ్తో వెళ్తున్న ఓ లారీని.. బూడిద లోడ్తో వస్తున్న మరో లారీ ఢీకొంది. అనంతరం బూడిద లోడ్తో వస్తున్న లారీ వీరి ఆటోపై పడింది. ఈ ఘటనలో షేక్ షకీల్ (28), ఆయన భార్య రేష్మ (22), కూతురు తరున్నుమ్ ఫాతిమా (ఏడు నెలలు) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. షకీల్ తండ్రి షేక్ హుస్సేన్, సోదరుడు తాజ్, కుమారుడు షాకీర్, కూతురు సాదియా, ఆటో డ్రైవర్ రహీంబేగ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృతదేహాలను అదేరాత్రి గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మంగళవారం ఉదయం పోస్టుమార్టం పూర్తిచేసి వారి బంధువులకు అప్పగించారు. మృతదేహాలను ఇంటికి తీసుకురావడంతో బంధువులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. షకీల్ మంచితనాన్ని తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబానికి అన్నీతానై చూసుకుంటున్నాడని, ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరని బంధువులు రోదించారు. ఆనందంగా బయల్దేరి.. వెల్డింగ్ పనిచేసే షకీల్ శుభకార్యానికి వెళ్లాలని సోమవారం మధ్యాహ్నం వరకు సంతోషంగా ఉ న్నాడని తోటికార్మికులు గుర్తు చేశారు. విధులు ముగించుకుని ఇంటికి చేరిన ఆయన.. సాయంత్రం తన ఇద్దరు పిల్లలకు హెయిర్ సెలూన్లో కటింగ్ చేయించాడని స్థానికులు తెలిపారు. ఎంతో ఆనందంగా కుటుంబసమేతంగా వివాహానికి బయలుదేరిన గంటలోపే మృత్యువాత పడడం ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. షకీల్ మంచితనం, ఓపిక, మర్యాదను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనాథలైన చిన్నారులు ప్రమాదంలో భార్యాభర్తలు షేక్ షకీల్, రేష్మ చనిపోవడంతో వారి కుమారుడు షాకీర్, కూతురు షాదియా అనాథలుగా మారారు. వారిని చూసిన ప్రతిఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు. దహనసంస్కారానికి ముబారక్నగర్కాలనీ వాసులు వందలాదిగా తరలివచ్చారు. పరిహారం కోసం రాస్తారోకో గోదావరిఖని: సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారి బంధువులు రాజీవ్రహదారిపై మృతదేహాలతో రాస్తారోకో చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ యజమాని స్పందించకపోవడంతో మంచిర్యాలలో ఉంటున్న అతడి ఇంటికి వెళ్లేందుకు బయల్దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గంగానగర్ ఫ్లైౖఓవర్వద్ద ధర్నా చేపట్టారు. అయినా లారీ యజమాని అందుబాటులోకి రాలేదు. ఆందోళన తీవ్రం చేయడంతో రూ.2.5లక్షలు ఇచ్చేందుకు యజమానికి అంగీకరించడంతో శాంతించారు. పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, వన్టౌన్ సీఐ రమేష్బాబు, టూటౌన్ సీఐ శ్రీనివాస్రావు బందోబస్తు చేపట్టారు. చదవండి: Covid Vaccine: వద్దన్నా వినలేదు.. బలవంతంగా వ్యాక్సిన్ వేశారు.. గంట తర్వాత.. -
అందరూ చూస్తుండగానే..
రామగుండం: అది పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ ప్లాట్ఫాం.. ప్రయాణికులు ప్లాట్ఫాంపై ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి ప్లాట్ఫాంపై నుంచి రైలుపట్టాలపైకి దూకాడు. ప్రయాణికులందరూ వద్దని వారి స్తున్నారు.. అంతలోనే బెంగళూరు వైపు వెళ్తున్న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు రావడం.. అతడిని ఢీకొనడం.. క్షణాల్లో జరిగిపోయాయి. జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి సురేశ్గౌడ్ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లా కైరా గ్రామానికి చెందిన సంజయ్కుమార్ బెహ్రా (27) హైదరాబాద్లోని తన చిన్నాన్న ఇంట్లో ఉంటూ ఓ హార్డ్వేర్ షాపులో గుమాస్తాగా పనిచేసేవాడు. మూడేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోగా.. కుటుంబసభ్యులు సొంత గ్రామానికి తీసుకెళ్లారు. చికిత్స ఇప్పించి తిరిగి హైదరాబాద్ పంపించారు. నాలుగురోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అతడు.. ఆదివారం ఉదయం ఆరుగంటలకు ఇంట్లో నుంచి రైలులో బయల్దేరాడు. రామగుండం రైల్వేస్టేషన్లో రైలుపట్టాలపైకి చేరాడు. అదే సమయంలో న్యూఢిల్లీ నుంచి వస్తున్న రాజధాని సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. -
NTPC: భారత విద్యుత్తేజం ఎన్టీపీసీ
జ్యోతినగర్ (రామగుండం): భారతావనికి వెలుగులు అందిస్తూ విద్యుత్తేజంగా విరాజిల్లుతున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నేటికి 46 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో ఎన్టీపీసీ 74 విద్యుత్ కేంద్రాల ద్వారా 67,657.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తోంది. 2032 నాటికి 1,28,000 మెగావాట్ల లక్ష్యంతో నూతన ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తూ ముందుకు సాగుతోంది. నవంబర్ 7న ‘రైజింగ్ డే’.. స్వాతంత్య్రం అనంతరం దేశం తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంది. కేంద్రం పరిధిలో ఒక విద్యుత్ కేంద్రం ఉండాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఆ విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రానికి ఎక్కువ శాతం విద్యుత్ కేటాయించి, మిగతా విద్యుత్ను ప్రాంతాల వారీగా పంపిణీ చేయాలని తీర్మానం చేశారు. అప్పటికప్పుడు నిర్మించాలంటే సమయం పడుతుందనే ఉద్దేశంతో ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన బదర్పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని టేకోవర్ చేసింది. 1975 నవంబర్ 7న ఎన్టీపీసీని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్గా నమోదు చేసి, జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంగా నామకరణం చేసి, ఎన్టీపీసీగా గుర్తించారు. దీంతో ఈ రోజును సంస్థ ‘రైజింగ్ డే’గా నిర్వహిస్తోంది. 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం ఎన్టీపీసీ దేశంలో బొగ్గు గనులు, గ్యాస్, నీరు, స్థలం ప్రాంతాలను గుర్తించి, విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఇలా దినదినాభివృద్ధి చెందుతూ అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచస్థాయి విద్యుత్ సంస్థలతో పోటీ పడుతూ భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పవర్ ప్లాంట్ సామర్థ్యం, పీఎల్ఎఫ్, మెయింటెనెన్స్, రక్షణ, విద్యుత్ పొదుపు, పర్యావరణ సమతౌల్యం, మేనేజ్మెంట్ విధానాలతో మొదటి స్థానంలో నిలిచింది. అలా నవరత్న కంపెనీగా ఉన్న ఎన్టీపీసీ 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం చెందింది. ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఎన్టీపీసీ సొంతంగా బొగ్గు, గ్యాస్, హైడ్రో, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, జాయింట్ వెంచర్స్తో పాటు మొత్తంగా 74 విద్యుదుత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. ప్రస్తుతం సూపర్ క్రిటికల్ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఎన్టీపీసీ తన ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి కన్సల్టెన్సీ, పవర్ ట్రేడింగ్, విద్యుత్ నిపుణుల శిక్షణ, బొగ్గు తవ్వకాల రంగాల్లో ముందుకు సాగుతోంది. మైనింగ్లో ఎన్టీపీసీ వేగవంతమైన ప్రగతిని సాధించింది. ప్రపంచంలోని ప్రముఖ విద్యుత్ సంస్థగా అవతరించే దిశగా పయనిస్తోంది. కరోనా సమయంలోనూ నిరంతర విద్యుత్ సరఫరా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ దేశానికి ఎన్టీపీసీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసింది. కోవిడ్–19కు వ్యతిరేకంగా పోరాడటంలో ప్రభుత్వానికి మద్దతుగా పీఎం కేర్ ఫండ్కు రూ.257.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తంలో రూ.250 కోట్లు కంపెనీవి కాగా, సంస్థ ఉద్యోగులు తమ వేతనాల నుంచి రూ.7.5 కోట్లు అందించారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించారు. కరోనా ఉధృతిలో కాంట్రాక్టు, వలస కార్మికులకు నిత్యావసరాలు, వైద్యసేవలు అందించారు. సంస్థ ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికీ భౌతిక దూరం పాటిస్తున్నారు. ఎన్టీపీసీ ప్రపంచంలో నంబర్ వన్ స్థాయిలో నిలిచేందుకు సమన్వయంతో ముం దుసాగాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇతర సంస్థలతో కలసి వ్యాపారాలు ఒకప్పుడు విద్యుదుత్పత్తి మాత్రమే చేసిన ఎన్టీపీసీ భవిష్యత్ పోటీని ఎదుర్కొని ఉత్పత్తి, పంపిణీ, విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు, సొంతంగా బొగ్గు గనుల ఏర్పాటు, జాయింట్ వెంచర్లు తదితర ఎన్నో రంగాల్లో ఇతర సంస్థలతో కలసి వ్యాపారాలు చేస్తోంది. జాయింట్ వెంచర్ల పేరిట బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాల్లో వాటి భాగస్వామ్యంతో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మి స్తోంది. భవిష్యత్లో అణు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేయాల్సి వస్తే మొదట ఎన్టీపీసీకే అవకాశం దక్కనుంది. -
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో స్వల్ప భూకంపం
జ్యోతినగర్(రామగుండం)/మంచిర్యాలటౌన్/మంచిర్యాలఅగ్రికల్చర్: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది. భూప్రకంపనలకు ఇంట్లో ఉన్నవారు భయపడి బయటకు పరుగులు తీశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఐదో డివిజన్ మల్కాపూర్, నర్రాశాలపల్లె, అన్నపూర్ణ కాలనీతోపాటు మేడిపల్లి ప్రాంతంలోని ఓపెన్కాస్ట్ గనిలో ప్రతిరోజు బొగ్గు వెలికితీయడానికి బాంబు పేలుళ్లు జరుగుతుంటాయి. ఈ క్రమంలో శనివారం సంభవించిన భూ ప్రకంపనలను బాంబుపేలుళ్లు కావచ్చని చాలామంది భావించారు. అయితే అది భూకంపమని తర్వాత తేలింది. భూకంప లేఖిని(రిక్టర్ స్కేల్)పై 4.0గా నమోదైనట్లు గుర్తించారు. మధ్యాహ్నం 2.03 గంటల ప్రాంతంలో కరీంనగర్కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో.. జిల్లా కేంద్రమైన మంచిర్యాలతోపాటు నస్పూర్, శ్రీరాంపూర్లోని పలు ప్రాంతాల్లో కూడా మధ్యాహ్నం ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. మంచిర్యాల కలెక్టరేట్లో కుర్చీలు, టేబుళ్లు, బీరువాలు కదిలినట్లు అనిపించడంతో సిబ్బంది భయాందోళన చెందారు. శ్రీరాంపూర్, నస్పూర్ ప్రాంతాల్లోని ప్రజలు మొదట దీన్ని ఓసీపీ బ్లాస్టింగ్గా భావించారు. 2016 నవంబర్లో నస్పూర్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు పలువురు గుర్తు చేసుకున్నారు. మంచిర్యాల కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు. భూకంపం వచ్చిన ప్రాంతం -
మార్చికి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలోని జైపూర్ లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం రిజర్వాయ ర్పై తలపెట్టిన నీటిపై తేలియాడే 15 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఇందులో తొలి విడతగా 5 మెగావాట్ల ప్లాంట్ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచిం చారు. గురువారం ఆయన సింగరేణి భవన్లో సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ వివిధ ప్రాంతాల్లో మూడు దశల్లో సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం చేపట్టగా, ఇప్పటికే 172 మెగావాట్ల ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మొదటి దశలో మిగిలి ఉన్న 10 మెగావాట్ల ప్లాంట్ (రామగుండం– 3), రెండవ దశలో మిగిలిఉన్న కొత్తగూడెంలోని 37 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ నెలాఖరుకల్లా ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. అలాగే కరీంనగర్లోని దిగువ మానేరు జలాశ యంపై నిర్మించతలపెట్టిన 250 మెగావాట్ల తేలి యాడే సోలార్ ప్రాజెక్టుకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని వచ్చే ఏడాది మార్చిలో టెండర్లు పిలవడా నికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది దేశంలోని అత్యుత్తమ విద్యుత్ కేంద్రాల్లో ఏడవ స్థానం సాధించినందుకు ఆయన అధికారులను అభినందించారు. ఈ ఏడాది 93 నుంచి 94 శాతం సామర్థ్యం (పీఎల్ఎఫ్)తో విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని, దేశంలో అత్యుత్తమ 25 ప్లాంట్లలో మొదటి ఐదు స్థానాల్లో ఈ కేంద్రం నిలిచేలా కృషి చేయాలని అన్నారు. కాగా, సింగరేణి సంస్థ త్వర లోనే 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించబోతోందని తెలిపారు. -
5 ఏరియాలు టాప్.. ఆరు ఏరియాలు వెనుకంజ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం (2021– 2022)లో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి మూడు మాసాల్లో 16.44 మిలియన్ టన్నుల లక్ష్యానికి 15.56 మిలియన్ టన్నుల ఉత్పత్తి (95%)నే సాధించగలిగింది. మొత్తంగా ఐదు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఆరు ఏరియాలు వెనుకంజలో ఉన్నట్లు అధికారిక గణాంకాల్లో వెల్లడించారు. కొత్తగూడెం రీజియన్లోని కొత్తగూడెం ఏరియా 29.75 లక్షల టన్నుల లక్ష్యానికి 29.76 (100%) టన్నులు, ఇల్లందు ఏరియా 14.71 లక్షల టన్నుల లక్ష్యానికి 15.44 లక్షల (105%) టన్నులు, మణుగూరు ఏరియా 26.72 లక్షల టన్నుల లక్ష్యానికి 32.97 (123%) సాధించి సింగరేణివ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇక రామగుండం రీజియన్లోని రామగుండం–2 ఏరియాలో 19.35 లక్షల టన్నుల లక్ష్యానికి 19.87 లక్షల (103%) టన్నులు, రామగుండం–3 ఏరియా 14.80 లక్షల టన్నుల లక్ష్యానికి 15.38 లక్షల (104%) ఉత్పత్తి సాధించాయి. వెనుకబడిన ఆరు ఏరియాలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏరియాల వారీ ఉత్పత్తి వివరాలను సింగరేణి తాజాగా వెల్లడించింది. మణుగూరు, ఇల్లెందు, రామగుండం–3, 2, కొత్తగూడెం ఏరియాలు లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించాయి. రామగుండం–1 ఏరియాలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, ఆండ్రియాల ఏరియాలు వెనుకబడ్డాయి. ఆండ్రియాలలోనైతే 37 శాతం లక్ష్యాన్నే సాధించడం గమనార్హం. జూన్లో 102% ఉత్పత్తి సింగరేణిలో గడిచిన జూన్లో 20 ఓపెన్కాస్ట్ గనులు, 25 భూగర్భ గనుల్లో 51.83 లక్షల టన్నుల లక్ష్యానికి 52.71 లక్షల టన్నులు అంటే 102% ఉత్పత్తి సాధించింది. ఇందులోనూ కేవలం ఆరు ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి సాధించగా, మిగిలిన ఐదు ఏరియాలు వెనుకబడ్డాయి. ఇందులో రామగుండం–3 ఏరియా (139%) అగ్రస్థానంలో నిలిచింది. అయితే, జూన్తో పాటు త్రైమాసికం కలిపి పరిశీలిస్తే కొత్తగూడెం రీజియన్లోని మణుగూరు టాప్గా నిలిచింది. ఈ ఏరియాలో త్రైమాసికం ఉత్పత్తి 26,72,000 టన్నుల లక్ష్యానికి 32,79,877 టన్నులు అంటే 123%, జూన్లో 8,96,000 టన్నుల లక్ష్యానికి 11,83,879 (132%) టన్నుల ఉత్పత్తి సాధించి సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో, ఇతర ఏరియాలకు ఆదర్శంగా నిలిచింది. వెనకబడిన ఏరియాల్లో పనితీరు మారాలి త్రైమాసిక, నెలవారీ ఉత్పత్తి సాధనలో వెనకబడిన ఏరియాల్లో తీరుమారాలి. రోజు, నెలవారీ, వార్షిక లక్ష్యాల సాధనకు కృషి జరగకపోతే బాధ్యులపై వేటు తప్పదు. బొగ్గు ఉత్పత్తిలో అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు అంకితభావంతో పనిచేయాలి. – ఎన్.శ్రీధర్, సింగరేణి సీఅండ్ఎండీ -
అమెరికాలో ఉన్నా బతికేదానివి తల్లీ..
జ్యోతినగర్: అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను చూసేందుకు రామగుండం వచ్చిన నరిష్మారెడ్డి అనే యువతి కరోనా కాటుకు బలైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘అమ్మా.. నువ్వు అమెరికాలో ఉన్నా బతికే దానివి.. మమ్మల్ని చూడటానికి వచ్చి కరోనాకు బలైపోయావా తల్లీ..’ అంటూ తల్లడిల్లిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ (రామగుండం)లోని కృష్ణానగర్కు చెందిన ఓ కాంట్రాక్టర్కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నరిష్మారెడ్డి (27) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే నాలుగేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటానికి తల్లిదండ్రులు రామగుండం పిలిపించారు. దీంతో ఆమె నెల కిందట ఇక్కడికి వచ్చింది. అయితే ఆమె 20 రోజుల క్రితం అనారోగ్యం బారిన పడింది. కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమెతోపాటు తల్లికీ పాజిటివ్రాగా, ఇద్దరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు. వారం కిందట మరోసారి టెస్ట్ చేయించుకోగా నరిష్మారెడ్డికి నెగెటివ్ వచ్చింది. అయినా ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. దీంతో ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం రాత్రి ఆమె మృతిచెందింది. మంచి ఉద్యోగంతో అమెరికాలో క్షేమంగా ఉన్న కూతురు ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. -
లాక్డౌన్ ఉల్లంఘిస్తే ఐసోలేషన్కే..!
పెద్దపల్లి/మంచిర్యాలక్రైం: ఎంత చెప్పినా వినకుండా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కొత్త పద్ధతుల్ని అమలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాతోపాటు మంచిర్యాలలో.. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని నేరుగా ఐసోలేషన్కు తరలిస్తున్నారు. గురువారం జిల్లా కేంద్రంతోపాటు గోదావరిఖని, మంథని, మంచిర్యాలలో ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన ఆకతాయిలను సుల్తానాబాద్ ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. ఇక రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారి సెల్ఫోన్లు లాక్కొని ప్రత్యేక వాహనాల ద్వారా 79 మందిని బెల్లంపల్లిలోని ఐసోలేషన్కు తరలించారు. వారి కుటుంబసభ్యులను పిలిపించి కోవిడ్ కష్టాలు ఎలా ఉంటాయో వివరిస్తూ.. 4 గంటలపాటు కౌన్సెలింగ్ నిర్వహించి వదిలి పెట్టారు. ఇప్పటికైనా అనవసరంగా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. చదవండి: ఆర్టీసీ పొమ్మన్నా.. చేను చేరదీసింది.. -
శభాష్ డాక్టర్.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ప్రశంస
సాక్షి, రామగుండం: గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాస్రెడ్డి బుధవారం కరోనాతో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను స్వయంగా పీపీఈ కిట్లో ప్యాక్ చేసి మున్సిపల్ సిబ్బందికి అప్పగించిన తీరుకు.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం రాత్రి ఫోన్ చేసి అభినందించారు. ‘ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో, ఒక డాక్టర్గా ఉండి మీరే స్వయంగా రెండు కోవిడ్ మృతదేహాలను ప్యాక్ చేయడం చాలా గొప్ప విషయం. మీరు చేసిన ఈ పని అభినందనీయం. సేవా భావంతోపాటు ధైర్యానికి, నిష్టకు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నాను. మీరు దేశానికి ఆదర్శంగా నిలిచారు.. నా అభినందనలు’ అంటూ ఫోన్లో సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డిని గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. కోవిడ్ మృతదేహాన్ని ప్యాక్ చేస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్రెడ్డి చదవండి:హమ్మా.. నేనొస్తే గేటు తీయరా..! -
‘ఆర్ఎఫ్సీఎల్’లో లీకవుతున్న గ్యాస్
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో వారంరోజులుగా అమ్మోనియా, యూరియా ఉత్పత్తిపై ట్రయల్ ర న్ నిర్వహిస్తున్నారు. అమ్మోనియా ప్లాంట్లో పై ప్లైన్ నిర్మాణంలో ఏర్పడిన సమస్య కారణంగా క ర్మాగారం నుంచి గ్యాస్ లీకవుతోంది. వారం క్రితం నైట్రోజన్ పైప్ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మార్చి నెలాఖరులో యూరియా ప్లాంట్ను షట్డౌన్ చేశారు. 45 రోజుల మరమ్మతు అ నంతరం తిరిగి యూరియా ప్లాంట్లో ఉత్పత్తిపై అ ర్ధరాత్రి సమయంలో ట్రయల్రన్ నిర్వహిస్తున్నారు. భయం గుప్పిట్లో ప్రభావిత గ్రామాలు.. కర్మాగారానికి ఆనుకుని వీర్లపల్లి, లక్ష్మీపురం, ఎల్కలపల్లి గేట్, విఠల్నగర్, శాంతినగర్, తిలక్నగర్, గౌతమినగర్, చైతన్యపురికాలనీ, సంజయ్గాంధీనగర్ ఉంటాయి. ట్రయల్ రన్ సమయంలో లీకవుతున్న గ్యాస్ సమీప గ్రామాలను చుట్టేస్తోంది. దీంతో ఊపిరాడడం లేదని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. హై పవర్ టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలి రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో ట్రయల్ రన్ సమయంలో ప్లాంట్ నుంచి రెండు రోజులుగా బయటకు వస్తున్న గ్యాస్తో ప్రభావిత ప్రాంతాలలో శ్వాస ఆడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిర్మాణ క్రమంలో నాణ్యత పాటించకపోవడంతోనే నిత్యం ఇలాంటివి జరుగుతున్నాయని ఆర్ఎఫ్సీఎల్ వర్కింగ్ యూనియన్ ప్రెసిడెంట్ అంబటి నరేష్ అన్నారు. కేంద్ర ఎరువులు రసాయనాల శాఖామంత్రి స్పందించి కర్మాగా రంలో జరుగుతున్న ప్రమాదాలపై హై పవర్ టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు చేపట్టాలి రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో రెండురోజులుగా వెలువడుతున్న నైట్రోజన్ గ్యాస్తో ప్రభావిత గ్రామాలతోపాటు గోదావరిఖని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మంగళవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇంజినీర్ కె.రవిదాస్కు వినతిపత్రం అందించారు. ప్లాంట్ నుంచి వెలువడుతున్న గ్యాస్తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలుష్య నియంత్రణ అధికారికి వినతులు జ్యోతినగర్: ఆర్ఎఫ్సీఎల్లో అమ్మోనియా గ్యాస్ లీకేజీపై సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫైట్ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్, ఉపాధ్యక్షుడు కొమ్మ చందు యాదవ్ ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్షిప్లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి రవిదాస్కు మంగళవారం వినతిపత్రం అందించారు. సోమవారం ఉదయం గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు గంటపాటు వాసనతో ఉలిక్కిపడ్డారని, పెంచికల్పేట, లక్ష్మీపురం, వీర్లపల్లిలో ప్రభావం అధికంగా ఉందని, గౌతమినగర్, ఇందిరానగర్, తిలక్నగర్, విఠల్నగర్, అడ్డగుంటపల్లి, ఐదో ఇంక్లైన్, గోదావరిఖని, లక్ష్మీనగర్, కళ్యాణ్నగర్ వరకూ గ్యాస్ వ్యాపించిందని పేర్కొన్నారు. అమ్మోనియం లీక్ అవుతున్నా యాజమాన్యం స్పందించడం లేదన్నారు. దీనికి కాలుష్య నియంత్రణ అధికారి రవిదాస్ విచారణ చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
పోలీసుల అదుపులో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు
-
Putta Madhu: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు అరెస్ట్!
-
Putta Madhu: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అరెస్ట్!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాష్ట్రం భీమవరంలో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్న మధును తాము అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో విచారణ కోసం శనివారం ఆయనను రామగుండం తీసు కొచ్చారు. వామన్రావు తండ్రి కిషన్రావు గతనెల 16న ఐజీ నాగిరెడ్డికి చేసిన ఫిర్యాదులో పుట్ట మధు ప్రమేయంపై ఆరోపణలు చేశారు. దీనిపై రామగుండం పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని తొలుత ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. అలాగే పోలీసులు మధు అదృశ్యాన్ని ధ్రువీకరించకపోవడం, టీఆర్ఎస్ నేతల రాయబారాలు, మధు సతీమణి శైలజ స్పందన తదితర విషయాలతో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో శనివారం మధును అదుపులోకి తీసుకున్ననట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలో చిక్కని మధు వామన్రావు తండ్రి కిషన్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును తిరిగి తవ్వుతున్నారనే విషయం గత నెల 29న పుట్ట మధుకు తెలిసింది. దాంతో అదేరోజు రాత్రి ఆయన గన్మేన్లు లేకుండా, ప్రభుత్వ కారును ఇంట్లోనే వదిలేసి తన భార్య, మునిసిపల్ చైర్పర్సన్ శైలజ కారులో అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు మధు ‘గాయబ్’అయ్యారనే విషయాన్ని గోప్యంగా ఉంచి దర్యాప్తు ప్రారంభించారు. వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించి ఎట్టకేలకు మధు ఆచూకీ కనుకొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా వని పట్టణంలోని తన సోదరుడి ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని ఈనెల 1న అక్కడి పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. అయితే మధు అక్కడ పోలీసులకు చిక్కలేదు. ఈ మేరకు మరాఠీ దినపత్రికలో వార్త ప్రచురితమైంది. అదే సమయంలో ఈటల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన మధు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా టీఆర్ఎస్ అధిష్టానాన్ని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ లభించలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని భీమవరం వెళ్లి ఉంటారనేది ఓ కథనం.. కాగా మధు హైదరాబాద్లోనే ఉండి తన భార్య సహకారంతో ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారని, అదే సమయంలో పత్రికల్లో వార్తా కథనాలు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ఉంటారనేది మరో కథనం. అయితే హైదరాబాద్లో పట్టుకున్నట్లు కాకుండా ఆంధ్రప్రదేశ్లోని భీమవరం వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు సీన్ క్రియేట్ చేశారని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి భీమవరం వెళ్లి, శనివారం ఉదయాన్నే మధును అదుపులోకి తీసుకొని, మధ్యాహ్నానికల్లా జెట్ స్పీడ్లో రామగుండం తీసుకొచ్చి విచారణ ప్రారంభించడం ఈ సందేహానికి తావిస్తోంది. హైదరాబాద్లో ఉంటే ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే భీమవరం ఎపిసోడ్కు తెరతీశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిషన్రావు ఫిర్యాదుతోనే దర్యాప్తు వేగం ఈ జంట హత్యల కేసులో ప్రధాన నిందితులకు పుట్ట మధు రూ.2 కోట్లు సుపారీ ఇచ్చారని, ప్రధాన నిందితుడు కుంట శ్రీను జైల్లో ఉన్నప్పటికీ అతని స్వగ్రామంలో ఇంటి నిర్మాణం వేగంగా జరుగుతోందని, దీని వెనకాల జెడ్పీ చైర్మన్ ఉన్నారని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని వామన్రావు తండ్రి కిషన్రావు ఈనెల 16న ఐజీ నాగిరెడ్డికి పిర్యాదు చేశారు. ఈ కేసును హైకోర్టు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న క్రమంలో కిషన్రావు ఫిర్యాదుపై ఐజీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎ–1 కుంట శ్రీను ఇంటి నిర్మాణం వెనక ఎవరెవరున్నారనే కోణంలో కూడా విచారణ జరిపారు. హత్య కోసం రూ.2 కోట్లు సుపారీ ఇచ్చారా? అంతమొత్తం ఎక్కడ నుంచి వచ్చింది..? దీని వల్ల ఎవరికి ప్రయోజనం అనే కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో పుట్ట మధు అదృశ్యం కావడంతో కేసు మలుపు తిరిగింది. హత్యల కేసులో పాత్ర తేల్చేందుకే.. హైకోర్టు లాయర్ల హత్య కేసులో పుట్ట మధు ప్రమేయం తేల్చేందుకు శనివారం ఆయన్ను ఇక్కడికి తీసుకువచ్చాం. ఇద్దరు అధికారుల పర్యవేక్షణలో విచా రణ కొనసాగుతోంది. హత్యకేసులో ప్రధాన నిందితుని ఇంటి పనులు వేగవంతం కావడం, వారం రోజుల పాటు మధు ఎందుకు అదృశ్యం అయ్యారు? తదితర వివరాలు విచారణలో తెలుస్తాయి. కిషన్రావు ద్వారా కూడా ఆధారాలు సేకరిస్తాం. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. – వి.సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ దొరకని ‘పెద్దల’ అపాయింట్మెంట్ టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం.. పుట్ట మధు మహారాష్ట్ర నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చాడు. ఈ కేసు నుంచి బయటకు తీసుకురావాలని ఆయన జిల్లాకు చెందిన ఓ మంత్రి సాయం కోరాడు. అయితే ఆయన టీఆర్ఎస్ పెద్దలతో మాట్లాడి పుట్ట మధుకు అపాయింట్మెంట్ ఇప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడం, ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు రావడంతో పరిస్థితి మారింది. మధు సతీమణి పుట్ట శైలజ సీన్లోకి వచ్చి సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రగతి భవన్కు వెళ్లినా వీలు కాలేదు. దీంతో మరో మంత్రిని కలిసి సాయం కోరారు. ఈ ప్రయత్నాలు ఇలా కొనసాగుతున్న క్రమంలోనే పోలీసులు మధును అదుపులోకి తీసుకొని రామగుండం తీసుకొచ్చి విచారణ ప్రారంభించారు. ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. చదవండి: Putta Madhu: వారం రోజులుగా వీడని సస్పెన్స్.. అసలేం జరిగింది? -
రేపు కూతురు బర్త్డే.. మూగ హృదయం ఆగిపోయింది..
సాక్షి, రామగుండం: అతడు పుట్టు మూగ.. నాలుగేళ్ల రైల్వే రిక్రూట్మెంట్బోర్డు నిర్వహించిన పరీక్ష ద్వారా రైల్వేలో ఉద్యోగం సాధించాడు. రామగుండం రైల్వే రెగ్యులర్ ఓవర్హాలింగ్షెడ్డులో టెక్నికల్ అసిస్టెంట్గా చేరాడు. మూడేళ్ల క్రితం మూగ యువతినే వివాహమాడి ఆదర్శంగా నిలిచాడు. వీరికి కూతురు ఉంది. కరోనా నేపథ్యంలో భార్య, కూతురును పుట్టింటికి పంపించి విధులు నిర్వహిస్తున్నాడు. వ్యక్తి మూగ అయినా అందరితో కలిసి ఉండే అతడి హృదయం గురువారం విధినిర్వహణలోనే ఆగింది. వరంగల్ రూరల్ జిల్లా మడికొండకు చెందిన బండి రంజిత్కుమార్(35) గురువారం విధుల్లో ఉండగా గుండెలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. తోటి ఉద్యోగులు రైల్వే డిస్పెన్సరీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందనడంతో కరీంనగర్లోని ప్రైవేటుఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. రేపు కూతురు తొలి జన్మదిన వేడుకలు.. రంజిత్ కూతురు మొదటి పుట్టిన రోజు శనివారం ఉంది. కరోనా దృష్ట్యా పుట్టింటికి వెళ్లిన భార్య, కూతురును శుక్రవారం రామగుండం రావాలని ఫోన్చేసి చెప్పాడు. ఇంతలోనే గుండెపోటుతో మృతిచెందడంతో భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. -
సింగరేణి: 6 ఏళ్లు, 14 వేల ఉద్యోగాలు
సాక్షి, గోదావరిఖని(రామగుండం): రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిలో యువరక్తం ఉరకలేస్తోంది. తండ్రుల మెడికల్ ఇన్వ్యాలిడేషన్, డిపెండెంట్ ఉద్యోగాలతో యువత పెద్ద ఎత్తున సంస్థలో చేరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన ఆరేళ్లలో 14 వేలకుపైగా యువకులు సంస్థలో ఉద్యోగాలు సాధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి సంస్థలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీసుకున్న నిర్ణయంతో మెడికల్ ఇన్వ్యాలిడేషన్కు అనుమతిస్తున్నారు. 2014లో వారసత్వ ఉద్యోగాల పేరుతో సింగరేణిలో భర్తీ కొనసాగినప్పటికీ కొందరు దీనిపై హైకోర్టుకు వెళ్లడంతో నిలిచిపోయింది. 2018, మార్చి 9న సంస్థలో తిరిగి కారుణ్య నియామకాల పేరుతో సింగరేణి వారసులకు ఉద్యోగాల భర్తీ పక్రియ ప్రారంభమైంది. మహిళా కారి్మకులకు కూడా సింగరేణి సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆరేళ్లలో 11,051 మంది.. సంస్థ వ్యాప్తంగా 41,557 మంది కార్మికులు పనిచేస్తుండగా అందులో 11,051 మంది యువ కారి్మకులు కారుణ్య నియాకాల ద్వారా ఉద్యోగాల్లో చేరారు. సింగరేణి సంస్థ ఆరేళ్లలో 68 మెడికల్ బోర్డులు నిర్వహించి అనారోగ్య కారణాలతో ఉద్యోగం చేయలేని కారి్మకులను అన్ఫిట్ చేసి వారి స్థానంలో వారసులకు ఉద్యోగాలను కల్పించింది. అలాగే ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ల ద్వారా 3,101 మంది సింగరేణి ప్రభావిత జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారు. సంస్థలో ఉద్యోగుల వయోభారం పెరుగుతుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో సింగరేణి కుటుంబాల్లో యువతకు ఉద్యోగాలు లభించడం వరంగా మారింది. గతంతో బొగ్గు గనుల్లో కేవలం పురుషులకే అవకాశం ఉండగా, తాజాగా సింగరేణిలో కారి్మకులు ఆడపిల్లలకు కూడా ఉద్యోగావకాశం కలి్పస్తూ నిర్ణయం తీసుకోవడంతో మహిళా ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం సింగరేణి వైపు దృష్టి సారించారు. క్వార్టర్, వైద్యం, సంక్షేమం.. ఇలా పలు విధాలుగా సింగరేణి సౌకర్యాలు కలి్పస్తుండటంతో సంస్థలో చేరేందుకు అనేకమంది ఆసక్తి కనబర్చుతున్నారు. అలాగే ప్రభుత్వరంగ సంస్థల్లో ఎక్కడా లేనివిధంగా లాభాల్లో ఉద్యోగులకు వాటా చెల్లిస్తుండటంతో అనేకమంది సింగరేణిపైపు చూస్తున్నారు. సంస్థ తాజాగా ఉద్యోగాల భర్తీకి ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ జారీ చేసింది. 184 మంది మహిళా ఉద్యోగులు.. గతంతో బొగ్గు గనుల్లో పురుషులకే వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేవారు. తాజాగా సింగరేణిలో కార్మికుల కూతుళ్లకు కూడా వారసత్వ ఉద్యోగాలు ఇస్తున్నా రు. కారుణ్య నియామకాలకింద ఇప్పటి వరకు 184 మంది మహిళలు ఉద్యోగం పొందారు. ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 3,101 మందికి సింగరేణì యాజమాన్యం ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 3,101 మంది నిరుద్యోగులకు ఉద్యోగావశాలు కలి్పంచింది. 2014 నుంచి 2020 వరకు 47 ఎక్స్టర్నల్ నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్ష ద్వారా అర్హులకు ఉద్యోగాలు కలి్పంచింది. తెలంగాణలో బొగ్గు గనులు విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాల నిరుద్యోగ యువతకు ఈ నోటిఫికేషన్లలో అవకాశం కలి్పంచారు. పరీక్షలు నిర్వహించిన రోజునే ఫలితాలు వెల్లడించి పైరవీలకు తావు లేకుండా ఉద్యోగాల పక్రియ నిర్వహించారు. ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది.. సింగరేణిలో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. నాన్న మెడికల్ ఇన్వ్యాలిడేషన్ ద్వారా కారుణ్య నియామకం కింద సింగరేణిలో ఉద్యోగం లభించింది. సంస్థ అభివృద్ధి కోసం అహరి్నశలు శ్రమిస్తా. – పులిపాక సతీశ్, గోదావరిఖని బాధ్యతగా భావిస్తా.. మామయ్య ఉద్యోగం నాకు వచి్చంది. మెడికల్ ఇన్వ్యాలిడేషన్ ద్వారా దిగిపోవడంతో కూతురిని ఇచ్చి ఉద్యోగం పెట్టించాడు. మైనింగ్ డిప్లొమా పూర్తి చేసిన నాకు, చదువుకు తగిన ఉద్యోగం లభించింది. సంస్థలో ఉద్యోగం సాధించడం బాధ్యతగా భావించి అభివృద్ధిలో పాలు పంచుకుంటా. – ముత్యాల పవన్కల్యాణ్, తురకలమద్దికుంట, పెద్దపల్లి చదవండి: చేయని తప్పునకు గల్ఫ్లో జైలు పాలై.. -
ప్రాణాలు తీసిన పుచ్చకాయ!
రామగుండం: ఎలుకలు కొరికిన పుచ్చకాయ తినడం ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విసంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. విసంపేట గ్రామానికి చెందిన దారబోయిన కొమురయ్య, సారమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు.. వృద్ధాప్యం కారణంగా పెద్ద కొడుకు శ్రీశైలం, కోడలు గుణవతి వద్ద ఉంటున్నారు. శ్రీశైలం దంపతులకు ఇద్దరు కుమారులు శివానంద్ (12), శరణ్ (10) ఉన్నారు. గత సోమవారం గ్రామానికి వచ్చిన వ్యక్తి వద్ద పుచ్చకాయలు కొనుగోలు చేశారు. సాయంత్రం కుటుంబ సభ్యులంతా సగం పుచ్చకాయ తిన్నారు. మిగతా సగం ఇంట్లోని సెల్ఫ్లో ఉంచారు. అదేరోజు రాత్రి కొమురయ్య ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని తవుడులో విషం కలిపి పెట్టాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు మిగతా సగం పుచ్చకాయ తినగా, కొమురయ్య మాత్రం తినలేదు. ఆ రోజు ఇంట్లో ఎల్లమ్మ పూజలు చేసుకోవడంతో మాంసాహారం తిన్నారు. కాగా, సాయంత్రం నుంచి పుచ్చకాయ తిన్న వారికి మాత్రమే వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. తొలుత మాంసాహారంతోనే అస్వస్థతకు గురైనట్లు భావించి స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నారు. ఎల్లమ్మ పూజల నేపథ్యంలో శ్రీశైలం కుటుంబంతోపాటు అతని సోదరులు కనకరాజు, ప్రభాకర్ కుటుంబాలు సైతం భోజనం చేశాయి. వారికి ఎలాంటి అస్వస్థత లేకపోగా, శ్రీశైలం తండ్రి కొమురయ్య సైతం ఆరోగ్యంగా ఉండడంతో, పుచ్చకాయతోనే అనారోగ్యం బారిన పగినట్లు గుర్తించారు. విషం తిన్న ఎలుకలు పుచ్చకాయను కొరకవడంతో అది విషపూరితమైనట్లు భావిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారి పరిస్థితి క్షీణిస్తుండడంతో గురువారం ఉదయం కరీంనగర్లోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో శివానంద్, శరణ్లను చేర్పించారు. శ్రీశైలం, గుణవతి మరో ఆస్పత్రిలో చేరారు. చిన్నారుల పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి శివానంద్, శుక్రవారం వేకువజామున శరణ్ మృతిచెందారు. శ్రీశైలం, గుణవతిలకు శ్వాస సంబంధ సమస్య తీవ్రం కావడంతో బంధువులు వారిని హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. శ్రీశైలం తల్లి సారమ్మ సైతం కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని తెలిసింది. -
రూ.20 నాణెం చూశారా?!
సుభాష్నగర్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గతంలో విడుదల చేసిన కొత్త 20 రూపాయల నాణేలు మార్కెట్లో చలామణిలోకి వచ్చాయి. ఇప్పటి వరకు రూ.1 నుంచి 10 రూపాయల నాణేలు వాడుకలో ఉన్నాయి. 2020లో విడుదలైన రూ.20 నాణేలు తాజాగా మార్కెట్లో చలామణిలోకి రావడంతో ప్రజలు వాటిని ఆసక్తిగా చూస్తున్నారు. బడ్జెట్ ప్రసంగానికి కరెంటు కష్టం కోల్సిటీ (రామగుండం): విద్యుత్ సరఫరాలో సమస్యలతో పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో బడ్జెట్ సమావేశానికి అంతరాయం ఏర్పడింది. సమావేశం మధ్యలో ఏకంగా మూడుసార్లు కరెంటు పోవడంతో సెల్ఫోన్ లైట్ల వెలుతురులోనే నిర్వహించాల్సి వచ్చింది. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం లోని కౌన్సిల్ హాల్లో మేయర్ డాక్టర్ బంగి అనిల్కుమార్ అధ్యక్షతన మంగళవారం బడ్జెట్ సమావేశం జరిగింది. సమావేశం ఉదయం 11 గంటలకే జరగాల్సి ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారు. సమావేశంలో మేయర్ బడ్జెట్ సందేశం చదువుతుండగా కరెంటు మళ్లీ పోయింది. దీంతో సిబ్బంది సెల్ఫోన్ల ఫ్లాష్ లైట్లు ఆన్చేయడంతో మేయర్ ప్రసంగాన్ని కొనసాగించారు. సభకు హాజరైన కార్పొ రేటర్లు కూడా మొబైల్ ఫోన్ల వెలుగులోనే రిజిస్టర్లో సంతకాలు చేశారు. మల్యాలపల్లి సమీపంలోని 33 కేవీ విద్యుత్ వైర్లలో సాంకేతిక సమస్య తలెత్తడమే ఈ విద్యుత్ సమస్యకు కారణమైనప్పటికీ.. కార్పొరేషన్ కార్యాలయంలో జనరేటర్ సౌకర్యం లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఈ స్కీమ్ గడువు పొడగించిన ఎస్బీఐ బుల్ మళ్లీ రంకెలేసింది.. -
ఒకప్పుడు భయపడేవారు.. ఇప్పుడు ప్రశంసలు!
రామగుండం క్రైం: రోడ్డుపై వంద రూపాయలు దొరికితే.. ఎవరూ చూడకుండా టక్కున జేబులో పెట్టుకునే ఈ రోజుల్లో రామగుండం పారిశ్రామిక ప్రాంత ఆటోడ్రైవర్లు నిజాయితీకి మారుపేరుగా నిలుస్తున్నారు. ప్రయాణికులు హడావుడిలో తమ వాహనాల్లో మరిచిపోయిన సొమ్మును తిరిగి వారికి అప్పగిస్తున్నారు. నగదు, ఆభరణాలు కళ్ల ముందే ఉన్నా కాజేయాలనే ఆలోచన చేయకుండా వాటిని పోగొట్టుకునేవారు పడే బాధను పెద్ద మనసుతో అర్థం చేసుకుంటున్నారు. ఆటో యూనియన్ నాయకులు, పోలీసుల సహకారంతో సొత్తును అప్పగిస్తూ అటు బాధితుల ప్రశంసలు.. ఇటు పోలీసుల అభినందనలు అందుకుంటున్నారు. గతంలో ఈ ప్రాంత ఆటోడ్రైవర్లు అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడేవారనే అపఖ్యాతి ఉండేది. ఇప్పుడు అది చెరిగిపోయింది. క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం చాటుకుంటూ హ్యాట్సాఫ్ అనిపించుకుంటున్నారు. 12 తులాల బంగారు ఆభరణాలు.. గోదావరిఖని తిలక్నగర్ డౌన్కు చెందిన హలీమా శుక్రవారం పనిమీద బస్టాండ్ కాలనీకి వెళ్లింది. అక్కడ 12 తులాల బంగారు ఆభరణాలు బ్యాగులో వేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు మున్సి పల్ ఆఫీస్ వద్ద ఆటో ఎక్కింది. తర్వాత బ్యాగును ఆటోలోనే మరిచిపోయి ఇంటికి వెళ్లింది. కాసేపటికి గుర్తించిన ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే తన ఆటోలో బ్యాగు ఉన్న విషయం గుర్తించిన రమేశ్నగర్ ఆటో అడ్డాకు చెందిన ఆటోడ్రైవర్ మహమ్మద్ అజ్గర్ ఉరఫ్ అజ్జు అడ్డా వద్దకు చేరుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన క్రైమ్ పార్టీ పోలీసుల సాయంతో బ్యాగును పోలీస్స్టేషన్లో అప్పగించాడు. పోలీసులు దాన్ని శనివారం ఆటోడ్రైవర్ చేతుల మీదుగా బాధిత మహిళకు అందించారు. నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్ను సీఐ రమేశ్బాబు, ఆటో యూనియన్ నాయకులు అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నరసరావు పేటకు చెందిన బంగారం వ్యాపారులు తమ వ్యాపారం నిమిత్తం గత నెల 23న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి కారులో బయలుదేరారు. రామగుండం పోలీస్స్టేషన్ పరిధిలోని మల్యాలపల్లి రైల్వే బ్రిడ్జి కింద మూలమలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. 108 సిబ్బంది వారిని గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది తోట రాజేందర్, ఎండీ.చాంద్పాషాలు క్షతగాత్రుల వద్ద లభించిన సుమారు కేజీ బంగారాన్ని పోలీసులకు అందించారు. వారిని సీఐ కరుణాకర్, ఎస్సై మామిడి శైలజ అభినందించారు. పెళ్లికి వస్తూ నగలు మరిచిపోయి.. 2020 డిసెంబర్ 3న కొత్తగూడెం గౌతమీపూర్కు చెందిన కల్లేపల్లి లింగయ్య గోదావరిఖనిలో ఉంటున్న సోదరుడి కూతురు పెళ్లి కోసం వచ్చాడు. తన వెంట బంగారు ఆభరణాలు, నగదు తీసుకొచ్చాడు. ఉదయం గోదావరిఖని బస్టాండ్లో బస్ దిగి గాంధీనగర్కు ఆటోలో వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగ్ ఆటోలో మరిచిపోయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు బస్టాండ్కు వెళ్లి, సీసీ పుటేజీ ఆధారంగా గొల్ల శ్రీనివాస్ ఆటోగా గుర్తించారు. అతడిని ఫోన్లో సంప్రదించగా, బ్యాగ్ గురించి తనకు తెలియదని.. తన తమ్ముడి ఆరోగ్యం బాగా లేక కరీంనగర్ వచ్చానని తెలిపాడు. ఎందుకైనా మంచిది ఆటోలో సీటు వెనక ఒకసారి చెక్ చేయాలని పోలీసులు సూచించాడు. వారు సీటు వెనక చూడగా 35 గ్రాముల బంగారం, రూ.54 వేలు ఉన్న బ్యాగు దొరికింది. దీంతో బాధితులు కరీంనగర్ వెళ్లి బ్యాగు తీసుకున్నారు. నిజాయితీగా సొత్తు అప్పగించిన ఆటోడ్రైవర్ శ్రీనివాస్ను అభినందించారు. బంధువుల ఇంటికి వస్తూ.. హైదరాబాద్కి చెందిన ఆవుల అజయ్ ఫ్యావిులీతో గోదావరిఖనిలో బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి హాజరయ్యేందుకు 2018 ఫిబ్రవరి 23న సికింద్రాబాద్–కాగజ్నగర్ రైలులో వచ్చారు. రాత్రి రామగుండం రైల్వేస్టేషన్లో దిగి, ఎండీ.తహరొదీ్దన్ ఆటో ఎక్కి గోదావరిఖని బస్టాండ్లో దిగారు. ఈ క్రమంలో బ్యాగును అందులోనే మరిచిపోయినట్లు ఇంటికెళ్లాక గుర్తించారు. అందులో 6 తులాల బంగారు ఆభరణాలు, ఖరీదైన దుస్తులు ఉండటంతో వెంటనే ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నీలారపు రవికి సమాచారం ఇచ్చారు. అయితే ఆటోడ్రైవర్ తహరొద్దీన్ మరునాడు ఉదయం ఆటోలో బ్యాగును గుర్తించి, యూనియన్ ప్రెసిడెంట్కు తెలిపాడు. వెంటనే ఇద్దరూ ఆటోడ్రైవర్లతో కలిసి బ్యాగుతో ట్రాఫిక్ పోలీస్స్టేషన్కి వెళ్లి పోలీసులకు అప్పగించారు. బ్యాగును తనిఖీ చేసిన బాధితులు అన్నీ సరిగా ఉన్నాయని చెప్పడంతో ఆటోడ్రైవర్ను పోలీసులు అభినందించారు. ఊరికి వెళ్లే తొందరలో.. గోదావరిఖని అశోక్నగర్కు చెందిన కాసర్ల భారతి 2020 జూలై 8న కరీంనగర్ వెళ్లేందుకు గోదావరి ఖని బస్టాండ్కు రావడం కోసం గాంధీ చౌరస్తాలో ఆటో ఎక్కింది. బస్టాండ్లో పాయింట్ వద్ద బస్సు సిద్ధంగా ఉండటంతో ఊరికి వెళ్లాలనే తొందరలో ఆటో దిగుతుండగా ఆమె పర్సు అందులోనే పడిపోయింది. బస్సు ఎక్కిన తర్వాత పర్సు కనిపించకపోవడంతో వెంటనే దిగి ఆటో డ్రైవర్ కోసం గాలి ంచింది. అతను కనిపించకపోవడంతో ట్రాఫిక్ పో లీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాసేపటికి ఆటోడ్రైవర్ బస్టాండ్ ఆటో అడ్డా యూనియన్ ప్రెసిడెంట్ కనుకుంట్ల నారాయణకు తనకు పర్సు దొరికిందని తీసుకెళ్లి ఇచ్చాడు. ఇద్దరూ దాన్ని ఓపెన్ చేయకుండానే పోలీస్స్టేషన్కి వెళ్లి పోలీసులకు అప్పగించా రు. ప్రయాణికురాలి ముందు పర్సు ఓపెన్ చేయగా అందులో తులం బంగారం, రూ.5 వేలు ఉన్నా యి. భారతి అవి తనవే అని చెప్పడంతో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్ల సమక్షంలో బాధితురాలికి అందజేశారు. నారాయణను పోలీసులు, బాధితురాలు అభినందించారు. మహిళ ప్రాణాలు కాపాడి... గోదావరిఖని శివారులోని గోదావరి వంతెన పైనుంచి మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఓ మహిళ నదిలో దూకింది. ఆ సమయంలో గోదావరిఖని నుంచి ప్రయాణికులను తీసుకొని ఆటోడ్రైవర్ రహ్మత్బేగ్ మంచిర్యాల వైపు వెళ్తున్నాడు. వంతెన వద్ద జనం గుమిగూడి ఉండటంతో ఏం జరిగిందని అక్కడి వారిని ఆరా తీయగా.. మహిళ నదిలో దూ కిందని చెప్పారు. వెంటనే ఆటో దిగి, నదిలో మహిళ కొట్టుకోవడం గమనించాడు. ఆలస్యం చేయకుండా ప్రాణాలకు తెగించి దూకేశాడు. వెంటనే పైన ఉన్నవారు వేసిన తాడు సాయంతో ఈదుకుంటూ మహి ళ దగ్గరకు వెళ్లి కాపాడాడు. తర్వాత పడవ ఎక్కించాడు. అయితే అంతలోతు నీటిలో ఆమెను కాపాడటంతో తాను కూడా అలసిపోయానని బేగ్ తెలి పాడు. చివకు బాధితురాలిని ప్రాణాలతో బయటకు తీసుకురావడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఒకప్పుడు భయపడేవారు.. రామగుండం పారిశ్రామిక ప్రాంత ఆటోడ్రైవర్లు అంటే ప్రయాణికులు ఒకప్పుడు భయపడేవారు. కానీ ఇప్పుడు నిజాయితీకి మారుపేరుగా నిలవడం సంతోషంగా ఉంది. పోలీసులు మాకు కౌన్సెలింగ్ ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, సూచనలు ఇస్తున్నారు. డ్రైవర్లు మా యూనియన్ నాయకులకు, యూనియన్కు మంచి పేరు తీసుకురావడం గర్వంగా ఉంది. – నీలారపు రవి, ఆటో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ -
పట్టపగలే బాలికపై లైంగిక దాడికి యత్నం!
రామగుండం క్రైం: ఓ బాలికపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి యత్నించిన ఘటన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన బాలిక(16) తనకు పరిచయం ఉన్న యువకుడితో సోమవారం సాయంత్రం టూ ఇంక్లైన్ సమీపంలోని దర్గా వద్ద మాట్లాడుతోంది. ఈ క్రమంలో బైక్పై వచ్చిన ముగ్గురు యువకులు వారిపై దాడి చేశారు. బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె కేకలు వేసింది. స్థానిక యువకులు కొందరు గమనించి, గోదావరిఖని వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు వాహనం రావడం గమనించిన నిందితులు యువతిని వదిలిపెట్టి పరారయ్యారు. సర్కిల్ ఇన్స్పెక్టర్లు రమేష్బాబు, రాజ్కుమార్గౌడ్, క్రైం పార్టీ బృందం సభ్యులు బాధితురాలిని ఠాణాకు తీసుకెళ్లారు. వివరాలు తెలుసుకొని, ఆమె కుటుంబసభ్యులను పిలిపించారు. వారి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన ఏసీపీ సంఘటన స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ వన్ టౌన్ సీఐలు, బాధిత బాలికతో కలిసి మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకున్న సీఐలతోపాటు ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై శారద, క్రైమ్ పార్టీ బృందం సభ్యులు నిజాంపేట్ శేఖర్, ఏలియా, రహీంలను ఏసీపీ అభినందించారు. చదవండి: ‘రూ. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకును కిడ్నాప్ చేస్తాం’ -
పది నెలల క్రితమే ప్లాన్: చంపకపోతే
సాక్షి, పెద్దపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి ప్రమేయం ఉన్న, ఎవరినైనా, ఎంతటివారినైనా వదలిపెట్టేదిలేదని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. హత్య కుట్రలో నిందితులకు కారు, రెండు కత్తులను అందజేసిన బిట్టు శ్రీను అరెస్ట్ చేశామన్నారు. వామన్రావును హత్య చేయాలని పది నెలల క్రితమే ప్లాన్ చేశారని, చాలా సార్లు స్కెచ్ విఫలమైందని తెలిపారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. దీనిలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రధాన నిందితుల వాంగ్మూలం, నిందితుడు బిట్టు శ్రీను అలియాస్ తులసిగరి శ్రీను ఇచ్చిన వాంగ్మూలంను విశ్లేషించగా పలు విషయాలు తెలిసినవని చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాలు (బిట్టు వాంగ్మూలం) బిట్టు శ్రీను 2016 సంవత్సరం నుండి మంథనిలో నడుస్తున్న పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా కొనసాగుతున్నాడు. మంథని ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ ట్రస్టుపై మృతుడు గట్టు వామన్ రావు ట్రస్ట్పై పలు ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో చులకన చేస్తూ పలు వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపించేవాడు. బిట్టు శ్రీనుపై అవమానకరంగా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడని ప్రచారం చేసేవాడు. ట్రస్టు మరియు ట్రస్ట్ యొక్క ఆదాయాల పై హైదరాబాద్, ఇతర చోట్ల గట్టు వామన్ రావు తన అనుచరులతో ఫిర్యాదులు చేపించేవాడు. 2015 నుండి 2019 ఏప్రిల్ వరకు మంథని గ్రామపంచాయతీలో బిట్టు శీను చెత్త రవాణా కొరకు ఒక ట్రాక్టర్ పెట్టగా బిట్టు శ్రీనుకు నెలకు 30 వేల రూపాయలు ఆదాయం వచ్చేది. దానిపై 2019 మార్చి లో గ్రామ పంచాయతీలోని అధికారికి బిట్టు శ్రీను యొక్క ట్రాక్టర్ పై ఫిర్యాదు చేసి దానిని తీసి వేయాలి అని పంచాయతీ అధికారిపై గట్టు వామన్ రావు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దానితో ఆ అధికారి ట్రాక్టర్ని గ్రామపంచాయతీ నుండి తొలగించాడు. దానిపై వచ్చే నెల వారి 30 వేల ఆదాయం బిట్టు శ్రీను కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని గట్టు వామనరావు బిట్టు శ్రీనుపై సాధించిన విజయంగా మంథని ప్రాంతంలో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. బిట్టు శ్రీను- కుంట శ్రీను కి గల సంబంధం మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీను, బిట్టు శ్రీనుకు గత ఆరు సంవత్సరాలుగా పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారారు. రెగ్యులర్గా కలిసి ఉండేవారు. వీరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు మందు తాగే సమయంలో పంచుకునేవారు. వీళ్ళతో అప్పుడప్పుడు చిరంజీవి కూడా కలిసేవాడు. ఈ క్రమంలో కుంట శ్రీనివాస్ గుంజపడుగు గ్రామస్తుడైన గట్టు వామన్ రావు పీవీ నాగమణి దంపతులు హైకోర్టు న్యాయవాదులుగా చలామణి అవుతూ కొన్ని సంవత్సరాలుగా కుంట శ్రీనివాస్ను టార్గెట్ చేసుకొని ఒక ఫోన్ కాల్ విషయంలో హైదరాబాదులో కుంట శ్రీనివాస్ పై కేసు పెట్టించారు . కుంట శ్రీను వాళ్ళ కులదైవం పెద్దమ్మ తల్లి గుడి కట్టుటకు కుంట శ్రీనును చైర్మన్గా పెట్టి గుడి కడుతున్న క్రమంలో దానిని అక్రమ నిర్మాణం అని ఫిర్యాదు చేసి నోటీసులు ఇప్పించి వామన్ రావు దంపతులు గుడి నిర్మాణం ఆపించడం జరిగింది. కుంట శీను ఇంటి నిర్మాణం చేస్తుండగా నిర్మాణం మధ్యలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోలేదని అక్రమ నిర్మాణం చేస్తున్నాడని నిర్మాణం ఆపుదల చేస్తూ గ్రామపంచాయతీ నుండి నోటీసు ఇచ్చి నోటీసును ఫ్లెక్సీ తయారు చేపించి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో గట్టు వామన్ రావు ప్రచారం చేయడం జరిగింది. గుంజపడుగు లో రామ స్వామి గోపాల స్వామి ఆలయానికి సంబంధించిన కమిటీ చైర్మెన్ గా చాలా సంవత్సరాల నుండి వామన్ రావు తమ్ముడు చైర్మన్ గా ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడని, ఈ మధ్యకాలంలో గుంజపడుగు గ్రామస్తులు అందరూ కలిసి పాత కమిటీ రద్దుపరచి కొత్త కమిటీ చైర్మన్ గా వెల్ది వసంతరావు నీ ఎన్నుకోవడం జరిగింది ఇట్టి విషయంలో కూడా గట్టు వామన్ రావు, నాగమణి, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తూ హైకోర్టులో ఫిర్యాదు చేయుటకు ప్రయత్నిస్తున్న క్రమంలో గొడవ జరిగిందని ఆ విధంగా కుంట శ్రీను గ్రామంలో తన అధిపత్యానికి వామన్ రావు నాగమణి లు అడ్డువస్తున్నారని దానికి బిట్టు శీను కూడా కుంట శ్రీను తో తనకి కూడా ఆదాయ మార్గాలు రాకుండా చేసి ప్రజలలో అవమాన పరిచాడు వ్యక్తిగతంగా తీవ్ర నష్టం చేసాడని గట్టు వామన్ రావు ని చంపే విషయాలలో ఏలాంటి సహాయం కావాలన్నా చేస్తానని కుంట శ్రీనుతో చెప్పాడు. అందాద నాలుగు నెలల క్రితం వామన్ రావు గురించి చర్చించే సమయంలో కుంట శ్రీను రెండు కత్తులు తయారు చేయించి పెట్టు అన్నా అని బిట్టు శ్రీనుకి చెప్పగా బిట్టు శ్రీను రెండు ట్రాక్టర్ పట్టీలు తీసుకొని మంథనిలో కత్తులు తయారు చేపించి చిరంజీవి ఇంట్లో పెట్టారు. బిట్టు శీను అన్న ఎట్టి పరిస్థితుల్లో మనం వామన్ రావుని చంపకపోతే మనకు భవిష్యత్తులో ఎప్పుడూ ఇబ్బంది ఉంటుందని చాలా సందర్భాల్లో గత 10 నెలల నుండి కుంట శీను, బిట్టు శ్రీనుకు చెప్పడం జరిగింది. అందదా నాలుగు నెలల క్రితం వామన్ రావు 15 మందితో మూడు కార్లలో మంథని కోర్టుకు రాగా చిరంజీవి వారిని చూసి బిట్టు శీనుకు చెప్పగా వెంటనే ఇట్టి విషయం కుంట శ్రీనుకి బిట్టు శ్రీను తెలియజేశాడు. కుంట శ్రీను మంథనికి వచ్చేలోపే వామన్ రావు మూడు కార్లలో గుంజపడుగు వచ్చాడు. అప్పుడు కుంట శ్రీను వామన్ రావు గురించి గుంజపడుగు బస్ స్టాప్లో వెయిట్ చేశాడు. వామన్ రావు వాళ్ళ ఇంటికి వారితో పాటు వచ్చిన ఒక వ్యక్తికి సన్మానం చేస్తుండగా కుంట శ్రీను వామన్ రావు ఇంటికి ఎదురుగా ఉన్నా పాత స్కూల్ బిల్డింగ్ నుంచి చూసి ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు వీలు కాదని చెప్పగా వామన్ రావుని హత్యా ప్లాన్ విరమించుకున్నారు. వామన్ రావు హత్య పథకంలో ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న క్రమంలో తేదీ 17.2.2021 రోజు మధ్యాహ్నం సమయంలో మంథని కోర్టుకి గట్టు వామన్ రావు దంపతులు వచ్చారు అని తెలిసి కుంట శీను బిట్టు శ్రీనుకి ఫోన్ ద్వారా తెలపగా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకో అని చెప్పగా అప్పుడు కోర్టు దగ్గర లో ఉన్న కుంట లచ్చయ్య కి ఫోన్ చేసి వామన్ రావు ఉన్నది నిజమని నిర్ధారణ చేసుకుని మరల చెప్పడం జరిగింది. వెంటనే బిట్టు శ్రీను శివనందుల చిరంజీవికి ఫోన్ చేసి నీ దగ్గర ఉన్న కత్తులు తీసుకొని అర్జెంట్గా మంథని బస్ స్టాప్ దగ్గరికి రమ్మని చెప్పినాడు. చిరంజీవి టూ వీలర్ పై కత్తులు తీసుకొని రాగా అంతలో బిట్టు శ్రీను తన కారును చిరంజీవికి ఇవ్వగా కత్తులు కార్ లో పెట్టుకుని కుంట శ్రీను వద్దకు వెళ్లి పోయాడు. కల్వచర్ల సమీపంలో వామన్ రావు, తన భార్య నాగమణి ఇద్దరిని చంపాము అని కుంట శ్రీను బిట్టు శ్రీను కి ఫోన్లో తెలపగా బిట్టుశ్రీను మంచిది, మీరు మహారాష్ట్రకు వెళ్లిపొండని చెప్పి బిట్టు శ్రీను ఇంటి వద్ద ఏం తెలియనట్టు ఉన్నాడు. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుగుతూ ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సి న అవసరం ఉంది. ఇంకా కొంతమంది సాక్ష్యులను కూడా విచారించి వారి వాంగ్మూలం నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉంది. నిందితులను అందరిని పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిస్థాయి విచారణ జరిపి వారు ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను పూర్తి స్థాయిలో నిర్ధారించాల్సి ఉంది. దీనికిగాను హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు మరియు సైబర్ క్రైమ్ పరిశోధకులను విచారణ సహాయకులుగా తీసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ గారు ప్రధాన విచారణ అధికారిగా సమగ్ర విచారణ చేస్తున్నారు. సాక్ష్యాలు గానీ,హత్యకు సంబంధించిన వీడియో లు సమాచారం,ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నవారు ముందుకు వచ్చి సమాచారం అందిస్తే, ఇచ్చిన ప్రతి అంశాన్ని దర్యాప్తులో నిర్ధారించుకొని పరిశోధనలో ముందుకు పోవడం జరుగుతుంది అంటూ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. -
కిరాణా షాపు బాకీ.. గర్భిణి అని చూడకుండా
రామగుండం: గోదావరిఖని సీతానగర్లో కిరాణం షాప్ నిర్వహించే కురుము అనూష అనే గర్భిణిపై ఆదివారం అదే ప్రాంతానికి చెందిన దాసరి శ్రీకాంత్ అలియాస్ పింటూ అనే యువకుడు కత్తితో దాడికి యత్నించాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనూషకు చెందిన కిరాణా షాపులో శ్రీకాంత్ సామాన్లు తీసుకెళ్లి వాటి మొత్తాన్ని చెల్లించే విషయంలో బాకీ పడ్డాడు. ఆదివారం షాపు దగ్గరికి వెళ్లి ఉద్దెర అడగగా పాత బాకీ చెల్లించకుండా ఇచ్చేది లేదని అనూష తేల్చిచెప్పింది. దీంతో శ్రీకాంత్ కత్తి చూపించి తననే డబ్బు చెల్లించమని అడుగుతావా అంటూ బెదిరించడంతో బాధితురాలి భర్త శ్రీనివాస్ ఇంట్లో నుంచి బయటికి వచ్చి అడ్డుకున్నాడు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఆమె కిందపడడంతో స్వల్పగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి ఎస్సై ఉమాసాగర్ చేరుకొని విచారణ జరిపి బాధితుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: క్రూరత్వం: గొలుసులతో కట్టేసి ఏనుగుపై దాడి -
న్యాయవాదుల హత్య: ‘ఆ ఆరోపణల్లో నిజం లేదు’
సాక్షి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ స్పష్టం చేశారు. న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణిలను పట్టపగలు నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని చాలెంజింగ్గా తీసుకున్నామని.. హత్య జరిగిన 24 గంటల్లోపే ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. మంథనికి సంబంధం లేని పోలీస్ అధికారులతో దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు. న్యాయవాద దంపతుల హత్య అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రామగుండం సీపీని ‘సాక్షి’ఇంటర్వ్యూ చేసింది. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 24 గంటల్లోపే అరెస్టు చేశాం.. గట్టు వామన్రావు, నాగమణిలను దారుణంగా పట్టపగలు, నడిరోడ్డు మీద హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణించి ఉన్నతస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. దంపతులపై దాడిచేసినవారిని 24 గంటలలోపే అరెస్టు చేశాం. వారికి రెక్కీగా ఉపయోగపడ్డ కుమార్ను అరెస్టు చేశాం. ఈ క్రమంలోనే శాస్త్రీయపరమైన దర్యాప్తులో బిట్టు శ్రీను పాత్ర బయటకొచ్చింది. అతడు కారు, కత్తులు సమకూర్చినట్టు తేలింది. మాతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రీయ, సాంకేతిక బృందాలు దర్యాప్తులో పాలు పంచుకుంటున్నాయి. విచారణలో నిందితులుగా తేలితే వారు ఎంతటివారైనా సరే కచ్చితంగా అరెస్టు చేస్తాం. శాస్త్రీయ విధానంలో దర్యాప్తు.. బిట్టు శ్రీను అనే వ్యక్తి మంథనికి చెందిన ఓ ప్రజాప్రతినిధి మేనల్లుడు. చిరంజీవి, కుంట శ్రీనుతో హత్యకు ముందు, తర్వాత చాలాసార్లు మాట్లాడాడు. వారికి కారు, కత్తులు ఇచ్చాడు. మరోవైపు ప్రధాన నిందితుడు కుంట శ్రీనుకు ఊరిలో ఉన్న ఇల్లు, పెద్దమ్మ గుడి, రామస్వామి గోపాలస్వామి గుడి వివాదాలతోపాటు వామన్రావు కుటుంబంతో విభేదాలు ఉండటంతో హత్యలో నేరుగా పాల్గొన్నాడు. బిట్టు శ్రీను కీలక పాత్ర వహించాడన్న ఆధారాలు దొరికిన తర్వాత శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేస్తున్నాం. కేసును ఇతర ప్రాంతాల వారే దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫోన్ సీజ్ చేశాం.. వామన్రావు తొలుత పుట్ట మధు పేరు ప్రస్తావించినట్లు వైరల్ అయింది నిజమే. ఒరిజనల్గా వామన్రావును వీడియో తీసిన వ్యక్తి ఫోన్ను సీజ్ చేశాం. ఎలాంటి మార్ఫింగ్లు, కటింగ్లు లేని ఒరిజనల్ వీడియోను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ(ఎఫ్ఎస్ఎల్)కి పంపిస్తున్నాం. అందులో పుట్ట మధు అనే పదం లేదు. ఐదు సెకన్లు ముందు వచ్చిందది. పెదాల కదలిక, సౌండ్స్ చూస్తే కరెక్ట్ అనిపించలేదు. అయినా నిజానిజాల కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపించాం. అవి కాకుండా చాలా వీడియోలు, ఆడియోలను 2018 కంటే ముందువి, ఇటీవల కాలంలోనివి వేరే వాళ్ల వాయిస్ కూడా కుంట శ్రీను వాయిస్గా పెడుతున్నారు. దర్యాప్తును ఇవి ప్రభావితం చేస్తాయి. ఘటనను ప్రత్యక్షంగా చూసిన చాలామంది సాక్షులను విచారించాం. వీడియోలను సేకరించాం. దర్యాప్తుకు ఉపయోగపడే వీడియోలు ఉంటే ఇవ్వాలని కోరాం. ఈ సమయంలో ఫేక్ వీడియోలు, ఆడియోలు వైరల్ చేయడం కరెక్ట్ కాదు. భద్రత అడిగితే ఇచ్చేవాళ్లమే.. వామన్రావు, నాగమణిలకు సంబంధించి కొన్ని కేసుల్లో వ్యాజ్యాలు వేయగా.. ఆ కేసుల విచారణ పూర్తయ్యే వరకు దంపతులిద్దరినీ తెలంగాణలోని ఏ పోలీస్స్టేషన్కు పిలవొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. వాటిని పాటించాం. లోక్ అదాలత్కు సంబంధించి ఒకటి రెండుసార్లు కానిస్టేబుల్ ఫోన్ చేస్తేనే ‘కంటెప్ట్ ఆఫ్ కోర్టు’అని వామన్రావు చెప్పారు. ఐదారు నెలలుగా వారితో ఎవరూ టచ్లో లేరు. వాళ్లకు ముప్పు ఉంటే లిఖితపూర్వకంగా పిటిషన్ ఇస్తే చర్యలు తీసుకొనేవాళ్లం. వాళ్లు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో కూడా మాకు తెలియదు. గుంజపడుగులో గొడవలు జరగకుండా పెట్రోలింగ్ చేశాం. కానీ ఇంత దారుణంగా హత్య చేస్తారని భావించలేదు. బ్యారేజీలో లోతు ఎక్కువ ఉండటంతో.. హత్య జరిగిన తరువాత ఆయుధాలను సుందిళ్ల బ్యారేజీలో వేసినట్లు తేలింది. వాటిని తీయాలని భావించినా, అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో గజ ఈతగాళ్లను పిలిపించాలని నిర్ణయించాం. ఆయుధాలను తీసే విషయంలో శ్రద్ధ చూపించలేదనే ఆరోపణల్లో నిజం లేదు. త్వరలోనే వాటిని వెలికి తీస్తాం. ఇక ఈ కేసును త్వరలోనే పరిష్కరిస్తాం. బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తరువాత ఈ కేసులో ప్రమేయం ఉన్నవారందరినీ అరెస్టు చేస్తాం. చదవండి: దంపతుల హత్య: ఆ సమాచారం ఇచ్చింది లచ్చయ్య నేను వజ్రాన్ని... మోసగాణ్ని కాదు: పుట్ట మధు -
న్యాయవాద దంపతుల హత్య: అదే కారణం
సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి దారుణ హత్య కేసులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్, మరోవ్యక్తి చిరంజీవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం రామగుండం పోలీసులు మీడియా సమావేశం నిర్వహించిన హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వామన్రావు, నాగమణి నిర్మిస్తున్న పెద్దమ్మగుడి వివాదం కారణంగానే ఈ హత్య జరిగిందని వెల్లడించారు. అక్కపాక కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే నిందితులు న్యాయవాద దంపతులను హత్యచేశారని తెలిపారు. ఘటన అనంతరం సుందిళ్ల వైపు వెళ్లారని, రక్తపు బట్టలను అక్కడి బ్యారెజ్లో పడేసి మహారాష్ట్రకు పారిపోయారని పేర్కొన్నారు. తనకు సంబంధించిన ప్రతి విషయంలో వామన్రావు అడ్డుపడుతున్నాడనే కారణంతోనే కుంట శ్రీనివాస్ ఈ హత్యకు పథకం రచించాడని చెప్పారు. పాతకక్షల కారణంగానే న్యాయవాద దంపతులను హత్య చేశారని పేర్కొన్నారు. బ్రీజా కారుతో తొలుత వామన్రావు వాహనాన్ని ఢీకొట్టారని, వామన్రావుపై చిరంజీవి, శ్రీనివాస్ కలిసి ఏకకాలంలో వారిపై దాడి చేసినట్లు వివరించారు. తొలుత కారులో ఉన్న నాగమణిపై కత్తులతో పాశవికంగా దాడిచేయడంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందినట్లు తెలిపారు. అనంతరం వేటకొడవళ్లతో వామన్రావుపై దాడికి తెగబడ్డారని వెల్లడించారు. కేసులో మరికొంత మంది విచారణ జరుగుతోందని, త్వరలోనే విచారణ పూర్తిచేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నుంచి కుంట శ్రీనివాస్ సస్పెండ్ న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు -
బొగ్గు గనిలో వాలిపోనున్న ‘సలార్’ టీమ్
రామగుండం: ప్రభాస్ హీరోగా ‘సలార్' సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ ఫైటింగ్ సన్నివేశాన్ని రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో త్వరలో సినీ నటుడు ప్రభాస్, ఇతర చిత్రబృందం వాలిపోనుంది. బొగ్గుగని ప్రాంతంలో ఫైట్ సీన్లు తెరకెక్కించనున్నారు. ఈ మేరకు ఓపెన్కాస్ట్ ప్రాంతంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర బృందం ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్ద సెట్టింగ్ పనులు మొదలుపెట్టారు. సెట్టింగ్ పనులు పూర్తవగానే నటీనటులు, చిత్రబృందం రానుంది. రెండు, మూడు రోజుల్లో సెట్టింగ్ పూర్తయి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్ర బృందంలోని ఒకరు చెప్పారు. పది రోజుల పాటు ఓపెన్ కాస్ట్ గనిలో షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే చిత్ర బృందానికి సింగరేణి అతిథి గృహాలను కేటాయించినట్లు సమాచారం. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, సంగీతం రవి బస్రూర్ అందిస్తున్నారు. దీనితోపాటు ప్రభాస్ ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాలు చేస్తున్నాడు. -
కారుణ్య చీకట్లు.. చావు వైపు తండ్రుల చూపు
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని యైటింక్లైన్ కాలనీకి చెందిన మల్లేశం (59) సింగరేణి ఓసీపీ1లో ఈపీ ఆపరేటర్గా పనిచేసేవాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కుమారుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో తన కుమారునికి ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ మల్లేశం గత సంవత్సరం మెడికల్ అన్ఫిట్ కోసం సింగరేణి మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ బోర్డు ఆయనను అన్ఫిట్ చేయలేదు. దీంతో తన కుమారుడికి వారసత్వ ఉద్యోగం రాదన్న మనోవేదనతో మల్లేశం ఈ నెల 3న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన రాజయ్య (59) ఆర్జీ2 పరిధిలోని పోతన కాలనీలో ఉంటూ ఓసీపీ 3లో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్నాడు. రెండున్నరేళ్ల క్రితం గుండె ఆపరేషన్ కావడంతో విధులకు దూరంగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కుమారుడికి వారసత్వ ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నం చేశాడు. గత డిసెంబర్ 20న కొత్తగూడెంలో సింగరేణి మెడికల్ బోర్డుకు వెళ్లివచ్చాడు. అయితే సానుకూలంగా స్పందన రాకపోవడంతో తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించలేకపోతున్నాననే మనోవేదనతో అదే నెల 22న పురుగు మందు తాగి చికిత్స పొందుతూ 27న తనువు చాలించాడు. సింగరేణి కుటుంబాల్లో ‘కారుణ్యపు’ చీకట్లకు ఈ రెండు సంఘటనలు ఉదాహరణలు. సాక్షి, పెద్దపల్లి : పిల్లలకు మంచి భవిష్యత్ను ఇవ్వాలన్న తపన, వారికి మంచి ఉద్యోగాలు రాకపోతే ఏమిటన్న బెంగ పలువురు సింగరేణి ఉద్యోగులను మృత్యువు వాకిట్లోకి నెట్టేస్తోంది. ‘మెడికల్ ఇన్వాలిడేషన్’ కాకపోవడం, పిల్లలకు వారసత్వంగా ఉద్యోగం ఇప్పించలేకపోతుండడంతో ఉద్యోగులు పదవీ విరమణకు ముందే జీవితాన్ని ముగిస్తున్నారు. ఏ విధంగా చనిపోయినా తమ వారసులకు వారసత్వ ఉద్యోగం లభిం చే వెసులుబాటు ఉండటంతో కొందరు విధిలేని పరిస్థితుల్లో బలవంతంగా తనువు చాలిస్తున్నారు. దశాబ్దాలుగా సేవలందిస్తూ.. సంస్థలో భాగమైన ఉద్యోగుల వారసులకు కూడా సింగరేణిలో ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీని ప్రకారం విధులు నిర్వర్తించడానికి ఆరోగ్యం సహకరించని ఉద్యోగులను మెడికల్గా అన్ఫిట్ అని పరిగణిస్తూ వారి వారసుల (కొడుకు, కూతురు, అల్లుడు)కు సింగరేణిలో ఉద్యోగం కల్పిస్తారు. పదవీ విరమణకు రెండేళ్ల ముందు వరకే ఈ కారుణ్య నియామకాలు వర్తిస్తాయి. ఆ తరువాత అవకాశం ఉండదు. కానీ సర్వీసు ఒకరోజు మిగిలి ఉండగా మృతిచెందినా, వారసులకు ఉద్యోగ అవకాశం ఉం టుంది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో తమ ఉద్యోగ విరమణ అనం తరం వారసులకు శాశ్వత ఉ పాధి చూపించాలనే తపనతో చాలామంది సింగరేణి ఉద్యోగులు కారుణ్య నియామకాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆరోగ్యంగా ఉన్న ఉ ద్యోగులు కూడా మెడికల్ ఇన్వాలిడేషన్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ దరఖాస్తులను మెడికల్ బోర్డు తిరస్కరించడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. పిల్లల భవిష్యత్కోసం తండ్రులు చివరకు ప్రా ణాలు కూడా తీసుకుంటుండడం ప్రస్తుతం సింగరేణి వ్యా ప్తంగా కలవరం సృష్టిస్తోంది. ఆరోగ్యం బాగోలేకపోతేనే.. కారుణ్య నియామకాల కోసం సింగరేణి మెడికల్ బోర్డు నెలలో కనీసం రెండుసార్లు కొత్తగూడెంలో భేటీ అవుతోంది. అప్పటివరకు వచ్చిన దరఖా స్తుల ఆధారంగా ఉద్యోగులను పరీక్షించిన వైద్యు లు, వారి ఆరోగ్యం ఉద్యోగం చేయడానికి అనువుగా ఉందా, లేదా అన్నది నిర్ధారిస్తారు. అన్ఫిట్ అయితేనే వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు మార్గం సుగమమవుతుంది. సదరు ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నాడని పరీక్షలో తేలితే అదే ఉద్యోగం లో కొనసాగాలని ఆదేశిస్తారు. 2018 ఏప్రిల్ 7 నుంచి 2021 జనవరి 6 వరకు 66 సార్లు మెడికల్ బోర్డు భేటీ కాగా, 12,117 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 7,524 మంది మెడికల్ అన్ఫిట్ అయ్యారు. 2,537 మంది ఉద్యోగుల దరఖాస్తులను తిరస్కరించారు. కాగా తమ వారసు ల భవిష్యత్కు బాటలు వేసే క్రమంలో మూడు, నాలుగు దశాబ్దాల శ్రమ అనంతరం ప్రశాంతమైన విశ్రాంత జీవితం గడపాల్సిన స్థితిలో సింగరేణి ఉద్యోగులు ఇలా వారసుల కోసం అర్ధంతరంగా తనువులు చాలిస్తున్న వ్యథ ప్రస్తుతం సింగరేణిని కలచివేస్తోంది. -
బూడిదకు భలే డిమాండ్
సాక్షి, జ్యోతినగర్ (రామగుండం): వ్యర్థం అనుకున్న బూడిదకు నేడు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఎన్టీపీసీ చేపట్టిన పరిశోధనలు సత్ఫలితాలిస్తోంది. బూడిద వినియోగంపై సంస్థ చర్యలు పలు పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నూతనంగా జియో పాలిమర్ గుళికల (కంకర), టైల్స్ తయారీకి శ్రీకారం చుట్టడంతో మరింత వినియోగంలోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బూడిద వినియోగం 118.23 శాతం మార్కుకు చేరిందంటే డిమాండ్ ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమవుతోంది. బ్రిక్స్, జియో పాలిమర్ గుళికల తయారీకి విరివిగా వినియోగిస్తున్నారు. తాజాగా టైల్స్ తయారీపైనా దృష్టి సారించారు. 32 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగం ఎన్టీపీసీలో 2,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నిత్యం 32 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగిస్తారు. దీంతో సుమారు 13 వేల మెట్రిక్ టన్నుల బూడిద వెలువడుతుంది. దీన్ని చిన్నతరహాæ పరిశ్రమలతోపాటు సిమెంట్, కాంక్రీటు, ఇటుకల తయారీ, రోడ్ ఎంబ్యాంక్మెంట్, వాణిజ్యపరంగా సిమెంటు, రహదారుల నిర్మాణం, లోతట్టు ప్రాంతాల్లో నింపడం కోసం టెండర్ల ద్వారా విక్రయిస్తున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 25,06,533 మెట్రిక్ టన్నుల బూడిద విడుదల కాగా 19,78,750 మెట్రిక్ టన్నుల బూడిదను వినియోగంచుకుని 78.94 శాతంగా నమోదు చేశారు. రానున్న రోజుల్లో 100 శాతం వినియోగానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వినియోగం ఇలా.. భవిష్యత్ ప్రణాళిక ►తెలంగాణ ప్రాజెక్టు యాష్పాండ్ కట్ట నిర్మాణం, రోడ్డు నిర్మాణాలు, సింగరేణి సంస్థ భూగర్భ గనులను నింపేందుకు పూర్తిస్థాయిలో బూడిద వినియోగానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ►తెలంగాణ ప్రాజెక్టు సమీపంలో పైలట్ ప్రాజెక్టుగా జియోపాలిమర్ రోడ్డు నిర్మించింది. సిమెంట్ వాడకుండా 70 శాతం బూడిదతోపాటు సిలికాన్, సోడియం హైడ్రాక్సైడ్తో రోడ్ల నిర్మాణం చేపట్టారు. ►కంకరకు బదులుగా బూడిద గుళికలను తయారు చేస్తున్నారు. 80 శాతం బూడిద, 20 శాతం రసాయన పదార్థాలతో యంత్రాల ద్వారా గుళికలను 10 ఎంఎం, 20 ఎంఎం, 40 ఎంఎం పరిమాణంలో తయారు చేస్తున్నారు. ►గుళికలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి వరంగల్ నిట్ ఆధ్వర్యంలో ప్రయోగాలు ప్రారంభించారు. 118.23 శాతం వినియోగం ఎన్టీపీసీ బూడిదను ప్రస్తుతం 118.23% వినియోగంలోకి తీసుకొచ్చాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 78.94% వినియోగించు కుంటూ రానున్న రోజుల్లో 100 శాతం వినియోగంలోకి తీసుకురానున్నాం. భవిష్యత్లో కూడా ఇదే విధానాలను అనుసరించి పూర్తిస్థాయి పలు అవసరాలకు ఉపయోగించేందుకు పరిశోధనలు చేయనున్నాం. బూడిదను వినియోగించే సంస్థలు, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవగాహ న కల్పిస్తున్నాం. – సునీల్కుమార్, సీజీఎం,ఎన్టీపీసీ రామగుండం -
లోన్ యాప్ వేధింపులు, సెల్ఫీ సూసైడ్!
సాక్షి, పెద్దపల్లి: ఆన్లైన్ లోన్ యాప్ మరో వ్యక్తి ప్రాణాలు తీసింది. అవసరానికి అప్పులు తీసుకున్న వ్యక్తిని అదే పనిగా వేధించడంతో బాధితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... విశాఖపట్నానికి చెందిన సంతోష్కుమార్ రామగుండంలోని ఓ ఎరువుల కర్మాగారంలో సైట్ ఇంచార్జిగా పనిచేసేవాడు. మల్కాపూర్లో ఇల్లు అద్దెకు తీసుకునే ఉండేవాడు. తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో సంతోష్ ఆర్థికంగా కుదేలయ్యాడు. దీంతో యాప్ లోన్ ద్వారా అప్పు తీసుకున్నాడు. వాటిని వాయిదాల ప్రకారం చెల్లించసాగాడు. అయితే, అసలు, వడ్డీ ఒకేసారి చెల్లించాలని సదరు యాప్ల నిర్వాహకులు వేధించసాగారు. అసలే ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంతోష్ వారి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడే ముందు అతను సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోను తన ఫ్రెండ్ సుబ్రహ్మణ్యంకు పంపించాడు. (చదవండి: లోన్యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు) అప్పులు తీసిన ప్రాణం వెంటనే స్పందించిన సుబ్రహ్మణ్యం అతన్ని గోదావరిఖని ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. విశాఖపట్పం నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు సంతోష్ను మెరుగైన వైద్యం కోసం వైజాగ్కు తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 23న మృతి చెందారు. సూసైడ్ సెల్ఫీ వీడియో ద్వారా సుబ్రహ్మణ్యం ఎన్టీపీసీ పోలీసులకు పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 5 లోన్ యాప్ల ద్వారా సంతోష్ రూ. 54 వేలు అప్పు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉదాన్లోన్ యాప్, రుపీ లోన్ యాప్, రూపేలోన్ యాప్, ఎఎఎ-క్యాష్ లోన్ యాప్, లోన్గ్రాన్ యాప్లలో అతను అప్పుగా తీసుకున్నట్టుగా సమాచారం. ఆయా యాప్ల యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అతని స్నేహితుడు సుబ్రహ్మణ్యం ఎన్టీపీసీ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని ఎన్టీపీసీ ఎస్సై స్వరూప్రాజ్ తెలిపారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. (చదవండి: వేధింపులకు కొన్ని స్టేజ్లు..!) -
సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం
సాక్షి, పెద్దపల్లి : సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్పల్లి భూగర్భ బొగ్గు గనిలో జంక్షన్ కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. గురువారం సాయంత్రం 66 లెవెల్లో 41 డీప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న సింగరేణి యాజమాన్యం సహాయక చర్యలు చేపట్టింది. అయితే స్థానిక అధికారుల ద్వారా ప్రమాదం నుంచి ముగ్గురు కార్మికులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. -
కల సాకారం, గాల్లో విన్యాసాలు!
సాక్షి, పెద్దపల్లి/రామగుండం: కృషి ఉంటే మనిషి రుషి అవుతాడు. తాను అనుకున్నది సాధించే క్రమంలో అద్భుతాలు సృష్టిస్తాడు. అచ్చం అలాగే రామగుండంలో ఓ యువకుడు అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించాడు. స్వయంగా పవర్ పారా గ్లైడర్ రూపొందించి అందులో విహరించాడు. దాదాపు ఇరవై నిమిషాల పాటు గాల్లో విన్యాసాలు చేసి చూపరులను ఆకట్టుకున్నాడు. వివరాలు.. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రైల్వే కాలనీ కి చెందిన ఆడెపు అర్జున్కు పారా గ్లైడర్ రూపొందించాడు. జెన్కో క్రీడామైదానంలో ట్రయల్ రన్ నిర్వహించి సక్సెస్ అయ్యాడు. కాగా బీకామ్ చదివిన అర్జున్ చిన్నప్పటి నుంచి పారా గ్లైడింగ్ అంటే ఇష్టం.(చదవండి: పచ్చని అడవికి నెత్తుటి మరకలు) ఈ క్రమంలో స్వయంగా తానే పారా గ్లైడర్ రూపొందించాలనే పట్టుదలతో మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం అమెరికా, ఇటలీ నుంచి 15 లక్షల విలువైన ఉపకరణాలు తెప్పించుకుని తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు. ట్రయల్ రన్లో భాగంగా 20 నిమిషాలు గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేశాడు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. తన కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. రాజధాని హైదరాబాద్లో జరిగే అడ్వెంచర్స్ ఈవెంట్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి గ్లైడర్లను పిలిపించి వివిధ కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వం, తమలాంటి యువతకు కూడా అవకాశం ఇవ్వాలని కోరాడు. -
రామగుండంలో కేంద్రమంత్రులకు నిరసన సెగ
సాక్షి, పెద్దపల్లి : రామగుండం ఎరువుల కార్మాగారాన్ని సందర్శించడానికి వచ్చిన కేంద్ర మంత్రులకు షాక్ తగిలింది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఆర్ఎఫ్సిఎల్ ప్లాంటు ఎదుట ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎంపీ వెంకటేష్ నేత ధర్నాకు దిగారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయితే అధికారులతో మాట్లాడి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు పునరావాసం కల్పిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. -
ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి అంత్యక్రియలు
సాక్షి, గోదావరిఖని(రామగుండం): ప్రభుత్వ లాంఛనాలతో మాజీ మంత్రి మాతంగి నర్సయ్య పార్థివదేహానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అనారోగ్య సమస్యతో మంగళవారం హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా నర్సయ్య పార్థివదేహాన్ని బుధవారం గోదావరిఖని కాకతీయనగర్లోని ఇంటివద్ద ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాష్ట్ర సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ చేరుకొని పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ నివాళి అర్పించారు. అనంతరం మాతంగి అంతిమయాత్రలో పాల్గొన్నారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మాతంగి నర్సయ్య నాలుగుదశాబ్దాలుగా తనకు సుపరిచితులన్నారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ చదువుకొని ఉన్నతస్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అన్నారు. ఈ ప్రాంతం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేక సమస్యలు పరిష్కరించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, రామగుండం కార్పొరేషన్ మేయర్ అనిల్కుమార్, డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమేందర్, గోదావరిఖని వన్టౌన్ సీఐ పర్శ రమేశ్, ఆర్ఐ శ్రీధర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
మద్యం మత్తు గొడవ హత్యకు దారితీసింది
సాక్షి, రామగుండం(కరీనంనగర్): గోదావరిఖని గాంధీనగర్లో శుక్రవారం రాత్రి ఇద్దరి స్నేహితుల మధ్య మద్యంమత్తులో జరిగిన వివాదం హత్యకు దారి తీసింది. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు, స్థానికుల వివరాల మేరకు..జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవిముత్తారం గ్రామానికి చెందిన చెన్నూరి మధుకర్(21) మేషన్ పని చేసుకుంటూ గోదావరిఖని హనుమాన్నగర్లో నివాసం ఉంటున్నాడు. లెనిన్నగర్కు చెందిన గద్దల వంశీ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. శుక్రవారం రాత్రి గాంధీనగర్ సింగరేణి క్వార్టర్లో నివాసం ఉండే తోటి స్నేహితుడైన గడ్డం అరుణ్ అలియాస్ సోను ఇంటికి వెళ్లి మద్యం తాగారు. మద్యంమత్తులో వంశీ, మధుకర్ మధ్య మాటమాట పెరగడంతో మధుకర్పై విచక్షణారహితంగా తలపై బరువైన ఇనుప సుత్తిలాంటి వస్తువుతో గద్దల వంశీ దాడిచేసి బాదడంతో మధుకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు కూపీ లాగుతున్నారు. సదరు సింగరేణి క్వార్టర్లో నివాసముండే అరుణ్తోపాటు, నిందితుడు గద్దల వంశీ పరారీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి పోలీసులు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వంశీ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. అయితే అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. -
ఎన్పీడీసీఎల్లో అన్న పేరుతో తమ్ముడు ఉద్యోగం
సాక్షి, రామగుండం: గోదావరిఖని చంద్రశేఖర్నగర్కు చెందిన గాదె రవీందర్ అనే వ్యక్తి తన సోదరుడు రామదాసు పేరు మీద 12 ఏళ్లుగా టీఎస్ఎన్పీడీసీఎల్లో ఉద్యోగంలో కొనసాగుతున్న విషయం విజిలెన్స్ విచారణలో తేలింది. గోదావరిఖని వన్టౌన్ సీఐ పర్శ రమేశ్ వివరాల మేరకు..గాదె రామదాసు, గాదె రవీందర్ ఇద్దరు కవలలు. పన్నెండు సంవత్సరాలక్రితం గాదె రామదాసుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ వ్యవస్థలో జూనియర్ లైన్మెన్గా ఉద్యోగంరాగా రవీందర్ ఉద్యోగంలో చేరాడు. పదోన్నతి పొందుతూ లైన్మెన్ వరకు చేరుకున్నాడు. గోదావరిఖని ఎన్పీడీసీఎల్ ఈ సెక్షన్లో లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. సర్టిఫికెట్లలో పేర్లుదిద్ది ఉద్యోగం చేస్తున్న క్రమంలో అధికారులకు అనుమానంరావడంతో ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో అసలు విషయం నిర్ధారణ కావడంతో రవీందర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. మంథని డివిజనల్ ఇంజినీర్ తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ∙ -
రామగుండం ఎమ్మెల్యే చందర్కు కరోనా
సాక్షి, పెద్దపల్లి : ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు కరోనా సోకింది. సింగరేణి వనమహత్సోవంలో పాల్గొన్న కోరుకంటి చందర్, రామగుండం మేయర్ డా. అనిల్లకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో గత వారం రోజులుగా మేయర్ హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. అయితే ఎమ్మెల్యే చందర్ కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. (ప్రముఖులపై కరోనా పంజా) ఇప్పటికే తెలంగాణలోని అధికార పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పటాన్ చెరూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గొంగిడి సునీత, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తాతో పాటు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కరోనా బారిన పడి కోలుకున్నారు.(కరోనా టీకాపై ఓ గుడ్న్యూస్) -
సిద్ధమవుతున్న రామగుండం ప్లాంటు
న్యూఢిల్లీ: రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంటు తిరిగి ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇక్కడ 99.58 శాతం పనులు పూర్తి అయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గోరఖ్పూర్ (యూపీ), సింద్రి (జార్ఖండ్), తాల్చేర్ (ఒడిషా) వద్ద ఉన్న ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇతర ఖాయిలా పడ్డ యూనిట్లలో పనులు జరుగుతున్నాయని వివరించింది. గోరఖ్పూర్, సింద్రి యూనిట్లలో 2021లో, తాల్చేర్ ప్లాంటులో 2023లో యూరియా ఉత్పత్తి కార్యకలాపాలు తిరిగి మొదలు కానున్నాయి. బిహార్లోని బరౌనిలో హిందుస్తాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్కు చెందిన యూనిట్ను సైతం పునరుద్ధరిస్తున్నారు. 77.60 శాతం పనులు పూర్తి అయిన ఈ ప్లాంటు వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఒక్కో ప్లాంటు వార్షిక సామర్థ్యం 1.27 మిలియన్ టన్నులు ఉండనుంది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా యూరియా తయారీ చేపట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో మూతపడ్డ ఈ అయిదు ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. -
సెప్టెంబర్ నుంచి రామగుండం ఎరువుల ఉత్పత్తి!
సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం ఎరువులు, రసాయనాల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్) సెప్టెంబరు నెలాఖరు నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి మన్ సుఖ్ మాండవీయకు సంబంధిత అధికారులు నివేదించారు. దేశంలోని ఐదు ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ ప్రక్రియపై మంత్రి ఆ శాఖ అధికారులతో కలసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గోరఖ్ పూర్, బరౌనీ, సింధ్రీలోని హిందూస్తాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ ప్లాంట్లు, రామగుండం ఎరువులు రసాయనాల సంస్థ, తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ప్లాంట్లపై సమీక్ష జరిగింది. కర్మాగారాల ఆర్థిక ప్రగతి, ఇతర అభివృద్ధి అంశాలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కర్మాగారాల పునరుద్ధరణ పనులను సత్వరం పూర్తి చేసేందుకు సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రామగుండం ఎరువుల రసాయనాల కర్మాగారం అభివృద్ధి పనులు ఇప్పటికే 99.53% పూర్తయ్యాయని, కరోనా వైరస్ సంక్షోభం తలెత్తిన కారణంగా కొన్ని చిన్న పనుల్లో కాస్త జాప్యం జరిగిందని ఈ సమావేశంలో అధికారులు మంత్రికి తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకల్లా రామగుండం ప్లాంట్లో ఎరువుల ఉత్పాదన మొదలవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. అలాగే గోరఖ్పూర్ ఎరువుల కర్మాగారం పనులు 77%, సింధ్రీ ప్లాంట్ పనులు 70%, బరౌనీ కర్మాగారం పనులు 69% పూర్తయ్యాయని అధికారులు వివరించారు. గోరఖ్ పూర్, సింధ్రీ, బరౌనీ ప్లాంట్లు వచ్చే ఏడాది మే నెలలోగానే పూర్తవుతాయన్నారు. ఒడిశాలోని తాల్చేర్ ఎరువుల కర్మాగారంలో ప్రస్తుతం ప్రాజెక్టు అవకాశాలపై అంచనా, డిజైన్ల రూపకల్పన పని కొనసాగుతోందని చెప్పారు. -
మృతుల కుటుంబాలకు రూ.40 లక్షలు పరిహారం
గోదావరిఖని(రామగుండం): ఓసీపీ బ్లాస్టింగ్లో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.40 లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. మంగళవారం ఉదయం షిఫ్టులో ఓసీపీ–1 ప్రాజెక్టులో జరిగిన బ్లాస్టింగ్లో నలుగురు కార్మికులు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి చేరుకుని యాజమాన్యం తీరుపై ఆందోళన నిర్వహించాయి. బాధిత కుటుంబాల కు కోరిన నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు జరిగిన చర్చలు కొలిక్కివచ్చాయి. ప్రమాదంలో మృతిచెందిన ఒక్కోకార్మికుడి కుటుంబానికి రూ.40 లక్షల చొప్పున రూ.1.20కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించారు. చర్చలు సఫలం కావడంతో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబాలకు అప్పగించారు. చర్చల్లో యాజమాన్యం తరఫున సింగరేణి డైరెక్టర్(పా) చంద్రశేఖర్, ఆర్జీ–3 జీఎం సూర్యనారాయణ పాల్గొనగా జెడ్పీ చైర్మన్ పుట్టమధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సీపీఐ జాతీ య నాయకులు, గుర్తింపు యూనియన్ నుంచి బి.వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, జాతీయ కార్మిక సంఘాల నాయకులు జనక్ప్రసాద్, రియాజ్అహ్మద్, రాజారెడ్డి, కెంగర్ల మల్లయ్య, సీతారామయ్య, గట్టయ్య పాల్గొన్నారు. ఆసుపత్రి వద్ద ధర్నా.. సింగరేణి యాజమాన్యం, ఓబీ కాంట్రాక్టు యా జమాన్యం వైఖరి నిరసిస్తూ కార్మిక సంఘాల నాయకులు బుధవారం ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. నష్టపరిహా రం చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, అడ్మిన్ డీసీపీ అశోక్కుమార్, ఏఆర్ కమాండెంట్ సంజీవ్, గోదావరిఖని, జైపూర్ ఏసీపీలు ఉమేందర్, నరేందర్, సీఐలు పర్శరమేశ్, వెంకటేశ్వర్లు బందోబస్తు పర్యవేక్షించారు. -
కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తా : బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి రామగుండం ఓపెన్ కాస్ట్ గనిలో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో అధికారులకు ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్లు అక్షయ పాత్రగా మారారని బండి సంజయ్ మండిపడ్డారు. సింగరేణి అధికారులు కాంట్రాక్టు కేటాయించి పనులపై పర్యవేక్షణ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలను గాలికి వదిలి వేయటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సింగరేణిలో ఓబీ పనుల్లో అధికార పార్టీ నేతలు బినామీలతో కాంట్రాక్టు పనులు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. సింగరేణి ప్రమాద విషయంలో కేంద్ర మంత్రులకు పిర్యాదు చేస్తానన్నారు. మృతి చెందిన కుటుంబాలకు కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. (ఓపెన్కాస్ట్ ప్రమాదం : వైఎస్ జగన్లా ఆదుకోవాలి) -
ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ..!
రామగుండంక్రైం: పొట్టకూటికోసం ఒకరు.. పిల్లల పోషణకు మరొకరు..కూతుళ్ల పెళ్లిళ్లు ఘనంగా చేయాలని ఓ తండ్రి.. కుటుంబానికి సాయంగా ఉంటానని ఓబీ సంస్థలో కార్మికులు గా చేరారు. మంగళవారం జరిగిన బ్లాస్టింగ్లో మృతిచెందిన నలుగురు కుటుంబాల దీనగాథ ఇదీ..(ఓపెన్కాస్ట్ ప్రమాదం : వైఎస్ జగన్లా ఆదుకోవాలి) పొట్టకూటి కోసం.. మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన రాకేశ్ తండ్రి రాజన్న మృతిచెందాడు. తల్లి సుశీల పొట్టకూటి కోసం ఇద్దరు కొడుకులు రవి ,రాకేశ్, కూతురు మౌనికను తీసుకుని గోదావరిఖనికి వచ్చి భగత్సింగ్ నగర్ ఉంటున్నారు. మౌనిక పెళ్లి చేయగా, పెద్ద కొడుకు రవి కూలీ పని చేసుకుంటున్నాడు. రాకేశ్ ఏడాది క్రితమే ఓబీ సంస్థలో పనిలో చేరాడు. ఎదిగిన కొడుకు మృతితో సుశీల కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కూతుళ్ల పెళ్లి కోసం.. బిళ్ల రాజేశం వ్యవసాయం చేసేవాడు. ఈయనకు భార్య ధనలక్ష్మి, కూతుళ్లు మధుప్రియ, మానస. కూతుళ్ల పెళ్లి కోసం వ్యవసాయం వదిలి ఓబీ సంస్థలో కార్మికునిగా చేరాడు. పెద్ద కూతురు మధుప్రియకు వివాహం చేయగా, చిన్న కూతురు మానసకు కూడా మంచి సంబంధం తీసుకొచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నాడు. ప్రమాదంలో మృతిచెందడంతో భార్య బిడ్డలు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పిల్లల భవిష్యత్ ఆగం కమాన్పూర్కు చెందిన బండ అర్జయ్య(42) ఓబీ కార్మికుడిగా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య ఊర్మిళ, కరీంనగర్లో బీఫార్మసీ చదువుతున్న కూతురు నవ్యశ్రీ, గర్రెపల్లి మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న కొడుకు అభిరామ్ ఉన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్ అందించాలని కలలుగన్న అర్జయ్య ప్రమాదంలో దుర్మరణం చెందడంతో పిల్లల భవిష్యత్తును తలచుకుంటూ ఊర్మిళ శోకసంద్రంలో మునిగిపోయింది. భార్యా, పిల్లలకు దూరం.. బ్లాస్టింగ్ ప్రమాదంలో మృతి చెందిన బండారి ప్రవీణ్కుభార్య విలాసిని, ఐదేళ్ల కూతురు హానిక, ఏడాదిన్నర కొడుకు విహాన్ ఉన్నారు. ప్రవీణ్ తండ్రి సాల్మన్ సింగరేణి సంస్థలో పనిచేసి రిటైర్ అయి మృతిచెందాడు. ప్రవీణ్ రెండేళ్లుగా ఓబీ సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రవీణ్ మృతితో భార్య, పిల్లలు ఒంటరయ్యారు. తాము ఎలా బతకాలని విలాసిని రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. -
ఓపెన్కాస్ట్ ప్రమాదం : వైఎస్ జగన్లా ఆదుకోవాలి
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి ఉపరితల గనిలో మంగళవారం జరిగిన ప్రమాదానికి కారణమైన వారిని సస్పెండ్ చేయాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎల్జి పాలిమర్స్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినట్లు సింగరేణి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకెళ్లమని బాధిత కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. రామగుండం రీజియన్, ఆర్జీ–3 డివిజన్ పరిధిలోని ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు–1 (ఓసీపీ–1) బొగ్గుగని ఫేజ్–2లో మట్టి తొలగిస్తుండగా జరిగిన ప్రమాదంలో కమాన్పూర్కు చెందిన బిల్ల రాజేశం (46), గోదావరిఖనికి చెందిన రాకేశ్ రాజన్న బెల్కివార్ (27), బండారి ప్రవీణ్ (37), కమాన్పూర్ (దాసరిపల్లి)కి చెందిన బండి అర్జయ్య (48)లు మృతిచెందగా, మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. (‘సింగరేణి’లో భారీ పేలుడు) కాగా, నష్ట పరిహారం విషయంలో సింగరేణి అధికారులతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు ఇంకా కొలిక్కిరాకపోవడంతో మృతుల కుటుంబసభ్యుల ఆందోళన కొనసాగుతోంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.30 లక్షలు ఇచ్చేందుకు కాంట్రాక్టర్ అంగీకరించాడు. అయితే కోటి రూపాయల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని కార్మిక సంఘాలు, కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. -
సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
-
‘సింగరేణి’లో భారీ పేలుడు
రామగిరి(మంథని) : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి ఉపరితల గనిలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, తోటి కార్మికుల కథనం ప్రకారం.. రామగుండం రీజియన్, ఆర్జీ–3 డివిజన్ పరిధిలోని ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు–1 (ఓసీపీ–1) బొగ్గుగని ఫేజ్–2లో మట్టి తొలగింపు పనులను సింగరేణి యాజమాన్యం ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఇక్కడ మట్టి తొలగించేందుకు నిత్యం బ్లాస్టింగ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం షిఫ్టు విధులకు వెళ్లిన కార్మికులు బ్లాస్టింగ్ కోసం ముందుగా వేసిన డ్రిల్స్లో బ్లాస్టింగ్ ఇన్చార్జి, డిప్యూటీ మేనేజర్ ఎ.మధు, ఓవర్మెన్ మామిడి సతీశ్ పర్యవేక్షణలో డిటోనేటర్లు అమర్చి, రసాయనాలు నింపుతున్నారు. 31వ డ్రిల్స్లో పేలుడు పదార్థాలు నింపిన కార్మికులు 32వ డ్రిల్ బోల్టర్ (పెద్ద బండరాయి)కి వేశారు. 10:25 గంటలకు అందులో డిటోనేటర్ అమర్చి రసాయనం నింపే పనిని కమాన్పూర్కు చెందిన బిల్ల రాజేశం (46), గోదావరిఖనికి చెందిన రాకేశ్ రాజన్న బెల్కివార్ (27), బండారి ప్రవీణ్ (37), ఎస్ఎంఎస్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికునిగా పని చేస్తున్న కమాన్పూర్ (దాసరిపల్లి)కి చెందిన బండి అర్జయ్య (48), కమాన్పూర్ మండలం సిద్దిపల్లి పంచాయతీ పరిధి శాలపల్లికి చెందిన కుందారపు వెంకటేశ్, జూలపల్లికి చెందిన బండి శంకర్, రత్నాపూర్ పంచాయతీ పరిధి రాంనగర్కు చెందిన కొదురుపాక భీమయ్య చేపట్టారు. ఈ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బిల్ల రాజేశం, రాకేశ్రాజన్న బెల్కివార్, బండారి ప్రవీణ్, బండి అర్జయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి వారి శరీర భాగాలు ముక్కలు ముక్కలయ్యాయి. కొద్ది దూరంలో ఉన్న వెంకటేశ్, బండి శంకర్, కొదురుపాక భీమయ్య తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను ఓ వాహనంలో గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుందారపు వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చెల్లాచెదురుగా పడిన నలుగురి శరీర భాగాలను మరో వాహనంలో తీసుకెళ్లారు. -
ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్లో భారీ ప్రమాదం
-
ఓపెన్ కాస్ట్లో ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఆర్జీ-3 ఓసీపీ-1లో మట్టి తొలగిస్తుండగా భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించి నలుగురు కార్మికులు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు కమాన్ పూర్కు చెందిన రాజేష్, అర్జయ్య, గోదావరిఖని చెందిన రాకేష్, ప్రవీణ్లుగా గుర్తించారు. కమాన్పూర్కు చెందిన వెంకటేశ్, రత్నాపూర్కు చెందిన బీమయ్య, జూలపల్లికి చెందిన శంకర్కు గాయాలు అయ్యాయి. గాయపడ్డ ముగ్గురికి గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు అంతా కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మట్టిలో బండరాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేయడానికి ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో క్షతగాత్రులను ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఐఎన్టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణలు పరామర్శించారు. ఆందోళనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రి వద్ద, ఓసీపీ-1 వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ ఘటనలో మృతిచెందిన నలుగురికి కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఐఎన్టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు. గాయపడ్డ ముగ్గురికి రూ. 50 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని, పేలుడుపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలన్నారు. (‘కింగ్కోఠి’లో 19 మందికి పాజిటివ్) -
తప్పుడు పోస్టింగ్ చేస్తే చర్యలు
సాక్షి, గోదావరిఖని : సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు చేసిన ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాను వేదికలుగా చేసుకొని వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లలో కొందరు వ్యక్తులు ఇతర మతాలను కించపరిచేలా సందేశాలు అప్లోడ్ చేయడం, సమాజంలో పరువు ప్రతిష్ఠ కలిగిన వ్యక్తులు, వ్యవస్థలపై దుమ్మెత్తి పోయడం బురద చల్లడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నారని అన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతువులను నమ్మొద్దని కోరారు. పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పోస్ట్ చేయాలని సీపీ సూచించారు. ముగ్గురిపై కేసు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గురించి తప్పుగా, కించపరిచేలా పోస్టింగ్ చేసిన ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. ధర్మారం పోలీస్స్టేషన్ ప రిధిలోని దొంగతురి్తకి చెందిన జుంజిపల్లి శంకరయ్య అలియాస్ శేఖర్, గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని యైటింక్లయిన్కాలనీకి చెందిన యాకుల తిరుపతియాదవ్, పెద్దపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఉయ్యంకర్ సాయి కిరణ్పై కేసు నమోదు చేశామన్నారు. -
‘అధికారుల నిర్లక్ష్యం వల్లే సంజీవ్ మృతి’
సాక్షి, హైదరాబాద్ : అధికారుల నిర్లక్ష్యం వల్లే సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతి చెందాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శనివారం ఆయన సంజీవ్ పార్థివ పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంజీవ్ మృతిపై కేంద్రమంత్రికి, మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. లాక్డౌన్ ఉన్న సమయంలో అధికారులు ఒత్తిడి చేసి ఆయనను విధుల్లోకి పిలిచారని ఆరోపించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత అధికారులదే అన్నారు. మైనింగ్ రూల్స్ ప్రకారం శిక్షణ ఉన్న కార్మికులనే విధుల్లోకి తీసుకోవాలి కాని, ఎలాంటి అనుభవం లేని సంజీవ్ను ఎలా పనిలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. (చదవండి : కార్మికుడి అదృశ్యం.. విషాదాంతం) కార్మికుల సంక్షేమం మరచి సంపాదననే ధ్యేయంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తప్పిపోయి పదిరోజులు అయినా కార్మికుని ఆచూకి కనుక్కోలోని స్థితిలో ఉంటే కార్మికుల కుటుంబాలకు భరోసా ఎలా అంధిస్తారని ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యం తక్షణమే సంజీవ్ కుటుంబాన్ని ఆదుకొని, వారిలో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యానికి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ నెల 7న సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–11గనిలోకి వెళ్లి అదృశ్యమైన సింగరేణి కార్మికుడు కొడెం సంజీవ్(58) .. 11 రోజుల గాలింపు తర్వాత జీడీకే–6ఏ గని ప్రాంతంలో 43వ లెవల్, 4 సీమ్, 1డీప్లో మృతిచెంది కన్పించాడు. మృతదేహాన్ని శుక్రవారం కుళ్లిపోయిన దశలో అధికారులు గుర్తించారు. గనిలో మొదటిషిప్టులో విధుల్లోకి వెళ్లిన సంజీవ్ ముందుగా కేటాయించిన పంపు వద్ద నీటిని క్లియర్చేసి, 1డీప్, 27వ లెవల్, 4వ సీమ్లో పంపు ఆపరేటర్గా పనులు చేపట్టాడు. విధుల అనంతరం బయటకు రావాల్సి ఉంది. ఈక్రమంలో దారి తప్పి మూసివేసిన జీడీకే–6ఏగని వైపు సీమ్లోకి గాలిలేని ప్రాంతానికి వెళ్లి ఊపిరాడక మృతిచెందాడని అధికారులు తెలిపారు. -
రామగుండంలో ‘కరోనా’ దడ!
సాక్షి, రామగుండం: ఈ నెల 14న ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో రామగుండం వచ్చిన 10 మంది ఇండోనేషియన్లు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. వారు రామగుండం రైల్వేస్టేషన్లో దిగిన తర్వాత సమీపంలో ఉన్న మజీద్కు వెళ్లేందుకు రైల్వేస్టేషన్ ఎదుట అటూఇటు తిరిగిన దృశ్యాలు సివిల్ పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇండోనేషియన్లు గంట పాటు అక్కడ తిరగడం, నమాజ్ చేసుకోవడం, తిరిగి అదే ప్రాంతంలో ఎంగేజ్ తీసుకున్న టాటాఏస్ వాహనంలో కరీంనగర్ వెళ్లడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో వారందరికీ కరోనా వైరస్ సోకిందన్న విషయం గుప్పుమనడంతో వ్యాపారులు, స్థానిక ప్రజల్లో దడ పుట్టింది. ఇండోనేషియన్లకు కరీంనగర్లో ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి, హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అదేవిధంగా వైరస్ వ్యాప్తి చెందకుండా కరీంనగర్లో ఇండోనేషియా బృందం బస చేసిన, తిరిగిన ప్రాంతాలపై అధికార యంత్రాంగం ఆంక్షలు విధించింది. అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం రామగుండంలో ఇండోనేషియన్లు తిరిగారని తెలిసినా స్థానికంగా అధికారులు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం లేదు. కనీసం వారు సంచరించిన ప్రాంతాల్లో బ్లీచింగ్ చేయకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు సైతం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కనీసం రైల్వేస్టేషన్ పరిధిలోని రెండు ప్లాట్ఫాంలపై ఎక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని పలువురు అంటున్నారు. మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు రైల్వేస్టేషన్ ఎదుట ఇప్పటికే మూడు సీసీ కెమెరాలు ఉండగా, ఇండోనేషియన్ల బృందం పర్యటించిన మరుసటి రోజు మరో రెండు హై ఫ్రీక్వెన్సీ కెమెరాలను రామగుండం ఎస్సై మామిడి శైలజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మరో రెండు చోట్ల అదనంగా రెండు కెమెరాలు బిగించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఏడు సీసీ కెమెరాలను రైల్వేస్టేషన్ ప్రవేశ ద్వారంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు సివిల్ పోలీసులు తెలిపారు. -
ఆ రైల్లో వచ్చి రామగుండంలో దిగిన వ్యక్తికి కరోనా
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యా సంస్థలను మార్చి 31 వరకు బంద్ చేయాలన్న సర్కారు... మ్యారేజ్ హాల్స్ మూసివేయాలని, పబ్లిక్ ఈవెంట్లు అన్నింటినీ రద్దు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకోగా.. వారు ప్రయాణించిన రవాణా మార్గాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.(తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు) ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి రామగుండానికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో సర్కారు అప్రమత్తమైంది. అతడితో ప్రయాణించిన వారి వివరాలు తెలుసుకునేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్కు ఈ మేరకు లేఖ రాసింది. బాధితుడు మార్చి 13న ఢిల్లీ నుంచి బయల్దేరి ఏపీ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్లోని ఎస్9 కోచ్లో ప్రయాణించి మరుసటి రోజు రామగుండం చేరుకున్నాడని పేర్కొంది. అతడికి రక్త పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా తేలిందని పేర్కొంది. కావున అతడితో పాటు అదే కోచ్లో ఉన్న ఇతర ప్రయాణీకుల వివరాలు ఇవ్వాల్సిందిగా కోరింది.(సీరియస్గా తీసుకోని.. అప్రమత్తంగా ఉండండి) ‘విదేశీ విమానాలను పూర్తిగా రద్దు చేయాలి’ -
ఒకవైపు కరోనా.. మరోవైపు స్వైన్ఫ్లూ..
సాక్షి, రామగుండం: ‘ఒకవైపు కరోనా.. మరోవైపు స్వైన్ఫ్లూ..’ ప్రాణాంతకమైన వైరస్లు ప్రజలను వణికిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎక్కువగా మాస్క్లు ధరించినవారే కనిపిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఎయిర్పోర్ట్ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ కుటుంబానికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానంతో పరీక్షలు చేసిన వైద్యులు చివరికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఈ కుటుంబం ఇటీవల చైనా నుంచి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అధికారులు మాత్రం బాధిత కుటుంబ వివరాలను గోప్యంగా ఉంచారు. చైనాలో తొలిసారిగా.. చైనాలో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ మనదేశంలోకి సైతం ప్రవేశించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తికి వ్యాధి తీవ్రత అధికంగా ఉండడంతోపాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీని ప్రభావంతో ఇప్పటికే చైనాలో చాలా మంది మరణించారు. అలాంటి వారిని ముట్టుకోవద్దు.. విదేశీ ప్రయాణాలు చేసేవారు తమ సహ ప్రయాణికులతో జాగ్రత్తగా ఉండాలి. జలుబు, గొంతులో గరగర, జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి.. ఎవరికైనా జలుబు చేసినట్టుగా అనిపిస్తే వారిని ముట్టుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలుత ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లుగా భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు నాణ్యత గల మాస్క్లను వాడడం మంచిది. వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి.. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మాస్క్లు ధరించాలి. తుమ్మినా, దగ్గినా చేతి రుమాలను అడ్డుగా పెట్టుకోవాలి. జలుబు చేసిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అపరిశుభ్ర చేతులతో ముక్కు, నోరు తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేసేవారు తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండడం మంచిది. అంతేకాక, ప్రజా బాహుళ్యం ఎక్కువగా ఉన్న చోట్ల అనవసరంగా ఏ వస్తువులను పడితే వాటిని తాకకూడదు. లక్షణాలు ఇవే.. కరోనా వైరస్ సోకితే జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఛాతిలో నొప్పి, వాంతులు తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు తీవ్రమైన న్యుమోనియోకు దారి తీసి ఊపిరాడక మనిషి మరణించే ప్రమాదమూ ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారికి జలుబు ఎక్కువగా ఉండి, ముక్కు కారుతూనే ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు, గొంతులో మంట ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది. అంతకు మించి ఈ వైరస్ సోకినా వారికి వేరే ఏ లక్షణాలు కనిపించవు. ఇక ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. రెగ్యులర్గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలని చెబుతున్నారు. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని ఎవరూ చేతులతో టచ్ చేయవద్దని, రోగులకు దగ్గరగా ఉండొద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. ఈ దేశాల్లోనూ వైరస్ ప్రభావం.. చైనాలోని బీజింగ్, షాంఘై, సౌత్ గాంగ్ డాంగ్ ప్రావిన్స్లోనూ చాలా మంది ఈ వైరస్ బారినపడ్డారు. దక్షిణకొరియా, జపాన్, థాయ్లాండ్లోనూ ఈ వ్యాధి కేసులు వెలుగు చూశాయి. చైనాలో అనేక కేసులు అధికారికంగా నమోదైనా ఇంకా వెలుగులోకి రాని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఎన్నికల్లో వారసులొస్తున్నారు..!
సాక్షి, పెద్దపల్లి : మున్సిపల్ ఎన్నికల బరిలో నేతల బంధుగణం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోందిజ చైర్పర్సన్ పీఠాలు లక్ష్యంగా కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాలకు నేతల వారసులొచ్చారు. ఇప్పటికే పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కోడలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మరో నలుగురు వారసులు పోటీపడుతున్నారు. ఇందులో ఎంతమంది కౌన్సిల్లోకి వెళుతారో అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. చైర్పర్సన్ పీఠం లక్ష్యం మున్సిపల్ చైర్పర్సన్ పీఠాలు లక్ష్యంగా నేతల కుటుంబీకులు అడుగులు వేస్తున్నారు. జిల్లా కేంద్రం పెద్దపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కోడలు మమతారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. తన కోడలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న మనోహర్రెడ్డి, పావులు కదపడంతో 21వ వార్డు నుంచి మమతారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 36 వార్డులకుగాను రెండింటిని టీఆర్ఎస్ ఇప్పటికే ఏకగ్రీవంగా కైవసం చేసుకొంది. ఎన్నికలు జరుగుతున్న 34 వార్డుల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొంటే, మమతారెడ్డి చైర్పర్సన్ కావడం లాంఛనమే. ఇక మంథనిలో తొలి చైర్పర్సన్ పీఠాన్ని అధిష్టించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ఇక్కడ చైర్పర్సన్ పీఠం లక్ష్యంగా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు తన భార్య శైలజను టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దింపారు. గతంలో మంథని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా ఉన్న శైలజ, చైర్పర్సన్ రిజర్వేషన్ జనరల్ మహిళ కావడంతో రేసులో ముందున్నారు. రామగుండంలోమాజీ ఎమ్మెల్యేల వారసులు.. జిల్లాలోని ఏకైక నగరపాలకసంస్థ రామగుండంలో మాజీ ఎమ్మెల్యేల కుటుంబీకులు బల్దియా బరిలో నిలిచారు. మున్సిపల్ చైర్మన్గా రామగుండంపై తనదైన ముద్ర వేసిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కోడలు లావణ్య కార్పోరేషన్ ఎన్నికల్లో తలపడుతున్నారు. గత కౌన్సిల్లోనూ లావణ్య కార్పొరేటర్గా ఉన్నారు. ప్రస్తుతం 39వ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉన్నత విద్యావంతురాలైన లావణ్య తన మామ వారసురాలుగా కార్పొరేషన్లో పోటీపడుతున్నారు. ఇక ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం తనయులు ఇరువురు పురపోరులో పోటీకి దిగడం విశేషం. మల్లేశం కుమారులు కిరణ్ 44వ డివిజన్ నుంచి, మధు 33వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. మరో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కాసిపేట లింగయ్య కూడా తన భార్య తారను రామగుండం కార్పొరేషన్ 11వ డివిజన్ నుంచి పోటీలో నిలిపారు. ఆమె గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల కుటుంబీకులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీపడుతుండడగా, ఇందులో ఎంతమంది ఫలితం పొందుతారో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
‘అందరికీ నమస్కారం..మాకూ చాల సంతోషం’
సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై పెద్దపల్లి జిల్లా పర్యటన బుధవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి గవర్నర్ మురిసిపోయారు. బట్టసంచుల తయారీ కేంద్రం, నాప్కిన్స్ సెంటర్ను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. కాసులపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో అమలవుతున్న పంచాసూత్రాల కార్యక్రమం, స్వచ్ఛ వాతావరణం, కిచెన్గార్డెన్లను చూసి ప్రశంసించారు. నందిమేడారం పంప్హస్ను చూసి మెచ్చుకున్నారు. ఈసందర్భంగా జిల్లా పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ రామగుండంలో గవర్నర్ పర్యటన హైలెట్స్.. ► జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్షిప్లో బుధవారం ఉదయం ప్రారంభమైన గవర్నర్ పర్యటన హైలెట్స్ ఇలా ఉన్నాయి.. ► 9:20 గంటలకు జ్యోతిభవనల్లో పోలీసుల గౌరవవందనం స్వీకరణ. ► 9:24 గంటలకు కాన్వాయ్తో స్పందన క్లబ్కు చేరుకున్నారు. ► 9:26 గంటలకు గవర్నర్ను స్టేజీపైకి ఆహ్వానించారు. ► 9:29 గంటలకు వందేమాతరం గీతాలాపన. ► 9:31 గంటలకు గవర్నర్కు పూల మొక్కను అందజేశారు. ► 9:32 గంటలకు పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన కార్యక్రమాలను ప్రారంభించారు. ► 9:33 గంటలకు శిక్షకుడు డాక్టర్ శివ, బాలికల కళరిపయట్టు ప్రదర్శన ► 9:52 గంటలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభం ► 9:58 గంటలకు గవర్నర్ తమిళసై ప్రసగం ముగింపు ► 9:59 గంటలకు కళరిపయట్టు శిక్షకుడు డాక్టర్ శివకు శాలువా కప్పి అభినందించిన గవర్నర్ తమిళసై ► 10:00 గంటలకు విద్యార్థులకు డిక్షనరీల పంపిణీ ► 10:02 గంటలకు గవర్నర్ తమిళసైకి డిక్షనరీ అందించిన పెద్దపల్లి డీఈవో బి.జగన్మోహన్రెడ్డి ► 10:03 గంటలకు కళరిపయట్టు ప్రదర్శించిన బాలికలతో గవర్నర్ తమిళసై, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కలెక్టర్ శ్రీదేవసేనలు గ్రూపు ఫొటో దిగారు. ► 10:05 గంటలకు ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్లో పర్యటన ముగించుకుని బసంత్నగర్కు బయలుదేరిన గవర్నర్ తమిళసై. బట్టసంచుల తయారీ కేంద్రం సందర్శన గోదావరిఖని(రామగుండం): బసంత్నగర్ సమీపంలోని ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద గల నాన్ ఒవెన్ క్యారీ బ్యాగుల(బట్ట సంచులు) తయారీ కేంద్రాన్ని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సందర్శించారు. గవర్నర్ దంపతులకు నిర్వాహక మహిళలు వేదపడింతుల మంత్రోచ్ఛారణాల మధ్య మంగళహారతులు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా కేంద్రంలో తయారమవుతున్న బ్యాగులు, వాటి సైజులు, ఇతర అంశాల గూర్చి గవర్నర్ తెలుసుకున్నారు. కలెక్టర్ శ్రీదేవసేన స్థానిక తయారీ విధానం, సంచుల నాణ్యత గురంచి స్వయంగా వివరించారు. అనంతరం గవర్నర్ కేంద్రం నిర్వాహక మహిళలతో మాట్లాడారు.అంతకుముందు ప్రముఖ పర్యాటక క్షేత్రమైన బుగ్గ రహదారికి సమీపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీపీ సత్యనారాయణ, డీసీపీ రవీందర్, ఎంపీపీ అనసూర్య, జెడ్పీటీసీ సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు. పోలీసుల గౌరవవందనం జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం పర్మనెంట్ టౌన్షిప్లోని జ్యోతిభవన్లో బుధవారం గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు పోలీసులు గౌరవవందనం చేశారు. అనంతరం కళరిపయట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు సమస్యల పరిష్కారానికి గవర్నర్కు వినతిపత్రాలు అంద జేశారు. వావ్.. గ్రేట్.. పెద్దపల్లిరూరల్: ‘అందరికీ నమస్కారం..మాకూ చాల సంతోషం’..అంటూ తెలుగులో రాష్ట్ర గవర్నర్ తమిళిసై మాట్లాడడంతో సభికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ మాట్లాడుతూ.. కాసులపల్లిలో డ్రైనేజీలను పూడ్చి మురుగునీరు నిల్వ లేకుండా చేసేందుకు సమష్టిగా భాగస్వాములై దోమరహిత గ్రామంగా దేశానికే ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఇంటింటికీ పండ్లు, కూరగాయల మొక్కలను అందించి వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డిని అభినందించారు. పంచసూత్రాలు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలందరిలో అవగాహనను పెంచి స్వచ్ఛతలో సంపూర్ణ ఫలితాలు సాధించడంలో సఫలమయ్యారని గ్రామ సర్పంచ్ దాసరి పద్మను ప్రశంసించారు. గ్రామంలోని కూర సరిత–మల్లారెడ్డి ఇంటి ఆవరణలో పెంచుతున్న కిచెన్ గార్డెన్ను గవర్నర్ పరిశీలించారు. ఇంటి ఆవరణలోని పెరటితోటలో ఉన్న కొత్తివీుర ఆకును చేతితో తెంపి వాసన చూసిన గవర్నర్ ఇంటి పంటను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఉల్లి మడిని చూసి అబ్బో..ఇప్పుడు ఉల్లికి ధర మండిపోతోంది. మీరు పండించి మంచి పనే చేశారు. ఇంటి ఆవరణలో కాసిన అంజీర పండ్లను చూసి రక్తవృద్ధికి, శుద్ధికి తోడ్పడే ఆరోగ్య లక్షణాలున్న పండ్ల చెట్లను పెంచడం అభినందనీయమని సరిత–మల్లారెడ్డి దంపతులను ప్రశంసించారు. అయితే ఈ మొక్కలను ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సొంత ఖర్చులతోనే అందరికీ పంపిణీ చేశారని ఆ దంపతులు పేర్కొనడంతో ఎమ్మెల్యే గ్రేట్ అని అన్నారు. గ్రామంలో అమలవుతున్న పంచసూత్రాల కార్యక్రమంలో భాగంగానే వీటిని పెంచుతున్నారని కలెక్టర్ శ్రీదేవసేన గవర్నర్కు వివరించారు. ఇంటిలోని తడి, పొడి, ఇనుము, సీసం తదితర వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించే బుట్టలను చూపించి ఈ ఇంటిలో పంచసూత్రాలను పూర్తిగా అమలు చేస్తున్నారని కలెక్టర్ చెప్పడంతో ఆ ఇంటికి పంచసూత్రాలు అమలైనట్టు నిర్ధారించే స్టిక్కర్ను గవర్నర్ స్వయంగా అంటించారు. అంతకముందు గవర్నర్కు గామంలో మంగళహారతులతో మహిళలు, చిందు కళాకారులు, కోలాట మహిళలు, వాయినంతో ఐకేపీ సభ్యులు, ఒగ్గుడోలు, గంగిరెద్దులతో పల్లె సంప్రదాయం ఉట్టిపడేలా ఎమ్మెల్యే, కలెక్టర్ ఘనంగా స్వాగతించారు. భారీ బందోబస్తు గవర్నర్ పర్యటన భారీ బందోబస్తు నడుమ ముగిసింది. మంగళవారం రాత్రి నుంచి మొదలుకొని గవర్నర్ వెళ్లే వరకు పోలీసులు పటిష్ట భద్రత చేపట్టారు. రామగుండం సీపీ వి.సత్యనారాయణ నేతృత్వంలో పెద్దపల్లి డీసీపీ పి.రవీందర్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్ పర్యవేక్షిస్తూ రోడ్డు మార్గంలో బందోబస్తు నిర్వహించారు. ఎన్టీపీసీ జ్యోతిభవన్, స్పందన క్లబ్ లోపలికి ముఖ్య నాయకులను, మీడియాను తప్ప ఇతరులను అనుమతించలేదు. -
లైఫ్ ఇద్దరిదైనప్పుడు లాస్ ఒక్కరికేనా...
సాక్షి, రామగుండం : ఈ రోజుల్లో కట్నం అనే ప్రసక్తి లేకుండా ఒక్క వివాహం కూడా జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. పేద, మధ్యతరగతి కుటుంబాలను ‘కట్నకానుకలు’ సతమతం చేస్తున్నాయి. ‘పెళ్లీడొచ్చిన కొడుకులు కట్నాలు తెచ్చే బంగారు బాతులు.. ఎదిగిన ఆడపిల్లలైతే..? తల్లిదండ్రుల గుండెలపై కుంపట్లు..’ అనే భావనతో ఉంటున్నారు. తరాలు మారుతున్నాయి.. నేటి యువతలో కూడా కొంగొత్తగా స్వరాలు ధ్వనిస్తున్నాయి. ఆదర్శ భావాలున్న ఆధునిక యువతరంలో అక్కడక్కడా కొత్తగా తొంగిచూస్తున్నాయి. ఒక వైపు తల్లిదండ్రుల పేదరికాన్ని గౌరవిస్తూనే.. మరోవైపు కట్నం కోసం పరితపించే వారి ఆలోచనల్ని సున్నితంగా మార్చేందుకు నేటి యువతరం ప్రయత్నిస్తోంది. ఇరువర్గాలను ఒప్పించి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. నేడు ‘వరకట్న వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. చట్టం చేసి పాతికేళ్లు దాటినా.. వరకట్నం నిషేధపు చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లు దాటింది. చట్టం అమలు చేయడంలో అనేక లోపాలు చోటు చేసుకుంటుండడంతో మహిళలు తీవ్ర మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. కోరి చేసుకున్న వివాహాల్లో కూడా కట్నం ప్రభావం చూపుతుండటం మహిళల పట్ల శాపంగా మారింది. పెరిగిపోయిన ధనాకాంక్ష, మానవ సంబంధాలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. అదనపు కట్నం కావాలంటూ అనేక రకాలుగా హింసిస్తున్న సంఘటనటున్నాయి. కొందరు ఇవన్నీ మౌనంగా భరిస్తున్నారు. ఇంకొందరైతే తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టంలేక లోకాన్ని వదులుతున్నారు. 498–ఏ చట్టంలో మార్పులు.. మహిళల కోసం ఏర్పాటు చేసిన వరకట్న నిషేధపు చట్టం ‘498–ఏ’ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా వరకు కట్నం సమస్య కాకపోయినా అవగాహన లోపంతో భర్తతో పాటు అత్తమామ, ఆడపడులు, ఇలా అందరిపై కేసులు పెట్టి మానసిక ఆందోళనకు గురి చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. 90 శాతం ఇలాంటి కేసులు ఎక్కువగా ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 498–ఏ చట్టంలో పలు మార్పులు చేసింది. ఫిర్యాదు చేసిన వెంటనే అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అవగాహన కల్పిస్తున్న వెబ్సైట్.. మ్యారేజ్ బ్యూరోలు, మాట్రిమోనియల్ వెబ్సైట్స్ ఉన్నప్పటికీ యువతీ, యువకుల మధ్యవర్తిత్వం నెరవడం వరకే వారి పనిగా మారింది. ‘కట్నం’ ఇత్యాది విషయాల్లో జోక్యం చేసుకునేందుకు సాహసం చేయలేక పోతున్నారు. ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ దేశంలోనే తొలిసారిగా కట్నం ప్రసక్తి లేకుండా వివాహం చేసుకునే యువతీ, యువకులను ప్రోత్సహించేందుకు పదిహేనేళ్ల క్రితం ‘ఐ డోంట్ వాంట్ డౌరీ.కామ్’ అనే పేరుతో హైదరాబాద్లో కొందరు వెబ్సైట్ను ప్రారంభించారు. ‘స్వయంవరం’ పేరుతో శ్రీకారం చుట్టిన ఈ వెబ్సైట్ సంస్థ నేటి తరం యువతతోపాటు పెద్దలు కూడా మారేలా అవగాహన కల్పిస్తోంది. వరకట్న నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని యైటింక్లయిన్కాలనీకి చెందిన టి.శ్రవణ్కుమార్– కృష్ణకుమారి అనే మాజీ సింగరేణి ఉద్యోగి దంపతులు ‘సదాశయ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థతో వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కట్నం తీసుకోకుండా వివాహాలు జరగాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేవలం ప్రచారం చేయడం వరకే పరిమితం కాకుండా కట్నం తీసుకోకుండా ఇంట్లో పిల్లలకు పెళ్లిల్లు చేసి ఆదర్శంగా నిలిచారు. 1982లో తన సోదరుడు శ్రీనివాస్కు గీత అనే అమ్మాయితో కట్నం లేకుండా వివాహం జరిపించాడు. అలాగే 2011లో తమ పెద్ద కుమారుడు విక్రంకు, సౌమ్య అనే అమ్మాయితో కట్నం తీసుకోకుండా వివాహం జరిపించారు. 2013లో కూడా వారి చిన్నకుమారుడు అన్వేష్కు సైతం శ్రవంతి అనే అమ్మాయితో కట్నం లేకుండా వివాహం చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రతీ ఏడాది ‘వరకట్న వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ దంపతులను ఆదర్శంగా తీసుకున్న మరో ఆరు కుటుంబాలు కూడా వారి పిల్లలకు కట్నం తీసుకోకుండా పెళ్లిళ్లు చేయడం గమనార్హం. సిరిసిల్లకల్చరల్: పెళ్లి ఇద్దరి జీవితాలను కలిపి శాశ్వతంగా నడిపించేది. జీవితం ఇద్దరిదైనప్పుడు ఒకరు మాత్రమే ఆర్థిక నష్టానికి ఎందుకు లోను కావాలి. అందుకే కట్నం అవసరం లేదనుకోవడం జరిగింది. 20 ఏళ్ల క్రితం జరిగిన విషయం. అప్పట్లో పెళ్లి కుదుర్చుకునే సందర్భంలో కట్నం విషయం అంతగా ప్రస్తావనకు రాలేదు. పైగా సమీప బంధువుల అమ్మాయి కావడం కూడా కారణం కావచ్చు. కట్నం అవసరం లేకుండానే పెళ్లి జరిగింది. – కనుకుంట్ల లక్ష్మీపతి– జ్యోత్న్న కట్నం వద్దన్నలింగమూర్తి దంపతులు గోదావరిఖనిలోని సింగరేణి సంస్థ ఓసీపీ–1లో సీనియర్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న చెవుడవరపు లింగమూర్తి–రాజరాజేశ్వరి దంపతులు కట్నం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సింగరేణిలో మెకానికల్ ఫోర్మెన్ చేస్తున్న తన పెద్ద కుమారుడు యోగేష్ప్రకాష్కు కట్నం తీసుకోకుండా రవళికతో 2017లో వివాహం జరిపించారు. కట్నం వద్దంటూ కుమారుడికి పెళ్లి జరిపించిన లింగమూర్తి దంపతులను పలువురు అభినందిస్తున్నారు. కట్నం ముఖ్యం కాదు.. గుణగణాలు ఉంటే చాలు.. అంటూ లింగమూర్తి దంపతులు వరకట్నానికి వ్యతిరేకంగా సమాజంలో పెద్దల మనసు మార్చడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇరువర్గాల పెద్దలను ఒప్పించి.. గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన గోలివాడ ప్రదీప్కుమార్ 2017లో కేరళ రాష్ట్రం వాయినాడు ప్రాంతానికి చెందిన షాజిత అనే యువతిని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన శిబిరంలో నెహ్రూ యువ కేంద్రం తరుఫున పాల్గొన్న ప్రదీప్కుమార్కు అదే శిబిరంలో పాల్గొన్న షాజిత పరిచయమైంది. తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఇరు వర్గాల పెద్దలను ఒప్పించారు. దీంతో కట్నం తీసుకోకుండా షాజితను పెళ్లి చేసుకున్నట్లు ప్రదీప్కుమార్ తెలిపాడు. పాప రితణ్య పుట్టడంతో చాలా హ్యాపీగా ఉన్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు దంపతులు. -
అసలేం జరిగింది?
సాక్షి, గోదావరిఖని(కరీంనగర్): సింగరేని సంస్థ రామగుండం డివిజన్ – 2 పరిధిలోని ఓసీపీ – 3 ప్రాజక్టులో సోమవారం ఉదయం జరిగిన డంపర్ ప్రమాదంపై డీడీఎంఎస్(డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ) అధికారులు కూపీ లాగుతున్నారు. ప్రమాదంలో కార్మికుడు మృతిచెందడాన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు అసలు ఏం జరిగింది.. ప్రమాదం ఎలా జరిగింది.. అనే వివరాలు ఆరా తీస్తున్నారు. డీడీఎంఎస్ అధికారులు బాలసుబ్రహ్మణ్యం, రంగారావు మంగళవారం ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే ఆర్జీ–2 ఏరియాకు చేరుకున్న అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతోపాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరించారు. సోమవారం రాత్రి 9గంటల వరకు సంఘటనపై విచారణ జరిపారు. నిబందనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నట్లు గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో బొగ్గు, ఓబీ వెలికితీత పనులు నిలిపివేయాలని ఆదేశించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన డీడీఎంఎస్లు ప్రమాదంపై డీడీఎంఎస్ అధికారులు ప్రాజెక్టు క్వారీ, హాలేజీ రోడ్లు, డంప్యార్డులను క్షుణ్ణంగా రక్షణ చర్యలను తనిఖీ చేశారు. సేఫ్టీ కమిటీ టీంలను మూడు బృందాలుగా విభజించి షావల్స్, హాలేజీ రోడ్లు, డంప్యార్డు వైపు రక్షణ చర్యలు తనిఖీ నిర్వహించారు. సేఫ్టీ మెజర్స్ ప్రకారం షావల్స్ పనిచేస్తున్నాయా లేదా? అనే విషయాలను సేఫ్టీ బృందం ద్వారానే చెప్పించారు. షావల్ నిలిచే ప్రాంతం ఎగుడు, దిగుడుగా ఉందా.. రెస్ట్ షెల్టర్ సేఫ్టీ ప్రాంతంలో ఉందా? ఆప్రాంతంలో రాత్రి పూట లైటింగ్ ఏవిధంగా ఉంది అనే విషయాలను సేఫ్టీ బృందం సభ్యులతో చెప్పించారు. సేఫ్టీ రూ ల్స్ ఏమి చెబుతున్నాయి? ఇక్కడ అమలు ఏవిధంగా ఉందనే విషయాలని సేఫ్టీటీం సభ్యుల ద్వారా తనిఖీ చేయించారు. రక్షణ విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీ పడేది లేదని, పూర్తిస్థాయిలో రక్షణచర్యలు చేపట్టిన త ర్వాతే పనులకు నిర్వహించేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఉత్పత్తి నిలివేయడం ఇదే ప్రథమం.. ప్రమాదంపై సీరియస్గా ఉన్న డీడీఎంఎస్ అధికారులు ప్రాజెక్టుకు చేరుకున్న వెంటనే పూర్తిగా పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు తాము చెప్పే వరకు పనులు ని ర్వహించొద్దని సూచించారు. సోమవారం రోజుంతా ఉత్పత్తి నిలిచిపోగా, మంగళవా రం ఉదయం 10 గంటల వరకు పనులు ప్రా రంభం కాలేదు. ఆతర్వాత కొద్దిగా వె నక్కి తగ్గిన డీడీఎంఎస్ అధికారులు మూడు షా వల్స్ ద్వారా ఓబీ పనులు నిర్వహించుకోవాలని, ఇంటర్నల్ డంప్యార్డు వద్దకే పనులు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. దీంతో పాక్షికంగా పనులు సాగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదాలపై విచారణ చేపట్టడం, సాక్షుల నుంచి వివరాలు సేకరించడం సాధారణంగా జరుగుతుండగా, ప్రాజెక్టులో పూ ర్తిగా ఉత్పత్తి నిలిపివేయడం ఇదే ప్రథమం. బాధ్యులపై చర్య తీసుకోవాలి ఓసీపీ–3లో జరిగిన ప్రమాద ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని టీబీజీకేఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈమేరకు డీడీఎంఎస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రక్షణ చర్యలు పాటించడంలో యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఏదైనా సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే కార్మికుడిని ప్రాజెక్టు అధికారి వ్యక్తిగతంగా బెదిరించి క్రమశిక్షణ లేఖలు ఇస్తున్నారని ఆరోపించారు. రక్షణ వైఫల్యంతోనే ప్రమాదం ఏఐటీయూసీ ఓసీపీ–3లో ప్రమాదానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. ఈమేరకు డీడీఎంఎస్కు వినతిపత్రం అందజేశారు. వంద టన్నుల సామర్థ్యం గల డంపర్ సంస్థాగతమైన రక్షణ ఏర్పాట్ల లోపాలతో ప్రమాదం జరిగి ఈపీ ఆపరేటర్ రమేశ్ మృతిచెందాడని తెలిపారు. అధిక పనిభారంతోనే ప్రమాదాలు.. సింగరేణి యాజమాన్యం పనిభారం పెంచడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని జీఎల్బీకేఎస్ రాష్ట్ర నాయకులు ఐ.కృష్ణ, ఇ.నరేష్, మల్యాల దుర్గయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. ఓసీపీ–3లో డంపర్ ఆపరేటర్ రమేశ్ ప్రమాదానికిగురై మరణించాడని తెలిపారు. సరైన రక్షణ చర్యలు యాజమాన్యం పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు. రమేశ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఆర్ఎఫ్సీఎల్కు రాజకీయ గ్రహణం
సాక్షి, రామగుండం: తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశంలో ఎరువుల కొరతను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ప్లాంట్ నిర్మిస్తున్నారు. ప్లాట్ నిర్మాణం 99.5శాతం పూర్తి కాగా, త్వరలో ప్రారంభం కానుంది. ఆర్ఎఫ్సీఎల్లో మరో ఆరునెలల్లో ఉత్పత్తి ప్రారంభం కానుండడంతో రాజకీయ గ్రహణం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ప్లాంట్లో పట్టుకోసం పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల జేఏసీలు ప్రయత్నిస్తున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లు.. కొందరు దళారులు తెరపైకి వచ్చి స్థానికులకు కాంట్రాక్టు ఉద్యోగాలిప్పిస్తామంటూ.. సొమ్ములు దండుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. 1970 అక్టోబర్ 2న ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) కంపెనీని స్థాపించారు. ఆ సమయంలో వీర్లపల్లి, లక్ష్మీపురం, అడ్డగుంటపల్లి, ఎల్కలపల్లి గ్రామాలకు సంబంధించిన 1284 ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్నారు. 1980 నవంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభించారు. దాదాపు 19 సంవత్సరాలపాటు సాగిన ఉత్పత్తిని నష్టాలు రావడంతో 1999 మార్చి 31న కంపెనీని మూసివేశారు. ఇందులో 1,069 పర్మినెంట్ ఉద్యోగులకు వీఎస్ఎస్ ద్వారా తొలగించారు. అలాగే రెండువేల మంది కాంట్రాక్ట్ కార్మికులను అర్దాంతరంగా రోడ్డున పడేశారు. తిరిగి ఆర్ఎఫ్సీఎల్గా పునరుద్ధరణ నష్టాల్లో ఉన్న ఎఫ్సీఐని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సుమారు రూ.5,254 కోట్లతో 2015 సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. పునరుద్ధరణ వ్యయం రూ.5,254 కోట్ల నుంచి రూ.6120 కోట్లకు పెరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 63శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 11శాతం, 26శాతం ప్రైవేట్ సంస్థలకు వాటాగా నిర్ణయించారు. కంపెనీలో ప్రతిరోజు 2,200 టన్నుల ఆమ్మోనియా, 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగేనా...? ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభ సమయంలో 2015 మార్చి 11న ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల, ప్రభావిత గ్రామల ప్రజలకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎఫ్సీఐ నిర్మాణానికి లక్ష్మీపురం, ఎల్కలపల్లి, జనగామ, వీర్లపల్లి గ్రామాల ప్రజలు ఎరువుల కర్మాగారం నిర్మాణానికి 1,284 ఎకరాల భూమిని ఇచ్చారు. అప్పట్లో ఉద్యోగాలు కల్పిస్తామన్న యాజమాన్యం ఇంత వరకు వారికి ఉద్యోగావకాశాలు చూపించలేదు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు, ప్లాంట్లో పనిచేసి వీఎస్ఎస్ ద్వారా ఉద్యోగ విరమణ చేసిన వారికి, కాంట్రాక్ట్ కార్మికులకు, ప్రభావిత గ్రామాల యువతకు ఉద్యోగాలు ఏ విధంగా లభిస్తాయో వేచి చూడాలి. రాజకీయ గ్రహణం.. ‘స్థానికులకు కాంట్రాక్టు ఉద్యోగం’ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తూ.. పలు రాజకీయ పార్టీలు ఆర్ఎఫ్సీఎల్లో ఇప్పటినుంచే పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. రోజుకో కార్మికసంఘం పేరిట ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. దీనికి తోడు ఆర్ఎఫ్సీఎల్ పునః ప్రారంభం అవుతుండడంతో పుట్టగొడుగుల్లా దళారులు పుట్టుకొస్తున్నారు.ఆర్ఎఫ్సీఎల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇప్పటికే కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఉద్యోగంపై ఉన్న ఆశతో యువకులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నట్లు సమాచారం.ఇప్పటికైనా యాజమాన్యం దళారీ వ్యవస్థను అరికట్టాల్సి అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. -
ఓసీపీ–2 వెనుకంజ
సాక్షి, రామగిరి(పెద్దపల్లి జిల్లా) : రామగుండం–3 ఏరియా పరిధిలోని ఓసీపీ–2 గని బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడుతోంది. ఈ యేడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు రెండు నెలల్లో మాత్రమే ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. మే నెలలో 2.70లక్షల టన్నుల లక్ష్యానికి 2.74 లక్షల టన్నులు సాధించి 102 శాతం, జూన్లో 2.05 లక్షల టన్నుల లక్ష్యానికి 2.53 లక్షల టన్నులు సాధించి 123 శాతం ఉత్పత్తి నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం జనవరిలో 2.0 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి 2.28లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 114శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించింది. ఈయేడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు వరుసగా మూడు నెలల్లో ఓసీపీ2 యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేదు. ఈ క్రమంలో ఈ యేడాది నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇదే ఏరియా పరిధిలోని ఓసీపీ–1లో అధికారులు యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తున్నారు. వర్షాల వల్ల ఉత్పత్తికి ఆటంకం మూడు నెలలుగా వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ఓసీపీ–2లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. గత సంవత్సరం సెప్టెంబర్లో 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈయేడాది సెప్టెంబర్లో 405 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీని వల్ల నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేకపోయాం. ఓసీపీ–1 పురాతన ప్రాజెక్ట్. వర్షపునీళ్లు లోతులోకి వెళ్లి పోవడంతో పాటు రోడ్లు చాలా కండీషన్గా ఉండడం వల్ల బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతోంది. ఈ నెల నుంచి ఓసీపీ–2లో యాజమాన్యం నిర్దేశించిన లక్ష్యాన్ని మించి ఉత్పత్తి సాధిస్తాం. – కె.సూర్యనారాయణ, జీఎం, ఆర్జీ–3 ఉత్పత్తి వివరాలు ఇలా.. నెల లక్ష్యం (లక్షల టన్నుల్లో) సాధించినది(లక్షల టన్నుల్లో) శాతం జనవరి 2.00 2.28 114 ఫిబ్రవరి 2.25 1.68 75 మార్చి 2.25 2.15 96 ఏప్రిల్ 2.70 2.34 87 మే 2.70 2.74 102 జూన్ 2.05 2.53 123 జూలై 2.05 1.77 86 ఆగస్టు 2.05 0.86 42 సెప్టెంబర్ 2.05 1.46 71 -
గిరి దాటని ‘ఖాకీ’లు
సాక్షి, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీస్స్టేషన్లలో పనిచేసే కొందరు ‘ఖాకీ’లు రెండుమూడు ఠాణాల పరిధిలోనే దీర్ఘకాలికంగా గిరిదాటకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఒక ఠాణాలో పనిచేస్తూనే మరొక ఠాణాలో అటాచ్డ్గా.. విధులను అదనంగా నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు పోలీసుల క్రిందిస్థాయి సిబ్బంది.. ఈ అటాచ్డ్ విధుల కోసం ప్రత్యేకంగా ఆయా ఠాణాల్లోనే అటాచ్డ్ విధులను కొనసాగిస్తున్నారు. ఆ కొందరికి మాత్రమే ఈ అటాచ్డ్ విధులను అప్పగించడం వెనుక ఆంతర్యమేమిటో అని మిగతా పోలీస్ సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కమిషనరేట్ పరిధిలో పోలీసుల బదిలీలు అనేకం జరిగినప్పటికీ.. ఆ కొందరు మాత్రం యథావిధిగా ఆయా ఠాణాల్లోనే బదిలీలు లేకుండా, కాకుండా ఎప్పటిలాగే విధులు నిర్వర్తిస్తున్నారు. అనేక మంది పోలీస్ సిబ్బంది పలు పోలీస్స్టేషన్లకు బదిలీలు అయినా ఆ వారు మాత్రం బదిలీలు వచ్చినప్పటికీ, బదిలీ కాకపోవడం వెనుక మతలబు ఏమిటో అంతుచిక్కడం లేదు. రాజకీయంలో జోక్యం.. కమిషనరేట్ పరిధిలోని కొందరు పోలీస్ సిబ్బంది రాజకీయ పలుకుబడితో తమకు నచ్చిన ఠాణాలకు బదిలీ చేయించుకుంటున్నారనే ఆరోపణలు సైతం వినవస్తున్నాయి. అదేవిధంగా మరి కొంతమంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్న పోలీస్స్టేషన్లోనే కొనసాగేలా రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా దీర్ఘకాలంగా పనిచేసే కొందరు సిబ్బందిని, అదేవిధంగా చాలా రోజులుగా ఒక ఠాణాలో పనిచేస్తూ మరొక ఠాణాలో అటాచ్డ్గా విధులు నిర్వర్తించే వారిపై సైతం ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు.. రామగుండం కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా కమిషనరేట్ ఉన్న ప్రాంతంలోని రెండు ఠాణాల్లో పని చేసే కొందరు కిందిస్థాయి పోలీస్ సిబ్బంది దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. రెండు సంవత్సరాలకు ఒకసారి పోలీసులు బదిలీలు జరుగుతున్పప్పటికీ కొందరు మాత్రం ఆయా ఠాణాల్లో పనిచేస్తూ ఇక్కడిక్కడే మరొక ఠాణాలో అటాచ్డ్గా పనిచేస్తున్నారు. ఆ కొందరి సిబ్బందికి అడ్డూ.. అదుపు లేకుండా ఇక్కడిక్కడే ఏళ్లతరబడి పనిచేస్తున్నారు. 95 శాతం బదిలీలు.. ఇటీవల జరిగిన పోలీసుల బదిలీల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 95 శాతం సిబ్బందికి బదిలీలు అయ్యాయి. జిల్లా మొత్తంలో పదుల సంఖ్యలో మాత్రమే బదిలీలు ఆగాయి. ఇటీవల జరిగిన గణేశ్, నవరాత్రోత్సవాలు, మొహర్రం పండుగల నేపథ్యంలో ఆయా సిబ్బంది స్టేషన్లలో విధుల నిమిత్తం ఉంచడం జరిగింది. కొంత మందికి మాత్రం కుటుంబసభ్యులు అనారోగ్యం కారణంగా, త్వరలో పదవీ విరమణ పొందే వారికి మాత్రం బదిలీలు ఆపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ డివిజన్ నుంచి మరో డివిజన్కు బదిలీ చేశాం. దీర్ఘకాలికంగా ఒకే చోట అటాచ్డ్గా ఎక్కువ కాలం విధులు నిర్వహిస్తున్న వారిపై దృష్టి సారిస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకుంటాం. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సిబ్బందిని గుర్తించి బదిలీ అయ్యేలా చూస్తాం. – టి.సుదర్శన్గౌడ్, పెద్దపల్లి డీసీపీ -
కొడుకులు పట్టించుకోవడం లేదని..
సాక్షి, రామగుండం : కనీ పెంచిన కొడుకులను పెద్ద చేసి ప్రయోజకులుగా చేసిన తనను పట్టించుకోవడం లేదని వృద్ధుడు గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అటువైపుగా వెళ్తున్న వారు గమనించి తాడుతో బయటకు తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ సంఘటన బుధవారం గోదావరిఖనిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల సంజీవరెడ్డి (90)కి నారాయణరెడ్డి, నర్సింహారెడ్డి కొడుకులు. కొన్నేళ్లక్రితం సంజీవరెడ్డి భార్య మృతిచెందగా, వృద్ధాప్యంలో ఇద్దరు కొడుకుల వద్దే జీవనం సాగిస్తున్నాడు. సంజీవరెడ్డి పేరుతో ఉన్న 20 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.3 లక్షల నగదు కొడుకులకు సమానంగా ఇచ్చాడు. అప్పటివరకు బాగానే చేరదీసి తిండిపెట్టిన వారు, భూమి పంపకాల అనంతరం పట్టించుకోకుండా తిండికూడా పెట్టలేదని సంజీవరెడ్డి వాపోయాడు. ఎక్కడైనా గంగలోకి దూకి చావమంటూ ఉచిత సలహా ఇవ్వడంతో ఏమిచేయాలో తోచక బుధవారం గోదావరిఖనిలోని గోదావరి నది వద్దకు చేరుకున్నాడు. బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కొందరు తాడు అందించి పైకిలాగి పోలీసులకు సమాచారం అందించారు. గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధుడిని టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. కొడుకులను పిలిచించి కౌన్సెలింగ్ చేసి వారికి అప్పగిస్తామని తెలిపారు. బ్రిడ్జిపై కంచె ఏర్పాటు చేస్తాం.. గోదావరి నదిపై నుంచి దూకి పలు ఆత్మహత్య ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో గోదావరి బ్రిడ్జిపై నుంచి ఎవరూ దూకకుండా ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయిస్తాం. కంచె ఏర్పాటుపై మున్సిపల్, ఎన్టీపీసీ అధికారులతో చర్చలు జరిపి త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తాం. ఆయాప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్, బ్రిడ్జిపై పోలీస్ ఔట్పోస్టింగ్ ఏర్పాటు చేయిస్తాం. ఏవైనా కుటుంబపరమైన గొడవలు జరిగితే పోలీసులను సంప్రదించి పరిష్కారమయ్యేలా చూసుకోవాలని ఏసీపీ కోరారు. – ఉమేందర్, గోదావరిఖని ఏసీపీ -
మంత్రాలు చేస్తానని చెప్పి లైంగికదాడి చేయబోతుంటే..
సాక్షి, రామగుండం : మంత్రాల నెపంతో అత్యాచారయత్నానికి పాల్పడగా.. మహిళ ప్రతి దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. 2 నెలల తర్వాత వెలుగు చూసిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గామండలం మొగల్పహాడ్(రాజాపూర్)లో జరిగింది. కుందనపల్లి పంచాయతీ అనుబంధ గ్రామమైన మొగల్పహాడ్కు చెందిన సింగరేణి ఉద్యోగి మూడారపు మల్లేశ్ ఇంట్లో 6 నెలల క్రితం చోరీ జరిగింది. దొంగలు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి మల్లేశ్, అతని భార్య సరిత మదన పడుతున్నారు. వీరి పాత ఇంట్లో అద్దెకు ఉన్న దుర్గం ప్రభాకర్ వీరి బాధను సొమ్ము చేసుకునేందుకు పథకం వేశాడు. దొంగతనం చేసిన వారిని గుర్తించే ఒక ముఠా ఉందని, వారిని సంప్రదిస్తే దొంగలు దొరుకుతారని మల్లేశ్ దంపతులకు నమ్మించాడు. ఇతని మాయమాటలను నమ్మిన వారు ముఠాను తీసుకురావాలని ప్రభాకర్ను కోరారు. మంచిర్యాల జిల్లా రెబ్బన మండలం కొమురవెల్లికి చెందిన దుర్గం ప్రకాశ్ను జూలైలో తీసుకొచ్చి బాధితులకు పరిచయం చేశాడు. చోరీ జరిగిన ఇళ్లంతా కలియతిరిగిన ప్రకాశ్.. ఇంటికి శాంతి పూజ చేయాలని తెలిపాడు. అందుకు రూ.18 వేలు ఖర్చవుతుందని పేర్కొనగా, చివరకు ఇద్దరి మధ్య రూ.పది వేలకు ఒప్పందం జరిగింది. అప్పటికప్పుడు రూ.3 వేలు మల్లేశ్ చెల్లించాడు. జూలై 26న రాత్రి 10 గంటలకు దుర్గం ప్రభాకర్, దుర్గం ప్రకాశ్ తన శిష్యులైన దుర్గం భీంరావు, తగిడి సోను వచ్చి పూజ ప్రారంభించారు. పూజలో మల్లేశ్ ఉండగా అర్ధరాత్రి వరకు కొనసాగుతున్న క్రమంలో ‘నీ భార్యలోనే దోషం ఉందని పేర్కొంటూ ఆమెను తీసుకువచ్చి పూజల్లో కూర్చో పెట్టాలి’అని ఆదేశించాడు. దీంతో సరితను తీసుకొచ్చి పూజల్లో కూర్చోబెట్టి మల్లేశ్ ఇంట్లోకి వెళ్లిపోయాడు. అనంతరం సరితపై ప్రకాశ్ లైంగికదాడికి యత్నించాడు. ఈ హఠాత్పరిణామంతో కోపోద్రిక్తులైన సరిత.. ఈల పీటతో ప్రకాశ్ మెడపై కొట్టడంతో కుప్పకూలాడు. ఈ విషయం సరిత భర్తకు చెప్పింది. అప్పటికే వేకువజామున కావడంతో మృతదేహాన్ని దుప్పటితో చుట్టి ద్విచక్ర వాహనంపై బసంత్నగర్ రైల్వే వంతెన మీద నుంచి కింద పడేశారు. నెల రోజుల తర్వాత రెబ్బన పోలీసులు దుర్గం ప్రకాశ్ మిస్సింగ్ కేసు గురించి తన అనుచరులు భీంరావు, సోనులతో కలసి పలుమార్లు ఇక్కడికి వచ్చి విచారించగా తమకేమీ తెలియదని బుకాయించారు. ఎన్నటికైనా విషయం బయటపడుతుందని భావించి మల్లేశ్ దంపతులు మంగళవారం అంతర్గాం పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి విచారించి మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటన స్థలంలో పూడ్చిన మృతదేహాన్ని బయటకు తీశారు. -
సింగరేణిలో మోగిన సమ్మె సైరన్
గోదావరిఖని(రామగుండం): సుదీర్ఘకాలం తర్వాత సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సంస్థలోని గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతోపాటు అన్ని జాతీయ సంఘాలు పిలుపు మేరకు ఒక్క రోజు సమ్మె ప్రారంభమైంది. కార్మికులు విధులకు గైర్హాజరై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె కారణంగా రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. దీంతో సింగరేణి యాజమాన్యానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో సమ్మె ప్రభావం లేకుండా చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. విధలకు హాజరయ్యే కార్మికులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చినప్పటికీ అరకొరగానే కార్మికులు విధులకు హాజరయ్యారు. బొగ్గు గనుల వద్ద బందోబస్తు సింగరేణి కార్మికులు ఒక్క రోజు సమ్మె ప్రకటించడంతో బొగ్గు గనుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. విధులకు హాజరయ్యే కార్మికులను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ ఉపేందర్ హెచ్చరించారు. గనుల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు పలు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా.. బొగ్గు పరిశ్రమల్లో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కార్మిక సంఘాలన్నీ ఏకమయ్యాయి. ఈ నెల 24న సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో మంగళవారం బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోనుంది. గతంలో జాతీయ కార్మిక సంఘాలు సమ్మె పిలుపునిస్తే, సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) వ్యతిరేకించేది. బొగ్గు పరిశ్రమలో వంద శాతం విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ సమ్మె చేయాలని నాలుగు జాతీయ కార్మిక సంఘాలు ఇటీవల నిర్ణయించాయి. సమ్మెకు గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ కూడా సమ్మెకు మద్దతు పలకడంతో సింగరేణిలో సమ్మె సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వరాష్ట్రంలో తొలిసారి మద్దతు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా టీబీజీకేఎస్ సమ్మెలో పాల్గొనాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చి జాతీయ సంఘాల సమ్మెకు మద్దతు పలికింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి కార్మికులు పలుమార్లు సమ్మె చేశారు. సకలజనుల సమ్మెలో సుదీర్ఘంగా 35 రోజులు పాల్గొని కార్మికులు తమ పోరాట స్ఫూర్తిని నిరూపించుకున్నారు. గతేడాది జూన్ నెలలో జాతీయ కార్మిక సంఘాలు మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చిన్పటికీ, టీబీజీకేఎస్ దానికి దూరంగా ఉండడంతో సింగరేణిలో కొంతమంది కార్మికులు విధులకు హాజరయ్యారు. ఈసారి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె జరుగుతోంది. మరోవైపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో కార్మికవర్గానికి జరిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మద్దతునివ్వకుంటే కార్మికవర్గంలో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో జాతీయ సంఘాలకు టీబీజీకేఎస్ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.73 కోట్ల ఉత్పత్తికి విఘాతం.. సింగరేణిలో రోజుకు రెండు లక్షల టన్నుల చొప్పున బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. మొన్నటి వరకు గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాలు కురువడంతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తరుచూ విఘాతం ఏర్పడింది. సాధారణంగా వర్షాకాలం యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిని కుదించుకుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే దిశగా యాజమాన్యం ప్రణాళిక రూపొందించుకుంది. సింగరేణిలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలలో ఇప్పటి వరకు 292.53 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. గత సంవత్సరంలో ఇదే కాలంతో పోలుచకుంటే 23.41 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అధికంగా జరిగినప్పటికీ, మిగతా ఆరు మాసాల కాలంలో 407.47 లక్షల టన్నుల ఉత్పత్తి సాధిస్తేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది. ప్రస్తుతం వర్షాలతో ఉపరితల గనుల్లో నెలకు సగటున 49 లక్షల టన్నుల మేరకు ఉత్పత్తి జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగతా ఆరు నెలల కాలంలో నెలకు 68 లక్షల టన్నుల చొప్పున ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఈ లెక్కన రోజుకు రెండున్నర లక్షల టన్నులకుపైగా బొగ్గు ఉత్పత్తి సాధిస్తేనే వార్షిక లక్ష్యం సాధ్యమవుతుంది. ప్రస్తుతం రోజుకు రెండు లక్షల టన్నుల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, సగటున 1.8 లక్షల ఉత్పత్తి జరుగుతోంది. సమ్మె జరిగితే రూ.50 కోట్ల మేర సింగరేణి యాజమాన్యానికి, రూ.23 కోట్లమేర సింగరేణి కార్మికులు జీతాల రూపంలో నష్టపోనున్నారు. బొగ్గు ఉత్పత్తి, కార్మికుల వేతనాలు కలిపి దాదాపు రూ.73 కోట్ల నష్టం జరుగనుంది. సమ్మెలోకి వెళ్లనున్న 48 వేల మంది కార్మికులు సింగరేణిలో మొత్తం 48,019 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ–1, 2, 3, ఏఎల్పీ డివిజన్లలో సింగరేణిలోనే అత్యధికంగా 16 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సమ్మెలో పాల్గొనాలని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్లు పిలుపునిచ్చాయి. దీనికి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ మద్దతునిస్తోంది. మరో జాతీయ కార్మిక సంఘమైన బీఎంఎస్ ఈ నెల 23 నుంచి 27 వరకు సమ్మెకు పిలుపునిచ్చింది. భాజపాకు అనుకూలంగా వ్యవహరించే బీఎంఎస్ సైతం కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండడంతో కోలిండియాలోనూ 24న సమ్మె ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని కార్మిక నేతలు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో సింగరేణిలో కార్మికుల సమ్మె సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. డిమాండ్లు ఇవే... బొగ్గు పరిశ్రమలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐలను) నిలిపివేయాలి. కోల్ ఇండియా మొత్తం విడదీయకుండా ఒకే కంపెనీగా ఉంచాలి. బొగ్గు పరిశ్రమలో ప్రైవేటీకరణను నిలిపివేయాలి. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి. నిలుపుదల చేసిన రిక్రూట్మెంట్లను వెంటనే చేపట్టాలి. సింగరేణిలో ఉన్న ఖాళీలను ఇంటర్నల్ కార్మికులతో భర్తీ చేయాలి. లాభాల్లో భాగస్వాములైన కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటా చెల్లించాలి. కారుణ్య నియామకాలు కార్మికులందరికీ వర్తింపజేయాలి. హైకోర్టు తీర్పు ప్రకారం రెండు సంవత్సరాలలోపు సర్వీస్ ఉన్న కార్మికులు అన్ఫిట్ అయినా వారి పిల్లలకు ఉద్యోగాలివ్వాలి. -
మిరాకిల్.. చావు నోట్లోకెళ్లి బయటపడ్డాడు!
సాక్షి, రామగుండం: నిజంగా ఈ కీమెన్ మృత్యువును జయించాడు. గూడ్సు రైలు వస్తుందని ఒక రైల్వే ట్రాక్పై నుంచి మరో ట్రాక్పైకి వెళ్లడం.. అంతలోనే అటువైపు నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అతనిపైకి దూసుకురావడం.. క్షణాల్లో అతను రైలు ఇంజన్ కిందికి దూరిపోవడం.. అయ్యో.. నుజ్జునుజ్జయి ఉంటాడని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారంతా ఆందోళన చెందడం.. ఇంతలోనే చావు నోట్లోకెళ్లి ప్రాణాలతో బయటపడటం.. ఇదంతా చూస్తుంటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది కదూ.. ఔను, ఈ కీమెన్ మృత్యు కోరల్లోకెళ్లి ప్రాణ గండం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలోని కుందనపల్లి రైల్వేగేటు వద్ద చోటుచేసుకుంది. కుందనపల్లి రైల్వేగేటు వద్ద కీమెన్ కత్తుల దుర్గయ్యతో రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యాడు. మూడు రైల్వే ట్రాకుల్లో ఒక ట్రాక్పై పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా గూడ్సు రైలు వస్తుండటంతో మరో ట్రాక్ మీదకు కార్మికులు చేరుకున్నారు. అప్పటికే అతి దగ్గరలో ఉన్న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్షణాల్లో కీమెన్ దుర్గయ్యపై దూసుకొచ్చింది. అప్రమత్తమైన ఆయన ఇంజిన్ కిందకు దూరిపోయాడు. రెండు బోగీలు అతని పైనుంచి వెళ్లాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు భయాందోళన చెందారు. రైలు కో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించాడు. సడెన్ బ్రేక్ వేసి రైలును కొద్ది దూరంలో నిలిపివేశాడు. అప్పటికే కీమెన్ పైనుంచి రెండు బోగీలు వెళ్లడంతో బాధితుడు నుజ్జునుజ్జు అయి ఉంటాడని అందరూ భావించారు. కానీ దుర్గయ్య పట్టాల మధ్యలో ప్రాణాలు బిగపట్టుకొని పడుకుని ఉన్నాడు. ఎడమ కాలి ఎముక విరిగి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అతడిని రైలు కింద నుంచి బయటకు లాగి హుటాహుటిన స్థానిక రైల్వే ఆస్పత్రికి తరలించారు. -
‘పాకిస్తాన్ దాడిని వాడుకొని మోదీ గెలిచారు’
సాక్షి, రామగుండం(కరీంనగర్) : ‘పాకిస్తాన్ దాడిని వాడుకొని మోదీ గెలిచాడు. కేంద్రంలో బీజేపీకి భారీ మెజార్టీ రావడం దురదృష్టకరం’ అని రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ ప్రాంగణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రావడంతో రైల్వే, ఎన్టీపీసీ పూర్తిగా ప్రయివేటుపరం అయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్షిప్(పీపీపీ) విధానాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కానుండడంతో కార్మిక రంగం మేల్కొనాల్సిన అవసరం ఉందన్నారు. గోదావరిఖని విప్లవాలకు పురిటిగడ్డని, తాను సింగరేణి కార్మిక సంఘాల్లో 30 ఏళ్లు పనిచేశానని, సమీపంలోని కేశోరాం కర్మాగారంలో కూడా ఐదేళ్లు ఏకగ్రీవంగా తనను కార్మిక సంఘం నాయకుడిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. దేశంలోనే రైల్వే వ్యవస్థ అతిపెద్ద కీలకమైన ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అని దీనిని ప్రైవేటీకరిస్తే సామాన్యుడికి రైలు ప్రయాణం ఖరీదవుతుందని అన్నారు. -
పంచాయతీలకు డిజిటల్ ‘కీ’
సాక్షి, పాలకుర్తి(రామగుండం): గ్రామ పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్ ‘కీ’ ద్వారా చెల్లింపులు జరిపేందుకు చర్యలు చేపట్టింది. ఈమేరకు దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. గతంలో గ్రామ పంచాయతీల్లో వినియోగించిన నిధుల విడుదల చెక్కుల రూపంలో ఉండేది. కొన్ని చోట్ల పంచాయతీల తీర్మానం లేకుండానే నిధులు దుర్వినియోగం చేస్తుండటంతో ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచులు సస్పెండ్కు గురికావడం, విచారణను ఎదుర్కోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో అలాంటి అక్రమాలకు చెక్పెట్టి పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‘కీ’ పేరుతో కొత్త విధానాన్ని రూపొందించింది. సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలతో.. గతంలో పంచాయతీ నిధుల వినయోగం విషయంలో గ్రామ కార్యదర్శితోపాటు సర్పంచ్కు జాయింట్ చెక్ పవర్ ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా సర్పంచ్, ఉప సర్పంచ్కు చెక్పవర్ కల్పించారు. దీంతో ఇద్దరి సంతకాలు సేకరించి డిజిటల్ ‘కీ’ల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను రూపొందించనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా సర్పంచులు, ఉప సర్పంచ్ల వివరాలు, వారి సంతకాలతో కూడిన ఫారంలను నింపి డిజిటల్ ‘కీ’ తయారీ కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈబాధ్యతను ప్రభుత్వం ఓప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి పనులను నిర్వహిస్తోంది. డిజిటల్‘ కీ’ ద్వారానే చెల్లింపులు.. పంచాయతీలకు మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులతో చేపట్టే పనులకు ఇక నుంచి డిజిటల్ ‘కీ’ ద్వారానే చెల్లింపులు జరుపనున్నారు. దీంతో జవాబుదారీతనం పెరిగి పంచాయతీ నిధుల స్వాహాకు చెక్ పడనుంది. తప్పుడు రికార్డులు, పనులు చేయకున్నా చేసినట్లు చూపే అవినీతి విధానానికి అడ్డుకట్టపడనుంది. దొంగ సంతకాలు, ఫోర్జరీలు చేసి నిధులను స్వాహా చేసే యత్నాలకు తావులేకుండా ఉంటుందని, ఈవిధానం ద్వారా నిధుల చెల్లింపులు జరుగుతాయి, ఏపనికి ఎంత చెల్లించాలనే విషయాలు స్పష్టంగా రికార్డు చేసి నిధులు విడుదల చేయనున్నారు. దీంతో పనులు చేయకుండానే నిధులు విడుదల చేస్తే దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి. చెక్కులకు కాలం చెల్లినట్లే.. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలల్లో నిధుల వినియోగానికి సంబంధించి చెక్కుల రూపంలో చెల్లింపులు జరిగేవి. ప్రతీ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఖాతాను తెరచి నిధులను ఖర్చు చేసేవారు. గ్రామ అభివృద్ధికి మంజూరైన నిధులను విడుదల చేసేందుకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఇద్దరు సంతకం చేసి ట్రెజరీ కార్యాలయానికి తీసుకెళితే అన్నీ సరిగాఉండి ఆమోదం పొందితేనే నిధులను విడుదల చేసుకునే అవకాశం ఉండేది. అయితే కొందరు తప్పుడు వివరాలు సమర్పించి నిధులను కాజేసిన సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. ఇలా జరుగకుండా ఉండేందుకు ప్రస్తుతం చెక్కుల విధానాన్ని తొలగించి ఈ–కుభేర్ ద్వారా బ్యాంక్లకు వెళ్లకుండా డిజిటల్ ‘కీ’ల ద్వారా నేరుగా బ్యాంక్ నుంచి చెల్లింపులు జరుగుతాయి. ప్రస్తుత 14వ ఆర్థికసంఘం నిధులు విడుదల చేసుకోవాలంటే చెక్కు అవసరం లేదు. ఆన్లైన్లో నమోదు చేసిన సర్పంచ్, ఉప సర్పంచుల డిజిటల్ సంతకాలను సరిపోల్చిచూసి, పంచాయతీ అధికారుల అనుమతి తర్వాత డిజిటల్ ‘కీ’ వస్తుంది. ఈ ‘కీ’లను ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించిన ట్రెజరీ కార్యాలయాలకు సమర్పించనున్నారు. ఆన్లైన్ ద్వారా లావాదేవీలు.. జిల్లా వ్యాప్తంగా 223 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఆన్లైన్ ద్వారా పనులు నిర్వహించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన ఇంటి నిర్మాణ అనుమతులు, ట్రైడ్ లైసెన్స్లు, ఆస్తి మార్పిడి, లే అవుట్ల అనుమతులకు సంబంధించిన సేవలను ఆన్లైన్లో చేపడుతున్నారు. ఈసేవలన్నీంటికీ గ్రామ పంచాయతీ కార్యదర్శిని బాధ్యులుగా చేసి వారి సంతకాలను కూడా డిజిటల్ చేశారు. వీటితోపాటు జనన, మరణ, వివాహా ధ్రువీకరణ పత్రాలను ఆయా గ్రామపంచాయతీల్లోనే జారీ చేయనున్నారు. ఈసేవలన్నీంటినీ ఆన్లైన్ ద్వారా అందిస్తుండటంతో అవినీతి, అక్రమాలకు చోటు ఉండదు. అదేవిధంగా నిధుల విడుదలలో డిజిటల్ ‘కీ’తో పాలన మరింత పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది. ఆన్లైన్ సేవలతో మేలు గ్రామ పంచాయతీల ద్వారా అందించే సేవలను ఆన్లైన్ విధానం ద్వారా అందుతుండటంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. వారు ఇబ్బంది పడకుండా స్థానికంగా అనేక సేవలను సులభంగా అందించే వీలు ఏర్పడుతుంది. ఇంటి నిర్మాణ అనుమతులు, జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలు సులభంగా పొందవచ్చు. –ఉదయ్కుమార్, పంచాయతీ కార్యదర్శి -
ఇండస్ట్రియల్ పార్క్కు గ్రీన్సిగ్నల్
రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతం సిగలో మరో పరిశ్రమ రాబోతోంది. శనివారం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ వెంకట నర్సింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ వనజాదేవి ఇండస్ట్రియల్ పార్క్ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా వనరుల లభ్యత (బొగ్గు, నీరు, విద్యుత్, రోడ్డు, రైలు రవాణా)ఉండడంతో ఉత్పాదక శక్తి మెరుగ్గా ఉంటుందని నిర్ణయించారు. ఫలితంగా అంతర్గాంలో ఇండస్ట్రియల్ పార్క్కు టీఎస్ఐఐసీ అధికా రుల బృందం అప్పటికప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్క్కు కేటాయించిన స్థల వివరాలను తెలియజేస్తూ.... అంతర్గాంలోని ఖాయిలాపడిన స్పిన్నింగ్, వీవింగ్ టెక్స్టైల్ విభాగానికి చెందిన 548.26 ఎకరాల విస్తీర్ణంలోని వంద ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్కు కేటాయించాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విజ్ఞప్తి చేయగా జేసీ వనజాదేవి ప్రత్యేక చొరవ తీసుకొని అంతర్గాంలోని టెక్స్టైల్ భూములు అనువైందిగా గుర్తించి సర్వే చేయించారు. వివిధ సర్వే నెంబర్లలో 102.20 ఎకరాల విస్తీర్ణం ఇండస్ట్రియల్ పార్క్ స్థాపనకు అనువుగా ఉంటుం దని గుర్తించారు. పార్క్కు కేటాయించిన స్థలంలో 57.23 ఎకరాలు గోలివాడ శివారు, మిగతా 44.37 ఎకరాలు రాయదండి శివారు స్థలంగా గుర్తించారు. ఇందులో ఏలాంటి నిర్మాణాలు లేకపోగా భూమి చదునుగా మైదాన ప్రాంతంగా ఉండడంతో ఇండస్ట్రియల్పార్క్కు అనువుగా ఉంటుందని జేసీ వనజాదేవి టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ వెంకట నర్సింహారెడ్డికి వివరించారు. త్వరలోనే స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అక్విజేషన్ (సీసీఎల్ఏ)కు బదిలీ చేసి టీఎస్ఐఐసీకి భూ బదలాయింపు చేయనున్నామన్నారు.ఇప్పటికే ఇండస్ట్రియల్పార్క్లో పది కంపెనీలతో సాఫ్ట్వేర్ ఉత్పత్తులు చేపట్టనున్నారని, ఇందులో ఇప్పటికే ఐదుగురు పారిశ్రామిక వేత్తలతో సంప్రదింపులు జరిపామని మరో ఐదు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉందన్నారు. ఇందులో ప్రధానంగా అర్హులైన బర్మా, కాందీశీకుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. నిరుద్యోగ సమస్య నిర్మూలనే ధ్యేయంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిరుద్యోగ యువకులు వేలాది ఉండడంతో అంతర్గాంలోని ప్రభుత్వ స్థలాల్లో పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సీఎం కేసీఆర్ సైతం భూమి అనుకూలంగా ఉన్న ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపట్టాలని పేర్కొనడంతో తాను ఆ దిశగా అడుగులు వేశానన్నారు. అంతర్గాంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో కనీసం ఆరు వేల మందికి ప్రత్యక్షంగా, పది వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. పరిశ్రమ స్థాపనకు స్థానిక ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతీ నియోజకవర్గానికిఒక పరిశ్రమ ఏర్పాటు.. ఉమ్మడి ప్రభుత్వ హయంలో రాజధాని హైదరాబాద్ చుట్టు పక్కల మాత్రమే పరిశ్రమలను స్థాపించడంతో ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుండేదని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించడంతో నియోజకవర్గానికి ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనేది ఆయన ధ్యేయమన్నారు. ఆ దిశగా తాము చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగానే రామగుండం నియోజకవర్గంలో పరిశ్రమ స్థాపనకు అంతర్గాం టెక్స్టైల్ భూములు అనువుగా ఉండడంతో త్వరలోనే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు బీజం పడనుంది. దశల వారీగా భూ లభ్యతను బట్టి పరిశ్రమలను విస్తరించే అవకాశం ఉంటుందన్నారు. మ్యాప్ సిద్ధం చేసి అప్పగించండి అంతర్గాం టెక్స్టైల్ భూములు పరిశ్రమల స్థాపనకు చాలా అనువుగా ఉందని టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి అన్నారు. సదరు భూమి నుంచి రైల్వేస్టేషన్, రాజీవ్ రహదారి, నేషనల్ హైవే, ఏయిర్పోర్టు, నీటి లభ్యత, బొగ్గు లభ్యత తదితర వివరాలతో కూడిన నూతన మ్యాప్ను సిద్ధం చేసి తమకు అప్పగించాలని కోరారు. అదే విధంగా ఇక్కడ వంద ఎకరాలు పోను మరో మూడు వందల ఎకరాలు తమకు అప్పగిస్తే మరో పెద్ద పరిశ్రమ స్థాపించేందుకు చర్యలు చేపడతామని ఎండీ నర్సింహారెడ్డి జేసీ వనజాదేవిని కోరగా సానుకూలంగా స్పందించారు. తమకు జేసీ భూనివేదికలు అందజేసిన మరుక్షణం నుంచే పరిశ్రమ స్థాపనకు చర్యలు చేపట్టనున్నామని ఎండీ పేర్కొన్నారు. స్థల పరిశీలనలో టీఎస్ఐఐసీ డీజీఎం విఠల్, కరీంనగర్ జోనల్ మేనేజర్ అజ్మీర, అంతర్గాం తహశీల్దార్ వంగల మోహన్రెడ్డి, టీటీఎస్ అంతర్గాం సర్పంచ్ కుర్ర వెంకటమ్మ, అంతర్గాం, పాలకుర్తి జెడ్పీటీసీలు ఆముల నారాయణ, కందుల సంధ్యారాణి, ఎంపీపీ దుర్గం విజయ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, సర్పంచుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు బాదరవేణి స్వామి, ధర్ని రాజేష్లతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి రూ.600కోట్లు గోదావరిఖని(రామగుండం): ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 600కోట్లు వెచ్చిస్తోందని టీఎస్ఐఐసీ చైర్మెన్ బాలరాయమల్లు, ఎండీ వెంకటనర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చందర్తో కలిసి మాట్లాడారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 42 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 3,500ఎకరాల భూమిని గుర్తించగా, తెలంగాణా ఏర్పడిన తర్వాత ఇండస్ట్రియల్ పార్కుల కోసం 1.43లక్షల ఎకరాల భూమిని ల్యాండ్ బ్యాంకుగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఇండస్ట్రియల్ పార్కులు కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు తర్వాత అగ్రి పొడక్ట్ ఏర్పాటు చేసే పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. దీనికోసం 15చోట్ల భూమిని గుర్తించామన్నారు. ఫుడ్, అగ్రికల్చర్, ఇన్ఫాస్ట్రక్చర్ కోసం 14ట్రస్టీ ఏరియాలు గుర్తించే పనిలో ఉన్నామన్నారు. టెక్స్టైల్స్, ఇంజినీరింగ్, ఏరోస్పేస్, పార్మా పార్కుల ఏర్పాటు కోసం మ్యాపింగ్ తయారు చేస్తున్నామన్నారు. -
కాంగ్రెస్ టు బీజేపీ.. వయా టీడీపీ, టీఆర్ఎస్
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : రాజకీయ అరంగేట్రంలో అరితేరిన సోమారపు సత్యనారాయణ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది రోజులకే కాషాయ కండువా కప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీల్లో కీలక పాత్ర పోషించిన ఆయన ప్రస్తుతం బీజేపీలో చేరి అన్నివర్గాల్లో చర్చలేపుతున్నారు. ఏపార్టీలో ఉన్నప్పటికీ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవికి డైరెక్ట్గా ఎన్నికలు నిర్వహిస్తే తాటు పోటీలో ఉండి విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్న ఆయన బీజేపీలో చేరడంతో ఈ ప్రాంతంలో బీజేపీకి పట్టు పెరిగే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఇంజినీర్గా పనిచేసిన సోమారపు సత్యనారాయణ మొదట కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. నోటిఫైడ్ ఏరియాగా ఉన్న ఈప్రాంతంలో 1998 జూన్ 30న నిర్వహించిన మొట్టమొదటి రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ సాధించి టీడీపీ అభ్యర్థి గోపు అయిలయ్యయాదవ్పై గెలుపొందారు. 2004 జూలై 2 వరకు చైర్మన్గా కొనసాగినప్పటికీ పలు కారణాల వల్ల అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో మంథనికి మారారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్బాబు చేతిలో ఓడిపోయారు. పునర్విభజనలో మేడారం నియోజకవర్గం రద్దయి రామగుండం జనరల్ నియోజకవర్గంగా మారడంతో తిరిగి మళ్లీ ఇక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. రామగుండం ఎమ్మెల్యేగా.. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి బాబర్ సలీంపాషాపై విజయం సాధించాడు. ఆతర్వాత వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్లో చేరిన ఆయన తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగడంతో కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. 2014లో టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసి ప్రత్యర్థి ఆలిండియా పార్వర్డ్బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్పై విజయం సాధించాడు. 2016లో తెలంగాణా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బరిలో దిగి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్పై ఓటమి పాలయ్యారు. తిరిగి కోరుకంటి చందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఇరువురి మధ్య రాజకీయ వైరం ప్రారంభమైన క్రమంలో టీఆర్ఎస్ సభ్యత్వ సేకరణలో తమను గుర్తించలేదని, కనీసం సభ్యత్వం కూడా ఇవ్వలేదని పేర్కొంటూ ఈనెలలో రాజీనామా చేశారు. బీజేపీ తీర్థం.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన వారం రోజుల్లోగా బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధిష్టానం చర్చించడంతోపాటు ఇద్దరు ఎంపీలు తన ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో ఆదివారం రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. -
రాజకీయాలకు దూరంగా ఉంటా
-
‘బాల్క సుమన్ను నిందించడం సరికాదు’
సాక్షి, పెద్దపల్లి : రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమారపుతోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి కోసం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పనిచేశారని ఆరోపించారు. కాగా సత్యనారాయణ ఆరోపణలపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవకాశవాద రాజకీయాలు చేస్తూ పార్టీని దిగజార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఓటమికి కారణం బాల్కసుమన్ అనడం సరికాదని హితవు పలికారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులను సత్యనారాయణ అణదొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసు పెరిగేకొద్దీ ఆయన బాలఖాళిలోకి వెళ్తున్నారని చురకలంటించారు. కొడుకుని రాజకీయాల్లోకి తెచ్చేందుకే సత్యనారాయణ పార్టీని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆయన టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు సముచిత న్యాయం చేసిందన్నారు. (చదవండి : టీఆర్ఎస్కు సీనియర్ నేత గుడ్ బై) -
టీఆర్ఎస్కు సీనియర్ నేత గుడ్ బై
సాక్షి, పెద్దపల్లి : రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమారపుతోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడారు. ఈ విషయాన్ని మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో సోమారపు వెల్లడించారు. పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్లనే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి కోసం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పనిచేశారని ఆరోపించారు. తను ఏ పార్టీలో చేరనని.. ఇండిపెండెంట్గానే ఉంటానని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించుకుంటానని అన్నారు. అయితే గత కొంత కాలంగా టీఆర్ఎస్లో స్థానికంగా నెలకొన్న వర్గపోరు కారణంగానే సోమారపు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా, సోమారపు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి ఇండిపెండెంట్గా గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సోమారపుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను ఆర్టీసీ చైర్మన్గా నియమించింది. అయితే గతేడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మాత్రం సోమారపు సత్యనారాయణ, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి కోరుకంటి చందర్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత చందర్ కేటీఆర్ సమక్షంలో తిరిగి టీఆర్ఎస్లో చేరారు. గతంలో రామగుండం మేయర్గా ఉన్న కొంకటి లక్ష్మీనారాయణపై అవిశ్వాసం పెట్టడంలో కీలక భూమిక పోషించిన సోమారపు తన పంతం నెగ్గించుకున్నారు. దీంతో కొంకటి లక్ష్మీనారాయణ మేయర్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అయితే సోమారపు ఓటమికి టీఆర్ఎస్లోని ఓ వర్గం ప్రధాన కారణమనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. -
విధులకు వెళ్తూ అనంతలోకాలకు..
సాక్షి, జ్యోతినగర్(రామగుండం): ‘నాన్నా మాకు దిక్కెవరు.. పనికి వెళ్తున్నానని చెప్పి ఇలా వెళ్లిపోయావా.. రోడ్డు పాడుగాను నిన్ను మాకు దూరం చేసిందా.. ఇక మాకు నాన్నలేడా’.. అని నాగపురి రాజయ్య మృతదేహం వద్ద కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం రామగుండం మండలం మల్యాలపల్లెకు చెందిన నాగపురి రాజయ్య(48) ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు డీఎం ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం విధుల కోసమని సైకిల్పై మల్యాలపల్లె నుంచి రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టుకు వస్తున్న క్రమంలో లేబర్ గేట్ క్రాస్ చేసే సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో రాజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు మృతదేహం వద్ద రోదించారు. మృతుడికి భార్య కొమురమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోడ్డుపై నిలిచిన ట్రాఫిక్.. రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందడంతో గోదావరిఖని వైపు వెళ్లే వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ట్రాఫిక్, ఎన్టీపీసీ పోలీసులు సంఘటనా స్థలం వద్ద ట్రా ఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి కారణౖ మెన కారును ఎన్టీపీసీ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లా రు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గోదావరిఖ ని ప్రభుత్వం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. సర్వీసు రోడ్డు లేకనే ప్రమాదం.. రాజీవ్ రహదారిపై బీ–పవర్ హౌస్ నుంచి సర్వీసు రోడ్డు లేకపోవడంతోనే మల్యాలపల్లెకు చెందిన రాజయ్య మృతిచెందాడని కాంట్రాక్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసు రోడ్డు ఉంటే మెయిన్ రోడ్డుపైకి రాకుండా ఉండేవాడని, పట్టపగలే నిండు ప్రాణం పోవడంపై వారు రోడ్డు నిర్వాహకులు, సంబంధిత ప్రజాప్రతినిధుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 18న హైకింగ్ రెస్టారెంట్ ఎదుట రహదారిపై జరిగిన ప్రమాదంలో గోదావరిఖని హనుమాన్నగర్కు చెందిన కారు డ్రైవర్ నూతి రమేశ్ మృతిచెందిన విషాదం నుంచి ప్రజలు కోలుకోకముందే మరో ప్రమాదం జరగడంపై ఆవేదన చెందుతున్నారు. పట్టింపులేని ప్రజాప్రతినిధులు.. రాజీవ్ రహదారిపై సర్వీసు రోడ్డు లేకపోవడంతో వరుస రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలను కోల్పోవడంతో పాటు చాలామంది అంగవైకల్యానికి గురవుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రోడ్డులో ఉన్న సర్వీసు రోడ్డును నిర్మించలేని వారు ఇంకా ఆయా కాలనీలలో ఉన్న సమస్యలు ఏం పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పడు పరామర్శించడం మానుకుని సర్వీసు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. -
బాలికపై స్కూల్ అటెండర్ వేధింపులు
సాక్షి, గోదావరిఖని(కరీంనగర్): అభం శుభం తెలియని చిన్నారిపై పాఠశాలలో పనిచేసే తాత్కాలిక అటెండర్ అఘాయిత్యానికి యత్నించిన విషయం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో సర్వర్ అనే వ్యక్తి తాత్కాలికంగా అటెండర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిన్నారితో అటెండర్ రెండు రోజుల క్రితం(శనివారం) అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి నుంచి తప్పించుకున్న చిన్నారి ఈవిషయాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో సోమవారం ఉదయమే బాలిక తల్లిదండ్రులు, కాలనీవాసులు పాఠశాలకు చేరుకొని చిన్నారిని లైంగికంగా వేధించిన సర్వర్కు దేహశుద్ధి చేశారు. ప్రధానోపాధ్యాయుడు స్వరూప్చంద్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాఠశాలకు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఐదు నెలల క్రితం లైంగిక దాడికి యత్నం.. సర్వర్ సదరు బాలికపై ఐదు నెలల క్రితం కూడా లైంగిక దాడికి యత్నించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. గతంలో అసభ్యకరంగా ప్రవర్తించినా చిన్నారి భయపడి విషయం తమకు చెప్పలేదని, మళ్లీ అలాగే ప్రవర్తించడంతో శనివారం ఏడ్చుకుంటూ వచ్చి విషయం చెíప్పిందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు స్థానికులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. విద్యార్థి సంఘాల ధర్నా పేదరికంతో ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే పాఠశాల సిబ్బందే లైంగిక వేధింపులకు పాల్పడడంపై విద్యార్థి సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. నిందితుడు సర్వర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సుమారు గంటపాటు ధర్నా చేసిన అనంతరం పోలీసుల జోక్యంతో విరమించారు. సర్వర్ను విధుల నుంచి తొలగించిన ఎంఈవో విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన సర్వర్ను అటెండర్ విధుల నుంచి తొలగిస్తూ మండల విద్యాధికారి డానియేల్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, బెదిరించినా బాధితులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వర్పై చర్య తీసుకోవాలని పోలీసులను కోరారు. గోదావరిఖనిటౌన్(రామగుండం): అభం శుభం తెలియని చిన్నారిపై పాఠశాలలో పనిచేసే తాత్కాలిక అటెండర్ అఘాయిత్యానికి యత్నించిన విషయం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో సర్వర్ అనే వ్యక్తి తాత్కాలికంగా అటెండర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిన్నారితో అటెండర్ రెండు రోజుల క్రితం(శనివారం) అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి నుంచి తప్పించుకున్న చిన్నారి ఈవిషయాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పింది. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో సోమవారం ఉదయమే బాలిక తల్లిదండ్రులు, కాలనీవాసులు పాఠశాలకు చేరుకొని చిన్నారిని లైంగికంగా వేధించిన సర్వర్కు దేహశుద్ధి చేశారు. ప్రధానోపాధ్యాయుడు స్వరూప్చంద్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాఠశాలకు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
కూలుతున్న త్రిలింగేశ్వరాలయం
గోదావరిఖనిటౌన్(రామగుండం): శివశివ ఏమి త్రిలింగేశ్వరాలయ దుస్థితి. తెలంగాణ ప్రాంతంలోనే అతి పురాతనమైన కట్టడాల్లో ప్రత్యేకస్థానం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామం లోని త్రిలింగేశ్వరాలయం. కాకతీయులు 12 శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారు. గతంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ ఆలయం కొంతకాలంక్రితం మూ త పడింది. గ్రామస్తుల చొరవతో పదేళ్లక్రితం పున: ప్రారంభమైంది. ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తాత్కాలిక పనులు చేపట్టి ఆలయంలో తిరిగి పూజలు జరిగేలా చూస్తున్నారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఆలయంలో భాగమైన భీమన్న ఆలయం పూర్తిగా కూలిపోయింది. ఆలయం కూలి వారం రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం సందర్శించలేదు. ఇప్పటికి ఎ లాంటి చర్యలు జరపలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పురాతన ఆలయ సంపదను కాపాడుకోవాలని కోరతున్నారు. ఎండోమెంట్ అధికారులు, పాలకులు చొరవ తీసుకొని తిరిగి పున:నిర్మించాలని కోరుతున్నారు. పర్యటన తప్ప చేసిందేమీ లేదు గతంలో రాష్ట్ర పర్యాటకశాఖ డైరెక్టర్ విశాలాచ్చి జనగామ త్రిలింగేశ్వర ఆలయాన్ని సందర్శించి త్రీడి విధానంతో పున: నిర్మించి ప్రత్యేకత చాటుతామని చెప్పి రెండేళ్లు దగ్గర పడుతున్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పురాతన కట్టడాలకు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ప్రతీ కట్టడానికి నంబర్లు వేశా రు. కొన్ని కట్టడాలు తొలగించి ఆలయ ప్రాంగణం లో పెట్టారు. కొంతకాలంగా ఆదరణ లేక కొన్ని విగ్రహాలు ఆరుబయటే ఉంటున్నాయి. సింగరేణి, ఎన్టీపీసీ, ఇతర సంస్థల సహకారంతో పూర్వ వైభవం తీసుకొస్తామని డైరెక్టర్ విశాలాచ్చి, ఇతర అధికారులు హామీఇచ్చారు. ఆలయంలో మరుగుదొడ్లు, సేద తీరేందుకు ప్రత్యేక గదులు, బాత్ రూంలు, కల్యాణ మందిరం, పార్కింగ్ స్థలం, ఇతర సౌకర్యా లు లేవు. సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలు ఆలయ నిర్మాణంకోసం కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
రామగుండం ఎన్టీపీసీని సందర్శించిన కేసీఆర్
సాక్షి, రామగుండం: పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రామగుండం ఎన్టీపీసీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఎన్టీపీసీలో సీఎం కేసీఆర్ విస్త్రత సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలుత రామగుండం ఎన్టీసీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్-1 ప్లాంట్ను సీఎం కేసీఆర్ సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. పవర్ ప్లాంట్కు సంబంధించిన పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్లాంట్కు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పెద్దపలి, జయశంకర్ జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు కేసీఆర్ రామగుండం వచ్చారు. పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రికి ఎన్టీపీసీలోని జ్యోతిభవన్లో కేసీఆర్ బస చేస్తారు. ఇక రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయాన్ని కేసీఆర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపు హౌస్, మేడిగడ్డ బరాజ్ పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లో భాగంగా తెలంగాణ కోసం రామగుండం ఎన్టీపీసీలో 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తుండగా, తొలి విడుతలో చేపట్టిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులు శరవేగం గా జరుగుతున్నాయి. రూ.10,598.98 కోట్ల వ్యయంతో రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను 2016 ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ పవర్ స్టేషన్ కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రెండు టీఎంసీల నీటిని కేటాయించారు. ప్లాంట్ నిర్మాణం కోసం మే 2015లోనే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. కాగా, దీనికి ఒడిశాలోని మందాకిని-బీ మైన్ నుంచి బొగ్గు సరఫరా చేస్తారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ పర్యావరణ అనుమతులను కూడా సాధించగా, పనులు శరవేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన -
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..
సాక్షి, రామగుండం : ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే క్షక్ష్యతో ఆమె భర్త ఇంట్లో పెట్రోల్పోసి ఇంటిల్లిపాదిని హత్యచేయాలని కుట్రపన్నాడు.. కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్దపల్లి డీసీపీ సుదర్శన్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని జనగామ గ్రామానికి చెందిన గాదె అవినాష్కు మందమర్రి పట్టణానికి చెందిన సింధూతో వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందే ఆమెతో పాటు చదువుకున్న మందమర్రి పట్టణానికి చెందిన ముదాం రవి ప్రేమపేరుతో వెంటపడ్డాడు. అమ్మాయి తల్లిదండులు అతడితో పెళ్లికి నిరాకరించి అవినాష్తో వివాహం జరిపించారు. తాను ప్రేమించిన సింధూను అవినాష్ వివాహం చేసుకున్నాడని అప్పటి నుంచి కక్ష్య పెంచుకున్నాడు. ఆమెను కలవడానికి కూడా చాలాసార్లు జనగామ వచ్చి వెళ్లినట్లు డీసీపీ తెలిపారు. ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించడంతో ఈవిషయమై సింధూ, రవిపై మంచిర్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని రెండుసార్లు పిలిపించి కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. అయినా పద్ధతి మార్చుకోక ఆమెపై ప్రేమను పెంచుకుని అవినాష్ను బెదిరిండంతో పాటు మందమర్రికి వెళ్లిన సమయంలో అతడి కారుపై దాడిచేసి కారు అద్దాలు కూడా పగులగొట్టాడు. ఈక్రమంలో దమ్ముంటే తన ఊరికి రా అని అవినాష్ అనడంతో మరింత కక్ష్య పెంచుకుని, ఏలాగైనా చంపాలనే ఉద్దేశ్యంతో కుటుంబాన్ని అంతమొందించేందుకు రవి పన్నాగం పన్నినట్లు వివరించారు. డెలివరీకి వెళ్లిన సమయంలో.. అవినాష్ భార్య డెలివరీ అయి మంచిర్యాలలోని ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని తెలుసుకుని, ఆమె భర్త ఇంట్లోనే ఉన్నాడని నిర్ధారించుకుని అతడి కుటుంబాన్ని అంతమొందించేందుకు రవి కుట్ర పన్నాడు. తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులను వెంటబెట్టుకుని ఈ నెల 25వ తేదీన అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో రెండు క్యాన్లలో 10లీటర్ల పెట్రోల్తో అవినాష్ ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపులకు బయటివైపు గడియలు పెట్టి పైపుద్వారా ఐదు లీటర్లపెట్రోల్ను ఇంట్లోకి పంపించాడు. అయితే ఘాటు వాసన రావడంతో కుటుంబ సభ్యులు నిద్రలేచి తలుపులు బలంగా తీసి బయటివచ్చి అరవడంతో నిందితులు పరారయ్యారు. ఆసమయంలో ఇంట్లో అవినాష్తో పాటు తల్లి అరుణ, అమ్మమ్మ అనసూయ, తమ్ముడు అభిలాష్ ఉన్నారు. కుటుంబ సభ్యులు లేచి అరవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. రౌడీషీట్ నమోదు చేస్తాం: డీసీపీ సుదర్శన్ కుటుంబాన్ని హతమార్చాలనే దుష్ట పన్నాగం చేసిన మందమర్రి పట్టణం తాళ్లపల్లి గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు ముదాం రవి(27)ని అరెస్ట్ చేసినట్లు డీసీపీ వివరించారు. ఈహత్యాయత్నానికి సహకరించిన మరో ముగ్గురు నిందితులు అదే ప్రాంతానికి చెందిన కాతం రమేశ్(22), ఇందారం మండలం నర్సింగాపూర్కు చెందిన పులి ప్రశాంత్(22), వరంగల్ జిల్లా బాహుపేట్కు చెందిన పొన్నం అనిరుధ్(19)లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారు ఉపయోగించిన పెట్రోల్ క్యాన్లు, ద్విచక్రవాహనాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల పుటేజీ, సైబర్ సిబ్బంది సహకారంతో నిందితున్ని త్వరగా పట్టుకున్నామని, ప్రధాన నిందితుడు రవిపై రౌడీషీట్ నమోదు చేస్తామని వెల్లడించారు. పోలీసులకు రివార్డులు కుటుంబాన్ని హతమార్చేందుకు కుట్రపన్నిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్న గోదావరిఖని టూటౌన్ సీఐలు వెంకటేశ్వర్లు, ప్రవీణ్కుమార్, కానిస్టేబుల్ శ్రీనివాస్, క్రిష్ణారెడ్డిలను డీసీపీ అభినందించారు. చాకచక్యంగా వ్యవహరించిన వీరికి రివార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, సీఐలు పాల్గొన్నారు. -
జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్య
రామగుండం : మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు తన చావుకు ఎవరూ కారణం కాదని చేతిపై రాసుకుని రైలు కిందపడి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఘటన రామగుండం జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి పోపర్ల వేణుగోపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం పట్టణంలోని మహబూబ్సూబాని నగర్కు చెందిన మహ్మద్ ఫిరోజ్ ఖాన్(30) కొద్ది రోజులు లారీ డ్రైవర్గా పనిచేశాడు. తర్వాత ఎలాంటి పనికి వెళ్లకుండా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విర క్తి చెంది పట్టణంలోని రైల్వే వంతెన సమీపంలోని కి.మీ.నెం.273/5 వద్ద గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ద్విచక్ర వాహనంపై వచ్చి రైలు కింద పడినట్లు ఘటన స్థలాన్ని బట్టి తెలుస్తుంది. మృతుడి ఎడమ చేతిపై ‘నా చావుకు ఎవరు కారణం కాదు’ అని రాసుకున్నాడు. మృతుడి భార్య ఆసియాబేగం తొమ్మిది నెలల గర్భిణి. ఈ క్రమంలో ఇలాంటి అఘాయిత్యం చేసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య ఫిర్యాదు మే రకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఇన్చార్జి తెలిపారు. -
గులాబీ గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే
సాక్షి, కరీంనగర్ : రామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కోరకంటి చందర్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన చందర్ సీటు దక్కకపోవడంతో ఫార్వర్డు బ్లాక్ నుంచి పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి సోమవరపు సత్యనారయణపై విజయం సాధించిన విషయం తెలిసిందే. రేపు (గురువారం) మధ్యాహ్నం కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తనకు మాతృసంస్థ అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చందర్ తెలిపారు. కాగా ఎన్నికల వరకు కూడా ఆయన టీఆర్ఎస్లోనే కొనసాగిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం కేసీఆర్ను ఆయన కలిసి మద్దతు తెలిపారు. దీంతో టీఆర్ఎస్ బలం 88 స్థానాల నుంచి 89కి చేరింది. గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ రెబల్గా పోటీచేసిన చందర్ సత్యనారాయణపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం, వైరా స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. -
సింగరేణిలో ‘సోలార్’!
సాక్షి, గోదావరిఖని(రామగుండం): సింగరేణి సంస్థలో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు వడివడిగా అడుగులుపడుతున్నాయి. సంస్థ వ్యాప్తంగా నాలుగు సోలార్విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రామగుండం, శ్రీరాంపూర్ పవర్ప్రాజెక్టు, ఇల్లెందు, మణుగూరులో సోలార్ విద్యుత్ప్లాంట్లను నెలకొల్పేందుకు ఇప్పటికే యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. టెండర్ల పక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. రూ.600 కోట్ల వ్యయంతో మొదటి దఫాగా సింగరేణి సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో 129 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నెలకొల్పనున్నారు. ప్రస్తుతం థర్మల్పవర్ విద్యుత్ కేంద్రాన్ని నిర్వహిస్తున్న యాజమాన్యం.. సోలార్ విద్యుత్ తయారీ కోసం ముందుకు సాగుతోంది. తొమ్మిది నెలల్లో పూర్తి.. వచ్చే ఏడాది జనవరిలో పనులు ప్రారంభమై సెప్టెంబర్ చివరినాటికి పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన టెండర్లు పక్రియ పూర్తికానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అన్ని అనుమతులు పూర్తయ్యాయి సోలార్ పవర్ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనుమతులు కూడా తీసుకున్నాం. టెండర్ల పక్రియ పూర్తయింది. త్వరలో ఎల్వన్కు టెండర్ కేటాయించనున్నాం. సెప్టెంబర్ చివరినాటికి నాలుగు ఏరియాలో ప్లాంట్ల నిర్మాణం పూర్తవుతుంది. – డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్ -
‘లగడపాటి ఓ జోకర్’
సాక్షి, రామగుండం(పెద్దపల్లి): తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసినా.. నాయకుల మధ్య మాటల యుద్దం ఆగటం లేదు. విజయంపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మినహా అన్ని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ఫోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే లగడపాడి రాజగోపాల్ మాత్రం మహాకూటమి అధికారంలోకి రాబోతోందని, పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని తన సర్వేలో తేలినట్లు వివరించారు. రామగుండంలో టీఆర్ఎస్ రెబల్ కోరుకంటి చందర్ విజయం ఖాయమని అభిప్రాయపడ్డారు. లగడపాటికి సోమారపు సవాల్ దీంతో లగడపాటి సర్వేపై రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ నిప్పులు చెరిగారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన లగడపాటి ఒక జోకర్ అంటూ మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రామగుండంలో కూడా టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ‘నీవిచ్చిన సర్వే నిజమైతే హైదరాబాద్లో బట్టలు విప్పుకొని తిరుగుతా? నీ సర్వే అబద్దమైతే నువ్వు బట్టలిప్పుకొని తిరగాలి’అంటూ లగడపాటికి సోమారపు సత్యనారాయణ సవాల్ విసిరారు. -
ఆమడ దూరంలో!
సాక్షి, పెద్దపల్లి : రామగుండం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ప్రభుత్వాలు మారినా.. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో పట్టణవాసులు మా పరిస్థితి ఇంతేనా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీ-థర్మల్ పరిరక్షణతో పాటు నూతన విద్యుత్కేంద్రం ఏర్పాటు, బీపీఎల్ భూముల సమస్య, రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా మార్చడం, పెద్ద చెరువును మినీట్యాంక్ బండ్గా చేయడం.. అంతర్గాం టెక్స్టైల్ కార్మికుల సమస్యలు ఏళ్లకు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడంలేదు. విస్తరణకు నోచుకోని బీథర్మల్.. రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)ను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1965 జూలై 19న శంఖుస్థాపన చేశారు. అప్పుడు రూ. 14.8 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత దీనిని జవహర్లాల్ నెహ్రూ థర్మల్ విద్యుత్తు కేంద్రంగా నామకరణం చేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడడంతో ఆంధ్రాలోనూ థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయాలని తలిచి విజయవాడ సమీపంలో నిర్మించతలపెట్టారు. దీంతో రామగుండం బి-థర్మల్ను 62.5 మెగావాట్లకు సరిపెట్టారు. ఆ తర్వాత బిథర్మల్ కేంద్రం విస్తరణకు నోచుకోలేదు. నేటి పాలకులు రామగుండంను విద్యుత్ హబ్గా మార్చుతామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. నిరుపయోగంగా వేలాది ఎకరాలు.. 1994లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం బెంగళూరుకు చెందిన మారుబెని, తోషీబా, ఎలక్ట్రిక్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జపాన్)లకు దశలవారీగా పనులు చేపట్టేందుకు ప్రాజెక్టును కట్టబెట్టారు. స్థానికంగా ఉన్న ఏపవర్హౌస్ స్థలం 750 ఎకరాలతో పాటు మరిన్ని అవసరాల నిమిత్తం మరో 1,050 ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ చేశారు. 520 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో రూ.2813.9 కోట్ల వ్యయంతో అంచనా రూపొందించి రూ. 150 కోట్ల వ్యయమంతో ప్రహరీ నిర్మాణాలు ఎకరాల విలువైన భూములు నిరుపయోగంగా ఉన్నాయి. ఎవరికీ పట్టని రాముని గుండాలు.. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిన రామగుండం సమీపంలోని రామునిగుండాలను పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధి చేపట్టాల్సిన అవసరం ఉంది. స్థానికంగా రామునిగుండాలు ఉండడం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయం కావడంతోనే ప్రపంచ దేశ, రాష్ట్ర చిత్రపటాలలో రామగుండంకు ప్రత్యేక పేరుంది. రామునిగుండాలలో రామలక్ష్మణుడు సంచరించినట్లు ఆనవాళ్లుఉన్నాయి. కొండపై 108 గుండాలున్నాయి. గుట్టపై 200 ఫీట్ల లోతు, 50 ఫీట్ల వెడల్పుతో ఓలోయ ఉంది. లోయకు పైభాగాన ఉన్న బావిలో సీతాదేవి స్నానమాచరించిందని ప్రతీతి. రాముడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు పాదముద్రికల స్థానంలో ఏర్పడిన గుంతలు గుండాలుగా మారి రామగుండంగా పేరువచ్చింది. 108 గుండాలలో అన్ని కాలాల్లో నీరు సమృద్ధిగా ఉండడం విశేషం. దీనిని ఆధ్యాత్మికంతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవికూడా నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆమడదూరం పెద్ద చెరువు.. పట్టణంలోని 210 ఎకరాల విస్తీర్ణంలో నియోజకవర్గ పరిధిలోనే పెద్దచెరువు. ఇందులోకి ఎన్టీపీసీకి చెందిన బూడిద నీరు చేరుతుండడంతో పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్క పెరగడంతో పాటు కార్పొరేషన్లోని వివిధ డివిజన్లలో సేకరించిన చెత్తను ఇందులో వేయడంతో చెరువు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయి కలుషితమవుతుంది. దీని కింద సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిని గడిచిన పాలకవర్గం మినీ ట్యాంకుబండ్గా ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ రాజకీయ వర్గ విభేధాలతో మరో చెరువును ఎంపిక చేశారు. దీంతో అభివృద్ధికి పుల్స్టాప్ పడింది. -
టార్గెట్–2020!
గోదావరిఖని/జ్యోతినగర్(రామగుండం): దక్షణ భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థ రామగుండం ఎన్టీపీసీ అని.. తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు అందించడం కోసమే వడవడిగా నూతన ప్రాజెక్టు నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర అన్నారు. సంస్థ 40వ ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్లోని మిలీనియం హాలులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంస్థ 52,946 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అగ్రభాగాన నిలిచిందన్నారు. భారతావనికి 22.74 శాతం విద్యుత్ను అందిస్తున్న సంస్థగా చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. రామగుండం ప్రాజెక్టు 1978లో శంకుస్థాపన కాగా 1983లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిదని వెల్లడించారు. దినదినాభివృద్ధి చెందుతూ తెలంగాణలో అతిపెద్ద వెలుగుల కేంద్రంగా నిలిచిందని అన్నారు. రూ.10598.98 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తెలంగాణ స్టేజీ నిర్మాణపు పనులు ప్రమాదరహితంగా కొనసాగుతున్నాయని ప్రకటించారు. తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణం.. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజీ–1లో నిర్మాణంలో యూనిట్–1 టర్బైన్ జనరేటర్ 18 మీటర్లు. చిమ్నీ నిర్మాణం 180 మీటర్లు పూర్తయిందన్నారు. ఇంకా చాలా పనులు కొనసాగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో బాయిలర్ సీలింగ్, బాయిలర్ ప్రెజర్ పార్ట్స్, టర్భైన్ జనరేటర్ యూనిట్–2 పనులు, బూడిద పైపులైన్ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జూన్–2019లో స్టీమ్ బాయిలింగ్ విధానం ప్రారంభం కానుందన్నారు. యూనిట్–1, మే–2020, యూనిట్–2, నవంబర్–2020న విద్యుత్ ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని ప్రకటించారు. సమావేశంలో జనరల్ మేనేజర్లు అరవింద్కుమార్ జైన్, పుష్ఫేందర్ కుమార్ లాఢ్, డాక్టర్ సశ్మితా డ్యాష్, శ్రీరామారావు, సౌమేంద్రదాస్, ఉమాకాంత్ గోఖలే, విజయ్సింగ్, యం.ఎస్.రమేష్, సీఎస్సార్ మేనేజర్ జీవన్రాజు, ఉద్యోగ వికాస కేంద్రం మేనేజర్ ప్రవీణ్కుమార్, పీఆర్వో సహదేవ్సేథీ, విష్ణువర్ధన్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. -
అభ్యర్థుల నామినేషన్ టు ఎలక్షన్స్
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలో నామినేషన్ల నుంచి ఎన్నికలు పూర్తయ్యేదాకా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.నర్సింహమూర్తి పేర్కొన్నారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఈ నెల 12న నామినేషన్ల పక్రియ మొదలై, 19న ముగుస్తుందని తెలిపారు. నామినేషన్కు వచ్చే అభ్యర్థులు 200 మీటర్ల ముందు వరకు కాన్వాయ్ నిలిపి, వంద మీటర్ల లోపు మూడు వాహనాలకు అనుమతి ఉందని, అక్కడి నుంచి కాలినడకన వచ్చి నామినేషన్ వేయాలన్నారు. నామినేషన్ మొదలు, ఎన్నికల పక్రియ అంతా ఎన్టీపీసీ జ్యోతినగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచే కొనసాగుతుందని వెల్లడించారు. 262 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. వీటిలో 1.81 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రామగుండం అర్బన్లో 210 పోలింగ్బూత్లు, అంతర్గాం27, పాలకుర్తి25 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు.. నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒక రిటర్నింగ్ అధికారి, ముగ్గురు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, నలుగురు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) ఉంటారని వెల్లడించారు. వీరి నేతృత్వంలో మూడు ప్లయింగ్ స్క్వాడ్స్, మూడు వీడియో సర్వర్ లైన్స్ బృందాలు, వీడియో వీవింగ్ బృందాలు, అకౌంటెడ్ టీంలు, చెక్పోస్టు వద్ద మూడు స్టాటిక్ సర్వేలైన్స్ టీంలు(ఎస్ఎస్టీ) ఉండనున్నట్లు తెలిపారు. 262 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రానికి పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు ఉంటారని పేర్కొన్నారు. ఇలా నియోజకవర్గంలో సుమారు 1,050 మందిని ఏర్పాటు చేశాం. మైక్రో అబ్జర్వర్లు 262 మంది, వెబ్ కాస్టింగ్ 262 మందితో పాటు అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను పరిశీలించేందుకు షాడో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలు... ఎన్నికల్లో పోటీచేసే అసెంబ్లీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.28లక్షలుగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. నామినేషన్ మొదలు ఎన్నికల ముందు రోజుదాకా ఖర్చుపై నిఘా ఉంటుంది. కౌంటింగ్ పూర్తియిన తర్వాత 30 రోజుల్లోగా ఖర్చుల వివరాలు సమర్పించాలి. దీనికోసం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని నామినేషన్ వేసిన అభ్యర్థులకు అందజేయనున్నట్లు చెప్పారు. లేకుంటే ఎన్నికల కమిషన్ నోటీస్ జారీ చేసి పోటీకి అనర్హునిగా ప్రకటించనుంది. ఖర్చుపై ఐఆర్ఎస్ అధికారి నిఘా.. ఎన్నికల్లో చేసే వ్యయాలపై బెంగాల్కి చెందిన ఐఆర్ఎస్ అధికారి హెచ్ఎం.దాస్ ఈ నెల 12న ఇక్కడకు రానున్నట్లు తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి దీనికి సంబందించిన లెక్కలను పరిశీలించనున్నారు. ప్రతీ ఖర్చుకు సంబంధించి వీడియో చిత్రీకరణ ఉంటుందని, తాము పేర్కొన్న లెక్క ప్రకారం ప్రతీ లెక్క లిఖిత పూర్వకంగా అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో నలుగురు అనర్హులు నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు నలుగురు అభ్యర్థులు అనర్హులుగా ఎలక్షన్ కమిషన్ గుర్తించినట్లు రిటర్నింగ్ అధికారి నర్సింహమూర్తి తెలిపారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వ్యయం సమర్పించక పోవడంతో 2020 వరకు పోటీ చేసే అవకాశాన్ని లేకుండా చేశారన్నారు. 200 మీటర్ల దూరంలో ర్యాలీ నిలిపివేత నామినేషన్ సమర్పణకు వచ్చే అభ్యర్థులు నామినేషన్ సెంటర్కు 200మీటర్ల దూరంలోనే ర్యాలీ నిలిపివేయాలని సూచించారు. అక్కడి నుంచి వంద మీటర్ల దూరం వరకు మూడు వాహనాలకు అనుమతి ఉంటుందని చెప్పారు. తర్వాత కాలినడకన వచ్చి నామినేషన్ సమర్పించుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అయితే అభ్యర్థితో సహా ఐదుగురు, ఇండిపెండెంట్ అయితే అభ్యర్థితో సహా 11 మందిని లోనికి అనుమతిస్తామని వివరించారు. మీడియాకు నో ఎంట్రీ.. నామినేషన్ల పర్వాన్ని చిత్రీకరించేందుకు నామినేషన్ సెంటర్లోకి మీడియాకు అనుమతి లేదని రిటర్నింగ్ ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్నికల అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అభ్యర్థుల ఎన్నికల నామినేషన్కు సంబంధించిన ఫొటోలను డీపీఆర్వో ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. -
రామగుండం నుంచి కోదండరాం?
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో భాగస్వామ్యపక్షమైన తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి ఇప్పటిదాకా 8 సీట్లు ఖరారు అయినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామగుండం, వరంగల్ తూర్పు, మల్కాజిగిరి, మిర్యాలగూడ, అశ్వారావుపేట, సిద్దిపేట, చాంద్రాయణగుట్ట, మలక్పేట నియోజకవర్గాలకు కాంగ్రెస్ నుంచి అంగీకారం వచ్చినట్లు తెలుస్తోంది. రామగుండం నుంచి టీజేఎస్ అధ్యక్షుడు ఎం. కోదండరాం పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. మరోవైపు తమకు కనీసం 12 స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కోదండరాం పట్టుబడుతున్నారని తెలుస్తోంది. తమకు చెన్నూరు, ఆసిఫాబాద్, దుబ్బాక, షాద్నగర్ లేదా మెదక్ నియోజకవర్గాలను ఇవ్వాలని కోదండరాం గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను పోటీలో దించడానికి తమకు తగిన సీట్లు కేటాయించాలని ఆయన కోరుతున్నారని తెలియవచ్చింది. మరోవైపు చాంద్రాయణగుట్ట, మలక్పేట వంటి నియోజకవర్గాలు తాము కోరుకోవడం లేదని, ఆ సీట్లను కూడా మార్చాలని టీజేఎస్ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఏదైనా నియోజకవర్గాన్ని మార్చి మహబూబ్నగర్ను ఇవ్వాలని వారు అడుగుతున్నట్లు సమాచారం. మరో రెండు సీట్లను పెంచడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగానే ఉందని, అదే సమయంలో సీట్లను కూడా మార్చాలని తాము కోరుతున్నట్లు టీజేఎస్ నేతలు చెబుతున్నారు. టీజేఎస్ స్టీరింగ్ కమిటీ సమావేశం... సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు ఇంకా పూర్తికాకపోవడం, కోరిన సీట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించని నేపథ్యంలో టీజేఎస్ స్టీరింగ్ కమిటీ మంగళవారం హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు ఎం. కోదండరాం అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీపీసీసీపై కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి తేవాలని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. కోరిన సీట్ల సంఖ్య, కోరిన నియోజకవర్గాలను సాధించుకోవడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేయాలని, అప్పటికీ సంతృప్తికరంగా సీట్ల సర్దుబాటు పూర్తికాకుంటే భవిష్యత్ కార్యాచరణ గురించి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. -
ఏకగ్రీవంగా రామగుండం మున్సిపల్ ఎన్నికలు
-
నెగ్గిన అవిశ్వాసం..
సాక్షి, పెద్దపల్లి: అధికార పార్టీకి చెందిన రామగుండం మేయర్ కొంకటి లక్ష్మినారాయణపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం గోదావరిఖనిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్లపై సొంత పార్టీ టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఎక్స్అఫీషియో సభ్యుడు, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సహా 37 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు పలికారు. మరో ఎక్స్అఫీషియో సభ్యుడు, ఎంపీ బాల్క సుమన్, మేయర్ లక్ష్మీనారాయణ సహా 15 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. 37 మంది సభ్యు లు మద్దతు తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఎన్నికల అధికారి, జేసీ వనజాదేవి ప్రకటించారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవులను కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ విప్ను ధిక్కరించిన 13 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతు పలకడం గమనార్హం. పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే సోమారపు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన పంతం నెగ్గించుకున్నారు. అధిష్టానం దిగి వచ్చేటట్లు చేసి మేయర్ను పదవి నుంచి దించేశారు. సోమారపు, మేయర్ నడుమ గతేడాది నుంచి విభేదాలు తీవ్రమయ్యాయి. మేయర్కు ఎంపీ సుమన్ మద్దతు ఉందనే ప్రచారం జరిగింది. వర్గపోరు ముదురు పాకాన పడటంతో గత నెల 6న మేయర్, డిప్యూటీ మేయర్లపై ఎమ్మెల్యే వర్గం కార్పొరేటర్లు, కాంగ్రెస్, బీజేపీలతో కలసి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ వ్యవహారంపై రాష్ట్రంలోని మేయర్లందరూ కలసి సీఎం కేసీఆర్కు మొర పెట్టుకొన్నారు. దీంతో అవిశ్వాసాన్ని ఆపేయాలని సత్యనారాయణకు మం త్రి కేటీఆర్ ఫోన్ చేశారు. అధిష్టానంపై కినుక వహించిన సోమారపు రాజకీయ సన్యాసాన్ని ప్రకటించి సం చలనం సృష్టించారు. అధిష్టానం దిగివచ్చి అవిశ్వాసంపై ఎమ్మెల్యేకే తుది అధికారాన్ని కట్టబెట్టడంతో అలకవీడి, మేయర్ను అవిశ్వాసంలో ఓడించి పంతం నెగ్గించుకొన్నారు. పార్టీ విప్ను ధిక్కరించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే వర్గానికి జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
మానవత్వాన్ని చాటుకున్న రామగుండం పోలీసులు
-
రామగుండంలో విమానాశ్రయం!
పాలకుర్తి(రామగుండం) పెద్దపల్లి : జిల్లాలో విమానం ఎగరానుంది. బసంత్నగర్ కేంద్రంగా విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఐదుజిల్లాలో విమానశ్రయాలు నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నూతన విమానాశ్రయాల ఏర్పాటుపై పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఏవియేషన్ అధికారులతో హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో రామగుండంతో పాటు వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్లో విమాన సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల సహకారం తీసుకుని సర్వేప్రక్రియ వేగవంత చేయాలని మంత్రి అధికారులను కోరారు. దీంతో బసంత్నగర్లో నూతన విమానాశ్రయం ఏర్పాటు అంశానికి బలం చేకూరింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విమానాలు ఎగరనున్నాయి. 40 ఏళ్లు కేశోరాం ఆధీనంలో.. బసంత్నగర్లో 1972లోనే విమానాశ్రయం ఏర్పాటు జరిగింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి హైదరాబాద్కు వాయుదూత్ సర్వీసులు నడిచేవి. అయితే ఆరోజుల్లో ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కొంతకాలం తర్వాత విమాన సర్వీసులు నిలిపివేసింది. అనంతరం స్థానిక కేశోరాం సిమెంట్ కర్మాగారం యాజమాన్యం విమానశ్రయ స్థలాన్ని లీజుకు తీసుకుని దాదాపు 40 సంవత్సరాల పాటు సొంత అవసరాల కోసం వినియోగించుకుంటోంది. ఏటా కంపెనీ ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ కోసం కంపెనీ అధినేత బసంత్కుమార్ బిర్లా ప్రత్యేక విమానంలో వచ్చినప్పుడు విమానశ్రయాన్ని వినియోగించేవారు. ఐదేళ్ల క్రితం కేశోరాం యాజమాన్యం విమానశ్రయ స్థలం లీజు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ప్రభుత్వం రన్వే స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. వైఎస్సార్ హయాంలో బీజం.. బసంత్నగర్లో విమానశ్రయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో తెరమీదకి వచ్చింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనంతరంÐð ఎస్ఆర్ బసంత్నగర్లో విమానశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారంచుట్టారు. ఇందుకోసం అధికారులు భూసర్వే కూడా చేపట్టారు. వైఎస్సార్ అకాల మరణంతో ఈఅంశం మరుగున పడింది. తదనంతరం 2013లో విమానశ్రయ ఏర్పాటు అంశం మళ్లీ తెరమీదికి వచ్చింది. జిల్లా అధికారులు ఇచ్చిన సర్వేరిపోర్టు ఆధారంగా బసంత్నగర్కు వచ్చిన ఏవియేషన్ అధికారులు స్థానికంగా ఉన్నరన్వేతో పాటు ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.అయితే ప్రతిపాదిత స్థలం చుట్టూ హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఉన్నాయనే కారణంతో అధికారులు విముఖత చూపారు. ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో టవర్ లైన్లను తప్పించి 290 ఎకరాల స్థలాన్ని అధికారులు సేకరించారు. సులభం కానున్న రవాణా... పారిశ్రామిక జిల్లాగా నూతనంగా ఏర్పాటైన పెద్దపల్లి జిల్లాలో విమానశ్రయం ఏర్పాటుతో సమీప ప్రాంతంలో రవాణాసౌకర్యం మరింత మెరుగపడనున్నది. జిల్లా పరిధిలో రామగుండం, ఎన్టీపీసీ, సింగరేణి, కేశోరాం మొదలగు పరిశ్రమలుండగా, ప్రస్తుతం ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీపీసీలో మరో రెండు నూతన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పరిశ్రమల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు కార్మికులు, ఉద్యోగులు, అధికారులుగా పనిచేస్తున్నారు. వీరంతా సొంత అవసరాలతో పాటు వృత్తి, వ్యాపార కార్యాకలాపాల కోసం దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తూ.. వస్తుంటారు. ప్రస్తుతం వీరు రైలు మార్గాల ద్వారా ప్రయాణం చేస్తున్నారు. లేదంటే హైదరాబాద్కు వెళ్లి విమానం ఎక్కాల్సి ఉంటుంది. తద్వారా ఖర్చుతో పాటు సమయాభావం అధికమవుతున్నది. ఈనేపథ్యంలో స్థానికంగా విమానశ్రయం ఏర్పాటైతే అన్నివర్గాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. మరో ‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ గా పేరుగాంచిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విమానశ్రయం నిర్మాణం జరిగితే పెద్దపల్లి జిల్లా మరింత వేగంగా అభివృద్ధి చెంది ప్రత్యక్షంగా పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నాలుగు జిల్లాలకు అనుకూలం... బసంత్నగర్లో విమానశ్రయం ఏర్పాటుతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల ప్రజలకు విమానయాన సౌకర్యం అందుబాటులోకి రానున్నది. బసంత్నగర్ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండగా కరీంనగర్, జగిత్యాల జిల్లా కేంద్రాలకు 45 కిలోమీటర్లు, మంచిర్యాల జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని ప్రాంత వాసులకు ఇంది ఎంతో అనుకూలంగా మారనుంది. -
కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీలో కలకలం
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పెద్దపల్లి : కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగింది. రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. పార్టీలో క్రమశిక్షణ కొరవడిందని పేర్కొన్నారు. పార్టీలో ఎంతో మందిని ప్రోత్సహించానని, ఇపుడు వారే తనకు నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏం నిర్ణయం తీసుకున్నా.. సింగరేణి కార్మికులకు ముందుగా చెప్పడం ఆనవాయితీ అని సోమవారం జరిగిన కార్మికుల గేట్ మీటింగ్ లో ఆయన స్పష్టం చేశారు. కారణమిదేనా? రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం టీఆర్ఎస్లో ప్రకంపనలకు దారితీసింది. మేయర్ లక్ష్మీనారాయణపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై హైకమాండ్ మండిపడింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అవిశ్వాసం నిలిపివేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో రామగుండం పరిస్థితిని వివరించడానికి ఎమ్మెల్యే ప్రయత్నించినా కేటీఆర్ వినిపించుకోలేదని విశ్వసనీయంగా తెలిసింది. ‘ అవిశ్వాసం ఆపేస్తారా.. అవిశ్వాసం లేకుండా ఆర్డినెన్స్ తీసుకురమ్మంటారా ’ అని ఘాటుగా వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరుగుతోంది. అధిష్టానం ఆదేశం మేరకు రంగంలోకి దిగిన ఎమ్మెల్యే నోటీసు ఇచ్చిన కార్పేటర్లను బుజ్జిగించే ప్రయత్నం చేశారు. అవిశ్వాసంపై వెనక్కి తగ్గేది లేదని కార్పొరేటర్లు తేల్చిచెప్పారు. ఓ వైపు అధిష్టానం అవిశ్వాస తీర్మానం పట్ల సీరియస్గా ఉండటం.. మరో వైపు కార్పోరేటర్లు తన మాట వినకపోవడంతో ఎమ్మెల్యే మనస్థాపానికి గురైనట్టు తెలిసింది. దీంతో తాను రాజకీయల నుంచి తప్పుకుంటున్నానని ఎమ్మెల్యే ప్రకటించారు.