Regina
-
పార్లమెంట్ సందర్శనలో టాలీవుడ్ హీరోయిన్ రెజీనా (ఫొటోలు)
-
‘రూరల్ విమెన్స్ లీడర్షిప్ ’కార్యక్రమంలో నటి రెజినా (ఫొటోలు)
-
తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. సడన్గా ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
రాజ రాజ చోర ఫేమ్ సునైన హీరోయిన్గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెజీనా. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ గతేడాది జూన్ 23న రెజీనా తమిళ వెర్షన్ మాత్రమే థియేటర్లలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అందుకోసం తెలుగునాట ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహించారు. కానీ రెజీనాకు ఇక్కడ అనుకున్న స్థాయిలో స్క్రీన్స్ దొరకలేదు. తమిళంలో ఎప్పుడో రిలీజ్ దాంతో తెలుగు రిలీజ్ డేట్ వాయిదాపడింది. తమిళంలో సినిమా అంతగా ఆడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల చేయాలన్న ఆలోచన సైతం విరమించుకున్నారు. ఇకపోతే రెజీనా తమిళ వర్షన్ అమెజాన్ ప్రైమ్లో ఇదివరకే అందుబాటులో ఉంది. ఇన్నాళ్ల తర్వాత సడన్గా తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు. తమిళ వెర్షన్ థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత తెలుగు వెర్షన్ను ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు.. ఛాలెంజింగ్ పాత్రలో.. డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించిన ఈ రివేంజ్ థ్రిల్లర్ మూవీలో అనంత్ నాగ్ కీలక పాత్ర పోషించాడు. ఇందులో యాక్షన్ ఓరియెంటెడ్ రోల్లో సునైన నటించింది. గత సినిమాల్లో సాఫ్ట్ రోల్స్ చేసిన సునైన ఇందులో ఛాలెంజింగ్ క్యారెక్టర్లో కనిపించింది. తన భర్త మరణంపై ఓ మహిళ ఎలా ప్రతీకారం తీర్చుకుందన్నదే కథ. ఈ సినిమాలో సునైన నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ కథలోని మలుపులు ఈజీగా గెస్ చేసేలా ఉండటం, కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా అంతగా వర్కవుట్ కాలేదు. తెలుగు సినిమాతోనే కెరీర్ మొదలు హీరోయిన్గా సునైన కెరీర్ తెలుగు సినిమాతోనే మొదలైంది. కుమార్ వర్సెస్ కుమారీ అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. 10th క్లాస్ మూవీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్కు 10 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకుని 'పెళ్లికి ముందు ప్రేమ కథ'తో రీఎంట్రీ ఇచ్చింది. రాజరాజచోర మూవీ, చదరంగం, మీట్ క్యూట్ వెబ్ సిరీస్లతోనూ మెప్పించిందీ బ్యూటీ. Telugu version of Tamil film #Regina (2023) by @domin_dsilva, ft. @TheSunainaa @AnanthNag24 @actorvivekpra @actor_saideena & @writerbava, now streaming on @PrimeVideoIN.@SathishNair20 @YugabhaarathiYb @telugufilmnagar @yellowbearprod @JungleeMusicSTH pic.twitter.com/LqN8WCOM5I — CinemaRare (@CinemaRareIN) February 22, 2024 చదవండి: 'విడాకులిచ్చేశా.. బిజీగా ఉన్నాను కాబట్టి లైట్..', జీవితం చాలా చిన్నది.. -
లక్కీచాన్స్
దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్ రెజీనా సుపరిచితురాలే. కానీ ఇటీవల కాలంలో ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. ఇలాంటి సమయంలో రెజీనాకు ఓ లక్కీచాన్స్ లభించిందని కోలీవుడ్ టాక్. అజిత్ హీరోగా మగిళ తిరుమేణి దర్శకత్వంలో ‘విడాముయార్చి’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారని సమాచారం. అలాగే కథ రీత్యా ఈ సినిమాలో మరో హీరోయిన్ కు చాన్స్ ఉందని, ఈ అవకాశం రెజీనా తలుపు తట్టిందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. మరి.. ఈ మూవీలో రెజీనా నటి స్తారా? లేదా? వేచి చూడాలి. లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఈ నెలలో నేనేనా
రెజీనా ప్రధాన పాత్రలో నటించిన ఫ్యాంటసీ థ్రిల్లర్ తమిళ చిత్రం ‘సూర్పనగై’ (తెలుగులో ‘నేనేనా’). కార్తీక్ రాజు దర్శకత్వంలో ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రోడక్షన్ నిర్మించిన చిత్రం ఇది. అక్షరా గౌడ, అలీ ఖాన్ , జై ప్రకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఈ నెల 18న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. 19వ శతాబ్దంతో పాటు ప్రస్తుత కాలంతో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రెజీనా రెండు పాత్రలు చేశారు. ఓ పాత్రలో ఆమె పురావస్తు శాస్త్రవేత్తగా కనిపిస్తారట. -
పాత్రలే దెయ్యాలైతే..!
కాజల్, రెజీనా, జననీ అయ్యర్ ముఖ్య తారలుగా నటించిన తమిళ చిత్రం ‘కరుంగాప్పియం’. డి. కార్తికేయన్ (డీకే) దర్శకత్వం వహించారు. వెంకట సాయి ఫిల్మ్స్ పతాకంపై ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్ధన్ ‘కార్తీక’ పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ముత్యాల రాందాస్, టి. జనార్ధన్ మాట్లాడుతూ– ‘‘జూలై 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. ఇందులో ఐదుగురు వ్యక్తుల జీవితాలను చూపించే క్రమంలో రెజీనా లైబ్రరీలో వందేళ్ల క్రితం నాటి కాటుక బొట్టు అనే బుక్ చదువుతుంది. భవిష్యత్లో ఏం జరుగుతుందో చెప్పే బుక్ అది. అయితే అందులోని పాత్రల గురించి చదువుతున్నప్పుడు అవి దెయ్యాలుగా మారి ఆమె ముందుకు వస్తాయి. ఇక తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రను కాజల్ చేశారు. జనని పాత్ర కూడా అలరించే విధంగా ఉంటుంది. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని డీకే అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. -
హీరోయిన్ సునయన కామెంట్స్.. నచ్చిందే చేస్తానని!
దక్షిణాదిలో 18 ఏళ్లుగా హీరోయిన్ గా రాణిస్తున్న భామ సునయన. తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ.. తమిళం, మలయాళం, కన్నడం భాషల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన రెజీనా చిత్రం పాన్ ఇండియా స్థాయిలో శుక్రవారం తెరపైకి రానుంది. తాజాగా ప్రమోషన్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా కుటుంబం, తమిళ ప్రేక్షకుల నుంచి ప్రేమ, ఆదరణ చాలానే లభించాయి. అందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రెజీనా చిత్రం నా కెరీర్లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 2018లో నేన ఏం చేయాలన్న దాని గురించి చాలామంది చాలా విషయాలు చెప్పారు. అప్పుడు ఏం అనిపిస్తే అదే చేయాలని ఫిక్సయ్యాను. ఆ తర్వాత మంచి ఆలోచనాత్మక సినిమాలని ఎంపిక చేసుకోవడం ప్రారంభించను.' 'ఈ క్రమంలోనే అలా ఎలా నటించడానికి అంగీకరించావని అన్నారు. ఆ సమయంలో చాలా మందికి వెబ్ సీరీస్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. అందుకే చాలా మంది అటువైపు దృష్టి సారించలేదని, అయితే వెబ్ సీరీస్లో నటించడం నాకు నచ్చింది. అందుకే నచ్చింది చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత తమిళంలో సిల్లుక్కరు పట్టి, తెలుగులో రాజరాజ చోళ లాంటి డిఫరెంట్ మూవీస్ చేశాను. ఈ 'రెజీనా' చిత్రం కూడా అలాంటిదే' అని సునయన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) -
దెయ్యాలు పగబడితే...
హీరోయిన్ రెజీనా ఓసారి లైబ్రరీకి వెళ్లారు. అక్కడ వందల ఏళ్ల క్రితం నాటి ‘కాటుక బొట్టు’ అనే బుక్ చదివారు. ఆ బుక్లోని పాత్రలు దెయ్యాలుగా మారి రెజీనా ముందుకు వచ్చాయట. ఆ తర్వాత ఏం జరిగింది? దెయ్యాలు ఎవరిపై, ఎందుకు పగబట్టాయి? అనేది తెలుసుకోవాలంటే ‘కార్తీక’ చిత్రం చూడాల్సిందే. కాజల్ అగర్వాల్, రెజీనా, జననీ అయ్యర్ ప్రధాన పాత్రల్లో, రైజా విల్సన్, నోయిరికా కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కరుంగాపియం’. ఈ మేలో తమిళంలో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా తెలుగులో ‘కార్తీక’ టైటిల్తో రిలీజ్ కానుంది. ముత్యాల రామదాసు సమర్పణలో టి. జనార్థన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘‘తనకు హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంగా మారి పగ తీర్చుకునే పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
చంద్రముఖి సినిమా చూశాక ఒకటి ఫిక్సయ్యా: హీరోయిన్
హీరోయిన్ సునయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రెజీనా. మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన డోమిన్ టి.సిల్వా ఈ మూవీని తెరకెక్కించారు. ఎలో బీయర్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష నాయర్ నిర్మించి, సంగీతాన్ని అందించారు. భవీ కె.భవన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన రెజీనా చిత్ర టీజర్ మే 30వ తేదీన విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం స్థానికరాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో దర్శకుడు వెంకట్ ప్రభు, నిర్మాత టి.శివ, చిత్రా లక్ష్మణన్, ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్, శక్తి పిలిమ్స్ ఫ్యాక్టరీ శక్తివేలన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై సునయన మాట్లాడుతూ.. 2006లో అమ్మానాన్నల మధ్య కూర్చొని టీవీ సీరియల్స్ చూసే చిన్న అమ్మాయినని, అప్పట్లో తనకు నటిగా రంగ ప్రవేశం చేయాలనే ఆలోచన లేదని పేర్కొన్నారు. అలాంటి సమయంలో సెలవులకు హైదరాబాద్ వెళ్లినప్పుడు చంద్రముఖి, గజిని చిత్రాలను చూశానని తెలిపారు. ఆ సమయంలో దక్షిణాది సినీ కథానాయిక అవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అప్పుడు సినిమాపై పెంచుకున్న ఆసక్తి, సిన్సియారిటీ, నిజాయితీని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నానన్నారు. ఈ చిత్ర దర్శకనిర్మాతల దగ్గర నుంచి యూనిట్లో ప్రతి ఒక్కరికీ సమైక్యత ఉందని సునయన అన్నారు. చదవండి: ఆదిపురుష్.. మా అదృష్టం: ప్రభాస్ -
రెండు కాలాలతో...
రెజీనా ప్రధానపాత్రలో కార్తీక్ రాజు దర్శకత్వంలో రాజ్శేఖర్ వర్మ నిర్మించిన చిత్రం ‘నేనే నా’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్త థియేట్రికల్, నాన్–థియేట్రికల్ రైట్స్ని ఎస్పీ సినిమాస్ దక్కించుకుంది. ‘‘1920, ప్రస్తుతం.. ఇలా రెండు విభిన్న కాలాల నేపథ్యంలో రూపొం దించిన ఫ్యాంటసీ అడ్వంచరస్ థ్రిల్లర్ ఇది. ఇందులో రెజీనా పురావస్తు శాస్త్రవేత్తపాత్ర చేశారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ వేసవిలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్. -
అలా భయపెట్టడం ఇష్టం: రాజమౌళి
‘‘హారర్ జానర్లో రెండు టైప్స్. ఒకటి ఐడియాతో భయపెట్టడం. మరోటి సడన్గా ఎవరో వెనకనుంచి రావడం లేదా సౌండ్తో భయపెట్టడం. నాకు ఐడియాతో భయపెట్టడం ఇష్టం. ‘అన్యా’స్ ట్యుటోరియల్ చూసినవారు ఎందుకు మాయం అవుతున్నారనే ఐడియా ఇంట్రెస్టింగ్గా ఉంది. పల్లవి, సౌమ్యల ఫ్రెష్ వర్క్, కొత్త ఐడియాలజీ, ఉత్సాహం బాగున్నాయి’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. రెజీనా, నివేదితా సతీష్ ముఖ్య తారలుగా పల్లవి గంగిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘అన్యా’స్ ట్యుటోరియల్’. ఆర్కా మీడియా, ఆహా నిర్మించిన ఈ సిరీస్ జూలై 1 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ వెబ్సిరీస్ ట్రైలర్ లాంచ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజమౌళి. ‘‘అన్యా’స్ ట్యుటోరియల్’ కథను నిర్మాత అల్లు అరవింద్గారికి చెప్పాను. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ చెప్పాను. ‘మొదటిసారి నువ్వు చెప్పిన సీన్ ఎందుకు తీసేశావు? అని అడిగారు’. ఎన్నో కథలు వినే ఆయన ఓ చిన్న సీన్ను ఎలా గుర్తుపెట్టుకున్నారా? అని ఆశ్చర్యం వేసింది. ఇదే ఆయన సక్సెస్కు ఓ సీక్రెట్ కావొచ్చు’’ అన్నారు పల్లవి గంగిరెడ్డి. ‘‘ఆహా’ టీమ్తో కలిసి ఇలాంటి కాన్సెప్ట్తో వస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు శోభు యార్లగడ్డ. -
స్పెషల్ సాంగ్స్తో కనువిందు చేయబోతోన్న బ్యూటీలు..
కొంత లవ్వు.. కాస్త నవ్వు.. కాసింత సెంటిమెంట్... మధ్య మధ్యలో ఫైట్స్.. సినిమా ఇలా సాగిపోతుంటుంది. మధ్యలో జిల్.. జిల్.. జిగేల్మనే స్పెషల్ సాంగ్ వస్తే... ప్రేక్షకులకు ఐ ఫీస్ట్... ఇయర్ ఫీస్ట్... ఇప్పటికే ఇలాంటి ప్రత్యేక పాటలు చాలానే చూశాం. రానున్న రోజుల్లో కనువిందు చేయనున్న ‘స్పెషల్ సాంగ్స్’ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా తారలు ఉండేవారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు, హీరోయిన్లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్లో తొలిసారి సమంత ఒక స్పెషల్ సాంగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకూ ఈ బ్యూటీ యాభైకి పైగా సినిమాలు చేశారు. ఫస్ట్ టైమ్ సమంత స్పెషల్ సాంగ్లో కనిపించనుండటం విశేషం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’లోనే సమంత ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. చదవండి: 'జగపతిబాబును గుర్తుపట్టలేదు, బాలకృష్ణ మనిషేనా?' సేమ్ టు సేమ్ సమంతలానే హీరోయిన్ రెజీనా తన కెరీర్లో ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేశారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’లోనే రెజీనా స్పెషల్ సాంగ్ చేశారు. అయితే ఇది రెగ్యులర్ స్పెషల్ సాంగ్లానో, ఐటమ్ సాంగ్లానో ఉండదని తెలిసింది. చిరంజీవి–రెజీనా పాల్గొనగా ఓ గుడిలో ఈ పాట ఉంటుందని సమాచారం. రామ్చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలు చేసిన ‘ఆచార్య’ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్స్లోకి రానుంది. ఇంకోవైపు బుల్లితెర ఫేమస్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ‘బోళా శంకర్’ చిత్రంలో ఓ మాస్ మసాలా సాంగ్లో చిరంజీవితో కలిసి స్టెప్పులేశారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేష్ కనిపిస్తారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక సమంత, రెజీనా, రష్మీ గౌతమ్ల లెక్క ఫస్ట్ టైమ్ కాకుండా... ఇప్పటికే తమన్నా అరడజను (అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, కేజీఎఫ్: చాప్టర్ 1, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరు) స్పెషల్ సాంగ్స్లో స్టెప్పులు వేశారు. చదవండి: RRR Janani Song: ఆర్ఆర్ఆర్ 'జనని' సాంగ్ వచ్చేసింది.. తాజాగా ‘గని’ కోసం మరోసారి స్పెషల్గా మాస్ స్టెప్పులేశారని తెలిసింది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (‘జాతి రత్నాలు’ ఫేమ్) ‘బంగార్రాజు’ చిత్రంలో నాగార్జునతో కలిసి ఓ స్పెషల్ సాంగ్లో కనిపించనున్నారు. నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయానా’ చిత్రానికి ప్రీక్వెల్గా ‘బంగార్రాజు’ రూపుదిద్దుకుంటోంది. ఇందులో నాగచైతన్య, కృతీశెట్టి ఓ జంటగా నటిస్తున్నారు. ఇంతేనా? రానున్న రోజుల్లో మరిన్ని స్పెషల్ సాంగ్స్లో కొందరు తారలను చూసే అవకాశం ఉంది. -
దారుణం: సమాధులతో నిండిన పాఠశాల..మాతృ భాష శాపమైందా?
రెజీనా: కెనడాలోని 1899 నుంచి 1997 వరకు నడిచిన మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్లో 751 మంది గుర్తు తెలియని పిల్లల సమాధులు కనుగొన్నారు. గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని కమ్లూప్స్ సమీపంలోని పాఠశాల స్థలంలో 3 సంవత్సరాల వయస్సు గల 215 మంది పిల్లల అవశేషాలను గుర్తించారు. ఇక ప్రస్తుత ఘటన జరిగిన ప్రాంతం సస్కట్చేవాన్ రాజధాని రెజీనాకు తూర్పున 87 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ఘటనపై కౌసెస్ చీఫ్ కాడ్ముస్న్ డెల్మోర్ మాట్లాడుతూ.. ‘‘పాఠశాలను నిర్వహిస్తున్న రోమన్ కాథలిక్ చర్చి అక్కడ ఆనవాళ్లు తెలియకుండా గుర్తులను తొలగించింది. దీన్ని నేరంగా భావిస్తున్నాం. ఇది ఓ విధంగా దేశంపై దాడి చేయడం వంటిది. ఇక్కడ ఇంకా ఎన్ని మృతదేహాలను పూడ్చి పెట్టారో.. వాటన్నింటిని తెలుసుకునే వరకు అన్వేషణ కొనసాగుతుంది. దోషులను కఠినంగా శిక్షిస్తామని’ పేర్కొన్నారు. ఇలా వెలుగులోకి.. గత నెలలో బ్రిటిష్ కొలంబియాలోని కమ్లూప్స్ సమీపంలోని ఓ పాఠశాల స్థలంలో 3 సంవత్సరాల వయస్సు గల 215 మంది పిల్లల అవశేషాలు బయటపడ్డాయి. దీనిపై పోప్ ఫ్రాన్సిస్ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారించి ఏం జరిగిందో.. తెలుసుకోవాల్సిందిగా మత, రాజకీయ నేతలు తీవ్ర ఒత్తిడి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కెనడా ప్రభుత్వం పాఠశాలలో శారీరక, లైంగిక వేధింపులు అధికంగా ఉన్నట్లు, అంతేకాకుండా విద్యార్థులు తమ మాతృభాష మాట్లాడితే వారిపై దాడి చేయడం వంటివి క్రూరమైన చర్యలు కూడా జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. చదవండి: వైరల్:అయ్యో.. ఇంటర్వ్యూ తీసుకోకుండా.. అలా పారిపోతున్నారేంటి! -
‘అలా నటించడం ఆనందంగా ఉంది’
తమిళ సినిమా: అలా నటించడం చాలా ఆనందంగా ఉందని అంటోంది నటి రెజీనా. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ హీరోయిన్గా నటించడమే కాకుండా విలనిజాన్ని కూడా ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా రెజీనా ప్రతినాయకిగా నటించిన చిత్రం చక్ర. విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రెజీనా ప్రతినాయకిగా జీవించారనే చెప్పాలి. ఈ సందర్భంగా చక్ర చిత్రంలో నటించిన అనుభూతిని రెజీనా సోమవారం మీడియాతో పంచుకున్నారు. లాలా పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు ఆనందన్ తనను రెండుసార్లు కలిసి కథను వినిపించారన్నారు. ఆ తరువాత ఛాయాగ్రాహకుడు బాలసుబ్రమణ్యన్ ఫోన్ చేసి ప్రతినాయకి పాత్రలో మీరు నటిస్తే బాగుంటుందని చెప్పారన్నారు. అలా ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించానని తెలిపారు. పాత్ర, కథ నచ్చితే వైవిధ్యభరిత పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని తెలిపారు. ప్రస్తుతం తమిళంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఒక వెబ్సిరీస్లోనూ నటిస్తున్నానని చెప్పారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజం మరప్పదిల్లై చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన తెలుగు చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. చదవండి: 'సర్కారు వారి పాట' నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే.. పంచేంద్రియాల నేపథ్యంలో... -
హిందీలోకి మానగరం
సందీప్ కిషన్, శ్రీ, రెజీనా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మానగరం’. ‘నగరం’ టైటిల్తో తెలుగులో విడుదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఒక్క రాత్రిలో జరిగే కథాంశంగా ఈ సినిమా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. విక్రాంత్ మాస్సీ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ కెమెరామేన్ సంతోష్ శివన్ డైరెక్ట్ చేయబోతున్నారు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
నో డూప్
ఓ మిస్టరీని ఛేదించడాని సిద్ధమయ్యారు రెజీనా. మరి ఆ ప్రయాణంలో ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? తెలియడానికి ఇంకా సమయం ఉంది. తమిళ దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి అంగీకరించారు రెజీనా. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్పై రాజ్శేఖర్ వర్మ నిర్మించనున్నారు. తమిళనాడులో చిత్రీకరణ కూడా ప్రారంభించారు చిత్రబృందం. కన్నడ హీరోయిన్ అక్షర గౌడ ఈ సినిమాలో కీలక పాత్ర చేయనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కూడా ఉండబోతోందట. రెజీనా డూప్ లేకుండా ఫైట్స్ చేయనున్నారని సమాచారం. ఇందుకోసం శిక్షణ కూడా ప్రారంభించారట. -
ఇద్దరు భామలతో విశాల్
చెన్నై : విశాల్కు ఇద్దరు సెట్ అయ్యారు. నటుడు విశాల్ ఆయోగ్య చిత్రం తరువాత నటిస్తున్న చిత్రం ‘యాక్షన్’. టైటిల్ చూస్తేనే తెలిసి పోతుంది ఇది పుల్ యాక్షన్ చిత్రమని. ఎంటర్టైన్ చిత్రాలు చేయడంలో సిద్ధహస్తుడైన సుందర్.సీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో విశాల్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు నటించిన హిట్ చిత్రం ఇరుంబుతిరై ద్వారా పీఎస్.మిత్రన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నటి సమంత హీరోయిన్గా నటించింది. కాగా ఇప్పుడీ చిత్రం సీక్వెల్కు సన్నాహాలు జరుగుతున్నాయి. విశాల్కు జంటగా నటి రెజీనా, శ్రద్ధాశ్రీనాథ్ నటించనున్నారన్నది తాజా సమాచారం. చెన్నై చిన్నది రెజీనా ఇంతకు ముందు పలు తమిళ చిత్రాల్లో నటించి సక్సెస్లు అందుకున్నా, స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సంపాదించలేకపోయ్యింది. కండనాళ్ ముదల్ చిత్రంతో పరిచయ్యమై గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఆ తర్వాత అళగియ అసుర, పంచామృతం చిత్రాల్లో నటించినా అవి తన కేరీర్కు ఉపయోగపడలేదు. అలాంటిది ఇన్నాళ్లకు నటుడు విశాల్తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం అయినా రెజీనాకు స్టార్డమ్ను తెచ్చిపెడుతుందేమో చూద్దాం. ఇక శ్రద్దాశ్రీనాథ్ విషయానికి వస్తే వేదా చిత్రంతోనే తమిళ సినీ ప్రరిశ్రమ తన వైపు తిరిగి చూసేలా చేసుకుంది. ఇటీవల అజిత్తో నటించిన నేర్కొండ పార్వై చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఈ భామలు ఇద్దరూ విశాల్తో నటించడానికి రెడీ అవుతున్నారన్నమాట. కాగా దర్శకుడు పీఎస్.మిత్రన్ ప్రస్తుతం శివకార్తీకేయన్తో హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసి విశాల్తో ఇరుంబుతిరై 2 చేయనున్నట్లు సమాచారం. -
‘ఎవరు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఎవరు జానర్ : ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తారాగణం : అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ సంగీతం : శ్రీ చరణ్ పాకల దర్శకత్వం : వెంకట్ రామ్జీ నిర్మాత : పీవీపీ క్షణం, గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ మరోసారి తనదైన స్టైల్లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్ రామ్జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమాకు కూడా శేష్ అన్నీ తానే అయి వ్యవహరించాడు. మరి ఈ సినిమాతో అడివి శేష్ మరోసారి సక్సెస్ సాధించాడా..? కథ : ఓ హత్యతో సినిమా ప్రారంభమవుతుంది. ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్ మహా భార్య, సమీరా మహా(రెజీనా), డీసీపీ అశోక్ (నవీన్ చంద్ర)ను కాల్చి చంపేస్తుంది. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేసే అశోక్, తమిళనాడు.. కూనుర్లోని ఓ రిసార్ట్లో హత్యకు గురికావటంతో ఈ కేసు సంచలనంగా మారుతుంది. చనిపోయింది డిపార్ట్మెంట్ వ్యక్తి కావటంతో పోలీసులు కూడా కేసును సీరియస్గా తీసుకుంటారు. సమీరాపై హత్య కేసు పెడతారు. సమీరా మాత్రం అశోక్ తనపై అత్యాచారం చేయటంతో ఆత్మరక్షణ కోసం చంపానని వాదిస్తుంది. కేసు విషయంలో సమీరాకు సాయం చేసేందుకు అవినీతి పరుడైన పోలీసు అధికారి విక్రమ్ వాసుదేవ్(అడివి శేష్)ఆమెను కలుస్తాడు. తనకు అసలు నిజం చెపితేనే కేసు నుంచి కాపాడగలనని సమీరాకు చెపుతాడు విక్రమ్. మరి సమీరా, విక్రమ్తో అసలు నిజం చెప్పిందా..? అశోక్తో సమీరాకు ఉన్న సంబంధం ఏంటి? ఈ కేసుకు, ఏడాది క్రితం కనిపించకుండా పోయిన వినయ్ వర్మ(మురళీ శర్మ)కు, అతని కొడుకు ఆదర్శ్కు సంబంధం ఏంటి..? అసలు విక్రమ్ వాసుదేవ్ ఎవరు? సమీరా ఎవరు? అన్నది తెర మీద చూడాల్సిందే. నటీనటులు : థ్రిల్లర్ కథాంశాల్లో నటించటం అడివి శేష్కు కొట్టిన పిండి. అందుకే విక్రమ్ వాసుదేవ్ పాత్రలో ఈజీగా నటించేశాడు శేష్. అనవసరమైన బిల్డప్లు భారీ ఎమోషన్స్, పంచ్ డైలాగ్లు లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. సమీరా పాత్రలో రెజీనా అద్భుతంగా నటించిందనే చెప్పాలి. ఇటీవల ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్న రెజీనా ఈ సినిమాలో మరో అద్భుతమైన పాత్రలో నటించింది. సమీరాగా చాలా వేరియేషన్స్ చూపించే చాన్స్ దక్కింది. కీలక పాత్రల్లో నవీన్ చంద్ర, మురళీ శర్మ, నిహాల్లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ఒక హత్య కేసు, ఓ మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తయారు చేసుకున్న కథను తన కథనంతో రెప్పవేయకుండా చూసేంత ఇంట్రస్టింగ్గా మలిచాడు దర్శకుడు వెంకట్ రామ్జీ. సినిమాలో పది, పదిహేను నిమిషాలకోసారి ఓ ట్విస్ట్తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు. దర్శకుడు థ్రిల్లర్ జానర్కే ఫిక్స్ అయి సినిమాను తెరకెక్కించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో కామెడీ, డ్యూయెట్స్ లాంటివి ఇరికించకపోవటం సినిమాకు కలిసొచ్చింది. రొటీన్ ఫార్ములా సినిమాలను ఇష్టపడేవారిని ఈ సినిమా అలరించటం కాస్త కష్టమే. చాలా సన్నివేశాలు రెండు మూడు కోణాల్లో చూపించినా ఎక్కడ బోర్ అనిపించకుండా తన స్క్రీన్ప్లేతో మ్యాజిక్ చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ అంత గ్రిప్పింగ్గా అనిపించదు. సినిమాకు మరో ప్రధాన బలం శ్రీచరణ్ పాకల సంగీతం. పాటలు కథలో భాగం వచ్చిపోతాయి. నేపథ్య సంగీతంతో ప్రతీ సన్నివేశాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు.. సంగీత దర్శకుడు. వంశీ పచ్చిపులుసు తన కెమెరా పనితనంతో థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన సీరియస్నెస్ను తీసుకువచ్చాడు. సినిమా అంతా రెండు, మూడు లోకేషన్లలోనే తెరకెక్కించినా ఎక్కడా బోర్ ఫీలింగ్ కలగకుండా తన సినిమాటోగ్రఫీతో మ్యాజిక్ చేశాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనం లీడ్ యాక్టర్స్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
సస్పెన్స్ సెవెన్
హవీష్ హీరోగా నటించిన చిత్రం ‘7’. ఈ చిత్రానికి కెమెరామేన్ నిజార్ షఫీ దర్శకత్వం వహించారు. కథ అందించి, నిర్మించారు రమేష్ వర్మ. రెజీనా, నందితా శ్వేత, త్రిదా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కొత్త హవీష్ను చూస్తారు. రమేష్ వర్మ సస్పెన్స్తో కూడిన మంచి కథ అందించారు. ఈ కొత్త కాన్సెప్ట్ ఆడియన్స్ను థ్రిల్ చేస్తుంది’’ అన్నారు. ‘‘సినిమాపై కాన్ఫిడెంట్గా ఉన్నాం. కథ విన్నప్పుడు చాలా ఎగై్జట్ అయ్యాను. నేను విన్న స్టోరీ లైన్నే ట్రైలర్గా చూపించాం. మంచి స్పందన లభిస్తోంది. అందరూ ప్యాషనేట్గా వర్క్ చేశారు. రమేష్ వర్మ సూపర్ కథ అందించారు. కథకు డైరెక్టర్ పూర్తి న్యాయం చేశారు. చైతన్యా భరద్వాజ్ మంచి సాంగ్స్ ఇచ్చారు. జి.ఆర్. మహర్షి తన డైలాగ్స్తో అదరగొట్టారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని అన్నారు హవీష్. ‘‘ఈ చిత్రం నా కెరీర్లో సమ్థింగ్ స్పెషల్. రమ్య క్యారెక్టర్ నచ్చి బాగా నటించాను. హవీష్ లవ్లీ కోస్టార్. టీమ్ అంతా మంచి పాజిటివ్ జోష్లో ఉన్నాం’’ అన్నారు నందితా శ్వేతా. ‘‘నిజార్ షఫీ గారు ఎన్నో హిట్ సినిమాలకు కెమెరామేన్గా వర్క్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ ఫస్ట్ మూవీ ఆడియన్స్కు నచ్చుతుంది’’ అన్నారు పూజిత. ‘‘ఆడియన్స్కు ‘7’ డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది’’ అన్నారు త్రిదా చౌదరి. -
సెప్టెంబర్లో ‘7’
తమిళ, తెలుగు చిత్రాలలో సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన నిషార్ షఫి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘7’. ఈ చిత్రంలో రెజినా, నందితా సహా ఏడుగురు కథానాయకిలు నటిస్తున్నారు. తమిళం, తెలుగు రెండు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా రూపొందుతోంది. ఈ చిత్రం గురించి నిషార్ షఫి మాట్లాడుతూ ‘7లో కథను నడిపించేందుకు ఏడు మహిళా కథా పాత్రలు ఉంటాయన్నారు. కనిపించకుండాపోయిన భర్త ఆచూకీ కనిపెట్టి ఇవ్వాలని పలువురు మహిళలు ఫిర్యాదు చేస్తారని, వీరి ఫిర్యాదులన్నీ పార్థిబన్ పాత్ర చుట్టే తిరుగుతాయని తెలియజేశారు. రెజినా, నందిత, అనిషా ఆంబ్రోస్, సునితా చౌదరి, అతిథి ఆర్య, పూజిత, పొన్నాడా కథానాయకిలుగా నటిస్తున్నట్లు తెలిపారు. తెలుగు నటుడు హవిష్, పార్తిబన్ తో పాటు మరో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారని, సినిమా సెప్టెంబర్లో విడుదల కానున్నట్లు తెలిపారు. -
అందుకే లెస్బియన్గా నటించాను : రెజీనా
తమిళసినిమా: అలాంటి వారినీ అంగీకరించాలి అంటోంది నటి రెజీనా. కోలీవుడ్, టాలీవుడ్లో నటిగా ఒక టైమ్లో రాణించిన ఈ బ్యూటీకి ఇప్పుడు ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు తగ్గాయి. ఆ మధ్య నటించిన మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో విచ్చలవిడిగా అందాలను ఆరబోసినా, వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న చందాన ఆ చిత్రం సక్సెస్ కాకపోవడం పైగా రెజీనా విమర్శలను మూటగట్టుకుంది. కాగా ఈ జాణ బాలీవుడ్లో సంచలన నటిగా మారింది. అక్కడ ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా చిత్రంలో నటించింది. ఇందులో నటి సోనం కపూర్ను ప్రేమించే లెస్బియన్గా నటించింది. గత నెలలో తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో లెస్బియన్గా నటించిన నటి రెజీనా ధైర్యానికి మెచ్చుకుంటున్న వాళ్లు కొంతమంది అయితే విమర్శించేవాళ్లూ అదే స్థాయిలో ఉండటం విశేషం. దీని గురించి మనసు విప్పిన రెజీనా సమాజానికి ఏం చెబుతుందో చూద్దాం. ఒక నటిగా ఎలాంటి పాత్రనైనా నటించడానికి సిద్ధంగా ఉండాలి. నేను దక్షిణాది నటిగా మాత్రమే ఉండాలనుకోవడం లేదు. హింది సినిమాల్లోనూ తన ప్రతిభను చాటుకోవాలనుకుంటున్నాను. అందుకే ఆ చిత్రంలో లెస్బియన్గా నటించడానికి కూడా వెనుకాడలేదు. నటిగా నేను ఎల్లలు అధిగమించాలని కోరుకుంటున్నాను. అయినా మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం. కాలం మారుతోంది. లెస్బియన్ల జీవితాలను అంగీకరించాలి. ఎవరు ఎలా జీవించాలని కోరుకుంటే వారిని అలా జీవించనివ్వాలి. సుప్రీంకోర్టే హిజ్రాలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దాని గురించి చర్చ జరుగుతున్నా, సమాజంలోనూ మార్పు వస్తోంది. ఇదే విషయాన్ని నేను నటించిన హింది చిత్రంలో చర్చించాం అని నటి రెజీనా పేర్కొంది. ఏదేమైనా లెస్బియన్ పాత్రలో నటించి మరోసారి వార్తల్లోకెక్కిన ఈ బ్యూటీకి ఈ సారి అయినా అవకాశాలు వస్తాయా? అన్నది వేచి చూడాలి. -
లెస్బియన్గా రెజీనా..!
సౌత్లో యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయిన బ్యూటీ రెజీనా. సాయి ధరమ్ తేజ్ లాంటి మీడియం రేంజ్ హీరోలతో పాటు అ! లాంటి ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించిన రెజీనా స్టార్ హీరోలతో మాత్రం జతకట్టలేకపోయారు. దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన ఈ భామ ఓ బోల్డ్ క్యారెక్టర్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ వారం బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ‘ఏక్ లడఖీ కో దేఖాతో ఐసా లగా’. అనిల్ కపూర్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనా లెస్బియన్ పాత్రలో నటించారు. ప్రధాన పాత్రలో నటించిన సోనమ్ కపూర్ ప్రియురాలిగా రెజీనా నటించారు. సినిమా టాక్ పరంగా నిరాశపరిచినా రెజీనా పాత్రకు, ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
‘గూఢచారి’ తరువాత..!
గూఢచారి సక్సెస్తో యంగ్ హీరో అడివి శేష్ హాట్ టాపిక్గా మారిపోయాడు. బడా నిర్మాణ సంస్థలు ఈ యంగ్ హీరోలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. అయితే శేష్ మాత్రం తన స్టైల్లో కూల్గా మరో సినిమా పనుల్లో బిజీ అయినట్టుగా తెలుస్తోంది. క్షణం సినిమా తరువాత గూఢచారి తెరకెక్కించేందుకు గ్యాప్ తీసుకున్న శేష్ ఈ సారి వెంటనే మరో సినిమా ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో అడివి శేష్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు కూడా శేష్ కేవలం కథా కథనాలు మాత్రమే అంధించనున్నాడు. రామ్ జీ అనే కొత్త దర్శకుడిని ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతానికి క్షణం 2 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాను క్షణం చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సంస్థే నిర్మించనుంది. -
నటి రెజీనా.. నీకు ఇది తగునా?
సాక్షి, హైదరాబాద్ : పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ‘కికి చాలెంజ్’ స్వీకరించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ చాలెంజ్ను స్వీకరించి అందులో భాగస్వాములు కావడంతోనే అసలు తంటాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే తమ అభిమాన నటీనటులు, క్రికెటర్లు లేక ఇతర రంగాల వాళ్లు ఎవరు ఏది చేసినా వారి ఫ్యాన్స్ అది ఫాలో అవుతుంటారు. కానీ కిక్ చాలెంజ్ లాంటి ప్రమాదకర విషయాల జోలికి వెళ్లొద్దని ఇదివరకే దీని ప్రభావం ఎక్కువగా కర్ణాటక, ముంబైలలో పోలీసులు హెచ్చరించారు. ఇప్పుడు దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. Not just a risk for you but your act can put life of others at risk too. Desist from public nuisance or face the music ! #DanceYourWayToSafety #InMySafetyFeelingsChallenge pic.twitter.com/gY2txdcxWZ — Mumbai Police (@MumbaiPolice) 26 July 2018 ఇటీవల నటి అదాశర్మ కికి చాలెంజ్ స్వీకరించి డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్గా ఉండే అదా శర్మ కదులుతున్న కారు పక్కన కాకుండా ఆగి ఉన్న వాహనం పక్కన స్టెప్పులేశారు. అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత టాలీవుడ్ మరో నటి రెజీనా కూడా కికి చాలెంజ్ను స్వీకరించారు. హాఫ్ శారీలో చాలా అందంగా, సంప్రదాయబద్దంగా కనిపించిన రెజీనా కదులుతున్న కారులోంచి దిగి ‘ఇన్ మై ఫీలింగ్స్’ పాటకు డ్యాన్స్ చేశారు. దీన్ని వీడియో తీసి తన సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. అయితే ఇలాంటివి వీరి అభిమానులు ఫాలో అయ్యే అవకాశం ఉందని ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆందోళన వ్యక్తమవుతోంది. #inmyfeelingschallenge had to be done!!!@champagnepapi you’ve got us South Indian girls dancin to your tunes.. 😂😋 This is the craziness that goes on between shots... 🙄😛 Video and styling: @jaya_stylist Music supervision:#priyankatumpala pic.twitter.com/dTA1enB9Nt — ReginaCassandra (@ReginaCassandra) 29 July 2018 హలీవుడ్ సింగర్ డ్రేక్ తన కొత్త పాట ‘ఇన్ మై ఫీలింగ్స్’ను విడుదలతో పాటు ‘కికి చాలెంజ్’ను జనాల్లోకి విసిరారు. ఈ చాలెంజ్ తీసుకున్న వారు కదులుతున్న వాహనంలోంచి దిగి ‘ఇన్ మై లైఫ్’ పాటకు అనుగుణంగా కదులుతున్న వాహహం పక్కనే ముందుకు సాగుతూ డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. పాట అయిపోయాక తిరిగి వాహనంలోకి ఎక్కాలి. అలా చేస్తేనే చాలెంజ్ నెగ్గినట్లు. అయితే ఇది మీకు మాత్రమే కాదు, మీ వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ముంబై పోలీసులు ఇటీవల ట్వీట్ చేశారు. ఎలాంటి జన సంచారం, రద్దీలేని రోడ్లపై ఇలాంటివి చేయాలని, అయినా కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి చాలెంజ్లు స్వీకరించడకపోవడమే ఉత్తమమని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
రెజీనా కూడా చేసేశారు
-
మిస్టర్ చంద్రమౌళికి డేట్ ఫిక్స్
తమిళసినిమా: కోలీవుడ్లో తండ్రీ కొడుకులు కలిసి హీరోలుగా నటించడం అన్నది అరుదైన విషయమే. అలా అరుదైన తండ్రీ కొడుకులుగా సీనియర్ నటుడు కార్తీక్, గౌతమ్ కార్తీక్ నమోదవుతున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ చంద్రమౌళి. చిత్రంలోనూ వీరిద్దరూ తండ్రికొడుకులుగా నటించడం విశేషం. నటి రెజీనా నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని తిరు దర్శకత్వంలో ధనుంజయన్ నిర్మించారు. కీలక పాత్రలో నటి వరలక్ష్మీశరత్కుమార్, ముఖ్యపాత్రల్లో సతీష్ నటించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, రిచర్డ్, ఎం.నాథన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.యూ /ఏ. సర్టిఫికెట్తో జూలై 6న తెరపైకి రావడానికి మిస్టర్ చంద్రమౌళి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తిరు వివరాలను తెలుపుతూ చిత్రం ప్రారంభం నుంచి పాజిటివ్గానే జరుగుతూ వచ్చిందన్నారు. మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో తాము అందించిన ఎంటర్టెయిన్మెంట్, ఎమోషనల్ అంశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయనే నమ్మకం ఉందన్నారు. వారి సమయాన్ని వృథా చేయదన్న గ్యారెంటీ ఇస్తున్నామని అన్నారు. ముఖ్యంగా గౌతమ్ కార్తీక్, రెజీనాల రొమాన్స్ సన్నివేశాలు యువతను గిలిగింతలు పెట్టిస్తాయని అన్నారు. చిత్రం కలర్ఫుల్గానూ, అదే సమయంలో చాలా భావోద్రేక సన్నివేశాలతోనూ జనరంజకంగా ఉంటుం దని తెలిపారు. నటుడు గౌతమ్కార్తీక్, రెజీనా, సతీష్, వరలక్ష్మి వంటి వారు పలు చిత్రాలతో బిజీగా ఉన్నారన్నారు. అలాంటి వారితో ఈ చిత్రాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి వారందించిన సహకారమే కారణం అని పేర్కొన్నారు. చిత్రాన్ని జూలై 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తిరు చెప్పారు. -
బాలీవుడ్కి హాయ్
సౌత్లో మంచి నటిగా ప్రూవ్ చేసుకున్నారు కథానాయిక రెజీనా. సౌత్లో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్పై కన్నేశారు. అదేనండీ.. బాలీవుడ్ నుంచి కాలింగ్ అందుకుని షూట్లో జాయినైపోయారని బీటౌన్ టాక్. అనిల్ కపూర్ హీరోగా నటించిన ‘1942: ఏ లవ్స్టోరీ’ సినిమా ఎంత హిట్ అయ్యిందో.. అందులోని ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఏశా లగా’ సాంగ్ అంతకు మించి ఫేమస్. ఇప్పుడు ఈ సాంగ్ టైటిల్తోనే ఓ సినిమా రూపొందుతోంది. షెల్లీ చోప్రా దర్వకత్వంలో అనిల్కపూర్, సోనమ్ కపూర్, రాజ్కుమార్ రావు, రెజీనా, జూహ్లీ చావ్లా ముఖ్య తారలుగా నటిస్తున్న సినిమా ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఏశా లగా’. ఈ సినిమా షూటింగ్లో రెజీనా జాయిన్ అయ్యారట. హిందీ చిత్రం ‘అన్కేన్’ సీక్వెల్ ‘అన్కేన్ 2’ తో రెజీనా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారని అప్పట్లో వార్తలొచ్చినా కుదుర్లేదు. ఈ ఏడాది అక్టోబర్లో ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఏశా లగా’ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రెజీనా ప్రేమలో పడిందా?
రెజీనా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చెన్నైకి చెందిన రెజీనా కోలీవుడ్లో కంటే టాలీవుడ్లోనే మంచి పేరు తెచ్చుకుంది. మొదట్లో పలు టీవీ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించి, ఆ తరువాత వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది. ఆపై రెజీనా కోలీవుడ్ తెరకు పరిచయమైంది. కండనాళ్ మొదల్ చిత్రంతో హీరోయిన్గా 2012 తెరపైకి వచ్చిన రెజీనా ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందినా, ఆ తరువాత నటించిన చిత్రాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో టాలీవుడ్పై దృష్టిసారించి వరుసగా అవకాశాలను చేజిక్కించుకుంటోంది. అయితే కోలీవుడ్లో ఆ మధ్య నటించిన మానగరం చిత్రం ఈ అమ్మడి ఖాతాలో హిట్గా నిలిచింది. దీంతో ఇక్కడ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం రెజీనా చేతిలో తమిళం, తెలుగు కలిపి అరడజను చిత్రాల వరకూ ఉన్నాయి. వీటిలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన నెజైమరప్పదిల్లై, వెంకట్ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. రెజీనా మాత్రం టాలీవుడ్కే అధిక ప్రాముఖ్యత ఇస్తోంది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. కారణం తెలుగు చిత్రాల ద్వారా బాలీవుడ్కు వెళ్లాలనే ఆశతో ఉన్నట్లు సమాచారం. అయితే మరో వైపు రెజీనా ప్రేమలో మునిగి తేలుతోందని చెబుతున్నారు. ఒక టాలీవుడ్ యువ నటుడితో పరిచయం ప్రేమగా మారిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని రెజీనా ఖండిస్తోంది. తానెవరినీ ప్రేమించడం లేదని, అసలు ప్రస్తుతానికి ప్రేమించే సమయం, పెళ్లి చేసుకునే ఆలోచన లేవని అంటోంది. అయితే ప్రేమలో పడ్డ చాలా మంది చెప్పే కబుర్లనే రెజీనా చెబుతోందని, ఇలాంటి వారు సడన్గా పెళ్లికి సిద్ధం అవుతారని సినీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. -
అప్పుడు ఈగ... ఇప్పుడు చేప..!
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘అ!’ అనే సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిత్యామీనన్. రెజీనా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో నాని నిర్మాతగానే కాక మరో కీలక పాత్ర పోషించనున్నాడు. అయితే ఆ పాత్ర కూడా తెర వెనుకకే పరిమితం కానుంది. ఈ సినిమాలో కనిపించే ఓ చేప పాత్రకు నాని డబ్బింగ్ చెపుతున్నాడు. తాజాగా ఆ చేప క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే మేజర్ పార్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. Playing an interesting role in my next .. been learning swimming coz the script demands ;))#AWE https://t.co/VDmOAuUPHK — Nani (@NameisNani) 23 December 2017 -
'బాలకృష్ణుడు' మూవీ రివ్యూ
టైటిల్ : బాలకృష్ణుడు జానర్ : కమర్షియల్ ఎంటర్ టైనర్ తారాగణం : నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, అజయ్, పృధ్వీ సంగీతం : మణిశర్మ దర్శకత్వం : పవన్ మల్లెల నిర్మాత : బి. మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి స్టార్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నారా రోహిత్, నటుడిగా మంచి మార్కులు సాధిస్తున్నా కమర్షియల్ సక్సెస్ లు సాధించటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాత్మక చిత్రాల మీదే దృష్టి పెట్టిన నారావార్బాయి... తొలిసారిగా ఓ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆరు పాటలు, నాలుగ ఫైట్లు, పంచ్ డైలాగ్ లు, భారీ చేజ్ లు వీటికి తోడు హీరోయిన్ గ్లామర్ షో.. ఇలా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులతో రూపొందిన బాలకృష్ణుడు నారా రోహిత్ కు కమర్షియల్ హీరో ఇమేజ్ తీసుకువచ్చిందా..? కథ : కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో 2006లో సినిమా కథ మొదలవుతుంది. రవీందర్ రెడ్డి (ఆదిత్య) ఆ ప్రాంత ప్రజల జీవితాలను మార్చాలనుకునే ప్రజల మనిషి, తన చెల్లెలు భానుమతి దేవీ (రమ్యకృష్ణ) ఆలోచనల ప్రకారం తమ ప్రాంతంలో కాలేజీలు ఫ్యాక్టరీలు కట్టి అందరికీ చదువు, ఉద్యోగం అందుబాటులోకి తీసుకురావాలనుకుంటారు. జనంలో రవీందర్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రత్యర్థి బసిరెడ్డి (మహదేవన్) రగిలిపోతాడు. కానీ రవీందర్ రెడ్డి చేతిలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి చావును కళ్లారా చూసిన బసిరెడ్డి కొడుకు ప్రతాపరెడ్డి (అజయ్) దొంగ దెబ్బతీసి రవీందర్ రెడ్డిని చంపేస్తాడు. తాను పోయినా తన ఆశయం మాత్రం బతకాలని ఆఖరి నిమిషంలో చెల్లెలుతో మాట తీసుకుంటాడు రవీందర్ రెడ్డి. (సాక్షి రివ్యూస్) అన్నకిచ్చిన మాట కోసం ప్రతాపరెడ్డి లాంటి రాక్షసుడితో పోరాటానికి సిద్ధమవుతుంది భానుమతి. రవీందర్ రెడ్డిని చంపిన కేసులో ప్రతాపరెడ్డి జైలుకెళతాడు. తన అన్నకూతురు ఆధ్య (రెజీనా) ఈ గొడవలకు దూరంగా పెంచుతుంటుంది భానుమతి. పదకొండేళ్ల తరువాత సత్ప్రవర్తన కింద ప్రతాపరెడ్డి జైలు నుంచి విడుదలవుతున్నాడని తెలుసుకున్న భానుమతి, తన ఆధ్యని కాపాడేందుకు బాలు (నారా రోహిత్)ను బాడీ గార్డ్ గా పెడుతుంది. ప్రతాపరెడ్డి నుంచి ఆధ్యను బాలు ఎలా కాపాడాడు..? ఈ ప్రయాణంలో బాలు, ఆధ్యలు ఎలా దగ్గరయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తొలిసారిగా రొటీన్ కమర్షియల్ సినిమాలో నటించిన నారా రోహిత్, అందుకు తగ్గ ఫిజిక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ చాలా మార్పులు చూపించాడు. ఎక్కువగా సెటిల్డ్ రోల్స్ లోనే కనిపించిన ఈ యంగ్ హీరో ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. కమర్షియల్ సినిమాకు కీలకమైన యాక్షన్ సీన్స్, డ్యాన్స్ ల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. హీరోయిన్ గా రెజీనా ఆధ్య పాత్రలో అలరించింది. అభినయంతో పాటు అందాల ప్రదర్శనతోనూ ఆకట్టుకుంది. కీలకమైన భానుమతి పాత్రలో రమ్యకృష్ణ నటన సినిమాకు మరో ఎసెట్, నీలాంబరి తరహా పాత్రలో కనిపించిన రమ్యకృష్ణ తనకు అలవాటైన హావాభావాలతో భానుమతి పాత్రను పండించింది.(సాక్షి రివ్యూస్) విలన్ గా నటించిని అజయ్ ది రొటీన్ ఫ్యాక్షన్ విలన్ పాత్రే, తన వంతుగా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు అజయ్. డిస్కవరీ ఫొటోగ్రాఫర్ మాధవరావు పాత్రలో పృథ్వీ ఇరగదీశాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిన ఈ కామెడీ స్టార్ అద్భుతమైన టైమింగ్ తో అలరించాడు. విశ్లేషణ : కమర్షియల్ ఫార్ములా తీయాలన్న ఆలోచనతో బాలకృష్ణుడు సినిమా కథ రెడీ చేసుకున్న దర్శకుడు పవన్ మల్లెల పక్కా ఫార్ములా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొటీన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలో ఉండాల్సిన ఫైట్లు, గ్లామర్, పంచ్ డైలాగ్ లు, చేజ్ లు, పాటలు ఇలా అన్ని సమపాళ్లలో ఉండేలా చూసుకున్నాడు. నారా రోహిత్ ను సరికొత్త యాంగిల్ లో ప్రజెంట్ చేయటంలో సక్సెస్ సాధించాడు. అయితే ఈ తరహా కథా కథనాలు కాలం చెల్లిపోయి దశాబ్దం పైనే అవుతుంది. (సాక్షి రివ్యూస్) మరి ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ మణిశర్మ సంగీతం. తన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు మణి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నారా రోహిత్ నటన పృథ్వీ కామెడీ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : రొటీన్ కథా కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
వంటింట్లో ఓ ఆదివారం!
ఎప్పుడూ సినిమాలు, షూటింగులు, సెట్లో మేకప్ కిట్టులు... ఇవేనా? అనుకున్నట్టున్నారు రెజీనా! మేకప్ కిట్ ప్లేసులో కుకింగ్ సెట్ వచ్చింది. మొన్న ఆదివారం కిచెన్లోకి వెళ్లారు. చేపల్లో రెండు రకాలను ఇంటికి తెప్పించుకున్నారు. రెండిటినీ బాగా రోస్ట్ చేశారు. ఓ ప్లేటులో వాటిని అందంగా మేకప్ చేసి (అదేనండీ... గార్నిష్ చేసి) ఫొటో తీసుకున్నారు. ఇన్సెట్లో చూస్తున్న ఫొటోలు అవే! కుకింగ్కి ముందు.. తర్వాత! ఆదివారం వంట చేశానని చెప్పారు గానీ... వంట రుచి ఎలా ఉందో మాత్రం చెప్పలేదు. ఈసారి మీడియా ముందుకొచ్చినప్పుడు అడుగుదాంలెండి! అన్నట్టు... రెజీనా నటించిన తాజా తెలుగు సిన్మా ‘బాలకృష్ణుడు’ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో నారా రోహిత్ హీరో. వీళ్లిద్దరూ జంటగా నటించిన మూడో చిత్రమిది. -
‘బాలకృష్ణుడు’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
‘‘చిన్న బట్టలు వేసుకుంటే రేప్ చేస్తారా?’’
‘‘పసిపిల్లల్నీ వదలడం లేదు పండు ముసలివాళ్లపై కూడా అత్యాచారం చేస్తున్నారు. మృగానికి చిన్నా పెద్దా తెలియదు. చెడు తెలుసు.. అంతే! వేసుకున్న దుస్తులను బట్టి అమ్మాయి క్యారెక్టర్ నిర్ణయించే మగాళ్లు బయల్దేరారు. అమ్మాయిలు తిరగబడితే.. ఇలాంటి పిరికిపందలు పారిపోవాల్సిందే...’’ అంటున్నారు రెజీనా! అమ్మాయిలు వేసుకునే దుస్తులను బట్టి వాళ్ల క్యారెక్టర్ని.. హీరోయిన్లనైతే సినిమాల్లో వాళ్లు వేసుకునే డ్రెస్సులతో క్యారెక్టర్ని ఫిక్స్ చేస్తున్నారు. చిట్టిపొట్టి దుస్తుల వల్లే జరగకూడనివి జరుగుతున్నాయంటున్నారు... మన ఇండియాలో రేప్కి గురైన అమ్మాయిలందరూ చిన్న స్కర్టులు వేసుకున్నవాళ్లేనా? పసిపాపలను కూడా రేప్ చేస్తున్నారు, పెద్దవాళ్లనూ వదిలిపెట్టడంలేదు కదా? పోనీ.. నిండుగా సల్వార్ కమీజో, చీరో కట్టుకుంటే రేపులు ఆగుతాయా? రోడ్డు మీదకొచ్చి ఎలా పడితే అలా రెచ్చిపోయే మగవాళ్లను అనడం మానేసి, ఆడవాళ్ల బట్టల గురించి మాట్లాడతారా? సినిమాలో క్యారెక్టర్, కథను బట్టి హీరోయిన్లు డ్రెస్సులు వేసుకుంటారు. అవి చూసి, మా క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారా? ఒకవేళ నేను ఏదైనా సినిమాలో చీర కట్టుకుంటే రియల్గా ట్రెడిషనల్గా ఉన్నట్లా? చిట్టిపొట్టి బట్టలు వేసుకుంటే అదో టైపా? డ్రెస్సులను బట్టి క్యారెక్టర్ని డిసైడ్ చేసేవాళ్లలోనే మార్పు రావాలి. ప్రతి అమ్మాయి లైఫ్లో ఏదో ఒక్క చేదు అనుభవం అయినా ఉంటుంది.. మీ లైఫ్లో? కాలేజ్ డేస్లో జరిగిన రెండు ఇన్సిడెంట్స్ని మరచిపోలేను. కాలేజీకి వెళుతుంటే వెనక నుంచి ఒకడు టచ్ చేసి, ఏమీ తెలియనట్లు వెళ్లిపోయాడు. నాకలా జరగడం అది ఫస్ట్ టైమ్. అడుగు ముందుకు పడలేదు. తప్పు చేసినవాడు అంత క్యాజువల్గా ఉన్నాడు. ఏ తప్పూ చేయని మనం ఎందుకిలా అయిపోయాం? అనుకున్నాను. ఆ ఇన్సిడెంట్ని మరచిపోక ముందే మరోసారి ఇలాంటిదే జరిగింది. ఒకడు నన్ను టచ్ చేసుకుంటూ, అసలు తనేమీ చేయనట్లు నడుచుకుంటూ వెళ్లాడు. నాకు ఒళ్లు మండిపోయింది. ఒక్కటిచ్చాను. తిరగబడతాడనుకున్నా. కానీ, పారిపోయాడు. తప్పు చేసినవాళ్లను వదలకూడదు.. తిరగబడాలి. తిరగబడే ధైర్యం ఉన్న అమ్మాయిలు తక్కువ కావడం వల్లే వేధింపులు ఎక్కువయ్యాయి.. నిజమే. వరల్డ్ మొత్తాన్ని తీసుకుందాం. మన ఇండియాలో జరిగినన్ని రేప్స్ బహుశా ఎక్కడా జరగవేమో? ఎందుకంటే మనవాళ్లల్లో తిరుగుబాటు ధోరణి తక్కువ. మన సొసైటీలో అమ్మాయిల పట్ల చాలా రూడ్గా ఉంటున్నారు. అందరినీ అనడం లేదు. అమ్మాయిల దగ్గర ఎవరైతే అమానుషంగా ప్రవరిస్తున్నారో వాళ్ల గురించి అంటున్నా. హర్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయి వస్తారనుకుంటా. వెకిలి వేషాలు వేస్తారు. ఎదురు తిరిగితే తోక ముడుచుకుంటారు. ఇలాంటి వేధింపుల గురించి పక్కన పెట్టండి.. అసలు అమ్మాయిలకు పెట్టే ఆంక్షలుంటాయే.. అవి టూ మచ్.. కరెక్టే. గోడ దూకామనుకోండి.. ఏంటి అబ్బాయిలా? అంటారు. ఫుట్బాల్ ఆడితే.. ఇది ఆడపిల్లల ఆట కాదంటారు. దాంతో అమ్మాయిలు ‘మనం తక్కువ’ అని మెంటల్గా ఫిక్సయిపోతారు. లక్కీగా మా ఇంట్లో అలా కాదు. ఎందులోనూ తక్కువ కాదన్నట్లే పెంచారు. అవునూ... ఈ రెండేళ్లల్లో నాలుగు తెలుగు, ఏడు తమిళ సినిమాలు సైన్ చేశారు.. తెలుగు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు తెలుసా? అవునండి. తెలుగులో తక్కువ సినిమాలు చేస్తున్నానని నాకూ అనిపిస్తోంది. రెండు భాషలనూ బ్యాలెన్స్ చేయాలి. ఆ సంగతి పక్కన పెడితే.. నాకు తమిళ సినిమాలు చేయడమంటే ఇష్టం. అక్కడి అమ్మాయిని కదా.. మాతృభాష అంటే కొంచెం ‘సాఫ్ట్ కార్నర్’ ఉంటుంది. 1945 – ఓ కొత్త అనుభూతి! ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల్లో ‘1945’ ఒకటి. ఆ కాలం కట్టుబొట్టుతో డిఫరెంట్గా కనిపిస్తాను. చీరల గురించి నా డిజైనర్తో కలసి చాలా డిస్కస్ చేశా. ఈ సినిమాలో సిల్క్, కాటన్ చీరల్లో కనిపిస్తా. కాంచీపురం చీరలు సెలక్ట్ చేసుకున్నా. మేకప్ చాలా చాలా తక్కువ. అసలు లేకపోయినా నో ప్రాబ్లమ్. మేకప్ వేసుకోవడం నాకు అంతగా నచ్చదు. ఇలా చెబితే.. తెలుగువాళ్లు ఫీలవుతారు.. ఆ క్లారిఫికేషన్ ఇద్దామనుకునే లోపు మీరు క్వొశ్చన్ అడిగేశారు. ఆర్టిస్ట్గా నాకు బ్రేక్ ఇచ్చింది తెలుగు పరిశ్రమే. మంచి కెరీర్ ఇచ్చిన తెలుగు పరిశ్రమను మరచిపోతే పెద్ద తప్పవుతుంది. అలాగని ఫస్ట్ చాన్స్ ఇచ్చిన తమిళ ఇండస్ట్రీని కూడా మరచిపోకూడదు. సింపుల్గా చెప్పేస్తానండి. రెండు భాషలకూ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తా. త్వరలో రిలీజ్ కాబోతున్న ‘బాలకృష్ణుడు’లో మీరు చేసిన క్యారెక్టర్ గురించి? ఇందులో నేను బాగా డబ్బున్న అమ్మాయిని. ధైర్యం ఎక్కువ. నాకేం కావాలంటే అది దక్కాల్సిందే. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. పెంకి అమ్మాయిని. ఇలాంటి క్యారెక్టర్స్లో యాక్టింగ్కి మంచి స్కోప్ ఉంటుంది. గ్లామరస్గా కనిపిస్తాను. బాగా డ్యాన్స్ చేశాను. ఫైట్స్ కూడా చేశానండి. రోప్ షాట్స్ చేశాను. భలే థ్రిల్గా అనిపించింది. మీ అమ్మానాన్నలకు మీరు ఒక్కతే కూతురు కాబట్టి, రియల్గానూ మీరేదనుకుంటే అదేనా? అంత సీన్ లేదు. మా అమ్మగారి డిక్షనరీలో ‘ప్యాంపర్’ (గారం) చేయడం అనేది లేదు. తప్పు చేస్తే పనిష్మెంట్ తప్పదు. అబద్ధాలు ఆడకూడదు. క్రమశిక్షణ పాటించాల్సిందే. పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వాల్సిందే. మీ ఫ్యామిలీలో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ పర్సన్ మీరే.. ఇక్కడికి రావాలని డిసైడ్ అయినప్పుడు మీ అమ్మానాన్నల ఫీలింగ్? జనరల్గా పిల్లలు కొత్త జాబ్కి వెళితే ఏ పేరెంట్స్కి అయినా కొంత భయం ఉంటుంది. ఇక, ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా పెద్దది కాబట్టి, భయపడ్డారు. నాకూ భయంగానే ఉండేది. అయితే బయట అందరూ చెప్పుకునేంత ఇబ్బందులు ఉండవు. మన పని మనం చేసుకుంటూ వెళితే ఎవరూ ఏమీ అనరు. ఎందుకురా ఇండస్ట్రీకి వచ్చామని ఎప్పుడైనా ఫీలయ్యారా? ఒకట్రెండుసార్లు అనిపించింది. ముఖ్యంగా 2015లో. ఆ సమయంలో నన్ను ఎగై్జట్ చేసే చాన్స్లు రాలేదు. ఎందుకిలా జరుగుతోంది? లైఫ్ ఎటువైపు వెళుతోంది? అనే ఆలోచన మొదలైంది. డిఫరెంట్ ప్రాబ్లమ్స్. వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? అని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు ఒక్క విషయం తెలిసింది. మనం సక్సెస్లో ఉన్నప్పుడు మన గురించి మనకు ఏమీ తెలియదని. డౌన్ ఫాల్లో ఉన్నప్పుడు మనం ఎంత స్ట్రాంగ్? ఎంత బాగా ఆలోచించగలుగుతాం? నిర్ణయాలు తీసుకోగలుగుతామా? లేదా.. ఇలా మన గురించి మనకు ఓ క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. అందుకే అంటున్నా.. జీవితంలో ‘డౌన్ఫాల్’ కూడా ముఖ్యం. నేను డైలమాలో పడినప్పుడు అవసరాల శ్రీనివాస్ నుంచి ‘జో అచ్యుతానంద’ ఆఫర్ వచ్చింది.. అంగీకరించాను. ఆ సినిమా నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. ఆ తర్వాత తమిళంలో బిజీ కావడం, తెలుగులోనూ చేస్తుండటంతో ఆ ‘డిఫరెంట్ ఫేజ్’ దాటేశాను. డిసెంబర్లో సర్ప్రైజ్! నేనిప్పటివరకూ 25 సినిమాలకు పైగా చేశాను. వీటిన్నింటిలో కనిపించిన దానికన్నా ఓ సినిమాలో డిఫరెంట్గా కనిపించబోతున్నా. ఈ సినిమాకి సంబంధించిన నా కొత్త లుక్ డిసెంబర్లో వస్తుంది. ఆ లుక్ అందరికీ ఓ సర్ప్రైజ్. ఆ సినిమా వివరాలు కూడా అప్పుడే చెబుతా. హిందీలో ‘ఆంఖే 2’కి అవకాశం వచ్చింది కదా.. ఇప్పుడా సినిమా ముందుకు వెళ్లినట్లు అనిపించడం లేదు? నేనా సినిమా చేయడంలేదు. ‘ఆంఖే 2’ కరెంట్ స్టేటస్ తెలీదు. ప్రస్తుతానికి ఆగిందని విన్నాను. ఫస్ట్ హిందీ మూవీకే ఇలా జరగడం బాధగా... అలాంటిదేం లేదు. ఇది లైఫ్. ఏం జరుగుతుందో చెప్ప లేం. అందుకే లైట్ తీసుకున్నా. మీ మాటలు ‘కర్మ సిద్ధాంతాన్ని’ ఫాలో అవుతారేమో అనిపించేలా ఉన్నాయా? ఎగ్జాట్లీ. ‘ఎల్లామ్ తల విధి. ఎన్న ఎళుది ఇరుక్కో అదుదాన్ నడక్కుం’. (అంతా తలరాత. ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది అని అర్థం). సడన్గా మీ మాతృభాషలోకి వచ్చేశారేంటి? ఇలాంటి పెద్ద విషయాల గురించి మాట్లాడేటప్పుడు మదర్ టంగ్లో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ‘తల విధి’ని తెలుగులో ఏమంటారో తెలియదు (నవ్వుతూ). మణిరత్నం ‘యువ’లో సూర్య చెల్లెలి క్యారెక్టర్కి తీసుకోవాలనుకుంటే.. మీరేమో అందుబాటు లో లేరట.. అదేమైనా బాధగా ఉంటుందా? దూరదర్శన్ కోసం నేనో షో చేశాను. ఒక్క ఎపిసోడ్కే అది ఆగిపోయింది. ఆ షో డైరెక్టర్ మణిరత్నంగారికి అసిస్టెంట్ డైరెక్టర్. ‘యువ’లో చెల్లెలి క్యారెక్టర్ కోసం నన్ను తీసుకోవాలనుకున్నారట. కానీ, మేం వేరే ఇంటికి మారడంతో అడ్రస్ తెలుసుకోలేకపోయారు. అలా ‘యువ’ చాన్స్ మిస్సయ్యాను. మణిరత్నంగారు గ్రేట్ డైరెక్టర్. చూద్దాం.. భవిష్యత్తులో చాన్స్ వస్తుందేమో. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వదులుకోవడం ‘రాంగ్ డెసిషన్’ అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ టైమ్కి అదే కరెక్ట్ డెసిషన్ అనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది. శేఖర్ కమ్ములగారంటే నాకు గౌరవం. ఆయన మంచి డైరెక్టర్. అయితే ఆ టైమ్లో ‘సోలో’ హీరోయిన్గా ‘ఎస్సెమ్మెస్’ మూవీలో చాన్స్ వచ్చింది. అందుకని ఆ ∙సినిమా చేయడమే బెటర్ అనిపించింది. ఆ చాన్స్ వస్తే.. కత్తి తిప్పుతా ‘బాహుబలి’ లాంటి సినిమాకి అవకాశం వస్తే.. కాదనకుండా ఒప్పేసుకుంటా. అయితే నాకు హార్స్ రైడింగ్, స్వోర్డ్ ఫైట్ తెలియదు. కానీ, సినిమా కోసం నేర్చుకుంటా. కొత్త విషయాలు నేర్చుకోవడమంటే నాకు సరదా. రిస్క్ అయినా ఫర్వాలేదు.. త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.. ఈ ఏడాది ఎలా గడిచింది? తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా గడిచింది. మంచి క్యారెక్టర్స్కి అవకాశం వచ్చింది. వచ్చే ఏడాది కూడా ఇలానే పాజిటివ్గా ఉండాలనుకుంటున్నా. – డి.జి. భవాని -
తేడా వస్తే!
బాలకృష్ణుడు..పేరుకు తగ్గట్లే కుర్రాడు కూల్గా ఉంటాడు. కామ్గా తన పనేంటో తాను చూసుకుంటాడు. కానీ, ఏదైనా తేడా వస్తే మాత్రం తాట తీస్తాడు. ఇంతకీ ఈ బాలకృష్ణుడు ఎవరో కాదు.. హీరో నారా రోహిత్. పవన్ మల్లెల దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా రూపొందిన చిత్రం ‘బాలకృష్ణుడు’. శరత్చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ పిక్చర్స్ పతాకాలపై బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీ, వినోద్ నందమూరి నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాటలను ఈ నెల 10న విడుదల చేయనున్నారు. ‘‘కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రమిది. ఈ సినిమా కోసం నారా రోహిత్ సిక్స్ప్యాక్ చేశారు. రమ్యకృష్ణ ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించారు. రెజీనా బాగా నటించింది. ఇక మణిశర్మగారి సంగీతం సూపర్. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నిర్మాతలు. కోట శ్రీనివాసరావు, పృథ్వీ, ఆదిత్యా మీనన్, దీక్షా పంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా విజయ్ సి. కుమార్. -
రెట్రో వీరులు
రెట్రో వీరులు గడియారంలో ముల్లు వెనక్కి తిరుగుతుందా? ఊహూ... గతాన్ని మళ్లీ క్రియేట్ చేయొచ్చా? ఊహూ! రియల్గా కుదరదు కానీ... రీల్పై కుదురుతుంది. ఎన్నేళ్లయినా ముందుకెళ్లొచ్చు...ఎన్నేళ్లయినా వెనక్కి వెళ్లొచ్చు.ఇప్పుడు మాత్రం మన టాలీవుడ్లోకొందరు ‘బ్యాక్ టు పాస్ట్’ అంటున్నారు. ‘గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్’ అనే సామెత తెలుసా?దానర్థం గతమెప్పుడూబాగుంటుందని! అలాగని, భవిష్యత్తు బాగుండదని కాదు.బట్.. ప్రెజెంట్కన్నా ‘పాస్ట్’తెలుసుకోవడంలో ఓ కిక్కుఉంటుంది. మనవాళ్లను రెట్రో వీరులుగా చూడటంలో ఓ మజా ఉంటుంది. అందుకే...కలెక్షన్లను ముందుకుతీసుకెళ్లేందుకు గతంలోకి వెళుతున్నారు కొందరు దర్శక–నిర్మాతలు. 70 ఏళ్లు వెనక్కి రానా! నో.. కాంప్రమైజ్. క్యారెక్టర్స్వైజ్గా రానా రాజీపడరు. అవసరమైతే బరువు తగ్గుతారు. పెరుగుతారు. విలన్గానూ నటిస్తారు. అంతెందుకు బాస్.. ట్రెండ్కి తగ్గట్టుగా స్టైలిష్గా ఉండే రానా అవసరమైతే పాత కాలం మనిషిలా కనిపించడానికి ‘యస్’ అనేస్తారు. అలా అన్నదే ‘1945’ మూవీ. బర్మాకు వలస వెళ్లిన వారి బ్యాక్డ్రాప్లో సినిమా సాగుతుందని సమాచారం. ఈ సినిమా కోసం రానాను సుమారు 70 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు చిత్రదర్శకుడు సత్యశివ. 1945 టైమ్ అది. స్వాతంత్య్రం కూడా రాలేదు. ఆ కాలంలోకి వెళ్లి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు రానా. అందుకే, ఆ కాలం నాటి ఆనవాళ్లు స్క్రీన్పై కనిపించాలని టీమ్ అంతా చాలా కష్టపడి సెట్లో స్పెషల్ ఎరేంజ్మెంట్స్ చేస్తున్నారు. కాస్ట్యూమ్స్, లుక్స్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరో కోసం 1945 నాటి బైక్, వాచ్లను తయారు చేయించారు. రానా ఆల్రెడీ గెడ్డం తీసేశారు. రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరకర్త. నాజర్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కొచ్చి, చెన్నైలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆల్రెడీ సెకండ్ షెడ్యూల్ని కంప్లీట్ చేశారట. ఫస్ట్ లుక్ను నవంబర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. నార్త్లోనూ బ్యాక్ టు పాస్ట్ బాలీవుడ్లోనూ డైరెక్టర్లు ‘బ్యాక్ టు పాస్ట్’ అంటున్నారు. 1948 టైమ్లో ఒలింపిక్స్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించిన ఇండియన్ హాకీ టీమ్ ప్లేయర్ బల్బీర్సింగ్ బయోపిక్లో అక్షయ్కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకురాలు రీమా కగ్తీ. కండల వీరుడు సల్మాన్ ఖాన్ వచ్చే ఏడాది అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో నటించబోయే సినిమా 1950 కొరియన్ వార్ బ్యాక్డ్రాప్లో సాగనుంది. క్రికెట్లో ఇండియాకు 1983లో ఫస్ట్ వరల్డ్ కప్ అందించిన కపిల్దేవ్ కథతో రూపొందుతోన్న సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. కబీర్ఖాన్ ఈ చిత్రానికి దర్శకుడు. హీరోయిన్లలో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో ఆలియా భట్ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆలియా 1970 కాలానికి చెందిన కాశ్మీరీ అమ్మాయిగా నటిస్తున్నారు. ఇలా బాలీవుడ్ వాళ్లూ తమ సినిమాల కోసం వెనక్కి వెళుతున్నారు. వేరే దేశంలో 55 ఏళ్లు వెనక్కి! ప్రభాస్... చెప్పేదేముంది? ఎక్సెప్ట్ ‘బాహుబలి’ మిగిలిన అన్ని సినిమాల్లోనూ ఆల్మోస్ట్ ఎంతటి ట్రెండీ లుక్స్లో కనిపించారో... ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ, ప్రభాస్ను ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దాదాపు 55 ఏళ్ళ వెనక్కు తీసుకెళ్ల నున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. వీరి కాంబినేషన్లో తెరకెక్కే సినిమా 1960 యూరప్ బ్యాక్డ్రాప్లో రూపొందనుందట. అంటే... దర్శకుడు రాధకృష్ణ నాటి యూరప్ లొకేషన్ల కోసం వేటడాలి. లేకపోతే సెట్స్ వేయించాలి. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ ఉంది. ఈలోపు సెట్స్, లొకేషన్స్ని ఫైనలైజ్ చేసేస్తారు. మరి.. ప్రభాస్ను రాధాకృష్ణ ఆ కాలంలోకి తీసుకెళ్లి యుద్ధం చేయిస్తారో? ప్రేమలో పడేస్తారో? చూడాలి. గళ్ల లుంగీలో రామ్చరణ్ తెలుగువాళ్ల ట్రేడ్ మార్క్ అంటే.. ‘గళ్ల లుంగీ’. కాకపోతే సినిమాల్లో మన హీరోలు కనిపించేది ప్యాంటుల్లోనే కదా. అందుకే, మనోళ్లు ‘గళ్ల లుంగీ’ కడితే.. అభిమానులు ఈలలేసి, గోల చేసేస్తారు. రామ్చరణ్ ఫ్యాన్స్ అదే చేయబోతున్నారు. ‘ధృవ’ సినిమాలో చరణ్ ఎంత స్టైలిష్గా కనిపించారో చూశాం. కానీ, డైరెక్టర్ సుకుమార్ ‘రంగస్థలం’ సినిమా కోసం 1985 కాలంలోకి రామ్చరణ్ని తీసుకెళ్లారు. స్టైలిష్ హీరోను కాస్తా .. పక్కా విలేజ్ కుర్రాడిలా రెడీ చేశారు. గళ్ల లుంగీ, గెడ్డం, చేతిలో తువ్వాలు... టోటల్గా రామ్చరణ్ లుక్ అదిరింది. 30 ఏళ్ల క్రితం అమ్మాయిలు వేసుకున్నట్లే బిగుతుగా అల్లిన జడ, ఆ జడకు కట్టిన రిబ్బను, లంగా–ఓణీలో సమంత లుక్ కూడా బాగుంది. 1985ని తలపించేలా సుకుమార్ వేయించిన విలేజ్ సెట్స్ సూపర్. గోలీసోడా, పూరిళ్లు, కుండలు, ఎడ్లకావిడి.. ఇలా ఒకటేంటి ఆల్మోస్ట్ విలేజ్లో ఉండే అన్నింటినీ ఎరేంజ్ చేశారు. ఈ మధ్యే సెట్లో ఓ జాతర పాట తీసినట్లు బయటికొచ్చిన ఫొటో స్పష్టం చేసింది. అప్పటికాలంలో ఉండే జాతర, తిరున్నాళ్లను సినిమాలో చూడవచ్చన్న మాట. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా వస్తుంది. రూట్ మార్చిన పూరి..! ‘బ్యాక్ టు పాస్ట్’ వెళ్లడం ఇది కొత్త కాదు. గడచిన మూడు నాలుగేళ్లల్లో ‘మనం’, ‘24’ వంటి సినిమాలు సౌత్లో వచ్చాయి. అయితే, ఒకేసారి ఇటు సౌత్ అటు నార్త్లో ఎక్కువ సినిమాలు ‘ఆన్ సెట్స్’లో ఉండటం విశేషం. ప్రెజెంట్ ట్రెండ్ మూవీస్ ఎలానూ వస్తాయి. పాస్ట్ని ప్రెజెంట్ చూపించి, ప్రేక్షకులను మెప్పించి, మంచి వసూళ్లు రాబట్టుకోవాలన్నది ఫిల్మ్ మేకర్స్ టార్గెట్ అయ్యుండొచ్చు. ఫారిన్ లొకేషన్లు, పబ్బులు, హాట్ గాళ్స్... మారిన ట్రెండ్కి అప్డేటెడ్ వెర్షన్లా ఉంటాయి పూరి జగన్నాథ్ సినిమాలు. అయితే పూరి జగన్నాథ్ రూట్ మార్చారు. 1971కి వెళ్లిపోయారు. తనయుడు ఆకాశ్ పూరీ కోసం ‘మెహబూబా’ పేరుతో ఆయన లవ్స్టోరీ తీస్తున్నారు. 1971 చెందిన ఓ యువకుడు–యువతి మధ్య సాగే ప్రేమకథ ఇది. వార్ బ్యాక్డ్రాప్లో నడిచే సినిమా. 1971 అంటే పూరి స్టైల్ రిచ్నెస్ కనిపించే వీలుండదు. లేటెస్ట్ గన్స్, వెపన్స్ను ఫైట్స్లో యూజ్ చేయడం పూరి మార్క్. ఇలాంటివి ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయలేం.. 1971 అంటే పిస్తోల్, రైఫిల్.. లాంటివి వాడాలి కదా మరి. అందులోనూ వార్ బ్యాక్డ్రాప్ కాబట్టి చిట్టిపొట్టి కాస్ట్యూమ్స్లో హీరోయిన్ నెహా శెట్టిని చూపించే అవకాశం ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఈ సినిమా షూట్ను హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ చేశారు. హిమాలయాల్లో 18వేల అడుగుల ఎత్తులో, మైనస్ 7 డిగ్రీస్లో సినిమాను షూట్ చేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
చారిత్రాత్మక చిత్రంలో రెజీనా!
తమిళసినిమా: నటి రెజీనా కోలీవుడ్లో మళ్లీ పుంజుకుంటున్నారనే చెప్పాలి. ఇంతకు ముందు తమిళం, తెలుగు అంటూ విజయాలకోసం పరుగులు తీసిన ఈ బ్యూటీకి మానగరం వంటి అనూహ్య విజయం సాధించిన చిత్రంతో ఈ అమ్మడికి ఇక్కడ ఆశాజనక పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఒక చారిత్రాత్మక కథా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిని సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ఇతివృత్తంతో తెరకెక్కనున్న భారీ చిత్రంలో రెజీనా ఒక కీలక పాత్రను పోషించనున్నారన్నది తాజా సమాచారం. ఇందులో సుభాష్చంద్రబోస్తో పాటు స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుడు అజాద్ హింద్ ఫౌజ్ పాత్రను నటుడు రానా పోషించనున్నారు. బాహుబలి చిత్రం తరువాత ఆయన నటించనున్న మరో చారిత్రక కథా చిత్రం ఇది. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. 1945 కాల ఘట్టంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కనున్న మరో గొప్ప కళాఖండంగా ఈ చిత్రం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో రానాను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించబడ్డ యువతిగా రెజీనా నటించనున్నారట. ఇందులో ఈమె చాలా తక్కువ మేకప్తో విభిన్న గెటప్లో కనిపించనున్నారట. బాహుబలి చిత్రంతో అనుష్క, తమన్నా ఎంత పేరు సంపాదించుకున్నారో తెలిసిందే. మరి ఈ చరిత్ర కథా చిత్రం రెజీనాకు ఏ మాత్రం పేరు తీసుకొస్తుందో వేచి చూడాలి. -
1945 కట్
న్యూ ఇయర్ రావడానికి ఇంకా టైముంది. కానీ, హీరో రానాకు మాత్రం ఇప్పుడే స్టార్టయ్యిందంట. అయితే అందరూ అనుకున్నట్లు రాబోయే 2018 కాదండోయ్. 1945. విచిత్రంగా ఉందా? ‘వెల్కమ్ టు 1945’ అంటున్నారు రానా. ఎందుకంటే ఆయన హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం టైటిల్ ‘1945’ . రెజీనా కథానాయిక. సుభాష్చంద్రబోస్ సైన్యంలోని ఒక సైనికుడి పాత్రలో రానా నటిస్తున్నారన్నది ఫిల్మ్నగర్ టాక్. స్వాతంత్య్రానికి పూర్వపు సంఘటనలతో ఈ సినిమా ఉంటుంది. ఆ కాలానికి తగ్గట్టుగా హెయిర్ కట్ చేయించుకుంటున్నారు రానా. ‘‘జరిగిపోయిన కాలాన్ని సృష్టించబోతున్నాం. ఇప్పుడు మాకు ఇది 1945వ సంవత్సరం. ఈ చిత్రంలోని మేజర్ షెడ్యూల్ షూటింగ్ శుక్రవారం స్టార్టయ్యింది. తెలుగు, తమిళ్లో షూట్ చేస్తున్నాం. మా టీమ్ సభ్యులు విజయ్, జైపాల్ నా గెటప్ మార్చుతున్నారు’’ అన్నారు రానా. -
తండ్రి కొడుకుల మిస్టర్ చంద్రమౌళి
తమిళసినిమా: సీనియర్ నటుడు కార్తీక్, ఆయన కొడుకు గౌతమ్కార్తీక్ తొలిసారిగా కలిసి నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. క్రియేటీవ్ ఎంటర్టెయినర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై ధనుంజయన్ నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో మరిందరు ప్రముఖ నటీనటులు చేరుతున్నారు. ఈ క్రేజీ చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశం నటి రెజీనాను వరించింది. కాగా మరో ప్రధాన పాత్రలో నటి వరలక్ష్మీశర™Œత్కుమార్ నటించనున్నారు. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్ను ఖరారు చేశారు. మిస్టర్ చంద్రమౌళి అనే టైటిల్ను నిర్ణయించినట్లు దర్శకుడు తిరు వెల్లడించారు. ఆయన వివరిస్తూ కార్తీక్, గౌతమ్కార్తీక్ కలిసి నటించనున్నారనగానే ఈ చిత్రానికి పరిశ్రమ వర్గాల్లో మంచి క్రేజ్ సంతరించుకుందన్నారు. తాజాగా రెజీనా, వరలక్ష్మీశరత్కుమార్, ముఖ్యంగా దర్శకులు మహేం ద్రన్, అగస్థియన్లు నటిస్తుండడంతో చిత్రానికి మరింత హైప్ వచ్చిందన్నారు. అంతే కాదు ఈ మిస్టర్ చంద్రమౌళి చిత్రంపై ఒక దర్శకుడిగా తన బాధ్యత పెరింగిందన్నారు. -
నయా బాలకృష్ణుడు!
బాలకృష్ణుడు...పేరు కొంచెం క్లాసీగా ఉన్నా కుర్రాడిలో మాత్రం మాస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లున్నాయి. ఏదైనా తేడా కొట్టిందో విలన్స్ను ఇరగదీస్తాడంతే. సిక్స్ప్యాక్ ఉన్నప్పుడు ఆ మాత్రం కుమ్మేయడానికి ఆలోచించడు కదా. హీరో నారా రోహిత్నే ఈ నయా బాలకృష్ణుడు. పవన్ మల్లెల దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం ‘బాలకృష్ణుడు’. సరస్చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ మూవీస్ పతాకాలపై మహేంద్రబాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నందమూరి నిర్మిస్తున్నారు. రెజీనా కథనాయిక. మణిశర్మ స్వరకర్త. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘‘కంప్లీట్ కమర్షియల్ చిత్రమిది. ఈ సినిమా కోసం నారా రోహిత్ తొలిసారి సిక్స్ప్యాక్ చేశారు. ఆయన సూపర్గా నటిస్తున్నారు. పవన్ మల్లెల చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దసరాకు టీజర్ను రిలీజ్ చేయనున్నాం. మణిశర్మగారి మ్యూజిక్ సినిమాకు హైలైట్’’ అన్నారు. -
కొన్నేళ్లు ఒంటరిగానే జీవిస్తా!
తమిళసినిమా: నేనొకరిని ప్రేమించాను ఆ కారణంగానే.. ఒంటరిగా ఉన్నా నంటోంది రెజీనా. కోలీవుడ్, టాలీవుడ్ల్లో చాలా క్రేజీ హీరోయిన్. ముఖ్యంగా కోలీవుడ్లో మానగరం, రాజతందిరం, సరవణన్ ఇరుక్క భయమేన్, జెమినీగణేశనుమ్ సురళీరాజవుమ్ వంటి చిత్రాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి. తాజాగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎస్జే.సూర్యతో నటించిన నెంజమ్ మరప్పదిల్లై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రెజీనాను పలకిరిస్తే తన అనుభవాలను ఇలా చెప్పుకొచ్చింది. జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కోసారి టైమ్ వస్తుంది. ఇన్నేళ్ల నా సినీ అనుభవంలో నేను గ్రహించింది ఇది. అందుకే ఇప్పుడు ఏ విషయంలోనూ నేను తొందర పడడం లేదు. అదే విధంగా నేను ప్రస్తుతానికి ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతున్నాను. ప్రస్తుత జీవితమే నాకు బాగుందని నా అనుభవం చెబుతోంది. నేనిలా మాట్లాడడానికి కారణం ఏమిటి, ఏమిటా అనుభవం అని ప్రశ్నిస్తున్నారు. జీవితం నాకు చాలా పాఠాలు నేర్పింది. ఇంతకు ముందు నేనొకరిని ప్రేమించాను. నేనిప్పుడిలా మాట్లాడడానికి అదే కారణం. అయినా ఆ విషయాల్లోకి వెళ్లదలుచుకోలేదు. ప్రస్తుతం నేను చాలా తెలివిగా ఉన్నాను. నటిగా చిన్న గ్యాప్ తీసుకోవడానికి ఇదే కారణం. ఏదేమనా ఇప్పుడు ఎవరితోనూ రిలేషన్షిప్ పెట్టుకోవడం లేదు. నిజం చెప్పాలంటే నన్ను నేను అర్థం చేసుకోవలసింది ఇంకా చాలా ఉంది.అందుకే ఇంకా కొన్నేళ్లు నేను ఒంటరిగానే జీవించాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నా. -
రెజీనా కోసం రాశీఖన్నా..!
హీరోలే కాదు.. ఈ జనరేషన్ హీరోయిన్లు కూడా మల్టీ టాలెంటెడ్ గా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. సినిమాల్లో నటనతో పాటు ఇతర విభాగాల్లోనూ సత్తా చాటేందుకు ఉత్సాహపడుతున్నారు. అదే బాటలో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా గాయనిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. తను హీరోయిన్ గా నటించిన జోరు సినిమా కోసం తొలి సారిగా పాట పాడింది రాశీ. తరువాత మలయాళ చిత్రం విలన్ లోనూ గొంతు సవరించుకుంది. తాజాగా నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న బాలకృష్ణుడు సినిమాలో పాట పాడుతుంది. అయితే ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ కాదు. తొలి చిత్రాల్లో తన క్యారెక్టర్ కోసం పాట పాడిన రాశీ ఖన్నా, తొలిసారిగా రెజీనా పాత్ర కోసం పాడుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణం దశలో ఉంది. -
లెక్క తప్పింది
తమిళసినిమా: లెక్క తప్పిందన్న మనస్తాపంలో మునిగిపోయిందట రెజీనా . అనుకున్నవన్నీ జరిగితే ఇక దేవుడెందుకు అనే సామెత గుర్తుకొస్తోంది రెజీనా పరిస్థితి చూస్తే. నిజానికి ఈ బ్యూటీ మంచి ఫామ్లోనే ఉంది. తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ గానే ఉంది. అయితే ఇటీవల రెజీనాకు గ్లామర్పై మోజు పుట్టి నక్షత్రం అనే తెలుగు చిత్రం లో విచ్చల విడిగా అందాలను ఆరబోసింది. దీంతో స్టార్ హీరోయిన్ స్థాయి ఖాయం అని సన్నిహితులు చేవిలో బాజా ఊదడంతో చాలానే కలలు కనేసిందట. అయితే ఆ చిత్రం నిరాశ పరచడంతో ఇప్పుడు ఊహల పల్లకిలోంచి దబాల్న ఇహలోకంలోకొచ్చిందట. మితి మించిన గ్లామర్గా నటించినా ఫలితం దక్కకపోవడంతో లెక్క తప్పిందని చింతిస్తోందట. ఇకపై అలాంటి పొరపాటు చేయరాద న్న నిర్ణయానికి వచ్చేసిందట. కాగా ప్రస్తు తం ఈ అమ్మడు కోలీవుడ్లో సిల్లుక్కువార్పట్టి సింగం, నెంజమ్ మరప్పదిల్లై, రాజతంధిరం–2,పార్టీ అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగానే ఉం ది. వీటిలో ఏ రెండు చిత్రాలు విజయం సాధించినా త న మార్కెట్ పదిలంగా ఉంటుందని రెజీనా భావిస్తోందట. -
సంతోషంలో ఓ స్పెషాల్టీ ఉంటుంది
– సురేశ్ కొండేటి ‘సంతోషం’ సౌత్ ఇండియన్ ఫిల్మ్ 16వ వార్షికోత్సవ అవార్డుల వేడుక ఈ నెల 12న హైదరాబాద్లో జరుగనుంది. ఈ అవార్డులకు సంబంధించిన లోగోను ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, హీరోయిన్ రెజీనా లాంచ్ చేశారు. తొలి ఆహ్వాన పత్రికను శివాజీరాజా రెజీనాకు అందించారు. శివాజీరాజా మాట్లాడుతూ –‘‘సంతోషం అవార్డ్స్ వేడుక 16వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. ‘మా’ అసోసియేషన్లోని పేద కళాకారులందరికీ ఆర్థికంగా ఆయన సహాయం చేస్తున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఎప్పటిలానే సంతోషం వేడుకల్లో ఓ స్పెషాలిటీ ఫ్లాన్ చేశాం’’ అన్నారు ‘సంతోషం’ అధినేత సురేశ్ కొండేటి. ‘‘సంతోషం అవార్డు తీసుకోవాలన్న నా కల ‘ప్రేమకావాలి’తో తీరింది’’ అన్నారు హీరో ఆది. సురేశ్ కొండేటికి రెజీనా, హెబ్బా పటేల్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
లుక్.. నయా లుక్
నారా రోహిత్ ఇప్పుడు ‘బాలకృష్ణుడు’ అయ్యారు. అలా కావడం కోసం సన్నబడ్డారు. ఈ మధ్య నారా రోహిత్ కొంచెం బొద్దుగా తయారైన విషయం తెలిసిందే. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే సన్నబడిపోతానని ప్రూవ్ చేసుకున్నారు. పవన్ మల్లెల దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రంలో సన్నబడిన రోహిత్ను చూడొచ్చు. ఈరోజు రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ‘బాలకృష్ణుడు’ ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పొడవాటి జుత్తు, మెలి తిరిగిన మీసాలు.. సిక్స్ప్యాక్ బాడీతో నారా రోహిత్ డిఫరెంట్గా కనిపిస్తున్న లుక్ ఇది. ‘‘యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు బి.మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి. రెజీనా హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: విజయ్ సి.కుమార్, లైన్ ప్రొడ్యూసర్ డి.యోగానంద్. -
రక్షించేవాళ్లకు ఎందుకు భయపడాలి?
ప్రజల రక్షణ కోసమే ఉన్న పోలీసుల్ని చూసి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేసినోళ్లు భయపడాలి తప్ప సాధారణ ప్రజలు ఎందుకు భయపడాలి? అనే అంశాలను చర్చించడంతో పాటు ఓ అంతర్జాతీయ సమస్యను స్పృశిస్తూ... దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన సినిమా ‘నక్షత్రం’. సందీప్ కిషన్, రెజీనా, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యతారలుగా కె. శ్రీనివాసులు, వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టు 4న సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘పోలీస్ అవ్వాలని ప్రయత్నించే ఓ యువకుడి కథే ఈ సినిమా. హనుమంతుని శక్తియుక్తులు, సేవాభావం పోలీసుల్లో కనిపిస్తాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ఏదైనా సమస్యను చివరికి పరిష్కరించేది పోలీసే. మనం వాళ్లను చూసే దృక్పథం మారాలని ఈ సినిమాలో చెప్పా’’ అన్నారు. తులసి, జేడీ చక్రవర్తి, ప్రకాశ్రాజ్, శివాజీరాజా తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్, పద్మశ్రీ, కిరణ్ తటవర్తి, సంగీతం: భీమ్స్, భరత్, హరి గౌర. -
వెంకట్ప్రభు పార్టీ మొదలైంది
తమిళసినిమా: కొందరు దర్శకుల చిత్రాలకే ప్రత్యేక బ్రాండ్ ఉంటుంది. అలాంటి వారిలో దర్శకుడు వెంకట్ప్రభు ఒకరు. ఆయన చిత్రాల్లో చాలా మంది హీరోలుంటారు. అయినా అవి వెంకట్ప్రభు చిత్రాలుగానే గుర్తింపబడతాయి. చెన్నై 28 రెండు భాగాలు, సరోజ, గోవా లాంటివన్నీ ఆ తరహా చిత్రాలే. తాజాగా వెంకట్ప్రభు పార్టీకి రెడీ అయ్యారు. అవును ఆయన తాజా చిత్రం పేరు పార్టీ. ఇంతకు ముందు వెంకట్ప్రభు దర్శకత్వంలో అమ్మా క్రియేషన్స్ పతాకంపై సరోజా వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన టి.శివ మళ్లీ ఆయన దర్శకత్వంలోనే చేస్తున్న చిత్రం పార్టీ. వెంకట్ప్రభు గత చిత్రాల తరహాలోనే ఇందులోనూ ఒక నక్షత్ర బృందమే నటిస్తున్నారు. నటుడు సత్యరాజ్, జయరామ్, జై, శివ, కయల్ చంద్రన్, రమ్యకృష్ణ, నివేదా పేతురాజ్, రెజీనా, సంచి తాశెట్టి ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ చి త్రానికి ప్రేమ్జీ సంగీతాన్ని అందిస్తున్నారు. తన సోదరుడైన వెంకట్ప్రభు చిత్రానికి ఈయన తొలిసారిగా సంగీతాన్ని అందిస్తున్న చిత్రం ఇదే అవుతుంది. రాజేశ్ మాధవ్ ఛాయాగ్రహణం నెరుపుతున్న ఈ చిత్ర మేజర్ పార్టీ షూటింగ్ను ఫిజీ దీవుల్లో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నైలో జరిగింది. -
మరో పవర్ఫుల్ పాత్రలో శివగామి
బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిన రమ్యకృష్ణ, మరో ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నారా రోహిత్, రెజినా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రమ్యకృష్ణ రాజకీయనాయకురాలి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎంత కీలకమో ఈ సినిమాకు రమ్యకృష్ణ పాత్ర అంతేకీలకమంటున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా నారా రోహిత్, రమ్యకృష్ణల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో ఉన్నారు. నారా రోహిత్ పుట్టిన రోజైన జూలై 25న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘నక్షత్రం’ డిజప్పాయింట్ చెయ్యదు
-దర్శకుడు కృష్ణవంశీ ‘‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రీకరణకు రామ్చరణ్ను కలవడానికి వెళ్లా. అప్పుడు కృష్ణవంశీగారితో ‘ఎప్పుడైనా మీ సినిమాలో ఓ క్యారెక్టర్ ఉంటే చెప్పండి. చేస్తా’ అన్నాను. ‘నక్షత్రం’లో అలెగ్జాండర్ అనే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. వెంటనే చిరంజీవి, పవన్కల్యాణ్ మావయ్యల దగ్గరకు వెళ్లి ‘కృష్ణవంశీగారి సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నా’ అని చెప్పా. ‘వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్’ అన్నారు. ముఖ్యంగా చిరంజీవిగారయితే చాలా చెప్పారు. నువ్వెంతో నేర్చుకుంటావన్నారు’’ అన్నారు సాయిధరమ్ తేజ్. సందీప్ కిషన్, రెజీనా జంటగా సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ కీలక తారలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నక్షత్రం’. ఎస్. వేణుగోపాల్, సజ్జు, కె. శ్రీనివాసులు నిర్మాతలు. భీమ్స్ సిసిరోలియో, భరత్, హరి గౌర సంగీత దర్శకులు. పాటల సీడీలను ఆవిష్కరించిన సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్లు, తొలి సీడీని శ్రియ, రెజీనా, ప్రగ్యాలకు అందించారు. కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘డెఫినెట్గా ఈ సినిమా ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చేయదు. అందరూ చాలా కష్టపడి చేశారు. నేనూ కష్టపడి చేశాను’’ అన్నారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘ప్రతి రోజూ ఈ సినిమా సెట్కు కాలేజి స్టూడెంట్ లా వెళ్లా. కృష్ణవంశీగారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నా’’ అన్నారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘2009లో కృష్ణవంశీగారికి ఫేస్బుక్లో ‘మిమ్మల్ని ఓసారి కలవాలని’ మెసేజ్ పెట్టా. ఆయన రిప్లై ఇవ్వలేదు. ఏడేళ్ల తర్వాత ఈ సినిమా కుదిరింది. కృష్ణవంశీగారితో సినిమా చేయాలనుకునే చాలామంది కల ఈ ఒక్క సినిమాతో తీరింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు మూడు పాటలతో పాటు నేపథ్య సంగీతం అందించాను. ప్రేక్షకులకు సంగీత దర్శకుడిగా తెలిసిన నన్ను నటుడిగా, గాయకుడిగా పరిచయం చేస్తోన్న మా దర్శకునికి కృతజ్ఞతలు’’ అన్నారు భీమ్స్. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ఓ పాట మాత్రమే చేసినందుకు బాధగా ఉంది. నెక్స్›్ట ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నా’’ అన్నారు శ్రియ. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొన్నారు. -
తమిళంలోకి రారా కృష్ణయ్య!
తమిళసినిమా: నటుడు సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన తెలుగు చిత్రం రారా కృష్ణయ్య ఇప్పుడు తమిళంలోకి రానుంది. తమిళంలో మానగరం చిత్రంతో హిట్ జంటగా గుర్తింపు పొందిన సందీప్కిషన్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమిళంలో మహేంద్ర అనే టైటిల్ను నిర్ణయించారు. జగపతిబాబు, తణికెళ్ల భరణి, కావేరి, రవిబాబు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి మహేశ్బాబు దర్శకుడు. సాయిరామ్ ఛాయాగ్రహణం, అనురాజామణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని తమిళంలోకి హైమావతి జాంబమూర్తి సమర్పణలో వీవీఎస్.క్రియేషన్స్ పతాకంపై ఎన్.రాయ్రామ్ అనువదిస్తున్నారు. ఎస్.రాజేశ్, రాజశ్రీ, మణికంఠన్, ఎస్.రాయ్రామ్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు తెలుపుతూ ఒక దుష్ట కుటుంబంలో పుట్టిన యువకుడు చిన్నతనం నుంచి మంచి వాడిగా పెరుగుతాడన్నారు.అతన్ని తమ బాటలోకి తీసుకురావడానికి ఆ కుటుంబం ప్రయత్నించగా, వారిని మంచి మార్గంలో పయనింపజేయడానికి ఆ యువకుడు ప్రయత్నిస్తాడన్నారు. వారిలో ఎవరి ప్రయత్నం ఫలించింది? అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం మహేంద్ర అని తెలిపారు.ప్రేమ, యాక్షన్ సన్నివేశాలు అంటూ చిత్రం పక్కా కమర్షియల్ అంశాలతో జనరంజకంగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రేమ, యాక్షన్లతో పక్కా కమర్షియల్..
నటుడు సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన తెలుగు చిత్రం రారా కృష్ణయ్య ఇప్పుడు తమిళంలో రానుంది. మానగరం చిత్రంతో హిట్ జంటగా గుర్తింపు పొందిన సందీప్కిషన్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమిళంలో మహేంద్ర అనే టైటిల్ను నిర్ణయించారు. జగపతిబాబు, తణికెళ్ల భరణి, కావేరి, రవిబాబు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి మహేశ్బాబు దర్శకుడు. సాయిరామ్ ఛాయాగ్రహణం, అనురాజామణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని తమిళంలోకి హైమావతి జాంబమూర్తి సమర్పణలో వీవీఎస్.క్రియేషన్స్ పతాకంపై ఎన్.రాయ్రామ్ అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.రాజేశ్, రాజశ్రీ, మణికంఠన్, ఎస్.రాయ్రామ్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ఒక దుష్ట కుటుంబంలో పుట్టిన యువకుడు చిన్నతనం నుంచి మంచివాడిగా పెరుగుతాడని అన్నారు. తమ బాటలోకి తీసుకురావడానికి ఆ కుటుంబం ప్రయత్నిస్తోంది. వారిని మంచి మార్గంలో పయనింపజేయడానికి ఆ యువకుడు ప్రయత్నాం చేస్తాడని తెలిపారు. వారిలో ఎవరి ప్రయత్నం ఫలించింది ? అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం మహేంద్ర అని తెలిపారు. ప్రేమ, యాక్షన్ సన్నివేశాలతో పక్కా కమర్షియల్ అంశాలతో జనరంజకంగా సినిమా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
పార్టీలో ఆ ముగ్గురు!
తమిళసినిమా: పార్టీలో చేరడానికి ముగ్గురు బ్యూటీస్ రెడీ అవుతున్నారు. ఏమిటీ ఏదేదో ఊహించుకుంటున్నారా? అంతలేదిక్కడ. సాధారణంగా వెంకట్ప్రభు చిత్రాల్లో హీరోలు, హీరోయిన్లు ఒకటి కంటే ఎక్కువే ఉంటారు. చెన్నై–28 చిత్రంలో చాలా మంది హీరో లు నటించారు. ఇక మంగాత్తాలో అజిత్తో పాటు అర్జున్, త్రిష, ఆండ్రియా అంటూ ప్రముఖ తారలు నటించారు. ఇటీవల వచ్చిన చెన్నై 28–2లోనూ హీరోహీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఇవన్నీ మంచి విజయాన్ని సాధించిన చిత్రాలే అన్నది గమనార్హం. కాగా వెంకట్ప్రభు తాజా చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి పార్టీ అనే టైటిల్ నిర్ణయించారు. దీన్ని అమ్మాక్రియేషన్స్ పతాకంపై టి.శివ నిర్మించనున్నారు. ఇందులో సత్యరాజ్, నాజర్, జయరాం, రమ్యకృష్ణ, జై, శివ, సంపత్, కయల్చంద్రన్ అంటూ చాలా మంది నటులు నటించనున్నారు. కాగా ఈ పార్టీలో నటి రెజీనా, సంచితాశెట్టి, నివేదపెతురాజ్ ముగ్గురు ముద్దుగుమ్మలు నటించనున్నారు. దీంతో పార్టీ చిత్రంపై ఆసక్తి పేరుగుతోంది. మరి ఈ ముద్దుగుమ్మలు పార్టీలో ఎలాంటి మజా అందిస్తారో చూడాల్సిందే. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ప్రేమ్జీ సంగీతాన్ని అందించనున్నారు. చిత్ర షూటింగ్ను బీజీ దీవుల్లో ఒకే షెడ్యూల్లో పూర్తి చేయడానికి చిత్ర వర్గాలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట. మొత్తం మీద వెంకట్ప్రభు ఈ పార్టీతో మరో విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. -
నలుగురు నాయికలతో అధర్వ రొమాన్స్
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు కథానాయికలతో రొమాన్స్ చేస్తూ వస్తున్నారు యువ నటుడు అధర్వ. ఈటీ, కణిదన్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత అధర్వ కథా నాయకుడిగా నటిస్తున్న చిత్రం జెమినీగణేశనుం సురుళిరాజానుం. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అమ్మాక్రియేషన్స్ టీ. శివ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈయన సంస్థకు ఇది జూబ్లీ చిత్రం అవుతుంది. ఇందులో అధర్వకు జంటగా నటి ఐశ్వర్యారాజేశ్, రెజీనా, ప్రణీత, అతిథి ఇలా నలుగురు బ్యూటీస్ నటిస్తున్నారు. కథ డిమాండ్ మేరకే నలుగురు కథానాయికలను ఎంచుకున్నామన్నారు దర్శకుడు ఓడం ఇళవరసు. చిత్రంలో ఈయనే హీరో, వీళ్లే హీరోయిన్లు, వీళ్లే కమెడియన్లు అన్నదేమీ ఉండదని.. వారి వారి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. రొమాం టిక్ కామెడీ కథా చిత్రంలో నటించాలన్న అధర్వ కోరిక ఈ చిత్రంతో తీరనుందని చెప్పారు. చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని.. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తునట్లు తెలిపారు. ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతం, శ్రీసరవణన్ ఛాయాగ్రాహణం అందిస్తున్నారు. -
భగవంతుడు వాయిదా వేశాడు
భగవంతుడు వాయిదా వేశాడు అంటోంది నటి రెజీనా. ఈ అమ్మడు అచ్చ తమిళ ఆడపడుచు. కేడీబిల్లా కిల్లాడిరంగా చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఆ చిత్రం సక్సెస్ అయినా ఇక్కడ అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్ను ఆశ్రయించింది. అక్కడ మంచి విజయాలనే అందుకుంటోంది. అయితే తమిళ అమ్మాయినై ఉండి తమిళంలో విజయాలను అందుకోలేకపోతున్నాననే మథన పడుతూనే ఉందట. అందుకని మధ్య మధ్యలో తమిళ చిత్రాల అవకాశాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉందట. ఆ మధ్య రాజతందిరం అనే చిత్రం బాగానే ఆడింది. అయినా రెజీనాను కోలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది చాలా కాలం తరువాత మానగరం చిత్రం రూపంలో ఈ అమ్మడి ఖాతాలో ఇటీవల మంచి విజయం నమోదైంది. అంతే కాదు ఇప్పుడు ఇక్కడ రెజీనా టైమ్ బాగుంది. ఎస్జే. సూర్యతో నెంజం మరప్పదిల్లై, అధర్వతో జెమినీగణేశనుం సురళీరాజానుం, ఉదయనిధిస్టాలిన్కు జంటగా సరవణన్ ఇరుక్క భయమేన్తో పాటు రాజతందిరం– 2, సిలుక్కువార్పట్టి సింగం మొదలగు ఐదు చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది. వీటిలో సరవణన్ ఇరుక్క భయమేన్ చిత్రం ఈ నెల 12న తెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఉదయనిధిస్టాలిన్ సిక్స్ప్యాక్తో నటిస్తున్నాడు. ఈయన పక్కన నటిస్తున్న తమిళ హీరోయిన్ అనే ప్రశంసలు అందుకుంటున్నానని రెజీనా తెగ మురిసిపోతోంది. ఈ చిత్రం పాటల్లో అందాలను వెండితెరపై పరిచిందట. ఈ సందర్భంగా ఈ అమ్మడు మనసులోని మాటను బయట పెడుతూ మాతృభాషలో విజయం సాధించాలన్న ఆశ చాలా కాలంగా ఉందని అంది. నిజానికి తాను ఇక్కడ ఎప్పుడో సక్సెస్ను అందుకోవాల్సిందని, ఆ భగవంతుడు కాస్త వాయిదా వేశాడని పేర్కొంది. ఇప్పుడు తన టైమ్ బాగుందని, త్వరలోనే కోలీవుడ్లో తాను ఆశించిన స్థాయికి చేరుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నిటిలోనూ తన పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పుకొచ్చింది. మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, మంచి పాత్రలను ఎంచుకుని నటిస్తున్నానని రెజీనా పేర్కొంది. -
భగవంతుడు వాయిదా వేశాడు
భగవంతుడు వాయిదా వేశాడు అంటోంది నటి రెజీనా. ఈ అమ్మడు అచ్చ తమిళ ఆడపడుచు. కేడీబిల్లా కిల్లాడిరంగా చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఆ చిత్రం సక్సెస్ అయినా ఇక్కడ అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్ను ఆశ్రయించింది. అక్కడ మంచి విజయాలనే అందుకుంటోంది. అయితే తమిళ అమ్మాయినై ఉండి తమిళంలో విజయాలను అందుకోలేకపోతున్నాననే మథన పడుతూనే ఉందట. అందుకని మధ్య మధ్యలో తమిళ చిత్రాల అవకాశాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉందట. ఆ మధ్య రాజతందిరం అనే చిత్రం బాగానే ఆడింది. అయినా రెజీనాను కోలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది చాలా కాలం తరువాత మానగరం చిత్రం రూపంలో ఈ అమ్మడి ఖాతాలో ఇటీవల మంచి విజయం నమోదైంది. అంతే కాదు ఇప్పుడు ఇక్కడ రెజీనా టైమ్ బాగుంది. ఎస్జే. సూర్యతో నెంజం మరప్పదిల్లై, అధర్వతో జెమినీగణేశనుం సురళీరాజానుం, ఉదయనిధిస్టాలిన్కు జంటగా సరవణన్ ఇరుక్క భయమేన్తో పాటు రాజతందిరం– 2, సిలుక్కువార్పట్టి సింగం మొదలగు ఐదు చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది. వీటిలో సరవణన్ ఇరుక్క భయమేన్ చిత్రం ఈ నెల 12న తెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఉదయనిధిస్టాలిన్ సిక్స్ప్యాక్తో నటిస్తున్నాడు. ఈయన పక్కన నటిస్తున్న తమిళ హీరోయిన్ అనే ప్రశంసలు అందుకుంటున్నానని రెజీనా తెగ మురిసిపోతోంది. ఈ చిత్రం పాటల్లో అందాలను వెండితెరపై పరిచిందట. ఈ సందర్భంగా ఈ అమ్మడు మనసులోని మాటను బయట పెడుతూ మాతృభాషలో విజయం సాధించాలన్న ఆశ చాలా కాలంగా ఉందని అంది. నిజానికి తాను ఇక్కడ ఎప్పుడో సక్సెస్ను అందుకోవాల్సిందని, ఆ భగవంతుడు కాస్త వాయిదా వేశాడని పేర్కొంది. ఇప్పుడు తన టైమ్ బాగుందని, త్వరలోనే కోలీవుడ్లో తాను ఆశించిన స్థాయికి చేరుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నిటిలోనూ తన పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పుకొచ్చింది. మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, మంచి పాత్రలను ఎంచుకుని నటిస్తున్నానని రెజీనా పేర్కొంది. -
నక్షత్రం వర్కింగ్ స్టిల్స్
-
ఆ దర్శకుల గురించి తెలుసుకోవడం లేదు
గొప్ప దర్శకుల నుంచి ఈ తరం కళాకారులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్న ఆవేదనను దర్శకుడు ఎళిల్ వ్యక్తం చేశారు. వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం సరవణన్ ఇరుక్క భయమేన్. నటుడు ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించి తన రెడ్ జెయింట్ మూవీస్ పతకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా రెజీనా, సృష్టిడాంగే నాయికలుగా నటించారు. సూరి, యోగిబాబు, మన్సూర్ అలీఖాన్, రవి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన వస్తోందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా సవరణన్ ఇరుక్క భయమేన్ చిత్రం మే 12న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో మాట్లాడుతూ సరవణన్ ఇరుక్క బయమేన్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇందులో సృష్టిడాంగే పాత్ర ఏమి చెప్పినా నమ్మేస్తారన్నారు. తాను ఆమె కలిసి నటించిన ఒక పాటను కేరళాలోని కొచ్చి దాటి సముద్ర తీరంలో చిత్రీకరించామన్నారు. అక్కడ సృష్టిడాంగేకు కేరవన్ వ్యాన్ కూడా లేదు. అంతగా ఆమె సహకరించి నటించారు. ఈ చిత్రానికి ముందు రెండు చిత్రాలను అంగీకరించానని, వాటి కంటే ముందుగా ఈ చిత్రం విడుదల కావడానికి దర్శకుడు ఎళిల్ వేగమే కారణం అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు ఎళిల్ మాట్లాడుతూ సంగీత దర్శకుడు డీ.ఇమాన్, గీత రచయిత యుగభారతి కలిస్తేనే సూపర్హిట్ పాటలు వస్తాయన్నారు. ఇకపోతే మన ముందు తరం దర్శకులు చాలా ప్రతిభావంతులన్నారు. వారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా పేర్కొన్నారు. అయితే అలాంటి వారి గురించి ఈ తరం వారు తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. అది కరెక్ట్ కాదని, ఈ పరిస్థితి మారాలని ఎళిల్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నటి రెజీనా, సృష్టిడాంగే, సూరి, డీ.ఇమాన్, రవి పాల్గొన్నారు. -
ప్రమోషన్కు నో అంటున్న రెజీనా
నటి రెజీనాకు రెక్కలొచ్చాయా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇటీవల ఈ అమ్మడు నటించిన మానగరం చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో రెజీనాకు అవకాశాలు వరుస కడుతున్నాయి. తెలుగులోనూ చిత్రాలు చేయడంతో నిర్మాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఈ జాణ తమిళంలో ఉదయనిధి స్టాలిన్తో సరవణన్ ఇరుక్క భయమేన్ చిత్రంలో నటించింది. వేల్లన్ను వందా వెళ్లక్కారన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత ఎళిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఉదయనిధి స్టాలిన్ తన రెడ్జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో ఉదయనిధి పూర్తి వినోదంతో కూడిన హీరో పాత్రలో నటించారు. ఆయనతో సూరి హాస్యాన్ని పండించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్తో విడుదలకు సిద్ధం అవుతోంది. మే నెల 12న చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలకు రావలిసిందిగా నటి రెజీనాకు కోరగా తాను తెలుగు చిత్ర షూటింగ్తో చాలా బిజీగా ఉన్నానని, అందువల్ల శరవణన్ ఇరుక్క భయమేన్ చిత్ర ప్రమోషన్కు రావడం కుదరదని ఖరాఖండీగా చెప్పేస్తోందట. దీంతో యూనిట్ వర్గాలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో నటి రెజీనాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
‘రంగస్థల’ జీవితాల ఆధారంగా...
సురభి రంగస్థల కళాకారుల జీవితాలు గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనే కథతో రూపొందుతోన్న సినిమా ‘హరే రామ హరే కృష్ణ’. దిలీప్ప్రకాశ్, రెజీనా జంటగా అర్జున్సాయిని దర్శకునిగా పరిచయం చేస్తూ, సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఎన్. నవీన్రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దిలీప్, రెజీనాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు చందూ మొండేటి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత ఎన్. నవీన్రెడ్డి మాట్లాడుతూ – ‘‘కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మే నెల్లో కులు–మనాలీలో ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెడతాం’’ అన్నారు. అర్జున్సాయి మాట్లాడుతూ – ‘‘రంగస్థల కళాకారులందరూ ఇప్పుడు కళను వదలి ఉద్యోగాలకు వెళ్తున్నారు. అంతరిస్తున్న సంప్రదాయ కళను కాపాడే ప్రయత్నం చేసే ఓ యువజంట కథే ఈ సినిమా. వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు దిలీప్, రెజీనా, నటి ఆమని, కళా దర్శకుడు బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశ్రాజ్, ఆమని, నాజర్, కృష్ణభగవాన్, అలీ, బాబూమోహన్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: అనూప్ రూబెన్స్. -
ఈ విజయం ఆనందాన్నిచ్చింది
‘‘నేను, సందీప్ కలిసి చేసిన మూడో సినిమా ‘నగరం’. ఈ చిత్రానికి ఇంత మంచి ఆదరణ రావడం హ్యాపీ. ప్రేక్షకులు మా సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. విమర్శకులు సైతం బాగుందని ప్రశంసిస్తున్నారు. దర్శకుడు లోకేష్ ఈ మూవీని చక్కగా తెరకెక్కించారు. చిత్రాన్ని ఆదిరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని రెజీనా అన్నారు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ ముఖ్యపాత్రల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ సమర్పణలో ఏకెఎస్ ఎంటర్టైన్మెంట్, పొటెన్షియల్ స్టూడియోస్ నిర్మించిన ‘నగరం’ గత శుక్రవారం విడుదలైంది. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా విడుదల టైమ్లో నేను, రెజీనా వేరే సినిమా షూటింగ్ కోసం మలేసియాలో ఉన్నాం. ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తున్నారని తెలిసి, ఆనందపడ్డాం. కథ బాగుండటంవల్లే ఈ విజయం. కొన్ని కారణాల వల్ల ‘నగరం’ ఆలస్యంగా విడుదలైంది. అయినా తెలుగు, తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. తెలుగు హీరోకు తమిళంలో ఇంత పెద్ద సక్సెస్ రావడం, రెండో వారంలో మరిన్ని థియేటర్స్ పెరగడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. -
నగరం నాకు రిలీఫ్ ఇచ్చింది
‘నగరం’ కథ విన్నప్పుడే, ఆ కాన్సెప్ట్కి కనెక్ట్ అయిపోయా. వాస్తవానికి దగ్గరగా ఉన్న కథ కావడంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ, మధుసూదన్ ముఖ్య పాత్రల్లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ‘నగరం’ ఈరోజు విడుదలవుతోంది. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ప్రతి మనిషిలో మంచీ, చెడూ ఉంటాయి.. వారిలోని మంచితనం కరెక్ట్ టైమ్కి బయటపడితే బాగుంటుంది’ అన్నదే ‘నగరం’ కథ. ఈ యూనిట్ అంతా కొత్తవారే. సినిమాపై ఉన్న ప్యాషన్తో ఉద్యోగాలు వదులుకుని మరీ తీశారు. ఒక మంచి డైరెక్టర్ నా చిత్రం ద్వారా పరిచయమవుతున్నందుకు గర్వంగా ఉంది. నా గత చిత్రాలు ‘రన్, ఒక్క అమ్మాయి తప్ప’ సరిగ్గా ఆడలేదు. దాంతో నాపై నాకే డౌట్ వేసింది. నేను సరైన కథలను ఎంచుకుంటున్నానా? అని. ‘నగరం’ ప్రివ్యూ చూసిన తెలుగు, తమిళ పరిశ్రమ పెద్దలు ‘చాలా బాగుంది’ అని అభినందిస్తుంటే రిలీఫ్ అనిపించింది. -
రానాతో జతకట్టనున్న రెజీనా
యువ నటుడు రానాతో జత కట్టేందుకు నటి రెజీనా రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. టాలీవుడ్ టాలెస్ట్ నటుడు రానా. ఈయన ఒక్క తెలుగు చిత్రసీమకే పరిమితం కాకుండా హిందీ, తమిళం అంటూ బహుభాషా నటుడిగా రాణిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ఘాజీ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషలో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. కాగా రానా తమిళంలో ఆరంభం చిత్రంతోనే పరిచయం అయ్యారు. ఆ తరువాత బెంగళూర్ నాట్కల్, బాహుబలి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం బాహుబలి–2తో పాటు ఒక తెలుగు చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా తాజాగా మరో ద్విభాషా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇంతకు ముందు కళగు అనే వైవిధ్య భరిత కథాంశంతో విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరి కలయికలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మడైతిరంద అనే టైటిల్ను నిర్ణయించారు. ఇది స్వాతంత్య్రానికి ముందు జరిగే చారిత్రక కథాంశంతో రూపొందనుందట. చిత్ర కథ నచ్చడంతో రానా ఇందులో నటించడానికి అంగీరించారు. ఈ విషయాన్ని ఇటీవల రానానే స్వయంగా చెన్నైలో ఘాజీ చిత్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాగా ఈ పిరియడ్ కథా చిత్రంలో రానాకు జంటగా నటి రెజీనా నటించనున్నారని సమాచారం. ఈ అమ్మడు నటించిన మానగరం చిత్రం ఈ నెల 10న తెరపైకి రానుందన్నది గమనార్హం. -
ఫుల్ యాక్షన్
రజనీకాంత్ ‘నరసింహ’ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ ఏ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారో తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి ఆ తరహా పాత్రలో కనిపించనున్నారట. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఎస్.వి.ఎం.పి. పతాకంపై బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీకృష్ణ, నందమూరి శ్రీవినోద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేయస్ రామారావు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. మరో నిర్మాత బెల్లంకొండ సురేశ్ దర్శకునికి స్క్రిప్ట్ అందించారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. సీనియర్ నటి రమ్యకృష్ణ మా చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ‘నరసింహ‘ చిత్రంలోని నీలాంబరి రేంజ్ క్యారెక్టర్ ఆమెది’’ అన్నారు. అజయ్, పృధ్వీ, ‘వెన్నెల’ కిషోర్, రఘుబాబు, సత్యకృష్ణ, తేజస్విని, శ్రావ్యా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: యోగానంద్, కెమెరా: విజయ్ సి.కుమార్, సంగీతం: మణిశర్మ. -
‘నగరం’ మూవీ స్టిల్స్
-
నాలుగు జీవితాలు 48 గంటలు...!
నాలుగు జీవితాలు.. మూడు కోణాలు.. రెండు ప్రేమకథలు... 48 గంటల్లో ఊహించని మార్పులు.. అవన్నీ ‘నగరం’లోనే ఉన్నాయి. ఆ ఢిపరెంట్ కాన్సెప్ట్ ఏంటో చూడాలంటే ఈ నెల 10 వరకు వెయిట్ చేయ్యాల్సిందే. ఏకేఎస్ ఎంటర్టైన్ మెంట్, పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్లపై లోకేశ్ దర్శకత్వం లో రూపొందిన చిత్రం ‘నగరం’. జంటగా నటించారు. చిత్రనిర్మాత అశ్వనికుమార్ సహదేవ్ మాట్లాడుతూ– ‘‘నలుగురు వ్యక్తుల మధ్య ఒక నగరంలో 48 గంటల్లో జరిగే కథ ఇది. సందీప్ కిషన్ది ఒక స్టోరి. రెజీనాది ఇంకో కథ. శ్రీ అనే వ్యక్తిది మరో స్టోరి. ఈ ముగ్గురినీ కలిపే డ్రైవర్ పాత్ర ఇంకొకటి. స్క్రీన్ప్లే బేస్డ్ చిత్రం. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చేస్తున్నాం. తమిళంలో ‘మానగరం’గా రిలీజ్ అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: జావేద్ రియాజ్, కెమెరా: సెల్వకుమార్ ఎస్కె, ఎడిటింగ్: గౌతంరాజు. -
ఛాన్స్ కావాలంటే అడ్జస్ట్ కావాలన్నాడు!
‘‘ఒక్క ఛాన్స్ కావాలా? అయితే ‘అడ్జస్ట్’ అవ్వాలి.. ఓకేనా?’’ అని అడిగేవాళ్లు ఉంటారని సినిమా రంగం గురించి తెలిసినవాళ్లు అంటుంటారు. ఒకప్పుడు రెజీనాకి ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఆ విషయం గురించి ఓ ఆంగ్ల పత్రికతో రెజీనా మాట్లాడుతూ – ‘‘ఏడేళ్ల క్రితం నేనో తెలుగు సినిమా చేస్తున్నప్పుడు, ఎవరో వ్యక్తి ఒక తమిళ సినిమాకి అవకాశం ఇస్తానంటూ ఫోన్ చేశాడు. ఆ ఛాన్స్ కావాలంటే, కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలన్నాడు. అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఫోన్ పెట్టాశాను’’ అన్నారు. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవాలో మహిళలకు తెలిసుండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. -
వారికి ఉరి శిక్ష విధించాలి!
నటి భావన లైంగికవేధింపుల సంఘటన దక్షిణాదిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దర్యాప్తులో ఆమె కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.మంత్రి కొడుకుల హస్తం ఉందని, ప్రముఖ నటుడికి ఈ దురాగతంలో భాగం ఉందని, మరో మహిళా వ్యాపారవేత్తే ఈ ఘటనకు సూత్రధారి అని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు మాత్రం ముమ్మరంగా సాగుతోంది. కాగా భావన లైంగికవేధింపులకు గురైన విషయాన్ని నటి రెజీనా ముందుకు తీసుకురాగా తానూ అడ్జెస్ట్మెంట్ వ్యాఖ్యలను ఎదుర్కొన్నానని అన్నారు.ఈ బ్యూటీ సందీప్కిషన్, శ్రీలతో కలిసి నటించిన మానగరం చిత్రం మార్చి 10వ తేదీన తెరపైకి రానుంది. విలేకరుల సమావేశంలో పాల్గొనడానికి చెన్నై వచ్చిన రెజీనాను భావన సంఘటనపై స్పందించాల్సిందిగా అడిగినప్పుడు సినిమాలో మనతో నటించే యూనిట్పై నమ్మకం కలగాలన్నారు.ఇది చాలా క్లిష్టవైున పరిస్థితి అని పేర్కొన్నారు.సెన్సిటివ్ అయిన ఈ అంశం గురించి తాను మాట్లాడదలచుకోలేదని అన్నారు.అయితే అత్యాచారయత్నానికి పాల్పడ్డ వారికి ఉరి శిక్ష లాంటి దండన విధించాలన్నారు. లేదా వారిని పెట్టే టార్చర్కు మరెవరూ మహిళలపై అత్యాచారం చేయడానికి భయపడేలా ఉండాలన్నారు. ఏదేవైునా స్త్రీలు తమ రక్షణ విషయంలో తరచూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.తాను ఆరంభంలో తమిళ చిత్రాల్లో నటించానని,ఆ తరువాత తెలుగు చిత్రాల వైపు దృష్టి సారించానన్నారు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు తనకు ఫోన్ చేసి తమిళ చిత్రంలో నటించడానికి కాల్షీట్స్ అడిగారన్నారు. తరువాత అడ్జెస్ట్మెంట్ అనే పదాన్ని ఉపయోగించారని, దాంతో తానా చిత్రంలో నటించలేదని తెలిపారు.ఆ తరువాత తనకలాంటి సంఘటనలు ఎదురవ్వలేదని చెప్పారు.ఏ రంగంలో అయినా మనం చాలా జాగ్రత్తగా ఉంటే ఎవరి సాయం అవసరం లేకుండా సురక్షితంగా ఉండవచు్చనని అంటున్నారా ఉత్తరాది భామ. -
ఛలో బ్యాంకాక్!
పాటలు కనువిందుగా ఉండాలంటే ఏం చేయాలి? లొకేషన్స్ అదిరిపోవాలి. అలాంటి లొకేషన్స్ కోసం ‘నక్షత్రం’ చిత్రబృందం బ్యాంకాక్ వెళ్లింది. అక్కడి అందమైన పరిసర ప్రాంతాల్లో మూడు పాటలు చిత్రీకరించనున్నారు. ఇక, సినిమా కథ ఏంటంటే... పోలీసు అవ్వాలనే ప్రయత్నంలో ఉన్న యువకుడి కథ ఇది. సందీప్ కిషన్,రెజీనా నాయకా నాయికలు. సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘‘రామాయణంలో హనుమంతుని పాత్రకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో, సమాజంలో పోలీసు పాత్రకు అంతే ఉంటుంది. అదెలాగో నా సినిమాలో చూడండి’’ అంటున్నారు చిత్రదర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమా టాకీ పూర్తయింది. నేటి నుంచి బ్యాంకాక్లో పాటల చిత్రీకరణ ఆరంభిస్తారు. ఒక పాటను సందీప్కిషన్, రెజీనా పై, మరోపాటను సాయిధరమ్, ప్రగ్యాపై చిత్రీకరించనున్నారు. అక్కడే ఓ ప్రత్యేక పాటను కూడా షూట్ చేస్తారు. ఆ పాట వివరాలు బ్యాంకాక్ నుంచి వచ్చిన తర్వాత తెలియజేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్, భరత్ అందిస్తున్నారు. శ్రీచక్ర మీడియా సారధ్యంలో బుట్టబొమ్మ క్రియోషన్స్ కె.శ్రీనివాసులు, విన్విన్విన్ క్రియేషన్స్ వేణుగోపాల్, సజ్జు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ముగ్గురు హీరోలతో హ్యాట్రిక్ సినిమాలు
అందం, అభినయం రెండూ ఉన్న స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవటంలో ఫెయిల్ అవుతున్న హీరోయిన్ రెజీనా. తెలుగులో వరుస అవకాశాలు లేకపోవటంతో కోలీవుడ్ బాట పట్టిన ఈ భామ, టాలీవుడ్లో ఇంట్రస్టింగ్ రికార్డ్కు చేరువైంది. ఈ జనరేషన్ హీరోలు ఒక సినిమాలో కలిసి నటించిన హీరోయిన్తో మరో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించటం లేదు. అలాంటి సమయంలో ముగ్గురు హీరోలతో హ్యాట్రిక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది రెజీనా. సందీప్తో రెజీనాకు ఇది మూడో సినిమా. గతంలో రొటీన్ లవ్ స్టోరి, రా రా కృష్ణయ్య సినిమాలో కలిసి నటించిన ఈ జోడికి తెలుగులో ఇది మూడో సినిమా. నక్షత్రం సినిమాలోనే మరో యంగ్ హీరోతో కూడా మూడో సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో కలిసి నటించిన సాయి ధరమ్ తేజ్ నక్షత్రం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరో యంగ్ హీరోతో కూడా హ్యాట్రిక్ సినిమాకు రెడీ అవుతోంది రెజీనా. ఇటీవల జ్యో అచ్యుతానంద సినిమాతో నారా రోహిత్ సరసన హీరోయిన్గా నటించి మంచి సక్సెస్ సాధించింది. అంతకు ముందే ఇదే కాంబినేషన్లో శంకర అనే సినిమాలో వీరు కలిసి నటించినా ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు మరోసారి రోహిత్తో జోడి కట్టేందుకు రెడీ అవుతోంది. పవన్ మల్లెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాలో ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. -
ప్రేక్షకులతోనే భయమంతా!
‘ఎ’ ఫర్ అమితాబ్ బచ్చన్. బాలీవుడ్లో అంతే మరి! యాక్టింగ్లో ఆయన తర్వాతే ఎవరైనా. అమితాబ్ తర్వాత ‘ఎ’ ఫర్... అనిల్కపూర్, అర్షద్ వార్సి, అర్జున్ రాంపాల్ పేర్లు రాసుకోవచ్చు. వీళ్లందరూ కూడా నటనలో తక్కువేం కాదు. అనీస్ బజ్మీ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఆంఖే–2’లో రెజీనా ఈ బాలీవుడ్ మహామహులతో నటించనున్నారు. హిందీ తెరకు పరిచయమవుతున్న తొలి సినిమాలో అమితాబ్ వంటి స్టార్తో పాటు హేమాహేమీలతో కలసి నటించడానికి నెర్వస్గా ఫీలవుతున్నారా? అని రెజీనాని అడిగితే... ‘‘అమితాబ్ అయినా మరొకరైనా... నేను నెర్వస్గా ఫీలవను. నా భయమంతా ప్రేక్షకులతోనే. హిందీలో నా మొదటి సినిమా కదా! ప్రేక్షకులతో పాటు అక్కడి మీడియా ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని భయపడుతున్నా. అందుకే కొంచెం నెర్వస్గా ఫీలవుతున్నా’’ అన్నారు. తెలుగులో కృష్ణవంశీ ‘నక్షత్రం’లో రెజీనా నటిస్తున్నారు. -
అర్.. ర్..ర్.. ర్రే!
ఆర్ ఎప్పుడూ రైటే.ఆర్ ఎప్పుడూ రాంగ్ కాదు.ఆర్ ఎప్పుడూ రాణే.ఆర్తో మొదలైతే ఆరా తీయడం అంటూ ఏమీ ఉండదు.హీరోయిన్గా తీసుకోవడం హిట్ సాధించడం... అంతే.ఇప్పుడు తెలుగులో ‘ఆర్’ (తెలుగులో ర) అక్షరంతో మొదలయ్యే నలుగురు నాయికల కెరీర్ చూస్తుంటే.. ‘ఆర్’ ఫర్ రాకింగ్ అని మీరే అంటారు. రకుల్ ప్రీత్సింగ్, రాశీ ఖన్నా, రెజీనా, రాయ్ లక్ష్మీ... ఈ నలుగురికీ 2016 మెమరబుల్.చదివితే అర్రే అని మీరే అంటారు. గ్లామర్లో హైపర్..కామెడీలో క్వీన్! కథానాయికలు కామెడీ చేస్తే భలే ఉంటుంది కదూ! ‘ఊరుకోండి.. మీరు చెప్పేది కామెడీగా ఉంది. ఓ నాలుగు పాటలు, ఐదు సీన్లలో హీరో పక్కన.. అయితే నవ్వుతూ లేదంటే బుంగమూతి పెట్టుకుని కనిపించడం తప్ప హీరోయిన్లు ప్రేక్షకుల్ని నవ్విస్తారా’ అనేగా మీ సందేహం. కావాలంటే ‘సుప్రీమ్’ సినిమా చూడండి. బెల్లం శ్రీదేవిగా రాశీఖన్నా భలే నవ్వించారు. ఈ ముద్దుగుమ్మ గతేడాది మూడు సినిమాలు చేశారు. అవన్నీ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గుర్తింపే తీసుకొచ్చాయి. వాటిలో నటిగా తన ప్రత్యేకతను చూపించే అవకాశం రాశీఖన్నాకు దక్కలేదు. ‘సుప్రీమ్’లో ఆ ఛాన్స్ రావడంతో చెలరేగారు. ఎస్ఐగా సీరియస్ డైలాగులు చెప్పి, నవ్వించారు. కామెడీగా ఫైట్స్ చేసి ప్రేక్షకులకు కితకితలు పెట్టారు. ‘సుప్రీమ్’ తర్వాత వచ్చిన ‘హైపర్’లో అయితే రాశీఖన్నా గ్లామర్డోస్ పెంచారనే చెప్పుకోవాలి. సినిమాలోనే కాదు.. ‘హైపర్’ ఆడియోకి వేసుకొచ్చిన డ్రస్ కూడా హాట్ టాపిక్ అయింది. ఒకప్పుడు బొద్దుగా ఉందని విమర్శించినోళ్లే, ఈ ఏడాది వచ్చిన సినిమాలు చూసి రాశీఖన్నా ముద్దు ముద్దుగా నవ్వించిందనీ, నటించిందనీ అంటున్నారు. మొత్తం మీద 2015తో పోల్చితే 2016 ఈ బ్యూటీకి కలిసొచ్చిందనే చెప్పాలి. కొత్త ఏడాదిలో గోపీచంద్ ‘ఆక్సిజన్’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అలాగే వచ్చే ఏడాది తమిళ పరిశ్రమకు కూడా పరిచయం కానున్నారు. ఆల్రెడీ రెండు తమిళ సినిమాలకు సైన్ చేసేశారు. వెయిటింగ్ టు రాక్! సై్టల్.. స్మైల్.. గ్లామర్గా కనిపించే గట్స్... రెజీనాలో అన్నీ ఉన్నాయి. ఈ హీరోయిన్ యాక్టింగ్కి ప్రేక్షకులు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ, ఆమె ఖాతాలో సాలిడ్ హిట్ పడలేదు. ఈ ఏడాది రెజీనా రెండు సినిమాల్లో నటించారు. అవేవీ చెప్పుకోదగ్గ విజయాలు ఇవ్వలేదు. కానీ, కృష్ణవంశీ ‘నక్షత్రం’తో రాకింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తానంటున్నారు రెజీనా. ‘చందమామ’తో కాజల్ అగర్వాల్, ‘మొగుడు’తో తాప్సీ, ‘పైసా’తో కేథరిన్... ఈతరం హీరోయిన్లకు గ్లామర్ పరంగా కృష్ణవంశీ బ్రేక్ ఇచ్చారు. ‘నక్షత్రం’లో రెజీనా ఇప్పటివరకూ కనిపించనంత అందంగా ఉంటుందన్నట్లు ఆమె బర్త్డేకి ఓ సాంపిల్ టీజర్ రిలీజ్ చేశారు. అందులో ఈ చెన్నై బ్యూటీని రాక్స్టార్గా అభివర్ణించారు కృష్ణవంశీ. మరి, సినిమా రిలీజయ్యాక రెజీనా ఏమాత్రం రాక్ చేస్తారో చూడాలి. తెలుగు సంగతి పక్కన పెడితే... రాకింగ్ హీరోయిన్ల జాబితాలో రెజీనాని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, 2016 ఆమెకు హిందీ సినిమాకి అవకాశం తెచ్చిపెట్టిన సంవత్సరం. అమితాబ్ బచ్చన్, అనిల్కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సి వంటి స్టార్స్ నటించనున్న హిందీ ‘ఆంఖే–2’లో ఛాన్స్ రావడంతో రెజీనా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇది కాకుండా తమిళంలో ఓ ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. కుర్రాళ్లకు పరేషానురా.. ప్రేమలో పడితే పరేషాను ఉంటుందో? లేదో? తెలియదు గానీ... ‘ధృవ’లో రకుల్ప్రీత్ సింగ్ను చూస్తే కుర్రాళ్లకు పరేషాను తప్పదు. అందమే అసూయ పడేలా ‘పరేషాను రా..’ పాటలో రకుల్ గ్లామర్తో రాక్ చేశారు. అందమేనా... సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’, తర్వాత ‘సరైనోడు’, ఇప్పుడు థియేటర్లలో ఉన్న ‘ధృవ’ ఈ ఏడాది హీరోయిన్గా నటించిన మూడు సినిమాల్లోనూ అభినయంతో రకుల్ రఫ్ఫాడించేశారు. గతేడాది ఈమె చేసిన సినిమాలు ఆశించిన విజయాలు ఇవ్వలేదు. అప్పుడు రకుల్పై గ్లామర్ డాల్ ముద్ర వేశారు. అందం వల్లే ఆమెకు ఛాన్సులు వస్తున్నాయని విమర్శించారు. ఇప్పుడీ గాళ్ గ్లామర్తో పాటు యాక్టింగ్లోనూ ఇరగదీస్తుందని అంటున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో అందం, అమాయకత్వం గల అమ్మాయిగా నటించడమే కాదు... ఆ పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ‘సరైనోడు’లో అయితే.. మేకప్ లేకుండా ఎమోషనల్ సీన్స్లో నటించిన తీరు నటిగా రకుల్కి రెస్పెక్ట్ తెచ్చిపెట్టింది. ఇక, ‘ధృవ’తో ముచ్చటగా మూడో హిట్ అందుకుని రాకింగ్ స్టార్ అయ్యారు. ముచ్చటగా మూడు విజయాలతో జోష్ మీద ఉన్న రకుల్కి వచ్చే ఏడాది కూడా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే, డైరీ ఫుల్. మహేశ్బాబు – ఏఆర్. మురుగదాస్ సినిమా, సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’, బోయపాటి శ్రీను – బెల్లంకొండ సాయి సినిమా.. కొత్త ఏడాది కూడా మినిమమ్ మూడు సినిమాలతో రకుల్ ప్రేక్షకుల ముందు రావడం గ్యారెంటీ. వీటితో పాటు తమిళ సినిమాలకు కూడా సైన్ చేశారు. రాకింగ్ ఐటమ్ ఒక్క పాట... ఒక్కటంటే ఒక్క పాట.. అది కూడా ఐటమ్ పాట. తెలుగులో రాయ్లక్ష్మీకి మళ్లీ లైఫ్ ఇచ్చింది. ఐటమ్ గాళ్ కేటగిరీలో ఈ ఏడాది రాక్స్టార్ ఎవరంటే... రాయ్లక్ష్మీ పేరే లిస్టులో ముందుంది. ‘సర్దార్ గబ్బర్సింగ్’లో పవన్కల్యాణ్తో కలసి రాయ్లక్ష్మీ స్టెప్పులేశారు. సినిమా రిజల్ట్ పక్కన పెడితే ‘తప్పు తప్పే... శుద్ధతప్పే’ అనే పాట సూపర్ హిట్. అందులో ఆమె స్టెప్పులు, ఆమె గ్లామర్ కూడా హిట్టే. హీరోయిన్గా పదేళ్ల కెరీర్లో ఈమెకు చెప్పుకోదగ్గ విజయాలు లేవు. కానీ, ఐటమ్ గాళ్గా రాకింగ్ స్టెప్పులతో ఆడియన్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది పవన్కల్యాణ్తో ఐటమ్ సాంగ్ చేసిన రాయ్లక్ష్మీ, రానున్న సంక్రాంతికి రిలీజవుతోన్న ‘ఖైదీ నంబర్ 150’ కోసం చిరంజీవితో కలసి స్టెప్పులేశారు. మరి, అందులో ఐటమ్ సాంగ్ ఎలా ఉంటుందో!! ఈ పాటలను పక్కన పెడితే.. సౌత్లో పదేళ్లకు పైగా పలు సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడీ భామ ‘జూలీ–2’తో హిందీలో హీరోయిన్గా అడుగు పెడుతున్నారు. కొత్త ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. 2016లో అతిథిగా కనిపించిన ‘అఖీరా’తో తొలిసారి హిందీ తెరపై కనిపించారు. అది చేస్తున్నప్పుడే ‘జూలీ–2’లో కథానాయికగా అవకాశం కొట్టేశారు. ఆ రకంగా రాయ్లక్ష్మీకి ఈ ఏడాది మెమరబుల్ అవుతుంది. ‘ఆర్’ అంటే హిట్టే! ఓ పాతికేళ్లు వెనక్కి వెళితే... అప్పట్లో తిరుగులేని తారలు అనిపించుకున్న రాధికా, రాధ, రేవతి తదితరుల పేర్లు ‘ఆర్’తో మొదలైనవే. విశేషం ఏంటంటే.. తమిళ దర్శకుడు భారతీరాజా తాను పరిచయం చేసే కథానాయికలకు ‘ఆర్’ అక్షరం వచ్చేట్లు పేరు పెడతారు. రాధ అసలు పేరు ఉదయచంద్రిక. ‘అలైగళ్ ఓయ్వదిల్లై’ సినిమా ద్వారా ఆమెను పరిచయం చేస్తూ, ‘రాధ’గా మార్చారు. విలక్షణ నటి రేవతి తొలి పరిచయం కూడా భారతీరాజా సినిమాతోనే జరిగింది. ‘మన్వాసనై’ అనే సినిమాకి రేవతిని నాయికగా ఎన్నుకున్న తర్వాత ‘ఆశా కుట్టి నాయర్’ అనే ఆమె పేరుని రేవతిగా మార్చారు. ‘ఆర్’ అక్షరంతో మొదలయ్యే మరో నటి రాధిక. ఆమె రియల్ నేమ్తోనే స్క్రీన్కి పరిచయమయ్యారు. అయితే పరిచయం చేసింది మాత్రం భారతీరాజానే. ‘కిళక్కే పోగుమ్ రైల్’ ద్వారా ఆయన రాధికను పరిచయం చేశారు. ఆ తర్వాత ఆమె తిరుగు లేని తార అయ్యారు. అలాగే రతీ ఆగ్నిహోత్రిని పరిచయం చేసింది కూడా భారతీరాజానే. ‘పుదియ వార్పుగళ్’ చిత్రం ద్వారా కథానాయికగా తమిళ్ తెరకు పరిచయమైన ఈ హిందీ అమ్మాయి ఆ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయ్యారు. నిత్యానంద స్వామితో లింకప్ వార్తల్లో నిలిచిన రంజిత అసలు పేరు శ్రీ వల్లి. భారతీరాజా దర్శకత్వం వహించిన ‘నాడోడి తెండ్రల్’ ద్వారా ఆమె తమిళ తెరకు పరిచయమయ్యారు. రాధ, రాధిక, రేవతిల రేంజ్ స్టార్డమ్ తెచ్చుకోకపోయినా రంజిత బాగానే పేరు తెచ్చుకున్నారు. దక్షిణాదిన తిరుగు లేని నాయిక అనిపించుకున్న రోజాకి నామకరణం చేసింది కూడా భారతీరాజానే. ఆమె అసలు పేరు శ్రీలత. ‘ప్రేమ తపస్సు’ ప్రారంభోత్సవానికి విచ్చేసిన భారతీరాజా తొలి దృశ్యానికి క్లాప్ ఇచ్చి, రోజాకి పేరు పెట్టారు. నాటి, నేటి తారల్లో ‘ఆర్’తో పేరు మొదలైనవాళ్లు రాక్ చేస్తున్నారు కాబట్టి, ఈ అక్షరం కలిసొస్తుందని నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లు ఉంటారు. ఎవరి నమ్మకం వారిది. ఇదండి సంగతి...రకుల్, రాశీ, రెజీనా,రాయ్ లక్ష్మీల కెరీర్ చూస్తుంటే... ‘ఆర్’ ఫర్ రాకింగ్ అనొచ్చు కదూ! -సత్య పులగం -
సరదాగా అన్నాను
సరదాగా అన్నాను. అది అంత దూరం తీసుకెళుతుందని ఊహించలేదు అంటోంది నటి రెజీనా. ఇంతకీ ఈ అమ్మడు ఏ విషయం గురించి మాట్లాడుతుందనేగా మీ సందేహం. రెజీనా కోలీవుడ్ తెరపై కని పించి చాలా కాలమే అయ్యింది. అలాగని పూర్తిగా తెరమరుగైపోయిందనే నిర్ణయానికి వచ్చేయకండి. టాలీవుడ్లో మంచి మార్కెట్ను సంపాదించుకుంది. అక్కడ మంచి విజయాలను కూడా చవిచూసిన రెజీ నా తాజాగా కోలీవుడ్పై దండెత్తడానికి సిద్ధమవువుతోంది. ప్రస్తుతం తమిళంలోనే నెంజం మరప్పదిల్లై, మానగరం, శరవణన్ ఇరుక్క భయమేన్, జెమినీ గణేన్ సురుళీరాజనుమ్, మడై తిరందు వంటి ఐదు చిత్రాల్లో నటిస్తున్న ఆ బ్యూటీ త్వరలో బాలీవుడ్ రంగప్రవేశం చేయనుంది. ఈ సందర్భంగా రెజీనా చెప్పిన ముచ్చట్లు.. ప్ర: సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన అనుభవం గురించి? జ: నెంజం మరప్పదిలె్లౖ చిత్రం ద్వారా తొలిసారిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్నాను. ఎస్జే.సూర్య కథానాయకుడు. మరో నాయకిగా నందిత నటిస్తున్నారు. ఇందులో నటించడానికి అంగీకరించినప్పుడు సెల్వరాఘవన్ చిత్రంలో నటించడం కష్టం అని చాలా మంది భయపెట్టారు. అయితే నేను వాటిని పట్టించుకోలేదు. పాత్రను వివరించి, సరైన నటనను రాబట్టుకోవడంలో సెల్వరాఘవన్ చాలా సహనశీలి. షూటింగ్లో ఆయన్ని నేను ఒక అధ్యాపకుడిగానే చూశాను. చిత్రాన్ని పూర్తిగా చూసినప్పుడు నేనేనా అలా నటించింది అని ఆశ్చర్యపోయాను. ఇది దెయ్యం కథా చిత్రం కాదు. అయితే నా పాత్ర దెయ్యమా? మామూలు అమ్మాయా? అన్నది చివరి వరకూ తెలియదు. ఇప్పటి వరకూ నేను నటించిన చిత్రాల్లో నెంజం మరప్పదిలె్లౖ ప్రత్యేకంగా ఉంటుంది. ప్ర: తెలుగు, తమిళ భాషల్లో బిజీగా నటిస్తున్నట్లున్నారు? జ: ఈ విషయంలో ఒక ప్రణాళిక అంటూ ఏమీ లేదు. అలా కుదురుతోంది అంతే. మానగరం, మడై తిరం దు చిత్రాలు ఏక కాలంలో రెండు భాషల్లోనూ తెరకెక్కుతున్నాయి. నాకు రెండు భాషల్లోనూ మార్కెట్ ఉంది. అదే విధంగా నేను తమిళంలో నటించిన చిత్రాలు తెలుగులో అనువాదమవుతున్నాయి. ప్ర: తమిళంలో చాలా గ్యాప్ రావడానికి కారణం? జ: తెలుగులో ఆశించిన అవకాశాలు వస్తుండడంతో పూర్తి గా అక్కడే శ్రద్ధ పెట్టాను. తమిళంలో అవకాశాలు వస్తున్నా, కాల్షీట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి. అంతేగాకుండా తమిళంలో ఒక చిత్రం చేసినా వైవిధ్యంగా ఉండాలి. ప్రేక్షకుల మనస్సుల్లో గుర్తిండిపోవాలని కోరుకున్నాను. ప్రస్తుతం చేస్తున్నవి అలాంటి చిత్రాలే. ప్ర: రెండు భాషల ప్రేక్షకుల గురించి? జ: తెలుగు ప్రేక్షకులు ఎప్పటి విజయాలను అప్పుడే ఎం జాయ్ చేస్తారు. తాజా చిత్రాల పాత్రలనే గుర్తుంచుకుం టారు. ఆ తరువాత వాటిని మరచిపోతారు. తమిళ ప్రేక్షకులు అలా కాదు. ఇక వైవిధ్యభరిత పాత్ర, అద్భుతమైన పాత్రలో నటిస్తే దాన్ని చాలా కాలం తరువాత కూడా అభినందిస్తూనే ఉంటారు. కేడిబిల్లా కిలాడిరంగా చిత్రంలో నేను నటించిన పాప్పా పాత్రకు విశేష ఆదరణ లభించింది. ఇప్పటికీ నేను ఇతర ప్రాంతాలకు షూటింగ్కు వెళ్లినప్పుడు పాప్పా అని అభిమానంగా పిలుస్తుంటారు. ప్ర: బాలీవుడ్ రంగప్రవేశం చేయనున్నారట? జ: అవును. ఒక హిందీ చిత్రంలో నటించనున్నాను. ముగ్గురు అంధులు బ్యాంక్ రాబరింగ్ చేసి కోట్ల రూపాయలు దోచుకునే ఇతివృత్తంతో తెరపైకి వచ్చిన చిత్రం ఆంఖే. దానికి సీక్వెల్గా రూపొందనున్న చిత్రంలో నటించనున్నాను. ఇది ముగ్గురు అంధులు ఒక పేకాట క్లబ్లో ఎలా దోచుకుంటారన్న ఇతివృత్తంతో తెరకెక్కనుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, అనిల్కపూర్ తదితర ప్రముఖ నటులు నటించనున్నారు. ఈ చిత్రం జనవరిలో ప్రారంభం కానుంది. ప్ర: వివాహ వదంతుల గురించి? జ: అదా సరదాగా అన్నాను. అది అంత దుమారం రేపుతుందని భావించలేదు. సోషల్మీడియా ద్వారా నా అభిమానులకు చిన్న షాక్ ఇవ్వాలని త్వరలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని పోస్ట్ చేశాను. అందుకు రియాక్ష¯ŒS ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దామనుకుంటే నిప్పంటించిన అడవిలా పెద్ద కలకలాన్నే సృష్టించింది. ప్ర: సరే, మరి పెళ్లెప్పుడూ? జ: నాకు ఏ విషయంలోనూ ముందుగా ప్రణాళిక ఉండదు. అయినా ఏదైనా విధిని బట్టే జరుగుతుంది. పెళ్లి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఎప్పుడు జరిగినా నాది ప్రేమ వివాహమే అవుతంది. -
నా డ్రీమ్ పాత్ర ఏమిటి?
నా డ్రీమ్ పాత్ర ఏమిటి? అనే ప్రశ్నను నాలో నేనే చాలా సార్లు వేసుకున్నాను అని పేర్కొన్నారు నటి రెజీనా. కోలీవుడ్లో కేడీబిల్లా కిలాడిరంగా చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా అవేవీ సక్సెస్ను అందించలేదు. దీంతో టాలీవుడ్పై దృష్టి సారించి అక్కడ మంచి అవకాశాలతో సక్సెస్ఫుల్ నాయకిగా గుర్తింపు పొందారు. ఆ తరువాత కో-2, వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్రాల సక్సెస్తో మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు కోలీవుడ్లో ఈ అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం మానగరం, నెంజమ్ మరప్పదిల్లై తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. చిన్న గ్యాప్ తరువాత సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం నెంజమ్ మరప్పదిల్లై. ఇందులో కథానాయకుడిగా నటిస్తున్న ఎస్జే. సూర్యకు జంటగా రెజీనా నటిస్తున్నారు. ఇది హారర్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నది గమనార్హం. స్థానిక ఈసీఆర్ రోడ్డులోని బంగ్లాలో అధిక భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంపై కోలీవుడ్లో చాలా ఆసక్తే నెలకొంది. కారణం సెల్వరాఘవన్ హ్యాండిల్ చేస్తున్న తొలి హారర్ కథా చిత్రం కావడమే. అదే విధంగా చాలా గ్యాప్ తరువాత సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి యువన్ శంకర్రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటించడంపై నటి రెజీనా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చాలా కాలంగా తన డ్రీమ్ పాత్ర ఏదని తనలో తానే ప్రశ్నించుకునే దాన్నని, దానికి జవాబు ఆ చిత్రం ద్వారా లభించిందని పేర్కొన్నారు. ఇందులో మరిమయ్ అనే పాత్రలో నటిస్తున్నానన్నారు. తాను ఇంతకు ముందు ఈ తరహా పాత్రను పోషించలేదన్నారు. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలో నటించే అవకాశం కల్పించిన దర్శకుడు సెల్వరాఘవన్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. కాగా ఇందులో తనది పని మనిషి పాత్ర అని, కొందరి దురాగతానికి బలై దెయ్యంగా వచ్చి పగ తీర్చుకుంటారని రెజీనా వివరించింది. -
వాళ్లిద్దరూ చాలా హాట్!
‘హీరోల్లో మీకెవరంటే ఇష్టం?’ అని ఏ హీరోయిన్ని అడిగినా... ‘అందరూ ఇష్టమేనండి’ అని అంటుంటారు. ఒకళ్ల పేరు చెప్పి, ఇంకొకరి పేరు చెప్పకుండా.. అనవసరంగా వివాదాల్లో ఇరుక్కోవడం ఎందుకని ‘సేఫ్ ఆన్సర్’ ఇచ్చేస్తారు. కానీ, రెజీనా లాంటి కొంతమంది కథానాయికలు మాత్రం, ఎవరు నచ్చితే వాళ్ల పేరు చెబుతారు. అంతవరకూ ఫరవాలేదు.. ‘ఫలానా హీరో చాలా హాట్’ అని కూడా బోల్డ్గా చెప్పేస్తారు. ఇప్పుడు రెజీనా అదే చేశారు. ఇటీవల ఓ సందర్భంలో ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో మహేశ్బాబు, రామ్చరణ్ భలే సెక్సీ’’ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు దీని గురించే నలుగురూ చర్చించుకుంటున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా ఈ బ్యూటీ స్టేట్మెంట్ ఇచ్చేసిందనీ, ఎంతైనా చాలా బోల్డ్ అనీ తెగ మెచ్చుకుంటున్నారు. మహేశ్బాబు, రామ్ చరణ్లు ‘సెక్సీ’ అని రెజీనా అంటే.. ఈ బ్యూటీని ఉద్దేశించి చాలామంది ఈ మాట అంటున్నారు. దానికి కారణం హిందీ చిత్రం ‘ఆంఖే 2’ కోసం రెజీనా చాలా హాట్గా తయారవ్వడమే. ఈ చిత్రంలో ఏ రేంజ్లో కనిపించనున్నారో శాంపిల్ చూపించడానికి ట్విట్టర్లో కొన్ని ఫొటోలు కూడా పెట్టారు. అవి చూసినవాళ్లు ‘రెజీనా చాలా హాట్ గురూ’ అని నోరు వెళ్ళ బెడుతున్నారు. -
రెజీనాకు నిశ్చితార్థం జరిగిందా?
నటి రెజీనాకు వివాహ నిశ్చితార్థం జరిగిందా? తాజాగా చిత్ర వర్గాల్లో జరుగుతున్న పెద్ద చర్చ ఇదే. కోలీవుడ్లో నిరాదరణకు గురై టాలీవుడ్ను ఆశ్రయించిన నటి రెజీనా. ప్రస్తుతం అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇప్పుడు మళ్లీ కోలీవుడ్లో సెకెండ్ ఇన్నింగ్స్కు సిద్ధం అవుతున్నారు. ఇక్కడి బ్యూటీకి చేతి నిండా చిత్రాలున్నాయి. ఇలాంటి పరిస్థితిలో తన చర్యలతో రెజీనా పెద్ద కలకలానికే కేంద్రబిందువుగా మారారు. ఈ జాన ఒక ఆడ మగ చేతులు మాత్రమే కనిపించే లాంటి ఫొటోను తన ఇన్స్ట్రాగ్రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో తను పేర్కొంటూ ఈ శుభతరుణంలో మీ అందరి ఆశీస్సులు కావాలి. ఇలా జరగడం కాస్త విచారించదగ్గ విషయయే. అతను ఎవరన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు ఉంటుందని తెలుసు. అయితే ఆ విషయం గురించి త్వరలోనే వెల్లడిస్తాను. నిజానికి ఇలాంటి సంతోషకరమైన కార్యం జరుగుతుందని నేనూ హించలేదు. అనే వ్యాఖ్యల్ని పొందుపరచిన రెజీనా కొద్ది సేపటికే ఆ ఫొటోనూ, తన వ్యాఖ్యలను తన సైట్ నుంచి తొలగించారు. అయినా సోషల్ మీడియాలో రెజీనా పోస్ట్ చేసిన ఫొటో, తాను పేర్కొన్న భావాలు చాలా వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. మరో విషయం ఏమిటంటే రెజీనా క్రికెట్ క్రీడా శిక్షకుడు విక్రమ్ ఆదిత్యతో తీసుకున్న సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక పోతే రెజీనా చాలా కాలంగా ఒక తెలుగు యువ నటుడితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నారన్న వదంతులు దొర్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో రెజీనా ఆడ మగ చేతులు కలిపిన ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏమిటీ? మళ్లీ వెంటనే దాన్ని తొలగించడం ఏమిటీ? అసలు ఈ అమ్మడి వివాహ నిశ్చితార్థం జరిగినట్టా? లేనట్టా? లేక తమిళ చిత్ర ప్రచారంలో ఈ తంతు ఒక భాగమా? అన్న రకరకాల అభిప్రాయాలతో సినీ వర్గాలు అయోమయంలో పడ్డారు. కాగా రెజీనా ప్రస్తుతం తమిళంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజం మరప్పదిల్లై, నటుడు ఉదయనిధి స్టాలిన్కు జంటగా శరవణన్ ఉరుక్క భయమే, అధర్వతో జెమినీగణేశనుమ్ సురళీరాజావుమ్, మానగరం, రాజతందిరం 2 చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉన్నారు. -
కిలాడీ లేడీ!
‘‘ఈ అమ్మాయి పేరు జమునా రాణి. పోలీస్ కాదు గానీ అప్పుడప్పుడు పోలీస్ డ్రస్ వేసుకుంటుంది. ఖాకీ చొక్కాపై నక్షత్రాలను చూపిస్తూ హల్ చల్ చేస్తుంది. ఈ లేడీ కిలాడీ కహానీ తెలుసుకోవాలంటే ‘నక్షత్రం’ చూడండి’’ అంటున్నారు రెజీనా. సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నక్షత్రం’. ఇందులో సందీప్కి జోడీగా జమునా రాణి పాత్రలో రెజీనా నటిస్తున్నారు. ఆదివారం జమునా రాణి ఫస్ట్ లుక్ను రామ్చరణ్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ అతిథి పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కె. శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు నిర్మిస్తున్నారు. విజయదశమి నుంచి ప్రతి రోజూ చిత్ర బృందం ఒక్కో లుక్ విడుదల చేస్తోంది. పది రోజుల పాటు పది ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తామని చెప్పారు. అందులో రెజీనాది నాలుగో లుక్. ఇంకా ఆరు లుక్స్ ఉన్నాయనమాట. -
తిరుపతిలో రెజినా సందడి
తిరుపతి నగరంలో సినీ నటి రెజినా సందడి చేసింది. స్థానిక తీర్థకట్టలో గురువారం ఉదయం ఆమె ఎంజీఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించింది. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడ అభిమానులు గుమికూడారు. -
మూడు చిక్కులు, రెండు ప్రేమలు..?
సందీప్ కిషన్, రెజీనా జంటగా ఎ.కె.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తమిళ, తెలుగు భాషల్లో నిర్మించిన ‘నగరం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సందీప్ కిషన్ వెరైటీ లుక్ తో ఆకట్టుకున్నాడు. నాలుగు బతుకులు, మూడు చిక్కులు, రెండు ప్రేమలు అంటూ ట్రైలర్ లో చూపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. సందీప్ కిషన్ సినిమాల్లో ఓ మంచి ఎంటర్టైనర్గా ‘నగరం’ ఉంటుందని నమ్ముతున్నామని నిర్మాత అశ్వనీకుమార్ సహదేవ్ అన్నారు. అన్ని వర్గాలవారూ చూడదగ్గ విధంగా ఈ చిత్రం ఉంటుందని మరో నిర్మాత రాజేశ్ దండా చెప్పారు. లోకేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జావెద్ సంగీతం అందించాడు. త్వరలోనే ‘నగరం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ కిషన్, రెజీనా కాంబినేషన్ లో క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశి ‘నక్షత్రం’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ కావాలనే ప్రయత్నంలో ఉన్న ఓ యువకుడి కథతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. -
సంతానంపై పొగడ్తల వర్షం
నటుడు సంతానంను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు నటి రెజీనా. సాధారణంగా ఏ రంగంలోనైనా ప్రతిభ ముఖ్యం అన్నది ఎవరూ కాదనలేని విషయం. అలాంటిది సినిమా రంగంలో ప్రతిభను గుర్తిస్తున్నారో లేదోగానీ సక్సెస్ను మాత్రం ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇక్కడ లక్కే ప్రధాన పాత్రను పోషిస్తోందని చెప్పక తప్పదు. ఒక భాషలో నిరాదరణకు గురైన వారు మరో భాషలో ఆదరణను పొందితే వారిని మళ్లీ పిలిచి మరీ అవకాశాలివ్వడం పరిపాటిగా మారింది. ఉదాహరణకు నటి అనుష్క, ఇలియానా, హన్సిక లాంటి వాళ్లంతా ఆదిలో కోలీవుడ్లో నిరాదరణకు గురైన వారే. అనుష్క రెండు అనే చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోశారు. అయినా ఆ చిత్రం తరువాత ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్నే నమ్ముకున్నారు. అక్కడ సక్సెస్ఫుల్ నాయకిగా పేరు తెచ్చుకున్న తరువాత మళ్లీ కోలీవుడ్ ఆహ్వానించింది. ఇలా పలు సంఘటనలు ఉన్నాయి. నటి రెజీనా కథా ఇంతే. మొదట్లో తమిళంలో కేడీబిల్లా కిల్లాడిరంగా తదితర కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తరువాత ఆమెను దూరంగా పెట్టేశారు. టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రెజీనా అక్కడ విజయాలను అందుకున్నారు. ఫలితం కోలీవుడ్ ఇప్పుడు వరుసగా అవకాశాలందిస్తోంది. దీంతో ఈ సారి ఎలాగైనా ఇక్కడ నిలదొక్కుకోవాలన్న పట్టుదలతో ఉన్న రెజీనా తాను నటించనున్న హీరోలను పొగడ్తలతో ముంచెత్తే కార్యక్రమాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అధర్వకు జంటగా జెమినీగణేశనుమ్ సురళిరాజానుమ్, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజమ్ మరప్పదిల్లై తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. సెల్వరాఘవన్ ఈ భామకు మరో అవకాశం కల్పించినట్లు తాజా సమాచారం. సంతానం హీరోగా తాను చేస్తున్న తదుపరి చిత్రంలోనూ రెజీనానే నాయకి అట. హాస్య పాత్రల్లో నటించి కథానాయకుడైన సంతానంతో నటించనున్నారేమిటన్న ప్రశ్నకు ఈ బ్యూటీ చాంతాడంత కారణానే చెప్పేస్తున్నారు. అదేమిటో చూద్దాం. నాకు సంతానం హాస్యనటుడిగానూ, కథానాయకుడిగానూ నచ్చుతారు. అంతగా ఆయన ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతారు. ముఖ్యంగా హీరోగా అవతారమెత్తిన తరువాత తన బాడీలాంగ్వేజ్ను పక్కాగా మార్చుకున్నారు. డాన్స్లోనూ, ఫైట్స్లోనూ ఇతర హీరోలు ఆశ్చర్యపోయేలా సూపర్గా నటిస్తున్నారు. అందుకే ఆయనతో నటించనుండడం సంతోషంగా ఉంది. -
జ్యో... అచ్యుత... ఆనంద... జో...
నటుడిగా మొదలై ‘ఊహలు గుసగుసలాడే’తో దర్శకుడిగా విస్తరించిన కెరీర్ అవసరాల శ్రీనివాస్ది. సాహిత్యం, సంగీతం మీద అభిరుచితో ఆయన దర్శకుడిగా రెండో ప్రయత్నం చేశారు. జో... అచ్యుతానంద జో జో ముకుంద! అన్నమయ్య కీర్తన అని తెలియకుండానే దశాబ్దాలుగా తెలుగునాట జనం నోట నిలిచిన లాలిపాట. అలాంటి కమ్మటి లాలిపాట లాంటి సినిమా తీయాలనుకున్నారేమో, దర్శక - నిర్మాతలు వెరైటీగా ‘జ్యో అచ్యుతానంద’ అంటూ ముందుకొచ్చారు. ఇది నిజానికి, ‘జ్యో’త్స్న (రెజీనా) అనే అమ్మాయికీ, అన్నదమ్ములు ‘అచ్యుత’ రామారావు (నారా రోహిత్), ‘ఆనంద’వర్ధనరావు (నాగశౌర్య)లకీ మధ్య నడిచే కథ. వాళ్ళ పేర్లలోని మొదటి కొన్ని అక్షరాలు కలిపితే ‘జ్యో అచ్యుతానంద’. సినిమా మొదలయ్యేసరికే అన్నదమ్ములు ఇద్దరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. తండ్రి పోవడంతో, తల్లి (సీత)తో కలసి, అందరూ ఒకే ఇంట్లో ఉంటుంటారు. అన్నయ్య ఓ కంపెనీలో హెచ్.ఆర్. మేనేజర్గా పెద్ద ఉద్యోగి. తమ్ముడు మెడికల్ రిప్రంజెటేటివ్గా కష్టపడుతున్న చిరుద్యోగి. ఈ అన్నదమ్ములకు పెద్దగా పడదు. కారణం ‘జ్యో’ అని పిలుచుకొనే జ్యోత్స్న (రెజీనా). ఎవరా ‘జ్యో’ అన్నది భార్యల అనుమానం. ఫ్లాష్బ్యాక్లో ఆరేళ్ళ క్రితానికి వెళితే దంతవైద్యం చదువుతున్న హీరోయిన్ ఈ అన్నదమ్ముల ఇంట్లో పై వాటాలో అద్దెకు దిగుతుంది. పై చదువులకు అమెరికా వెళ్ళాలనుకుంటున్న ఆ అమ్మాయిని పోటాపోటీగా అన్నదమ్ములిద్దరూ ప్రేమిస్తారు. ప్రేమలో తమ్ముడి మీద పై చేయి సాధించడానికి అన్న పెయైత్తులూ వేస్తాడు. అది వికటిస్తుంది. ఇద్దరిలో ఎవరినీ ప్రేమించ ట్లేదంటూ హీరోయిన్ అమెరికా వెళ్ళిపోతుంది. ఇక, వర్తమానానికి వస్తే సెకండాఫ్లో హీరోయిన్ మళ్ళీ ఈ ఇంటికొస్తుంది. పెళ్ళయిన అన్నదమ్ము లతో ఆడుకోవడం మొదలెడుతుంది. తర్వాతేమైందన్నది మిగతా సిన్మా. సినిమాలు, పాత్రలపై ధ్యాసలో శారీరక స్పృహను వదిలేసిన నారా రోహిత్ డైలాగ్ డెలివరీ బలంతో నెట్టుకొచ్చారు. నాగశౌర్య సహజంగా ఉన్నారు. క్లెమాక్స్ సీన్ లాంటి చోట్ల ఉద్వేగపూరిత నటన చూపెట్టారు. పాత్రలో క్లారిటీ తక్కువైనా, రెజీనా ఉన్నంతలో బాగా చేశారు. మిగిలిన అందరిదీ సందర్భోచిత నటన. ‘ఊహలు గుసగుసలాడే’ కెమేరామన్ వెంకట్ ఈసారీ ముద్ర వేశారు. ఇక శ్రీకల్యాణ్ రమణ అనే కొత్త పేరుతో వచ్చిన కల్యాణీమాలిక్ బాణీల్లో ‘ఒక లాలన’ (గానం శంకర్ మహదేవన్) లాంటివి పదేపదే వినాలనిపిస్తాయి. ‘సువర్ణ’ పాట మాస్ను మెప్పిస్తుంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘మనమంతా’ లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మిస్తూ వస్తున్న సాయి కొర్రపాటి ఆ ధోరణికి తగ్గట్లే చేసిన తాజా సమర్పణ ఇది. తోబుట్టువుల మధ్య ఉండే ఈర్ష్య, అసూయలనే కామన్ పాయింట్ ఆసక్తికరమే. అయితే, ఒకే అమ్మాయి కోసం ఇద్దరి పోటీ అనే పదునైన కత్తిని దర్శకుడు పట్టుకున్నారు. విభిన్నంగా తీయాలనే ప్రయోగస్పృహా పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఒకే అంశం రెండు పాత్రల దృష్టి నుంచి రెండు రకాలుగా రావడమనేది పావుగంట సా..గినా, ఫస్టాఫ్ సరదాగానే గడిచిపోతుంది. అసలు కథ నడపాల్సిన సెకండాఫ్లోనే చిక్కంతా. దృష్టి అంతా అన్నదమ్ముల పాత్రలు, బలవంతపు ఎమోషన్లు, అనవసరమైన ఫైట్ల మీదకు మళ్ళించేసరికి ట్రాక్ మారింది. ఈ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ సినిమా సకుటుంబంగా చూడదగ్గదే! సాధారణ కమర్షియల్ హీరో సినిమాల్లా కాకుండా, పాత్రల మధ్య నడిచే కథగా ముందుకు సాగడం మరికొంత రిఫ్రెషింగ్ ఫీలింగ్! దర్శక - రచయిత సెన్సాఫ్ హ్యూమర్ చాలా చోట్ల డైలాగ్సగా నవ్విస్తుంది. ఆలోచించి మరీ రాయడంతో, ఒక్కోసారి ఆలోచించే వ్యవధి ఇవ్వకుండా ఒకదాని మీద మరొకటి వచ్చి పడే డైలాగ్ పంచ్లు ఉక్కిరిబిక్కిరీ చేస్తాయి. కెమేరా వర్క్, ఒకట్రెండు పాటలు గుర్తుంటాయి. కానీ, అన్నదమ్ముల అనుబంధాన్ని ఆది నుంచి చూపకపోవడం, అప్పటికప్పుడు తెచ్చిపెట్టిన ఉద్వేగాల క్లైమాక్స్, సెకండాఫ్లో సాఫీగా సాగని ‘జ్యో’ పాత్ర ప్రయాణం, ఆమె నిశ్చితార్థానికీ - ఆఖరికి అదీ వద్దనుకోవడానికీ కారణం లేకపోవడం లాంటివీ మర్చిపోవడం కష్టమే. వెరసి, ఫస్టాఫ్లో ‘జ్యో’ అచ్యుతానందగా మొదలై, సెకండాఫ్లో ‘జో...జో’ అచ్యుతానందగా అనిపిస్తుంది. యువత, ముఖ్యంగా నవ దంపతులు లీనమయ్యే అంశాలతో, డైలాగ్లతో అర్బన్ ఆడియన్స్ మల్టీప్లెక్స్ మూవీ గుర్తుంటుంది! - రెంటాల జయదేవ చిత్రం: ‘జ్యో అచ్యుతానంద’, పాటలు: భాస్కరభట్ల, కెమేరా: వెంకట్ సి. దిలీప్, ఎడిటింగ్: కిరణ్ గంటి, కథ - మాటలు - స్క్రీన్ప్లే - దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్ -
రెజీనాతో సరదాగా కాసేపు
-
ఊహించని క్లైమాక్స్ ఉంటుందట
'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్. కొంత గ్యాప్ తరువాత 'జ్యో అచ్యుతానంద' పేరుతో ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు. జ్యో, అచ్యుత్, ఆనంద్ల ప్రేమకథే ఈ 'జ్యో అచ్యుతానంద'. నారా రోహిత్, రెజీనా, నాగ శౌర్యలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆ ఇద్దరు హీరోల్లో ఆమె మనసు ఎవరు గెలుచుకుంటారనేదే ప్రశ్న. అయితే ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం అనే టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులు ఊహించని విధంగా ముగింపు ఉంటుందని, కచ్చితంగా థ్రిల్కు గురవుతారని చిత్ర యూనిట్ చెబుతున్న మాట. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందట. వారాహి చలన చిత్ర బ్యానర్ఫై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ రమణ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుంది. -
ఆ నలుగురికీ కీలకం
ఊహులు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా జ్యో అచ్యుతానంద. మొదటి సినిమా తరహా లోనే ఈ సినిమాను కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందించాడు అవసరాల శ్రీనివాస్. ట్రయాంగులర్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు నలుగురి కెరీర్కు కీలకంగా మారింది. ముఖ్యంగా అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ విజయాలు సాధించలేకపోతున్నారు. అందుకే జ్యో అచ్యుతానంద సక్సెస్ ఆయనకు కీలకం కానుంది. ఇక హీరోలుగా నటిస్తున్న నారా రోహిత్, నాగశౌర్యలకు కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు సక్సెస్కు మాత్రం చాలాకాలంగా దూరంగా ఉన్నారు. ఇక హీరోయిన్గా నటిస్తున్న రెజీనా కూడా స్టార్ ఇమేజ్ కోసం ఈ సినిమానే నమ్ముకుంది. -
నన్ను ఇష్టపడతారు... అసహ్యించుకుంటారు!
అప్పుడు రెజీనా వయసు 90. మనవళ్లతో హాయిగా కాలక్షేపం చేస్తుంటారు. దాంతో పాటు ఓ సినిమా చూడమని వాళ్లకు చెబుతారు. అదే ‘జ్యో అచ్యుతానంద’. ఆమె అంత బాగా ఇష్టపడి చేసిన సినిమా ఇది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్య తారలుగా సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో రెజీనా చెప్పిన ముచ్చట్లు... ఈ చిత్రంలో నేను డెంటల్ డాక్టర్ని. నా పేరు ‘జో’. మీ పక్కింట్లోనో, ఎదురింట్లోనో ఉండే అమ్మాయిలా ఉంటాను. ఈ మూవీలో నన్ను చూసినవాళ్లు నవ్వుతారు, బాధపడతారు, ఇష్టపడతారు, అసహ్యించుకుంటారు. ఇంత మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ అవసరాలకు, సాయి కొర్రపాటిగారికి కృతజ్ఞతలు. మొన్నీ మధ్యే పాటలు విడుదలయ్యాయి. కల్యాణి రమణ (కల్యాణి మాలిక్) అద్భుతమైన పాటలిచ్చారు. నాకు 90 ఏళ్లు వచ్చినా కూడా నేనీ సినిమాని మర్చిపోను. నా మనవళ్ళకు, మనవరాళ్లకు ‘జ్యో అచ్యుతానంద’ చూడమని చెప్తాను. అంతగా నా మనసుకు దగ్గరయిందీ కథ. ‘జో’గా నేను, అచ్యుత్గా నారా రోహిత్, ఆనంద్గా నాగశౌర్య నటించాం. ప్రధానంగా మా ముగ్గురి మధ్య నడిచే కథ ఇది. కథ విన్నప్పట్నుంచి ఎప్పుడెప్పుడు షూటింగ్ ఆరంభమవుతుందా? అని ఎదురు చూశా. షూటింగ్ పూర్తయ్యాక ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నా. నేనే ఇంటర్వ్యూ ఇచ్చినా ‘మీకు, సాయిధరమ్ తేజ్కు బ్రేకప్ అయ్యిందా’ అని అడుగుతుంటారు. ‘‘మా ఇద్దరి మధ్య ఏదో ఉందని రాస్తారు. ఆ తర్వాత బ్రేకప్ అని రాస్తారు. కాసేపు రెజీనా పనైపోయింది అంటారు. ప్రస్తుతం తనకు సినిమాలు లేవు’’ అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు రాసుకుంటారు. బాధగా ఉంటుంది. అయినా అందరికీ విడివిడిగా సమాధానం చెప్పలేను. చెప్పను కూడా. ప్రస్తుతం హిందీ చిత్రం ‘ఆంఖే-2’లో నటిస్తున్నా. అమితాబ్గారు, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, అర్జున్ రాంపాల్.. ఇలా భారీ తారాగణంతో ఈ చిత్రం ఉంటుంది. ఈ మధ్య ఫోటోషూట్ జరిగింది. ఇప్పటివరకూ అలాంటి భారీ ఫొటోషూట్లో నేను పాల్గొనలేదు. ఆ ఇమేజెస్ ఎప్పుడు బయటకు వస్తాయా? అని ఎదురుచూస్తున్నా. ఇది కాకుండా తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. తెలుగులో చేసిన ‘జ్యో అచ్యుతానంద’తో పాటు, ‘శంకర’ కూడా రిలీజుకు రెడీగా ఉంది. హీరోలకైతే ఆ స్టార్ ఈ స్టార్ అని బిరుదులుంటాయి... మరి అనుష్క, సమంత, రకుల్ వంటి హీరోయిన్లకు? మీరైతే ఎలాంటి బిరుదు ఇస్తారు? అనే ప్రశ్న రెజీనా ముందుంచితే - ‘‘సమంతకు సూపర్స్టార్, అనుష్కకు తలైవా (నాయకుడు), రకుల్కి జిమ్ స్టార్, రాశీఖన్నాకి క్యూట్ స్టార్, నిత్యామీనన్కు నేషనల్ స్టార్....నాకేమో ఫన్ స్టార్ అని ఇస్తాను’’ అని సరదాగా అన్నారు. - శివ మల్లాల -
వాళ్లిద్దరూ అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారు - రాజమౌళి
‘‘‘జ్యో అచ్యుతానంద’ ట్రైలర్ చూస్తుంటే కామెడీ రొమాంటిక్ మూవీ అని తెలుస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్గా శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించాడు. ఈ చిత్రంలో అన్నదమ్ముల్లా నటించిన నాగశౌర్య, నారా రోహిత్ నిజంగానే అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారు. రెజీనా బాగా నటించింది. కల్యాణి రమణ మంచి పాటలిచ్చారు. దర్శకునిపై నమ్మకంతో సినిమాలు తీసే నిర్మాత సాయి కొర్రపాటిగారు. ఈ చిత్రం విజయవంతమవుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. నాగశౌర్య, నారా రోహిత్, రెజీనా ప్రధాన పాత్రల్లో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో సాయి శివాని సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జ్యో అచ్యుతానంద’. కల్యాణి రమణ స్వరపరచిన ఈ చిత్రం పాటలు, ట్రైలర్ను రాజమౌళి విడుదల చేశారు. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రకథ నారా రోహిత్కు చెప్పాలనుకున్నప్పుడు ఆయన చేస్తారా? చేయరా? అనే సందేహం ఉండేది. కథ విన్నాక చేస్తానన్నారు. ఆనంద్ పాత్ర రాసుకునేటప్పుడే నాగశౌర్యనే అనుకున్నా. యువతరంతో పాటు అన్నివర్గాల వారికీ ఈ చిత్రం నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘జ్యో అచ్యుతానంద’ రీమేక్ రైట్స్ కోసం తమిళం, బాలీవుడ్లో చాలామంది పోటీ పడుతున్నారు. జీవితం అనే జర్నీలో సాయి కొర్రపాటిగారిని, శ్రీనివాస్ అవసరాలను కలుసుకునే మంచి అవకాశం వచ్చింది. నా తల్లిదండ్రుల తర్వాత నేను అంత గౌరవం ఇచ్చే వ్యక్తి సాయి కొర్రపాటిగారే’’ అని నాగశౌర్య చెప్పారు. నారా రోహిత్ మాట్లాడుతూ- ‘‘కథను నమ్మి చిత్రాలు తీసే నిర్మాత సాయి కొర్రపాటి. ఆయన బ్యానర్లో నేను చేసిన ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ, ఈ చిత్రం మాత్రం హిట్టవుతుంది. శ్రీనివాస్ అవసరాల వల్లే ఈ సినిమా ఒప్పుకున్నా. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే బంధాన్ని చక్కగా చూపించాం’’ అన్నారు. నాని, తమ్మారెడ్డి భరద్వాజ, ‘జెమినీ’ కిరణ్, విజయేంద్ర ప్రసాద్, ఎంఎం కీరవాణి, కల్యాణి రమణ, నందినీరెడ్డి, భాస్కరభట్ల, స్మిత తదితరులు పాల్గొన్నారు. -
'నా రూట్స్ ఇక్కడే.. అలా ఊహించుకోలేను'
ముంబయి: తాను ఎప్పటికీ దక్షిణాది స్టార్నేనని ప్రముఖ నటి రెజీనా చెప్పింది. ఆంఖేన్ 2 చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న ఆమె ఇక దక్షిణాధి చిత్రాలకు వీడ్కోలు చెప్పినట్లే అని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో రెజీనా వివరణ ఇచ్చింది. ఇటు దక్షిణాదిలో అటు బాలీవుడ్ లో సమస్థాయిలో రానిస్తానన్న నమ్మకం తనకు ఉందని చెప్పింది. బాలీవుడ్ చిత్రాలకోసం దక్షిణాదిని వదిలేయడాన్ని తాను ఊహించుకోలేనని, అసలు అలా ఆలోచించనని చెప్పింది. 'నేను రెండు ఇండస్ట్రీల్లో పనిచేసేందుకు సమయం కేటాయిస్తాను. దక్షిణాదిని వదిలేస్తానని నేను అస్సలు అనుకోను. అవకాశాల రీత్యా నేను ఎక్కడి వరకైనా వెళ్లి ఉండొచ్చు. కానీ నా మనుగడ మాత్రం ఇక్కడే. నా రూట్స్ ఇక్కడే(దక్షిణాదిలో) ఉన్నాయి' అని ఆమె చెప్పింది. అదే సమయంలో తాను నటించనున్న బాలీవుడ్ చిత్రం ఆంఖేన్ 2 గురించి మాట్లాడుతూ పెద్ద స్లార్లతో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. -
వ్యవస్థలోని లోటుపాట్లపై పోరాటం
సమాజంలోని లోటుపాట్లను ప్రశ్నించే యువకుడి పాత్రలో నారా రోహిత్ నటించిన చిత్రం ‘శంకర’. రెజీనా కథానాయిక. తాతినేని సత్యప్రకాశ్ దర్శకత్వంలో ఆర్వీ చంద్రమౌళి ప్రసాద్(కిన్ను) నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘తమిళంలో రూపొం దిన ‘మౌన గురు’ చిత్రానికి రీమేక్ ‘శంకర’. యూని వర్సల్ సబ్జెక్ట్ కావడంతో ఏఆర్ మురుగదాస్ చిన్న చిన్న మార్పులు చేసి హిందీలో ‘అకీరా’ పేరుతో నిర్మించారు. వ్యవస్థలోని లోటుపాట్లు నచ్చని శంకర అనే కుర్రాడు వాటిని ప్రశ్నిస్తుంటాడు. ఓ ప్రయాణంలో జరిగిన ప్రమాదం అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? అనే కథాంశంతో తాతినేని సత్య అన్ని వర్గాల వారికీ నచ్చేలా తెరకెక్కించాడు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమేరా: టి.సురేందర్ రెడ్డి, సమర్పణ: ఎమ్వీ రావు. -
దేవుడా.. అసలేం జరిగింది: రెజీనా
తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రెజీనా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అది కూడా అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సీలాంటి టాప్ స్టార్స్ నటిస్తున్న సినిమాలో ఆమెకు అవకాశం రావడం విశేషం. ఆంఖే సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఆంఖే-2 లో రెజీనా మెరవబోతుంది. ఈ అవకాశం తాను ప్రయత్నించింది కాదని, ఇతర సినిమాల్లో తన నటన చూసి స్వయంగా ఆంఖే-2 టీం తనను అప్రోచ్ అయ్యారంటూ రెజీనా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. షూటింగ్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి.. ఈలోపు హిందీలో పట్టు సాధించి సొంత డబ్బింగ్ చెప్పుకుంటానని అంటోంది. కాగా ఆ వేడుకకు రెజీనా వేసుకొచ్చిన బ్లాక్ డ్రెస్ ఆమెకు తలనొప్పులు తీసుకొచ్చి పెట్టింది. నలుపు రంగు డిజైనర్ దుస్తుల్లో రెజీనా మెరిసినా, ఆ డ్రెస్ ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. ఆమె స్టేజ్పై డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆ దుస్తులు మరింత కురచగా అయిపోయి అతిధులను సైతం ఇబ్బంది పెట్టాయి. చుట్టూ ఉన్న కెమెరాలు వరుసపెట్టి క్లిక్ మనిపించాయి. విషయం గమనించినా ఆమె తన డ్యాన్స్ను కొనసాగించింది. ఇక అప్పటినుంచి ఆమె డ్రెస్ పై సోషల్ మీడియాలో కామెంట్లు చెలరేగిపోయాయి. చివరకు ఈ విషయంపై రెజీనా స్పందించింది. స్టేజ్ దిగిన వెంటనే 'దేవుడా.. అసలేం జరిగింది' అని ఆందోళనకు గురైందట. తన బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన కార్యక్రమంలో ఇలా జరగడం బాధాకరమంటూ వాపోయింది. అయితే అక్కడున్న టీం అంతా తనకు ఎంతో సహకరించారని, ఇలాంటి పొరపాట్లు జరగడం సాధారణమేనని తనకు ధైర్యం చెప్పారని తెలిపింది. ఇక జరిగింది వదిలేసి ముందుకెళ్లాలని తనకు తాను చెప్పుకున్నానని తెలిపింది రెజీనా. -
బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న రెజీనా
-
అందరి కళ్లూ రెజీనా పైనే!
యస్.. ఇప్పుడందరి కళ్లూ రెజీనా పైనే ఉన్నాయి. ఇక్కడ కాదు.. ముంబైలో. రెజీనా కొట్టేసిన అవకాశం అలాంటిది. ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ‘ఆంఖే 2’లో రెజీనా చాన్స్ దక్కించుకు న్నారు. ముంబైలో జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో అమితాబ్ బచ్చన్, ఇతర కీలక పాత్రలు చేస్తున్న అర్షద్ వార్శి, అర్జున్ రామ్పాల్, రెజీనా తదితరులు ర్యాంప్ వాక్ చేశారు. గ్లామరస్గా కనిపించిన రెజీనా పైనే అందరి కళ్లూ. అసలు హిందీ సినిమా గురించి రెజీనా కలలో కూడా ఊహించలేదట. హఠాత్తుగా ఈ అవకాశం రావడంతో ఎగ్జైట్ అవుతున్నారామె. ఇంతకీ రెజీనాకి ఈ అవకాశం ఎలా వచ్చిందంటే.. చిత్రదర్శకుడు అనీస్ బజ్మీ సౌత్లో రెజీనా చేసిన సినిమాలు చూసి, ‘ఆంఖే 2’కి సెలక్ట్ చేశారు. ఈ చిత్రంలో రెజీనా చాలా గ్లామరస్గా కనిపిస్తారట. ‘‘హిందీ తెరపై కనిపించని హీరోయిన్ని కీలక పాత్రకు తీసుకోవాలనుకున్నాను. ఆ అమ్మాయికి డ్యాన్సులు బాగా రావాలి. ఎమోషనల్ సీన్స్లో బాగా నటించాలి. రెజీనా గురించి తెలిసి, తను యాక్ట్ చేసిన సినిమాలు చూశాను. వెరీ టాలెంటెడ్. అందుకే ఈ సినిమాకి తీసుకున్నాను’’ అని అనీస్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా ఇలియానా నటించనున్నారు. ఇదిలా ఉంటే.. 2002లో విడుదలైన సూపర్ హిట్ మూవీ ‘ఆంఖే’కి ఇది సీక్వెల్. 14 ఏళ్ల తర్వాత రూపొందుతున్న ఈ సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే జనవరిలో ఆరంభమవుతుంది. -
బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న రెజీనా
సౌత్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న భామలందరూ బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ టాప్ స్టార్స్గా ఉన్న శృతిహాసన్, తమన్నా, కాజల్, ఇలియానా లాంటి చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్లో అడుగుపెట్టారు. అయితే సక్సెస్ సాధించిన వారు మాత్రం చాలా తక్కువ. ఇక్కడ టాప్ స్టార్స్గా ఉన్న వారికే బాలీవుడ్లో అవకాశాలు రావటం కష్టంగా ఉంటే.. ఇక్కడ కూడా స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న ఓ భామ బాలీవుడ్ చాన్స్ కొట్టేసింది. తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా, స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోతున్న తెలుగమ్మాయి రెజీనా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. అది కూడా అమితాబ్ బచ్చన్, అనీల్ కపూర్, అర్జున్ రామ్పాల్, అర్షద్ వార్సీ లాంటి టాప్ స్టార్స్ నటిస్తున్న సినిమాతో కావటం మరో విశేషం. ఆంఖేన్ సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఆంఖేన్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది రెజీనా. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్గా ఇలియానాను తీసుకోగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న మరో హీరో్యిన్ పాత్రకు రెజీనాను ఫైనల్ చేశారు. రెజీనా జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొననుంది. -
బోస్ కాలంలో రానా
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. కమర్షియల్ హీరో ఇమేజ్ కోసం పాకులాడకుండా.. విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా, మరో డిఫరెంట్ సినిమాకు అంగకీరించాడు. ప్రస్తుతం ఇండియాస్ బిగెస్ట్ మూవీగా పేరు తెచ్చుకున్న బాహుబలి పార్ట్ 2లో నటిస్తున్న ఈ మ్యాన్లీ హంక్, ఆ సినిమాతో పాటు భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఘాజీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత మరోసారి ప్రయోగానికే రెడీ అవుతున్నాడు రానా. 1940లలో జరిగే కథతో తెరకెక్కనున్న సినిమాలో రానా ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాలో భారత స్వతంత్ర సమరయోథుడు సుభాష్ చంద్రబోస్ పాత్రతోనూ రానాకు కొన్ని కీలక సన్నివేశాలను ఉండనున్నాయట. సత్య శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటులు నాజర్, కరుణలు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
రెజీనా నవ్వుల ఖజానా
-
పార్క్హోటల్లో రెజీనా..
సాక్షి,హైదరాబాద్: పార్క్ హోటల్లో ఓ సంస్థ ఏర్పాటు చేసిన చారిటీ షోలో అందాల తార రెజీనా పాల్గొన్నారు. అభిమానులతో ముచ్చటిస్తూ సందడి చేశారు. -
సంతానంతో రొమాన్స్కు రెజీనా రెడీ
హాస్యనటుడు సంతానంతో రొమాన్స్ చేసేందుకు నటి రెజీనా సిద్ధమవుతోంది. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తదుపరి చిత్రంలో సంతానం హీరోగా నటించనున్నాడు. ఆయనకు జంటగా నటి రెజీనాను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ సమాచారం. దర్శకుడు సెల్వరాఘవన్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ బిజీ అవుతున్నారు. అలాగే దిల్లుకు దుడ్డు చిత్ర విజయంతో ఖుషీగా ఉన్న సంతానం ప్రస్తుతం సర్వర్ సుందరం చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. కాగా నటి రెజీనా తమిళ చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్గా మారారు. ప్రస్తుతం ఎళిల్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రంలో ఉదయనిధి స్టాలిన్కు జంటగా రెజీనా నటిస్తోంది. అదే విధంగా నటుడు రానా దగ్గుబాటితో ద్విభాషా చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నెంజం మరప్పదిలై్ల అనే చిత్రాన్ని తీస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
ఏడు దశాబ్దాలు వెనక్కి!
రానా.. రెజీనా.. అన్నీ సవ్యంగా కుదిరితే ఇప్పటికే ఈ జోడీని తెరపై చూసేవాళ్లం. ప్రముఖ నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో వీరిద్దరూ జంటగా ఓ చిత్రం ప్రారంభమైంది. అనివార్య కారణాల వలన ఆ చిత్రం మధ్యలోనే ఆగింది. ఇన్నాళ్లకు మళ్లీ ఈ జోడీ కుదిరింది. తెలుగు, తమిళ భాషల్లో సత్యశివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో రానా, రెజీనా జంటగా నటించనున్నారు. తమిళ చిత్రానికి ‘మడై తిరందు’ తెలుగుకి ‘1945’ అనే టైటిల్ని ఖరారు చేశారట. 1940లలో జరిగే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రానా వివిధ గెటప్పుల్లో కనిపిస్తారట. ‘బాహుబలి: ది కంక్లూజన్’లో భల్లాలదేవుడి పాత్ర కోసం రానా కండలు తిరిగిన దేహంతో పాటు గడ్డం కూడా బాగా పెంచారు. ‘1945’లో ఓ గెటప్ ఈ భల్లాలదేవుడి గెటప్ తరహాలో ఉంటుందట. ఈ నెల 20న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట. ఏడు దశాబ్దాల క్రితం జరిగిన కథతో సినిమా కాబట్టి రానా, రెజీనా డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు. -
ఆ ఫొటోషూట్ అందుకేనా!
గతేడాది హిందీలో ‘హంటర్’ అనే సినిమా విడుదలైంది. ఆరు కోట్లతో తీసిన ఈ అడల్ట్ కామెడీ మూవీ పది రోజుల్లో 11 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియాలో బోల్డ్ కంటెంట్ ఏ స్థాయిలో సేల్ అవుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఇప్పుడీ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ సంస్థ తెలుగు వెర్షన్ని నిర్మిస్తోంది. దర్శక-నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ పాత్రలో నటించడానికి రెజీనా ఆసక్తి కనబరుస్తున్నారట. ఇప్పటివరకూ రెజీనా గ్లామరస్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ ఇది వాటిని తలదన్నే పాత్రలా ఉంటుంది. వాస్తవానికి ‘లెజెండ్’, ‘లయన్’ సినిమాల్లో హోమ్లీ పాత్రల్లో కనిపించిన రాధికా ఆప్టే ‘హంటర్’లో బోల్డ్గా కనిపించడం చర్చనీయాంశమైంది. హాలీవుడ్ హీరోయిన్లను తలపించేలా బోల్డ్ సన్నివేశాల్లో బ్యూటిఫుల్గా నటించి, రాధిక అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాను కూడా ఆ స్థాయిలో నటించాలనే పట్టుదలతో రెజీనా ఉన్నారని సమాచారం. అందుకే ఇటీవల ఆమె స్పెషల్ ఫొటోషూట్ చేయించుకున్నారని వినికిడి. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో హాట్ హాట్గా కనిపిస్తున్నారు రెజీనా. ఆ ఫొటోలను చూసినవాళ్లు ‘హంటర్’ రీమేక్లోని పాత్రకు రెజీనా పూర్తి న్యాయం చేయగలదని అంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. హీరో చిన్నప్పటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆగస్టు నుంచి అవసరాల శ్రీనివాస్ షూటింగ్లో పాల్గొంటారు. ఇందులో సెక్స్కి అడిక్ట్ అయిన క్యారెక్టర్లో నటిస్తున్న అవసరాల మాట్లాడుతూ - ‘‘అడల్ట్ కామెడీ సినిమా ఇది. హిందీ చిత్రంలానే తెలుగు రీమేక్ బోల్డ్గా ఉన్నప్పటికీ.. సెకండాఫ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది’’ అన్నారు. హిందీలో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగులో ఎన్ని సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందో? అసలు రెజీనా నటిస్తారో? లేదో? -
గ్యాంగ్..గ్యాంగ్..బజావో బ్యాంగ్... బ్యాంగ్
సమంత.. రకుల్.. రెజీనా.. నితిన్.. అండ్ టాలీవుడ్ టాప్ స్టైలిస్ట్ నీరజా కోన.. ఇప్పుడు వీళ్లంతా ఎక్కడ ఉన్నారో తెలుసా? బ్రస్సెల్స్ సిటీలో. ఈ బ్యాచ్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. బ్రస్సెల్స్ ఎక్కడుంది అంటారా? బెల్జియంలో. అక్కడికి ఎందుకు వెళ్లారు అనే డౌట్ వచ్చిందా? వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఫెస్టివల్.. ‘టుమారోల్యాండ్’కి వెళ్లారు. ఫేమస్ డీజేల లైవ్ షో ఈ ఫెస్టివల్ ప్రత్యేకత. ‘గ్యాంగ్ గ్యాంగ్.. బజావో బ్యాంగ్ బ్యాంగ్... స్టార్ట్ ది మ్యూజిక్’ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా సినిమా అవార్డు వేడుకల్లోనో, పక్క పక్కనే షూటింగ్ జరుగుతున్నప్పుడో.. ఈ స్టార్స్ అందరికీ సరదాగా కలుసుకునే అవకాశం లభిస్తుంది. గ్యాంగ్ అంతా కలసి ట్రిప్ వేయడం అంటే గగనమే. ఒకవేళ ఎవరో ఒకరు ఖాళీగా ఉన్నప్పటికీ.. మిగతావాళ్లకి షూటింగ్ ఉంటే కష్టమవుతుంది. కానీ, ఈసారి అందరికీ కుదరడంతో బెల్జియం ట్రిప్ వేశారు. ‘‘చివరి క్షణంలో అనుకోకుండా ప్లాన్ చేసిన ట్రిప్ ఇది. ఈ నెల మొదటివారంలో ‘టుమారో ల్యాండ్’ టికెట్స్ తీసుకున్నాం’’ అని నీరజా కోన సాక్షితో చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ - ‘‘నేను, నితిన్, మరో ఇద్దరు స్నేహితులు కలసి ఈ నెల 18న హైదరాబాద్ నుంచి మిలన్ (ఇటలీ) వెళ్లాం. సిటీ చూస్తూ.. షాపింగ్ చేస్తూ.. మిలన్లో సరదాగా గడిపాం. అక్కణ్ణుంచి 21న బ్రస్సెల్స్ చేరుకున్నాం. సమంత, రకుల్, రెజీనాలు బ్రస్సెల్స్లో మాతో జాయిన్ అయ్యారు. మా ఆయన అజయ్ అమెరికా నుంచి వచ్చారు. మ్యూజిక్.. మస్తీ.. మజా... దిస్ ట్రిప్ ఈజ్ ఫన్ విత్ మై హజ్బెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్’’ అని నీరజ పేర్కొన్నారు. ఎవరి మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేశారని ప్రశ్నిస్తే.. ‘‘ఫ్రెంచ్ డీజే డేవిడ్ గెట్టా, డచ్ డీజే ఆఫ్రోజాక్ మ్యూజిక్ మా ఫేవరెట్’’ అని చెప్పారు. ఈ నెల 28న వీళ్లంతా తిరుగు ప్రయాణమవుతున్నారు. -
మంచా.. చెడా?
ఖాకీ చొక్కా వేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని లాఠీ పట్టుకుని రెజీనా చాలా కొత్తగా కనిపిస్తున్నారు కదూ! ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో కనిపించిన రెజీనా వేరు.. ఇప్పుడు కనిపించనున్న రెజీనా వేరు. ఆమెలోని పవర్ఫుల్ యాంగిల్ని చూపించనున్నారు దర్శకుడు కృష్ణవంశీ. సందీప్ కిషన్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నక్షత్రం’. ఇందులో రెజీనా పోలీస్గా నటిస్తున్నారు. మంచి పోలీస్గా నటిస్తున్నారా? లేదా చెడ్డ పోలీస్గా నటిస్తున్నారా? అనేది చిత్రం చూసి తెలుసుకోవాలంటున్నారు హీరో సందీప్. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. కథానాయికలను చాలా అందంగా చూపిస్తారని కృష్ణవంశీకి పేరు. అందుకే, ప్రతి కథానాయిక ఒక్కసారైనా ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. పోలీస్గా రెజీనాను ఎలా చూపిస్తారో? అన్నట్టు.. ‘రొటీన్ లవ్స్టోరీ’, ‘రా రా కృష్ణయ్య’ చిత్రాల తర్వాత సందీప్, రెజీనా కలసి నటిస్తున్న మూడో చిత్రమిది. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించడం ఇద్దరికీ ఇది తొలిసారి. -
ఆరోగ్యమే..ఆనందం
అందాల తార రెజీనా శనివారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి విచ్చేశారు. కేన్సర్ సర్వైవర్స్ డే సందర్భంగా ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కేన్సర్ నుంచి విముక్తి పొందిన పలువుర్ని అభినందించారు. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ కేన్సర్ సర్వైవర్స్ డేను పురస్కరించుకొని జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’ పేరిట శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ నటి రెజీనా పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రాణాంతక కేన్సర్ నుంచి విముక్తి పొందిన వారిని అభినందించారు. వారి ధైర్యసాహసాలను కొనియాడారు. వారితో ఆమె అనుభవాలు పంచుకొని సరదాగా గడిపారు. కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆస్పత్రి డెరైక్టర్ విజయ్ ఆనంద్రెడ్డితో కలిసి ‘సింబల్ ఆఫ్ రెసిలెన్స్’ను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అపోలో జేఎండీ డాక్టర్ సంగీతారెడ్డి పాల్గొన్నారు. బంజారాహిల్స్ -
మరో మెగా హీరోతో రెజీనా
మంచి యాక్టింగ్ టాలెంట్తో పాటు వరుసగా అవకాశాలు కూడా వస్తున్నా.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది రెజీనా. యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా.., స్టార్ హీరోల సరసన మాత్రం ఛాన్స్ సాధించలేకపోతుంది. అయితే మెగా హీరోలు మాత్రం ఈ అమ్మడికి బాగానే ఛాన్సులిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలతో జతకట్టిన ఈ బ్యూటీ తాజాగా మరో మెగా హీరోతో నటించడానికి రెడీ అవుతోంది. పిల్లానువ్వులేనీ జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో సాయిధరమ్ తేజ్తో కలిసి నటించింది రెజీనా. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించటంతో మెగా హీరోల దృష్టిలో పడింది. అదే సమయంలో మరో మెగా హీరో శిరీష్ సరసన కొత్తజంట సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మరో మెగా హీరోతో సినిమాకు రెడీ అవుతోంది. ముకుంద, కంచె, లోఫర్ లాంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో 'మిస్టర్' సినిమాలో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్కు ఛాన్స్ ఉంది. అయితే ముందుగా ఈ పాత్రకు హేబా పటేల్ను తీసుకోవాలని భావించినా, వరుణ్ సరసన సూట్ అవ్వదన్న ఆలోచనతో రెజీనాను ఫైనల్ చేశారు. మరి వరుణ్ అయినా రెజీనాకు స్టార్ ఇమేజ్ తీసుకువస్తాడేమో చూడాలి. -
మూడోసారి జోడి కడుతున్నారు
ఫిలిం ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్లు రిపీట్ అవ్వటం కామన్. అయితే ఈ ఫార్ములాను బ్రేక్ చేస్తూ ఇప్పటికే రెండు ఫ్లాప్లు ఇచ్చిన కాంబినేషన్ను మరోసారి తెర మీదకు తీసుకు రావడానికి రెడీ అవుతున్నాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. బాలయ్య వందో సినిమాతో పాటు, రుద్రాక్ష సినిమా కూడా చేజారిపోవటంతో ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్తో నక్షత్రం అనే సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు కృష్ణవంశీ. ఇప్పటికే కథా కథనాలు కూడా రెడీ అయిన ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం కృష్ణవంశీ ఓ రిస్కీ కాంబినేషన్ను సెట్ చేస్తున్నాడట. నక్షత్రం సినిమాలో సందీప్ కిషన్ సరసన రెజీనాను హీరోయిన్గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాడు. గతంలో సందీప్ కిషన్, రెజీనాలు రెండు సినిమాల్లో కలిసి నటించగా ఆ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. తొలిసారి రొటీన్ లవ్ స్టోరి సినిమాలో కలిసి నటించిన ఈ జంట మంచి కెమిస్ట్రీతో ఆకట్టుకున్నా సినిమా రిజల్ట్ మాత్రం నిరాశపరిచింది. ఆ తరువాత కొత్త దర్శకుడితో రారా కృష్ణయ్య సినిమాలో మరోసారి కలిసి నటించారు. ఈ సినిమా కూడా రిలీజ్కు ముందు మంచి హైప్ క్రియేట్ చేసినా తరువాత మాత్రం ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. దీంతో ఇదే కాంబినేషన్లో సినిమా చేయటం కృష్ణవంశీకి ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో అన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ క్రియేటివ్ డైరెక్టర్ సెంటిమెంట్ను బ్రేక్ చేసి హిట్ కొడతాడేమో చూడాలి. -
తిరుపతిలో రెజీనా సందడి
సినీనటి రెజీనా శనివారం రాత్రి తిరుపతి లో సందడి చేశారు. నీరూస్ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె రావడంతో అభిమానులు కేరింతలు కొడుతూ, ఈలలు, కేకలతో హోరెత్తించారు. తిరుపతి సిటీ: తిరుపతిలోని ‘నీరూస్’ బ్రాండెడ్ షోరూంను టాలీవుడ్ నటి రెజీనా కసాండ్రా శనివారం ప్రారంభించారు. నగరంలోని ఏఐఆర్ బైపాస్రోడ్డులో ఏర్పాటుచేసిన నీరూస్ ఇండియన్ ఎథినిక్ బ్రాండెడ్ షోరూంను ప్రారంభించేందుకు విచ్చేసిన సినీనటి రెజీనాకు నీరూస్ మేనేజింగ్ డెరైక్టర్ హరీష్కుమార్, ప్రాంఛైజీ నిర్వాహకులు మాలిని, సుధాకర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం షోరూంను ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అక్కడి పలు వస్త్రాలు, శారీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం తాను మూడు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. -
ఘోర నేరాలపై శౌర్యం
కొన్ని కథలు కొత్తగా ఉంటాయి. మరికొన్ని కొత్తగా చెప్పాల్సి ఉంటాయి. చాలా కొద్దికథలే కొత్తగానూ, కొత్తగా చెప్పినట్లుగానూ ఉంటాయి. మొదటి రెండు రకాల సినిమాలూ తరచూ వస్తాయి. మూడో రకం సినిమాలు రావ డమే అరుదు. అలాంటి సినిమాలు తీసేవారూ అరుదే. అలాంటి సినిమా తీయాలనుకున్నప్పుడు రాత, దానితో పాటు తీత - రెండూ కత్తి మీద సామే. కానీ, ధైర్యం చేసి, దర్శక - నిర్మాతలు తెరపై చూపిన ‘శౌర్య’ం - ఈ ఫిల్మ్. చిన్న పాయింట్తో అల్లుకున్న 2 గంటల కథేమిటంటే, శౌర్య (మనోజ్) కోట్ల ప్రాజెక్ట్ సాధించినా, దాన్ని ప్రేమించిన అమ్మాయి నేత్ర (రెజీనా) కోసం వదులుకొనే కుర్రాడు. శివరాత్రి నాటి రాత్రి మొక్కు తీర్చేందుకు గుడిలో జాగారం చేస్తుంటే, హీరో పక్కనే హీరోయిన్ పీక తెగి, రక్తపు మడుగులో ఉంటుంది. ఆ నేరం హీరోపై పడుతుంది. డెత్బెడ్ మీద ఉన్న ఆ అమ్మాయి ఒక నంబర్ రాసి, కన్ను మూస్తుంది. ఎంపీ కూతురైన హీరోయిన్కీ, హీరోకీ సంబంధమేంటి? ఆ నంబరేంటి? హీరోయే నిజంగా నేరం చేశాడా లాంటి వన్నీ సస్పెన్స నిండిన ఈ థ్రిల్లర్ లవ్స్టోరీలో తెరపై చూడాల్సినవి. గత ఏడాదే వివాహమైన మనోజ్ ఈ సినిమాలో పాత్ర కోసం బొద్దుగా, ముద్దుగా అయ్యారు. ఎమ్ఫార్మసీ చదివిన, హుందాతనం నిండిన ఉద్యోగిగా కాస్ట్యూమ్స్లో కొత్తగా కనిపించే ప్రయత్నం చేశారు. ఇక, హీరో ప్రేమికురాలిగా, పలుకుబడి ఉన్న ఎంపీ కూతురు నేత్రగా రెజీనాది అభినయపరంగా కాకున్నా, కథా పరంగా కీలక పాత్ర. ఎస్.ఐగా ప్రకాశ్రాజ్ది ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్. హీరోయిన్ తండ్రిగా నాగినీడు, బాబాయ్గా సుబ్బరాజులది పాత్రోచిత నటన. కామిక్ రిలీఫ్ కోసం సినిమాలో హీరోయిన్ బావగా ‘ప్రభాస్’ శ్రీను, పోలీసు కానిస్టేబు ల్గా ‘షకలక’ శంకర్ లాంటివాళ్ళున్నారు. ‘చుచ్చూ పోయిస్తా!’ అంటూనే, లేని దయ్యానికి భయపడే మినిస్టర్గా బ్రహ్మానందం సెకండాఫ్లో ఎంట్రీ ఇస్తారు. ఆయనపై పాట అదనం. ఆ కాసేపు పక్కన పెడితే, మిగతా సినిమా అంతా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, సీరియల్ ఆఫ్ సీన్స్. చిత్రం: ‘శౌర్య’, తారాగణం: మంచు మనోజ్, రెజీనా కసండ్రా, ప్రకాశ్రాజ్, నాగినీడు, సుబ్బరాజు, బ్రహ్మానందం, ‘ప్రభాస్’ శ్రీను, రచన: గోపీ మోహన్, మాటలు: దశరథ్, కిశోర్ గోపు, సంగీతం: కె. వేదా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, నిర్మాత: మల్కాపురం శివకుమార్, కథ - దర్శకత్వం: దశరథ్, నిడివి: 121 నిమిషాలు, రిలీజ్: మార్చి 4 దర్శకుడు దశరథ్ సోదరుడైన వేదా ఇచ్చిన సంగీతం ఆయనలోని వైవిధ్య ప్రదర్శనకు ఉపకరిస్తుంది. కెమేరామన్, ఎడిటర్, ఫైట్స్ లాంటి సాంకేతిక విభాగాలన్నీ కథ, కథనానికి తగట్టుగానే ఉన్నాయి. మొదట క్యారె క్టర్ల పరిచయం, పీటముడిగా మారిన ఒక ఊహించని క్రైమ్లో అనుకోని మలుపుతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆ సమయంలో కోర్టులో హీరో చెప్పిన ఒక మాటతో ఊహించని ట్విస్ట్. దాంతో, ఇంటర్వెల్. ‘థ్రిల్ కంటిన్యూస్’ అనే ఇంటర్వెల్ కార్డ్కు తగ్గట్లే, ఫస్టాఫ్ తర్వాతా కథ సీరియస్గా సాగిపోతూ... ఉంటుంది. మరో అరగంటలో సినిమా ముగుస్తుందనగా, కథలో కొత్త వేగం వస్తుంది. ఓపిక పట్టినవాళ్ళకు సస్పెన్స్ వీడే అరగంట తప్పక బాగుంటుంది. పెచ్చరిల్లుతున్న కుల విద్వేషాలు, పరువు హత్యలనే సమకాలీన అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకోవడం అభినందించాల్సిందే. అయితే, దాన్ని మనసును కదిలించే సెంటిమెంటల్ అంశాలతో కాకుండా, విభిన్నంగా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్గా రూపొందించాలని భావించారు. ముడివీడనట్లు కనిపిస్తున్న ఒక నేరం తాలూకు మిస్టరీని సాల్వ్ చేయడం కోసం సస్పెన్స్ పంథాను ఆశ్రయించారు. అలా ఈ సినిమా పూర్తిగా ఆ దోవలో వెళ్ళింది. ఈ వ్యవహారంలో హీరోతో పాటు పోలీస్ ప్రకాశ్రాజ్, నేరస్థులూ మరింత కీలకంగా వ్యవహరిస్తే, కథకు ఇంకా ఊపు, ఉత్సాహం వచ్చేవి. మిస్టరీ సాల్వేషన్కి ఒకరు, దానికి వ్యతిరేకంగా మరొకరు వ్యవహరించడ మనే పంథాలో కలిసొస్తుంది. మొత్తం మీద, ప్రేమకథలోనే సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాల లాంటివి కలవడం ఒక కొత్తదనమే. అందుకే, టీవీలో కనిపించే ‘నేరాలు - ఘోరాలు’ లాంటి క్రైమ్స్టోరీలకు ఇది వినూత్నమైన వెండితెర ఆవిష్కారం. చాలాసార్లు మనం చూసి ఊహించే దానిలోనో, అవతలివాళ్ళు చెప్పే దానిలోనో కాక, అసలు నిజం వేరొకటి ఉంటుందని అవగాహన కల్పిస్తుంది. వెరసి, ఈ సినిమా ‘ఆనర్ కిల్లింగ్స్’ లాంటి ఘోర మైన నేరాలపై చూపిన ‘శౌర్యం’. - రెంటాల జయదేవ -
థ్రిల్లింగ్ లవ్స్టోరీ ఇది!
‘సంతోషం’, ‘సంబరం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’లతో కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దశరథ్. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం - ‘శౌర్య’. మంచు మనోజ్, రెజీనా జంటగా మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. దశరథ్ చెప్పిన ముచ్చట్లు... డిఫరెంట్ లవ్స్టోరీ చేయాలని ‘శ్రీ’ చిత్రం నుంచి ప్రయత్నిస్తున్నా. అది ఇప్పటికి కుదిరింది. ప్రేమికుల మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్లో, తల్లితండ్రులు ఒప్పుకోకపోవడం వల్లో ప్రేమకథలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయితే ‘శౌర్య’లో ఎవరూ ఊహించని ప్రత్యేక కోణం ఉంటుంది. ఇదొక థ్రిల్లింగ్ లవ్స్టోరీ. ఫైట్లుండవు. సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో మనోజ్ రెండు వేర్వేరు పాత్రల్లో నటించాడు. తెలుగులో ఇలాంటి కథతో సినిమా రాలేదు. ‘శ్రీ’ చిత్రం తర్వాత చాలా కాలానికి మళ్ళీ మనోజ్తో చేసిన చిత్రమిది. ఇప్పుడు కూడా తనలో ఎనర్జీ ఏ మాత్రమూ తగ్గలేదు. అతను ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. నా కెరీర్లో జయాలు, అపజయాలు చూశా. ఆ రెండింటినీ సమానంగా చూడడం వల్లే సంతోషంగా ఉన్నా. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. సినిమాలోని విషయం నచ్చితే ఆదరిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో నాకు కొద్దిమంది స్నేహితులున్నారు. దర్శకుడు వీవీ వినాయక్, హీరోలు మనోజ్, ప్రభాస్, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మంచి స్నేహితులు. సినిమాలతో సంబంధం లేకుండా మేము రెగ్యులర్గా కలుస్తుంటాం. ప్రభాస్తో తప్పకుండా ఓ చిత్రం చేస్తా. ఆ వివరాలు త్వరలో చెబుతా. -
బ్యాక్ లెస్... బ్యూటీ మోర్!
‘‘ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అదే చేయాలి. లేకపోతే హర్ట్ అయిపోతారు’’ అని కొంతమంది కథానాయికలు చెబుతుంటారు. ‘ఫలానా సినిమాలో గ్లామర్ పరంగా కొంచెం హద్దు దాటినట్లున్నారు?’ అనే ప్రశ్నకు కథానాయికలు సర్వసాధారణంగా చెప్పే జవాబు అది. ఒకప్పుడు నిండైన చీరకట్టులో కనిపించిన తారలు.. అప్పుడప్పుడు మాత్రం కురచ గౌనుల్లోనూ, ఉల్లిపొర లాంటి చీరల్లోనూ కనువిందు చేసేవారు. ఇప్పుడు మామూలుగానే ట్రెండ్ మారింది. దాంతో, బట్టల నిడివి తగ్గడం సాధారణమైంది. నడుము, నాభి చూపించడం సర్వసాధారణమైంది. నిన్న మొన్నటివరకూ ముందు వైపు అందాలనే ప్రదర్శించిన తారలు ఇప్పుడు బ్యాక్ పై దృష్టి పెడుతున్నారు. పాటల్లో కొన్ని సెకన్ల పాటు వీపు భాగం చూపిస్తున్న తారలు విడిగా అవార్డుల ఫంక్షన్లలో ఇంకా రెచ్చిపోతున్నారు. హాలీవుడ్ స్టయిల్లో పొడవాటి గౌనుల్లో దర్శనమిస్తున్నారు. వీపు అంతా కనిపించేలా వెనక భాగంలో దాదాపు నడుము నుంచి మాత్రమే బట్టలు ఉండేలా ఆ గౌన్లను డిజైన్ చేయించుకుంటున్నారు. అలా ఈ మధ్యకాలంలో వీపు అందాలను చూపించి, వార్తల్లో నిలిచినవాళ్లల్లో తాప్సీ, రకుల్ ప్రీత్సింగ్, రెజీనా, రాశీ ఖన్నా తదితరులు ఉన్నారు. వీళ్ల బ్యాక్ బ్యూటీ చూడకుండా, వెనకెనకే ఫాలో కాకుండా ఉండడం కుర్రకారుకు కష్టమే. ఆ సంగతి అలా ఉంచితే... ఇలా పొదుపైన బట్టలు వాడుతున్న తారలు పిసినారులని మాత్రం అనుకోకండి. ఒక్కో గౌను ఖరీదు మినిమమ్ 50 వేల రూపాయల నుంచి మొదలవుతుంది. కొన్నిటి ధర అయితే, లక్ష పైగానే ఉంటుందట -
మా మనోజ్ను... సరిగ్గా ఇలానే చూడాలనుకున్నా!
- మోహన్బాబు ‘‘ఏ చిత్రానికైనా దర్శకుడే కెప్టెన్. దశరథ్ నిగర్వి. మా సంస్థలో మనోజ్తో ‘శ్రీ’ చిత్రం చేశాడు. ఇన్ని రోజులుగా మనోజ్ను నేను ఎలాంటి పాత్రలో చూడాలనుకున్నానో ఈ చిత్రంలో సరిగ్గాఅలాంటి పాత్రలో కనిపించనున్నాడు’’ అని మంచు మోహన్బాబు అన్నారు. మంచు మనోజ్, రెజీనా జంటగా బేబీ త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. పతాకంపై దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ‘శౌర్య’. వేదా కె. స్వరపరచిన ఈ చిత్రం పాటలు హైదరాబాద్లో విడుదలయ్యాయి. మోహన్బాబు బిగ్ సీడీ, దర్శకుడు బి.గోపాల్ పాటల సీడీ ఆవిష్కరించారు. ‘‘దశరథ్ సాఫ్ట్ డెరైక్టర్. తన తమ్ముడు వేదాను సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రం మనోజ్ కెరీర్లో బెస్ట్గా నిలిచిపోతుంది’’ అని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు. దశరథ్ మాట్లాడుతూ -‘‘ఇదొక లవ్స్టోరీ కమ్ థ్రిల్లర్. రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నంగా ఉండే ప్రేమ కథా చిత్రం. నిర్మాత శివకుమార్గారు ఈ చిత్రంతో నాకు మంచి మిత్రుడయ్యారు. మనోజ్ లేకుంటే ఈ చిత్రం ఇంత బాగా వచ్చుండేది కాదు. రెజీనా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్’’ అని చెప్పారు. ఈ వేడుకలో శ్రీమతి మంచు నిర్మల, ఎమ్మెల్యే ‘రసమయి’ బాలకిషన్, బ్రహ్మానందం, దర్శకులు ఎన్.శంకర్, చంద్ర మహేష్, నిర్మాతలు శైలేంద్రబాబు, బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, గొట్టిముక్కల పద్మారావు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ‘‘ఏ చిత్రానికైనా దర్శకుడే కెప్టెన్. దశరథ్ నిగర్వి. మా సంస్థలో మనోజ్తో ‘శ్రీ’ చిత్రం చేశాడు. ఇన్ని రోజులుగా మనోజ్ను నేను ఎలాంటి పాత్రలో చూడాలనుకున్నానో ఈ చిత్రంలో సరిగ్గాఅలాంటి పాత్రలో కనిపించనున్నాడు’’ అని మంచు మోహన్బాబు అన్నారు. మంచు మనోజ్, రెజీనా జంటగా బేబీ త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. పతాకంపై దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ‘శౌర్య’. వేదా కె. స్వరపరచిన ఈ చిత్రం పాటలు హైదరాబాద్లో విడుదలయ్యాయి. మోహన్బాబు బిగ్ సీడీ, దర్శకుడు బి.గోపాల్ పాటల సీడీ ఆవిష్కరించారు. ‘‘దశరథ్ సాఫ్ట్ డెరైక్టర్. తన తమ్ముడు వేదాను సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రం మనోజ్ కెరీర్లో బెస్ట్గా నిలిచిపోతుంది’’ అని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు. దశరథ్ మాట్లాడుతూ -‘‘ఇదొక లవ్స్టోరీ కమ్ థ్రిల్లర్. రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నంగా ఉండే ప్రేమ కథా చిత్రం. నిర్మాత శివకుమార్గారు ఈ చిత్రంతో నాకు మంచి మిత్రుడయ్యారు. మనోజ్ లేకుంటే ఈ చిత్రం ఇంత బాగా వచ్చుండేది కాదు. రెజీనా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్’’ అని చెప్పారు. ఈ వేడుకలో శ్రీమతి మంచు నిర్మల, ఎమ్మెల్యే ‘రసమయి’ బాలకిషన్, బ్రహ్మానందం, దర్శకులు ఎన్.శంకర్, చంద్ర మహేష్, నిర్మాతలు శైలేంద్రబాబు, బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, గొట్టిముక్కల పద్మారావు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
సెల్వ దర్శకత్వంలో రెజీనా
చిత్రపరిశ్రమలో ఒక విచిత్రమైన అంశం ఏమిటంటే పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెతను అక్షరాలా నిజం చేయబడుతోంది. స్థానిక తారలకు మొదట్లో సొంత గడ్డపై ఆదరణ ఉండదు. పరభాషల్లో పేరు తెచ్చుకున్న తరువాత వారి ప్రతిభ తెలుస్తుంది. ముఖ్యంగా కథానాయికల విషయంలో ఎక్కువగా జరుగుతున్నది ఇదే. ఇటీవల కాలంలో చూస్తే నటి అంజలి, శ్రీదివ్య వంటి తెలుగమ్మాయిలకు తమిళంలో నాయికలుగా గుర్తింపు పొందిన తరువాతే తెలుగు చిత్రాలలో అవకాశాలు పెరిగాయన్నది నిజం. అదే విధంగా తమిళ, మలయాళ నటీమణులు రచ్చ గెలిచి ఇంట గెలుస్తున్నారని చెప్పవచ్చు. ఉదాహరణకు తమిళ నటి రెజీనానే తీసుకుంటే మొదట్లో ఇక్కడ కేడీబిల్లా-కిలాడీరంగా తదితర చిత్రాలలో నటించారు. ఈ తమిళంలో నటించిన చివరి చిత్రం రాజతందిరం. ఆమె నటించిన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందినా రెజీనాకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో తను టాలీవుడ్పై దృష్టి సారించారు. అక్కడ నాయికగా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ కోలీవుడ్ కన్ను రెజీనాపై పడింది. రెండు మూడు అవకాశాలు వరిస్తున్నాయి. వాటిలో ఒకటి దర్శకుడు సెల్వరాఘవన్ చిత్రం. కాదల్కొండేన్, 7జీ బృందావన్ కాలనీ తదితర చిత్రాలతో వేగంగా దూసుకొచ్చిన ఈ సంచలన దర్శకుడు ఇటీవల వరుస ఫ్లాపులతో కాస్త తడబడ్డారు. తాజాగా ఒక హారర్ కథా చిత్రాన్ని హ్యాండిల్ చేయడానికి సిద్ధం అయ్యారు. ఇందులో కథానాయికగా రెజీనాను ఎంపిక చేసేపనిలో ఉన్నట్లు కోలీవుడ్ సమాచారం. అదే విధంగా ఇందులో హీరోగా దర్శకుడు ఎస్జే.సూర్యను నటింప చేయనున్నట్లు. దీనికి దర్శకుడు గౌతమ్మీనన్ నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. -
రెజీనా ప్రేమలో పడిందా?
ప్రేమ ఒక మోహం. యుక్త వయసులో దాని నుంచి తప్పించుకోవడం కొంచెం కష్టమైన విషయమే. ఇక సినీతారల విషయానికోస్తే చాలా మంది ప్రేమలో పలు మార్లు పడుతుంటారు. ఇందుకు నటి రెజీనా మినహాయింపు కాదు. ఈ బ్యూటీ కోలీవుడ్లో కేడీబిల్లా కిలాడీ రంగా, రాజతందిరం చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు మంచి విజయాన్నే పొందాయి. అయినా రెజీనాకు ఇక్కడ అవకాశాలు రాలేదు. గ్లామర్ విషయంలో ఈ అమ్మడు మడి కట్టుకు కూర్చోవడమే అందుకు కారణం అనే వాళ్లు లేక పోలేదు. ఆ తరువాత అందాలారబొతకు గేట్లు ఎత్తివేసినట్లు స్టేట్మెంట్స్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో రెజీనా టాలీవుడ్లో మకాం పెట్టింది. అక్కడ కూడా మొదట్లో అన్నీ లంగా ఓణి పాత్రలే వస్తున్నాయని వాపోయినా తాజాగా అవకాశాలు బాగానే వస్తున్నాయి. కోలీవుడ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్లో గ్లామర్ విషయంలో సరిహద్దులు దాటేస్తున్న రెజీనా ఇప్పుడు ప్రేమలో పడినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ అమ్మడు ఒక తెలుగు యువ నటుడితో ప్రేమ సాగరంలో తేలిపోతోందని,ఆయన ఈ అమ్మడికి చిత్రాలు సిఫార్సు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఆమె సన్నిహితులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. రెజీనాకు ఇప్పటికే విక్రమ్ మీనన్ అనే బాయ్ఫ్రెండ్ ఉన్నారనీ, ఇటీవల కాస్త విరామం లభించడంతో అతనితో కలిసి అమ్మడు థాయ్ల్యాండ్ చుట్టొచ్చిందని వారు అంటున్నారు. ఇక నిజం ఏమిటన్నది ఆ పైవాడికే తెలియాలి. -
ప్యార్మే పడిపోయానే...
అవునండీ... నిజమే రెజీనా ప్రేమలో పడింది. ఆ ప్రేమ భాగ్యనగరంపైన.. చార్మినార్ పైన.. అక్కడ దొరికే ముత్యాలపైన.. హైదరాబాద్తో నాకు నాలుగేళ్ల అనుబంధం ఉంది. నా మాతృభాష తమిళం. టాలీవుడ్లో ఛాన్స్ వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. అప్పుడు నాకు హైదరాబాద్నే ధైర్యం చెప్పింది. ‘కొత్త జంట, రారా కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’.. తదితర నా సినిమాల షూటింగ్ ఎక్కువ శాతం సిటీలోనే జరిగింది. దీంతో భాగ్యనగరితో నా అనుబంధం పెరిగింది. ఇప్పుడు నా సెకండ్ ప్లేస్ హైదరాబాద్. ఇక్కడ ఎంతో కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడి ప్రజలు, పురాతన కట్టడాలు చాలా స్పెషల్గా అనిపిస్తాయి. అందుకే హైదరాబాద్ ప్రేమలో పడిపోయాను. రియల్లీ ఐ లవ్ భాగ్యనగరి. చార్మినార్ ముత్యాల గాజులంటే నాకు చాలా ఇష్టం. బంజారాహిల్స్లోని మహారాజ చాట్లో పానీపూరి తినడమంటే మరీ ఇష్టం. - రెజీనా (సినీ నటి) -
కొత్త కొత్తగా...
‘‘ఇందులో నాది చాలా మంచి క్యారెక్టర్. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. భవిష్యత్తులో మనోజ్తో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అని రెజీనా చెప్పారు. మంచు మనోజ్, రెజీనా జంటగా దశరథ్ దర్శకత్వంలో బేబి త్రిష సమర్పణలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న ‘శౌర్య’ సాంగ్ టీజర్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఇదొక థ్రిల్లింగ్ లవ్స్టోరీ అని, చిత్రీకరణ మొత్తం పూర్తయిందని దశరథ్ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ ‘సూర్య వర్సెస్ సూర్య’ తర్వాత మా సంస్థలో వస్తున్న సినిమా ఇది. ఇందులో మనోజ్ చాలా కొత్త కొత్తగా కనబడతారు. జనవరిలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. నందు, మధుమణి, శివారెడ్డి, జీవీ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వేదా, కెమెరా: మల్హర్భట్ జోషి. -
కామెడీ పాళ్లెక్కువ సౌఖ్యం?
చిత్రం : 'సౌఖ్యం' తారాగణం : గోపీచంద్, రెజీనా కథ, మాటలు : శ్రీధర్ సీపాన కెమేరా : ప్రసాద్ మూరెళ్ళ సంగీతం : అనూప్ నిర్మాత : ఆనంద్ప్రసాద్ స్ర్కీన్ప్లే,దర్శకత్వం : ఏ.యస్. రవికుమార్ చౌదరి హీరో గోపీచంద్ది చిత్రమైన కెరీర్. నటుడిగా హీరో పాత్రలతో మొదలై విలన్గా రాణించి, మళ్ళీ హీరోగా విజృంభించిన వెర్సటాలిటీ అతనిది. కానీ ఒకసారి అగ్రహీరోగా పేరు తెచ్చుకున్నాక సక్సెస్ నిలబెట్టుకోవడం అనుకునేంత ఈజీ కాదు. ఆ క్రమంలో కొన్ని సెంటిమెంట్లకూ, మరికొన్ని ఇమేజ్ చట్రాలకూ బందీ కావాల్సి వస్తుంది. ఒక రకమైన యాక్షన్, కామెడీ ఫార్ములా ఇటీవల అందరికీ సేఫ్ బెట్ అయింది. ‘సాహసం’ లాంటి కొన్ని ప్రయోగాలు ఆశించినంత విజయం సాధించకపోవడంతో గోపీచంద్ ఆ మార్గం పట్టారు. అందుకు తగ్గట్లే గత ఏడాది వచ్చిన ‘లౌక్యం’ ఊహించని రీతిలో విజయం సాధించింది. అలా ‘శంఖం’, ‘శౌర్యం’, ‘లౌక్యం’ తర్వాత ఆయన నవ్వులకే ప్రాధాన్యమిస్తూ చేసిన యాక్షన్ ఫిల్మ్ ఈ ‘సౌఖ్యం’. టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి లాంటి యక్షప్రశ్నలేయకుండా కథలోకి వెళితే - అమ్మానాన్న (ప్రగతి, ముఖేశ్రుషి), బాబాయ్ (రఘుబాబు) లాంటి బంధాలెన్నో ఉన్నా రెక్లెస్గా జీవితం గడిపే ఒక యువకుడు శ్రీను (గోపీచంద్). అనుకోకుండా అతనికి ఒక రైలు ప్రయాణంలో శైలజ (రెజీనా) ఎదురవుతుంది. చూసీచూడగానే ఆమెను ప్రేమించేస్తాడు. యాదృచ్ఛికంగా పదే పదే ఆమెను కలుస్తాడు. తమది విధి కుదిర్చిన బంధమని అంటాడు. మొదట కాదనుకున్నా, చివరకు హీరో ప్రేమకు ఆమె సరేనంటుంది. తీరా ఆమె వల్ల హీరో కుటుంబం చిక్కుల పాలవుతుంది. అప్పటికే ఊళ్ళో భావూజీ అనే విలన్ (ప్రదీప్ రావత్) గుంపుతో హీరో గొడవపడి ఉంటాడు. హీరోను తెలివిగా తప్పించడం కోసం కలకత్తా వెళ్ళి, కింగ్ మేకర్ పి.ఆర్. (మలయాళ నటుడు దేవన్) కూతురిని తీసుకురమ్మంటాడు భావూజీ. సరేనని అక్కడకు బయల్దేరతాడు హీరో. తీరా ఆ పి.ఆర్. కూతురే, హీరో ప్రేమించిన హీరోయిన్. కలకత్తా వెళ్ళిన హీరో అక్కడ పి.ఆర్.ను ధైర్యంగా ఎదిరించి మరీ, హీరోయిన్ను వెంటబెట్టుకొని వస్తాడు. అయితే, భావూజీ గ్యాంగ్ అసలు పన్నాగం తెలిసి, వాళ్ళకు మాత్రం చెప్పడు. హీరోయిన్ను తన కోడల్ని చేసుకోవాలనుకున్న భావూజీ అది తెలిశాక ఏం చేశాడు? కలకత్తా ముఖ్యమంత్రి కొడుక్కి తన కూతుర్ని కట్టబెట్టా లనుకున్న పి.ఆర్. కలకత్తా నుంచి వచ్చి, హైదరాబాద్లో ఏం చేశాడు? హీరో తన ప్రేమనెలా పెళ్ళి పీటలకెక్కించాడన్నది ఓపికగా వెండితెరపై చూడాలి. గోపీచంద్ సహా సుపరిచిత తారలెందరో కనిపించిన ఈ సినిమా కథలో చాలా సీన్లు ముందే ఊహించేయగలుగుతాం. ఫస్టాఫ్లో హీరోయిన్ అడ్రస్ కనుక్కోవడానికి హీరో పడే శ్రమతో మంచి లవ్స్టోరీగా నడు స్తుందనుకుంటాం. అంతలోనే అది ముగిసి, కథ యాక్షన్ టర్న తీసుకుంటుంది. ఆ తరువాత మళ్ళీ పూర్తిగా కామెడీ బాట పట్టించారు. ఇవాళ అందరూ వినోదానికే మార్కులేస్తున్నారనే భావంతో స్క్రిప్ట్లో నవ్వులపాళ్ళే ఎక్కువుండేలా చూసుకున్నారు. ఫస్టాఫ్లో ట్రైన్ ఎపిసోడ్లో బామ్మ పాత్రధారి సీనియర్ నటి ‘షావుకారు’ జానకితో మద్యం ఎపిసోడ్, పోసాని లోదుస్తుల ఎపిసోడ్ లాంటివి పెట్టారు. సెకండాఫ్కు వచ్చేసరికి పృథ్వి, కృష్ణభగవాన్, జ్యోతి బృందంతో ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ లాంటి పాపులర్ సినిమాల స్పూఫ్ బిట్స్ చేయించారు. చివరలో బ్రహ్మానందం ఎపిసోడ్, అలాగే ప్రదీప్రావత్తో ‘గబ్బర్సింగ్’శైలి అంత్యాక్షరి ఎపిసోడ్ లాంటి కామెడీ బిట్స్ - ఇలా వీలున్నవన్నీ చేశారు. మధ్య మధ్యలో జీపుల్లో ఛేజ్లు, పవర్ఫుల్ ఫైట్లతో గోపీచంద్ యాక్షన్ ఇమేజ్ యథాశక్తి వాడారు. కెమేరా వర్క, కొన్నిపాటల చిత్రీకరణ బాగున్న ఈ సినిమాకు ప్రధాన బలంతో పాటు బలహీనతా కామెడీనే. బలమైన భావోద్వేగాలుంటేనే వినోదం దానికి అదనపు బలమని మర్చిపోతే ఎంత నవ్వుకున్నా ఏం లాభం? -
అప్పుడు నా స్టైల్లో నేనేంటో చూపిస్తా!
- గోపీచంద్ యాక్షన్.. రొమాన్స్... ఫ్యామిలీ ఎమోషన్స్.. కామెడీ.. ఇలా ఏ జానర్కైనా పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వగల స్టార్ గోపీచంద్. తాజాగా ‘సౌఖ్యం’తో తన స్టయిలాఫ్ మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారు. ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్, రెజీనా జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా గోపీచంద్తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... నలుగురి కోసం ఆలోచించే వ్యక్తిగా ‘సౌఖ్యం’లో నటించారు. మరి విడిగా? నా చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. నా ఆలోచనలన్నీ దాదాపు పాజిటివ్గానే ఉంటాయి. ఎదుటి వ్యక్తిలో నెగటివ్ చూడడం నాకు నచ్చదు. వాళ్లల్లో ఉన్న పాజిటివ్ని చూస్తాను. వీలైనంత ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటాను. అందరూ బాగుండాలనుకుంటాను. ఆనంద్ప్రసాద్గారి భవ్య బేనర్లో ఇది మీకు నాలుగో సినిమా. ఆయనతో వేవ్ లెంగ్త్ బాగా కుదిరినట్లుంది? ఈ బేనర్లో సౌకర్యంగా ఉంటుంది. ఏదైనా సరే ఓపెన్గా చర్చించుకునే వీలుంటుంది. ఆనంద్ప్రసాద్గారు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవిల ప్లానింగ్ బాగుంటుంది. ‘నేను ఎవరితోనూ పెట్టుకోను. పెట్టుకుంటే ఆ పని తప్ప వేరే పని పెట్టుకోను...’ అని ఈ చిత్రంలో ఓ డైలాగ్ చెప్పారు. రియల్ లైఫ్లో కూడా అంతేనా? ఎవరైనా ఏదైనా కావాలని చేస్తే, మొహం మీద చెప్పేస్తా. సరదాగా జోక్స్ వేస్తే, వాటిని సీరియస్గా తీసుకోను. కావాలని చేస్తే డైలాగ్లో చెప్పినంత హార్ష్గా కాదు కానీ, నా స్టైల్లో నేనేంటో చూపిస్తా. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీస్ చేసిన మీరు ఈ మధ్య కామెడీకీ ఎక్కువ స్కోప్ ఉన్న యాక్షన్ మూవీస్ చేస్తున్నారేంటి? ప్రేక్షకులు ఏది ఆశిస్తున్నారో అది చేయడం బెటర్. ఇవాళ అందరూ హాయిగా నవ్వుకోవాలని థియేటర్కి వస్తున్నారు. అందుకే, ప్రతి సినిమాలోనూ దాదాపు కామెడీకే ఎక్కువ స్కోప్ ఇస్తున్నారు. నేను కూడా అలానే చేస్తున్నాను. కాకపోతే నా తరహా యాక్షన్ ఉండాలి కాబట్టి, ఫైట్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నాను. మరి మీ నుంచి అభిమానులు ఆశించే రిస్కీ ఫైట్స్ ‘సౌఖ్యం’లో ఉంటాయా? దర్శకుడు రవికుమార్ చౌదరి హీరో క్యారెక్టర్స్ను చాలా స్టైలిష్గా చూపిస్తాడు. మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉండేలా చూసుకుంటాడు. ఈ చిత్రంలో ప్రేక్షకులను థ్రిల్కి గురి చేసే ఫైట్స్ ఉన్నాయి. ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని లేదా? ఓ నటుడిగా ఉంటుంది. కానీ, నిర్మాతలనూ, బయ్యర్లను దృష్టిలో పెట్టుకుని అలాంటివి చేయడం లేదు. కమర్షియల్ సినిమా చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. నా సంతృప్తి కోసం రిస్కులు చేస్తే నిర్మాత రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇతరుల జీవితాలతో ఆడుకునే ప్రయోగాలు ఎందుకు? సొంతంగా సినిమా తీద్దామంటే నాకు ఇంట్రస్ట్ లేదు. మా నాన్నగారిలా డెరైక్షన్ చేయలేను. ఎందుకంటే ఆసక్తి లేదు. పర్సనల్ లైఫ్కి వస్తే... తండ్రయ్యాక అప్పటివరకూ లేని సెంటిమెంట్స్ హఠాత్తుగా వచ్చేస్తాయ్. అలవాట్లూ మారిపోతాయ్. మీలో వచ్చిన మార్పు? కొత్తగా వచ్చిన సెంటిమెంట్ ఏంటంటే... మనం చేసే మంచి మన కొడుకు జీవితానికి మంచి అవుతుందని ఆలోచిస్తున్నా. అంతకు ముందు ఎలా పడితే అలా ఉండేవాణ్ణి. ఇప్పుడు ఇంట్లో జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తోంది (నవ్వుతూ). ఎందుకంటే, పిల్లలకు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఊహ తెలిసి, బయటికెళ్లడం మొదలుపెట్టాక ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటారు. కానీ, క్రమశిక్షణ, ప్రవర్తన లాంటివన్నీ ఇంటి వాతావరణం నుంచే అలవాటవుతాయ్. అందుకే, జాగ్రత్తగా ఉండాలి. స్మోక్ చేసే అలవాటున్నవాళ్లు దాదాపు పిల్లల ముందు చేయరు... మీరు? సిగరెట్లు కాల్చను. సో.. నో ప్రాబ్లమ్. స్మోకింగ్ అనే కాదు... ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి పిల్లల ముందు ప్రదర్శించకపోవడం బెటర్. మీ అబ్బాయి విరాట్ కృష్ణ గురించి కొన్ని ముచట్లు? ఇప్పుడిప్పుడే మా అబ్బాయికి నడక వస్తోంది. ఈ మధ్య ఓ కారు బొమ్మ కొన్నాను. ఆ కారును నెట్టుకుంటూ వెళుతుంటే ముచ్చటగా ఉంది. మావాడు ఏం చేసినా నాకు ముచ్చటగానే ఉంటుంది. మీ అబ్బాయి కోసం మార్చుకున్న అలవాటు గురించి? కోపం వచ్చినప్పుడు వాయిస్ పెంచి మాట్లాడతాను. మా అబ్బాయి పుట్టాక కోపం తగ్గిపోయింది. మా అబ్బాయి ముందు గట్టిగా మాట్లాడను. అమ్మకూ, భార్యకూ సమానమైన ప్రేమ పంచకపోతే తేడా వచ్చేస్తుంది కదా! మీ అనుభవం ఏంటి? అమ్మ పెంచి, పెద్ద చేస్తుంది. భార్య మిగతా జీవితాన్ని పంచుకుంటుంది. సో... ఇద్దరూ ఇంపార్టెంటే. బేసిక్గా అర్థం చేసుకునే మనుషులు ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఆ విషయంలో మా అమ్మ, నా భార్య సూపర్. చాలా అర్థం చేసుకుంటారు. మీ అబ్బాయిని పెంచే క్రమంలో మీ అమ్మా, నాన్నల విలువ బాగా తెలుస్తోందా? చిన్నప్పుడు అమ్మా, నాన్న అన్ని విషయాలూ చెప్పి, పెంచినవన్నీ గుర్తొస్తుంటాయ్. పిల్లల జీవితం మీద తల్లిదండ్రులకు ఎన్ని కలలు ఉంటాయో తండ్రయ్యాక నాకు తెలుస్తోంది. అంతకు ముందు 50 శాతం తెలుసు. మా అబ్బాయి పుట్టాక 100 శాతం తెలుసుకున్నా. ఎలా పెంచాలి? ఎంత బాగా చదివించాలి? ఎంత మంచి జీవితం ఇవ్వాలి? అని మా అబ్బాయి గురించి ఆలోచిస్తుంటాను. లేడీస్ అంటే మీకు గౌరవం అనే అనిపిస్తుంది. మీ సినిమాల్లో హీరోయిన్లను అభ్యంతరకరంగా చూపించినప్పుడు అలా వద్దని చెబుతుంటారా? నీట్గానే చూపించమంటాను. అనవసర సన్నివేశాల్లో కూడా అభ్యంతర కరమైన దుస్తులు వేయించినప్పుడు ‘ఇది అవసరమా?’ అంటాను. కమర్షియల్కి అవసరమని దర్శక-నిర్మాతలు అన్నప్పుడు నేనేం చేయలేను! డైలాగ్స్లో కూడా ద్వంద్వార్థాలు వద్దనే అంటాను. నాకు తెలిసి హీరోయిన్లను గ్లామరస్గా చూపించినంత మాత్రాన టికెట్స్ తెగవు. లక్ష మంది ఆడియన్స్ లో హీరోయిన్స్ గ్లామర్ని చూడ్డానికి ఓ ఐదారు వేల మంది వస్తారేమో! - డి.జి. భవాని -
నన్ను కొత్తగా చూపించారు
- మనోజ్ ‘‘ప్రేమకథ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. ఫస్ట్ సిట్టింగ్లోనే ఈ కథ నాకు బాగా నచ్చేసింది. నా కెరీర్లోనే డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. ప్రతి ఫ్రేమ్లోనూ దర్శకుడు దశరథ్ నన్ను కొత్తగా చూపించారు’’ అని మంచు మనోజ్ చెప్పారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో మనోజ్, రెజీనా జంటగా మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ‘శౌర్య’ చిత్రం మోషన్ పోస్టర్ను హీరో మనోజ్ సతీమణి ప్రణతి ఇటీవల హైదరాబాద్లో ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘త్వరలో చిత్రీకరణ పూర్తవుతుంది. తనకు నచ్చిన అమ్మాయి ప్రేమ కోసం హీరో ఎలా పోరాడాడన్నది చాలా ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాం’’ అని చెప్పారు. ఈ వేడుకలో కథా నాయిక రెజీనా, సంగీత దర్శకుడు వేదా, నటుడు నందు తదితరులు పాల్గొన్నారు. -
రెజీనా ప్రేమలో పడిందా?
ప్రేమ ఒక మోహం. యుక్త వయసులో దాని నుంచి తప్పించుకోవడం కొంచెం కష్టమైన విషయమే. ఇక సినీతారల విషయానికోస్తే చాలా మంది ప్రేమలో పలు మార్లు పడుతుంటారు. ఇందుకు నటి రెజీనా మినహాయింపు కాదు. ఈ బ్యూటీ కోలీవుడ్లో కేడీబిల్లా కిలాడీ రంగా, రాజతందిరం చిత్రాల్లో నటించింది. ఆ చిత్రాలు మంచి విజయాన్నే పొందాయి. అయినా రెజీనాకు ఇక్కడ అవకాశాలు రాలేదు. గ్లామర్ విషయంలో ఈ అమ్మడు మడి కట్టుకు కూర్చోవడమే అందుకు కారణం అనే వాళ్లు లేక పోలేదు. ఆ తరువాత అందాలారబొతకు గేట్లు ఎత్తివేసినట్లు స్టేట్మెంట్స్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో రెజీనా టాలీవుడ్లో మకాం పెట్టింది. అక్కడ కూడా మొదట్లో అన్నీ లంగా ఓణి పాత్రలే వస్తున్నాయని వాపోయినా తాజాగా అవకాశాలు బాగానే వస్తున్నాయి. కోలీవుడ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్లో గ్లామర్ విషయంలో సరిహద్దులు దాటేస్తున్న రెజీనా ఇప్పుడు ప్రేమలో పడినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ అమ్మడు ఒక తెలుగు యువ నటుడితో ప్రేమ సాగరంలో తేలిపోతోందని,ఆయన ఈ అమ్మడికి చిత్రాలు సిఫార్సు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఆమె సన్నిహితులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. రెజీనాకు ఇప్పటికే విక్రమ్ మీనన్ అనే బాయ్ఫ్రెండ్ ఉన్నారనీ, ఇటీవల కాస్త విరామం లభించడంతో అతనితో కలిసి అమ్మడు థాయ్ల్యాండ్ చుట్టొచ్చిందని వారు అంటున్నారు. ఇక నిజం ఏమిటన్నది ఆ పైవాడికే తెలియాలి. -
ఒంగోలులో ‘సౌఖ్యం’ ఆడియో వేడుక
-
నేను హీరో కావడానికి ఆ నలుగురూ కారణం - - గోపీచంద్
‘‘మిమ్మల్ని చూస్తుంటే మా ఇంటికొచ్చిన ఫీలింగ్. ఒంగోలులో ఫంక్షన్ పెట్టినందకు ఆనంద్ప్రసాద్కి థ్యాంక్స్. భవ్య క్రియేషన్స్లో ఫ్రీడమ్ ఉంటుంది. నేను హీరో కావడానికి ముత్యాల సుబ్బయ్య, ఎం. నాగేశ్వరరావు, చప్పిడి హనుమంతరావు, తిరుపతిరావు... ఈ నలుగురూ కారణం’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్, రెజీనా జంటగా ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సౌఖ్యం’. ఈ చిత్రం ఆడియో వేడుక ఆదివారం రాత్రి ఒంగోలులో జరిగింది. అనూప్ రూబెన్స్ స్వరపరచిన పాటలను గోపీచంద్ ఆవిష్కరించి ఒంగోలు ఎమ్మెల్యే జనార్థన్కు ఇచ్చారు. గోపీచంద్ మాట్లాడుతూ - ‘‘పదకొండేళ్ల తర్వాత రవికుమార్తో చేసిన సినిమా ఇది. అనూప్ మంచి పాటలిచ్చారు. శ్రీధర్ సీపాన మంచి కథ ఇచ్చారు. కోన వెంకట్, గోపీ మోహన్ స్క్రీన్ప్లే విషయంలో చాలా హెల్ప్ చేశారు. అన్నే రవి నా బ్రదర్ లాంటివాడు. ఇద్దరం కలసి సినిమాలు డిస్కస్ చేసుకుంటుంటాం. ఒంగోలు ఎమ్మెల్యే జనార్ధన్, నేను క్లాస్మేట్స్. మా నాన్నగారు రూపొందించిన ‘నేటి భారతం’ వంద రోజుల వేడుక ఒంగోలులో జరిగినప్పుడు ఓ ఆడియన్గా ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడిలా అందర్నీ కలవడం ఆనందంగా ఉంది’’ అంటూ అభిమానుల కోరిక మేరకు ‘నేను కౌంట్ చేయడం అంటూ మొదలు పెడితే నువ్వు రీ కౌంట్ చేసుకోవడానికి నీ వైపు నుంచి ఒక్కడుండడు’ అని డైలాగ్ చెప్పారు. ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘మామూలుగా సినిమా ఫంక్షన్స్ అన్నీ ఏసీ హాళ్లలో జరుగుతుంటాయి. కానీ, ప్రేక్షకుల సమక్షంలో జరుపుకోవాలనుకుంటాను. ‘లౌక్యం’ని విజయవాడలో చేశాం. ‘సౌఖ్యం’ కోసం ఒంగోలు వచ్చాం. గోపీచంద్తో మా అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘చదువు చెప్పింది గుంటూరు జిల్లా. బతుకు ఇచ్చింది ఒంగోలు. దర్శకునిగా మొదటి బ్రేక్ ‘యజ్ఞం’తో వచ్చింది. ఆ చిత్రనిర్మాత బాబూరావుగారిది ఒంగోలు. ఇప్పుడీ చిత్రానికి అవకాశం ఇచ్చిన ఆనంద్ప్రసాద్కు ధన్యవాదాలు’’ అని దర్శకుడు చెప్పారు. రెజీనా పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆమెతో కేక్ కట్ చేయించి, చిత్రబృందం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావుతో పాటు ఆర్. నారాయణమూర్తి, గిరిబాబు, రఘుబాబు, గౌతంరాజు, అనూప్ రూబెన్స్ తదితర చిత్రరంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
కేడీతో లేడీ
సక్సెస్ఫుల్ డెరైక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది, ఘన విజయం సాధించిన చిత్రం ‘కేడీ బిల్లా - కిలాడీ రంగా’. విమల్, శివకార్తికేయన్, రెజీనా, బిందుమాధవి ఇందులో హీరో హీరోయిన్లు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ అదే పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. సమర్పకుడు రాజ్ కందుకూరి మాట్లాడుతూ -‘‘నా అభిమాన నిర్మాతల్లో తుమ్మలపల్లి ఒకరు. ఆయనతో అసోసియేటవ్వాలని చాలా రోజులుగా అనుకున్నా. ఇప్పటికి కుదిరింది’’ అన్నారు. ‘‘రెజీనా, బిందుమాధవిల అందాలు, యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. త్వరలోనే పాటలు విడుదల చేస్తాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.సత్యనారాయణ. -
అప్పుడు రకుల్... ఇప్పుడు రెజీనా
యూత్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ల జాబితాలో రెజీనా ముందు వరుసలో నిలుస్తారు. ‘ఎస్.ఎమ్.ఎస్’తో మొదలైన ఆమె సినీ ప్రయాణం ఇప్పటివరకూ ఎక్కడా బ్రేకుల్లేకుండానే సాగుతోంది. అయినా ఇంత వరకూ ఆమె ఊహించనంత మలుపు రాలేదు. అందుకే ఆమె ‘సౌఖ్యం’ సినిమా మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే హీరోయిన్ల విషయంలో హీరో గోపీచంద్ది లక్కీహ్యాండ్ అనే చెప్పాలి. అతని సరసన నటించిన చాలా మంది హీరోయిన్లు టాప్ స్లాట్లోకి దూసుకె ళ్లారు. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ రకుల్ ప్రీత్ సింగ్. ‘లౌక్యం’లో గోపీచంద్తో రొమాన్స్ చేసిన రకుల్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. రకుల్కి ‘లౌక్యం’ లానే తనకు ‘సౌఖ్యం’ టర్నింగ్ పాయింట్ అవుతుందనే ఆశాభావంలో ఉన్నారు రెజీనా. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ప్రసాద్ నిర్మిస్తున్న ‘సౌఖ్యం’ చిత్రానికి ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకుడు. డిసెంబరు 13న ఒంగోలులో భారీ ఎత్తున పాటల వేడుక చేయనున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘చీకటి రాజ్యం’ మెరుపు తీగెలు
అందాల తారలు రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్లు గురువారం నగరంలో సందడి చేశారు. కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన ‘చీకటి రాజ్యం’ ప్రీమియర్ షోను తిలకించేందుకు ఐమ్యాక్స్కు వీరు వచ్చారు. -
సౌఖ్యం
నలుగురూ బాగుండాలని కోరుకునే మంచి మనసు అతనిది. వాళ్ల సౌఖ్యం కోసం ఏమైనా చేయడానికి వెనకాడడు. బేసిక్గా అతను చాలా డైనమిక్. ఆత్మీయుల క్షేమం కోసం ఎలాంటివాళ్లనయినా ఢీ కొనడానికి రెడీ అవుతాడు. వాళ్ల ఆనందం కోసం కామెడీ చేయడానికి కూడా వెనకాడడు. ఇలా యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయిన కథాంశంతో గోపీచంద్, రెజీనా జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సౌఖ్యం’. ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయ్యింది. యూత్, ఫ్యామిలీస్ చూసే విధంగా ఈ చిత్రం ఉంటుందని దర్శక-నిర్మాతలు తెలిపారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘సౌఖ్యం’ న్యూ స్టిల్స్
-
ఓనా సిండ్రెల్లా... ముద్దొచ్చే ఏంజెల్లా...!
ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండటం ప్రెజెంట్ ట్రెండ్. కానీ, ఆ యువకుడు మాత్రం డిఫరెంట్. నలుగురి సౌఖ్యం కోరుకునే వ్యక్తి. ఆత్మీయుల పెదాలపై చిరునవ్వు చూడటానికి... ఎంటర్టైన్ చేయడానికైనా, యాక్షన్ చేయడానికైనా రెడీ అంటాడు. నలుగురి మంచి కోరుకునే వ్యక్తిగా గోపీచంద్, ఆయన సరసన రెజీనా కథానాయికగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సౌఖ్యం’. ఆనందప్రసాద్ మాట్లాడుతూ- ‘‘ఇటీవల స్విట్జర్లాండ్లో ‘ఓనా సిండ్రెల్లా... ముద్దొచ్చే ఏంజెల్లా...’, ‘నాకేం తోచదే నాకేం తోచదే...’, ‘ఆ ఇవ్వమ్మ ఇవ్వమ్మ హని హని స్వీటీ స్వీటీ..’ అనే మూడు పాటలను చిత్రీకరించాం. మిగతా రెండు పాటలను ఈ నెలాఖరులోపు చిత్రీకరిస్తాం. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ‘‘ ‘యజ్ఞం’ తర్వాత మళ్లీ పదేళ్లకు గోపీచంద్తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. గోపీచంద్, రెజీనా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్ప్లే: కోన వెంకట్, గోపీమోహన్. -
సౌఖ్యం కోసం!
నలుగురి సౌఖ్యం కోసం ఆలోచించే మంచి మనసున్న వ్యక్తి అతను. ఇతరుల ఆనందం కోసం ఏం చేయడానికైనా వెనకాడడు. అతను యాక్షన్ చేశాడా? ఎంటర్టైన్ మెంట్ వేలో వెళ్లాడా? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. గోపీచంద్, రెజీనా జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సౌఖ్యం’ టైటిల్ను ఖరారు చేశారు. ఆనందప్రసాద్ మాట్లాడుతూ- ‘‘మనుషుల మధ్య అనుబంధాలను స్పృశించే సినిమా ఇది. రవికుమార్-గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన ‘యజ్ఞం’ ఎంత మంచి హిట్ అయిందో తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను చేరుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది. టాకీ పూర్తయ్యింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 7 వరకు విదేశాల్లో మూడు పాటల చిత్రీకరిస్తాం. ఆ తర్వాత హైదరాబాద్లో రెండు పాటలను చిత్రీకరిస్తాం. డిసెంబర్ 25న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘పదేళ్ల తర్వాత గోపీచంద్తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. గోపీచంద్, రెజీనా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
హద్దులు దాటడానికి రెడీ!
ఇంటర్వ్యూ రెజీనా అంటే గ్లామర్. రెజీనా అంటే ఎగ్జయిట్మెంట్. రెజీనా అంటే ఎనర్జీ. రెజీనా అంటే బోల్డ్నెస్. ‘నాలో భిన్న కోణాలను ఆవిష్కరించే అవకాశం వచ్చినప్పుడు హద్దులు దాటడానికీ వెనుకాడను’ అంటోన్న ఈ అమ్మడు చెబుతోన్న మరిన్ని కబుర్లు చదివి ఎంజాయ్ చేయండి! * మీ బ్యాగ్రౌండ్..? నాది తమిళనాడు, నా మాతృభాష తమిళం. నిజానికి నన్ను ఎవరైనా ఏ ప్రాంతం వారు అని అడిగితే చెప్పడానికి కన్ఫ్యూజ్ అవుతాను. ఎందుకంటే అమ్మది కర్ణాటక, నాన్న నార్త్ ఇండియన్, నానమ్మ గోవాకి చెందిన ఆంగ్లో ఇండియన్, తాతయ్య అయ్యంగార్ ఫ్యామిలీలో పుట్టి క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారు. దాంతో నాది ఏ ప్రాంతం, ఏ భాష అంటే ఠక్కున చెప్పలేక ఇబ్బంది పడుతుంటా. * కానీ తెలుగు బాగా మాట్లాడుతున్నారే? ఆ క్రెడిట్ మారుతి గారిదని చెప్పాలి. ‘ఎస్మెమ్మెస్’ చిత్రం చేస్తున్నప్పుడు ఆయన నాకు డైలాగ్ డెలివరీ విషయంలో చాలా సహాయం చేశారు. ఏది ఎలా పలకాలో, ఇన్వాల్వ్ అయ్యి ఎక్స్ప్రెషన్తో డైలాగ్ ఎలా చెప్పాలో నేర్పించారు. అప్పట్నుంచీ అదే ఫాలో అయ్యాను. అందుకే చాలా త్వరగా తెలుగు వచ్చేసింది నాకు. * అసలు తెర మీదికి ఎలా...? స్కూల్లో ఉన్నప్పుడే దూరదర్శన్లో ఒక పిల్లల ప్రోగ్రామ్కి హోస్ట్గా చేశాను. మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. చాలా షార్ట ఫిల్మ్స్ కూడా చేశాను. తర్వాత ‘కండ నాళ్ ముదల్’ అనే తమిళ చిత్రంలో నటించే చాన్స్ వచ్చింది. అప్పటికి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. * అంత చిన్న వయసులో నటన... కష్టమనిపించలేదా? నేను చాలా యాక్టివ్. ఓపక్క చదువు, మరోపక్క భరతనాట్యం, మోడలింగ్, టీవీ షోలు, సినిమాలు... ఎప్పుడూ బిజీ బిజీ. అమ్మ అనేది... ‘నువ్వు మన ఫ్యామిలీలో మొదటి యాక్టర్వి. కానీ డిగ్రీ లేని మొదటి వ్యక్తివి కాకూడదు’ అని. దాంతో చదువు మీదా శ్రద్ధ చూపేదాన్ని. * తమిళంతో మొదలెట్టారు. కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లోనూ చేస్తున్నారు. మీ ప్రయారిటీ ఏది? నా ప్రయారిటీ సినిమా, భాష కాదు. తమిళ సినిమా నన్ను నటిని చేసింది. తెలుగు సినిమా నన్ను ఇంతదాన్ని చేసింది. మిగతా భాషల చిత్రాలూ నన్ను నిలబెడుతున్నాయి. అలాంటప్పుడు ఒక్క దానికే ప్రాధా న్యత ఎలా ఇస్తాను! * మిమ్మల్ని ఇలియానాతో పోలుస్తుంటారు. అప్పుడేమనిపిస్తుంది? తను చాలా అందంగా ఉంటుంది. మంచి నటిగా నిరూపించు కుంది. తనతో పోల్చడం కాంప్లిమెంటేగా! * రొమాంటిక్ సీన్లు, లిప్లాక్స్ ఓకేనా? సన్నివేశం డిమాండ్ చేసిందని ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో లిప్లాక్ చేశాను. భవిష్యత్తులో లిప్లాకుల పరంగా ట్రెండ్ సృష్టిస్తానేమో ఎవరికి తెలుసు! నేను ఆర్టిస్టుని. నాలో భిన్నకోణాలను ఆవిష్కరించే అవకాశం వచ్చినప్పుడు హద్దులు దాటడానికీ వెనుకాడను. * శాకాహారాన్ని ప్రోత్సహిస్తున్నారు... మీరు మొదట్నుంచీ వెజిటేరియనా? లేదు. చికెన్ నా ఫేవరేట్. మా అమ్మ చేసే రోస్టెడ్ బీఫ్ని కూడా ఇష్టంగా తినే దాన్ని. షాపుకెళ్లి మాంసం కొనుక్కొచ్చే దాన్ని కూడా. కానీ ఓ రోజు ‘పెటా’ వాళ్లు రాసిన ఓ ఆర్టికల్ చదివి ఏడుపొచ్చేసింది. వెంటనే అమ్మ దగ్గరికెళ్లి... ‘నేను వెజిటేరి యన్గా మారుతున్నాను’ అన్నాను. అంతే... ఆ తర్వాత నాన్వెజ్ ముట్టలేదు. * మరి ఇప్పుడు మీ ఫేవరేట్ పుడ్...? పన్నీర్ ఐటెమ్స్ ఇష్టంగా తింటాను. కాఫీ, చాకొలెట్స్ చాలా చాలా ఇష్టం. * ఫ్రీ టైమ్లో ఏం చేస్తుంటారు? సైక్లింగ్, వాటర్ ర్యాఫ్టింగ్, అవుట్డోర్ టూర్స్ వెళ్లడం, కొత్త స్నేహాలు చేసుకో వడం ఇష్టం. అలాగే రొమాంటిక్ నవలలంటే చాలా ఇష్టం. కొత్త రచయితలు రాసేవీ వదలను. ఇప్పటికి ఓ మూడొందలైనా చదివి ఉంటాను. * మీరు చాలా రొమాంటిక్ అన్నమాట... మరి ఎవరినైనా? లేదు. నా లైఫ్లో ఎవ్వరూ లేరు. ఉన్నారని ఎవరైనా చెప్పినా నమ్మకండి. కళ్లతో చూసినదాన్ని తప్ప, చెవులతో విన్నదాన్ని ఎప్పుడూ నమ్మకూడదు. * కానీ ఫాలోయింగ్ ఎక్కువే ఉండి ఉంటుందిగా..! ఉంది. కానీ ఎవరూ హద్దు దాటరు. నేను చాలా కాన్ఫిడెంట్, డేరింగ్. నా సంగతి తెలిస్తే ఎవ్వరూ నా జోలికి రారు. -
సుబ్రమణ్యం సోల్డ్!
కొత్త సినిమా గురూ! చిత్రం: సుబ్రమణ్యం ఫర్ సేల్ పాటలు: భువనచంద్ర, చంద్రబోస్, వనమాలి, భాస్కరభట్ల సంగీతం: మిక్కీ జె. మేయర్ కెమెరా: సి. రామ్ప్రసాద్ ఎడిటింగ్: గౌతంరాజు స్క్రీన్ప్లే: రమేశ్రెడ్డి, సతీశ్ వేగేశ్న, తోట ప్రసాద్ ప్రొడక్షన్ డిజైనర్: హర్షిత్ సహ నిర్మాతలు: శిరీష్ - లక్ష్మణ్ నిర్మాత: ‘దిల్’ రాజు కథ-మాటలు-దర్శకత్వం: హరీష్శంకర్ నిడివి: 154 నిమిషాలు బడ్జెట్: రూ.14 కోట్ల పైగా బిజినెస్: 20 కోట్ల పైగా (కొన్ని ఏరియాలు నిర్మాతవే) శాటిలైట్: 3.75 కోట్లు టేబుల్ ప్రాఫిట్! అమ్మకానికి చాలా వస్తువులుంటాయి. దాదాపు అన్నీ డిస్కౌంట్ మీదే దొరుకుతాయి. కాంపిటీషన్ పెరిగేకొద్దీ డిస్కౌంట్ పెరుగుతుంది.కుర్ర హీరోల్లో కాంపిటీషన్ భేషుగ్గా ఉంది.అయినా, సుబ్రమణ్యం సేల్ వితౌట్ డిస్కౌంట్ నడుస్తోంది. మేనమామల పోలికని కొందరు... మెగాస్టార్ మూవ్మెంట్లని ఇంకొందరు... బాక్సాఫీస్కి బాగా పనికొస్తాడని అందరూ... మూడో సినిమాకు మూడ్ సెట్టయింది! శుక్రవారం కంటే ముందే సాయిధరమ్ తేజ్ సోల్డ్!! సినీ ప్రపంచంలో కథలు పది పన్నెండే అన్నది ఒక సూత్రీకరణ. ‘కొత్త కథలంటూ ఉండవు. ఒక పాయింట్ తీసుకొని పాత కథనే కొత్తగా చెప్పాల’న్నది సినీజనం నమ్మే బాక్సాఫీస్ సూత్రం. ఈ రెంటినీ అర్థం చేసుకోవడమే కాక, ఇప్పటి ట్రెండ్లో ఎంటర్టైనింగ్గా సినిమా తీయాలని చేసిన ప్రయత్నం - ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ఎవడీ సుబ్రమణ్యం? ఏమా కథ? తల్లీతండ్రీ లేని పిల్ల సీత (రెజీనా). పెదనాన్న, బాబాయ్ల ప్రేమతో పెరుగుతుంది. ఫేస్బుక్లో మూడేళ్ళుగా చాటింగ్ చేస్తున్న అమెరికా అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఇంట్లోవాళ్ళు ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారంటూ, అతనితో పెళ్ళి, అమెరికాలో చదువంటూ పారిపోతుంది. ఇక, అమెరికాలో సుబ్రమణ్యం (సాయిధరమ్తేజ్)ది వేరే కథ. ప్రతి క్షణాన్నీ డాలర్గా మార్చాలని రకరకాల జాబ్స్ చేస్తుంటాడు. అమెరికాలో హీరో, హీరోయిన్లిద్దరూ తారసపడతారు. ఆమెను అమెరికా రప్పించిన ప్రేమికుడు మోసగాడన్న విషయం తెలిశాక, హీరో ఆమెను కాపాడతాడు. అలా దగ్గరైన వాళ్ళిద్దరూ డబ్బు కోసం ఒక చోట భార్యాభర్తలుగా నటించి, ‘బెస్ట్ కపుల్’ ప్రైజ్ కూడా కొట్టేస్తారు. కజిన్ సిస్టర్ పెళ్ళికని హీరోయిన్, సవతి చెల్లి పెళ్ళికని హీరో ఇండియాకొస్తారు. హీరోయిన్ వెంట వాళ్ళింటికి హీరో కూడా వెళతాడు. అక్కడ వారిద్దరినీ అందరూ భార్యాభర్తలనుకుంటారు. వీళ్ళు కూడా తప్పనిసరై, అదే నాటకం ఆడతారు. మరోపక్క హీరోను చూసి ‘సుబ్రమణ్యం తిరిగొచ్చాడు’ అంటూ కొందరు విలన్లు వెంట పడతారు. విలన్ చెల్లితో పెళ్ళికి ఒప్పుకొని, తీరా అనుకోని పరిస్థితుల్లో హీరో అమెరికా పారిపోయాడన్నది ఫ్లాష్బ్యాక్. హీరో వారి నుంచి ఎలా బయటపడ్డాడు? హీరోయిన్, హీరోల పెళ్ళి ఎలా అయిందన్నది మిగతా కథ. బోలెడన్ని సీన్లు... పాత్రలు... మూడు పాటలు, ఆరు సీన్లుగా సినిమా ఫస్టాఫ్ సుదీర్ఘంగా నడిచినట్లనిపించినా, సెకండాఫ్ వినోదం ఎక్కువ పంచుతుంది. ఈ సినిమాలో లేనిది లేదు. కోట శ్రీనివాసరావు, జీవా, సప్తగిరి, ‘ప్రభాస్’ శీను - ఇలా ప్రముఖులు చేసిన ఒకటి, రెండు సీన్ల పాత్రలున్నాయి. ఒకటికి నాలుగు పెళ్ళి సీన్లున్నాయి. పీటల మీద పెళ్ళిళ్ళు ఆఖరు క్షణంలో ఆగిపోవడాలున్నాయి. ఒకరిని ప్రేమిస్తూ, వేరొకరితో పెళ్ళికి సిద్ధపడడమనే త్యాగాలుంటాయి. పెళ్ళి కాని వ్యక్తులు పెళ్ళయినంత ఫీలింగిచ్చే చీటింగ్ డ్రామా ఉంది. ఒకరికి ముగ్గురు విలన్లుంటారు. ‘చంటిపిల్ల తప్పిపోతే వెతుక్కోవాలి. ఎదిగినపిల్ల పారిపోతే మర్చిపోవాలి’ లాంటి జీవితసూత్రాలు ఒకదాని వెంట మరొకటొచ్చి పడిపోతుంటాయి. ఎప్పటికప్పుడు మనసు మార్చుకొని మాట మార్చే పాత్రలుంటాయి. ఇలా చాలా ఐటమ్సున్నాయి. హుషారైన నటన... ఉత్సాహంగా డ్యాన్సులు... మొదలైంది మొదటైనా, రిలీజ్లో రెండోదిగా మారిన ‘రేయ్’ చిత్రం నుంచే ‘సుప్రీమ్ హీరో’ బిరుదాంకితుడైన నటుడు సాయిధరమ్ తేజ్. ముచ్చటైన ఈ మూడో సినిమాలోనూ హీరోయిజమ్పై డిపెండయ్యారు. రూపురేఖల్లోనే కాదు, హావభావాల్లోనూ తన ‘మెగా’ మేన మామల నుంచి ఈ కొత్త హీరో చాలానే పుణికిపుచ్చుకున్నారు. తెరపై అది తరచూ తొంగిచూస్తుంటుంది. సన్నివేశాల్లో హుషారుగా, డ్యాన్సుల్లో ఎనర్జిటిక్గా చేశారు. ‘సీత... సీత ఇక్కడ... అంత ఈజీ కాదు...’ అనే కథానాయిక పాత్రలో రెజీనా అందంగా ఉంది. ఆ పాత్ర రూపకల్పనతో పోలిస్తే ఆమె ఆకర్షణే సినిమా అంతటా కొంత నిలకడైన విషయం. రావు రమేశ్ విలక్షణ మాట తీరుతో విలనిజమ్ చూపారు. మరో విలన్కి చెల్లెలుగా నటి ఆదా శర్మ ఇంట్లో ఏసీ రిపేరింగ్కు వచ్చే మెకానిక్తో లవ్లో పడే పాత్రలో కనిపిస్తారు. చంచల స్వభావమున్న ఈ చిన్న పాత్ర ఆమె కెరీర్ కన్నా కథకే కీలకం. విదేశాల్లో స్థిరపడ్డ ఒకప్పటి విలన్ ప్రదీప్శక్తి రెస్టారెంట్ ఓనర్గా చాలాకాలానికి కనిపించారు. సెకండాఫ్లో... కామెడీ రిలీఫ్ పెళ్ళి, మొగుడుకు సంబంధించి సాగే ఈ కన్ఫ్యూజన్ డ్రామాలో రిలీఫ్ - బ్రహ్మానందం పోషించిన చింతకాయ్ పాత్ర. వంట రాకపోయినా చేయి తిరిగిన వంటవాడిలా బిల్డప్ ఇస్తూ, అమెరికాకు వచ్చే ఆ పాత్రలో బ్రహ్మానందం నటన, అతని అంతరాత్మ చేసే విన్యాసం నవ్విస్తాయి. రౌడీ గ్యాంగ్ ‘ఫిష్’ వెంకట్ బృందం చేసే చేష్టలు వినోదం పంచుతాయి. ఈ చిత్రంలో ‘జమ్.. పంకజమ్.. మిఠాయి పంకజమ్’ (ఓనర్ భార్య-బ్రహ్మానందం ట్రాక్), ‘మొహం మొగ్గలా ఉండడం’, లైంగిక చర్యను సంకేతిస్తూ ‘కారులో యోగా’ లాంటి డైలాగుల్ని వినిపిస్తారు. ‘(శోభనంగదిలో) నువ్వు అరిస్తే మంచి మేటరున్న మొగుడు దొరికాడనుకుంటారు’ అని హీరోయిన్ గురించి హీరోతో అనిపిస్తారు. కొత్తగా రేకెత్తే... పాత జ్ఞాపకాలు సాంకేతిక విభాగాల్లో - ఛేజింగుల్లో కెమేరా వర్క్, టాప్ యాంగిల్ షాట్స్, హైవే ఫైట్ (ఫైట్ మాస్టర్ రామ్ - లక్ష్మణ్) లాంటివి ప్రత్యేకించి గుర్తుంటాయి. హీరో ఒక్కడికే కాక చాలా భాగం సీన్లకీ బోలెడంత బిల్డప్ ఇచ్చిన వైనం సినిమాలో కనిపిస్తుంది. కానీ, బ్రహ్మాండం బద్దలవుతుందనుకొనే ప్రతి సీనూ, బద్దలు చేస్తుందనుకున్న ప్రతి పాత్రా మళ్ళీ మామూలుగా మారిపోతూ, ప్రేక్షకుల ఊహకందకుండా తిరుగుతాయి. ఒక రకంగా ఇది ప్లస్సే అయినా, మోసపోయాననే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగితేనే చిక్కు. ఇక, చివరకొచ్చేసరికి ఉడికీ ఉడకని సెంటిమెంట్, సగటు సీరియల్ తరహా క్లైమాక్స్ ఎదురవుతాయి. మొత్తానికి, దర్శకుడు చెప్పినట్లే, ఈ సినిమా గతంలో వచ్చిన అనేక చిత్రాల ప్యాట్రన్లో నడిచే కలగూర గంప. ‘మొగుడు కావాలి’, ‘బావగారూ బాగున్నారా’ నుంచి ఎన్టీయార్ ‘బృందావనం’ దాకా చాలా సిన్మాలు, సీన్లు గుర్తొస్తాయి. ‘గువ్వా గోరింకతో...’ రీమిక్స్ కొన్నేళ్ళ వెనక్కి తీసుకువెళుతుంది. వెరసి, పాత వెండితెర జ్ఞాపకాలనే కొత్తగా అమెరికా బ్యాక్డ్రాప్తో కళ్ళ ముందుకు తెచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్ - ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. - రెంటాల జయదేవ సేల్ వెనక... కథ! ‘మిరపకాయ్’ టైవ్ులోనే హరీశ్ రాసుకున్న కథ ఇది. కొందరు బ్యాంకాక్, సింగపూర్ నేపథ్యాల్లో తీద్దామన్నా, అమెరికా బ్యాక్డ్రాపే కావాలని ఆ ఆఫర్లు వద్దనేశారు. ఈ సినిమాకు పట్టిన షూటింగ్ డేస్ 90. అందులో 40 రోజులు అమెరికాలోని న్యూయార్క, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, గ్రాండ్ కానియన్ల దగ్గరే షూటింగ్. మొదట పూజాహెగ్డే హీరోయిన్. తీరా ఆమెకు హృతిక్రోషన్ ‘మొహంజొదారో’లో భారీ ఛాన్సొచ్చింది. దాంతో ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పి, రెజీనాను తీసుకున్నారు. ‘ఖైదీ నంబర్ 786’లో ఎస్పీబీ, జానకి పాడిన భువనచంద్ర రచన ‘గువ్వా గోరింకతో’ ఈసారి మనో, రమ్య పాడారు. సినిమాకు మ్యూజిక్కిచ్చింది మిక్కీ జె. మేయర్. అయితే, ఒకప్పటి ఈ రాజ్-కోటి హిట్ ట్యూన్ను రీమిక్స్ చేసింది ‘కృష్ణాష్టమి’ మ్యూజిక్ డెరైక్టర్ దినేష్. గ్రాండ్ కానియన్ దగ్గర టూరిస్ట్ స్పాటైన స్కైవాక్పై రెండు రోజులు ఉదయం 5 నుంచి 7 వరకు ఈ పాట తీశారు. -
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీ స్టిల్స్
-
తమిళ తెరపై జోరు చూపిస్తున్నాడు
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు కమిట్ అయ్యాడు. సపోర్టింగ్ రోల్లో ఎంట్రీ ఇచ్చి, తరువాత హీరోగా మారిన సందీప్ ఎక్కువగా లవ్ స్టోరిలనే చేస్తూ వచ్చాడు. టైగర్ సినిమాతో యాక్షన్ జానర్ ట్రై చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో టాలీవుడ్లో కాస్త స్లో అయ్యాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు సందీప్ కిషన్. ఇప్పటికే తమిళ్లో రెజీనాతో కలిసి ఓ కామెడీ థ్రిల్లర్ని కంప్లీట్ చేశాడు సందీప్ కిషన్.. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఇప్పుడు మరో ద్విభాషా చిత్రానికి కమిట్ అయ్యాడు. సూదుకవ్వం, తెగడి లాంటి సూపర్ హిట్స్ను నిర్మించిన సివి కుమార్ తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్న సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను కుమార్తో పాటు స్టూడియో గ్రీన్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. సందీప్కిషన్ జోరు చూస్తుంటే తమిళ్ ఇండస్ట్రీలోనే హీరోగా సెటిల్ అయ్యేలా ఉన్నాడు. -
సుబ్రమణ్యం ఫర్ సేల్
సుబ్రమణ్యాన్ని అమ్మకానికి పెట్టారట! సుబ్రమణ్యం అంటే కత్తి లాంటి కుర్రాడు. తిమ్మిని బమ్మిని చేయగల తెలివైనోడు. అలాంటివాణ్ణి ఎందుకు సేల్కు పెట్టారో తెలియాలంటే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. చురుకైన, పదునైన హీరోయిజాన్ని ఎంటర్టైనింగ్ వేలో ప్రెజెంట్ చేయడంలో హరీశ్శంకర్ స్పెషలిస్టు. ఇక కథను కరెక్టుగా జడ్జ్ చేసే కెపాసిటీ ఉన్న నిర్మాత ‘దిల్’ రాజు ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ నెలాఖరున విడుదల కానున్న ఈ చిత్రం మీద సాయిధరమ్తేజ్, రెజీనా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. -
ఎంత సపోర్ట్ ఉందన్నది కాదు... ఎంత కష్టపడ్డామన్నదే ముఖ్యం - చిరంజీవి
‘‘ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా టైటిల్ వినగానే నా సినిమాలు ‘దొంగ మొగుడు’, ‘బావగారూ బాగున్నారా’ సినిమాలు గుర్తుకువచ్చాయి’’ అని చిరంజీవి అన్నారు. సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’రాజు నిర్మించిన చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. శిరీష్, లక్ష్మణ్ సహ నిర్మాతలు. మిక్కీ జె. మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో చిరంజీవి విడుదల చేశారు. ఈ సంద ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ -‘‘ప్రతి శాఖలోనూ గ్రిప్ను సంపాదించి మంచి నిర్మాతగా కొనసాగుతున్న ‘దిల్’రాజు, అలాగే ‘గబ్బర్సింగ్’ సినిమాను ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించిన హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్ని ఫ్రేముల్లోనూ తేజు చాలా కష్టపడ్డాడని అందరూ అంటూంటే చాలా ఆనందం వేసింది. ఎంత సపోర్ట్ ఉందన్నది కాదు... ఎంత కష్టపడ్డామన్నదే ముఖ్యం అని ఎప్పుడూ చెబుతూ ఉంటా’’ అని అన్నారు. ‘‘మెగాస్టార్ అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా కష్టపడతాను’’ అని సాయిధరమ్ తేజ్ చెప్పారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘మా బ్యానర్ను మొదలు పెట్టి 14 ఏళ్లయింది. ‘పిల్లా నువు లేని జీవితం’ సినిమాకు ముందే సాయిధరమ్ తేజ్ను ఈ సినిమాలో హీరోగా అనుకున్నాం. సాయిధరమ్ తేజ్ నాలుగో సినిమాకే పవన్కల్యాణ్ రేంజ్కు వెళ్లిపోతారు. వచ్చే నెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు రావు రమేష్, దర్శకులు రవికుమార్ చౌదరి, అనిల్ రావిపూడి, ‘పవర్’ బాబి, గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. -
హీరోయిన్పై హరీశ్ పొగడ్తల వర్షం
హీరోయిన్ రెజీనాపై దర్శకుడు హరీష్ శంకర్ పొడగ్తల వర్షం కురిపించాడు. రెజీనాలో టాలెంట్ ఉందని, అనతి కాలంలోనే అగ్ర నటిగా పేరు తెచ్చుకుంటోందని హరీష్ ప్రశంసించాడు. 'పవర్' సినిమాలో ఆమె నటన తనకు చాలా ఇష్టమని తెలిపాడు. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రంలో సీత అనే పాత్రను రెజీనా చేస్తోందని, ఆ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని... రెజీనా కెరీర్లో ఈ పాత్ర గుర్తుండిపోతుందని హరీశ్ స్పష్టం చేశాడు. 'శివ మనసులో శృతి' చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై భామ అనతి కాలంలోనే మంచి మార్కులు కొట్టేసింది. అందంతో పాటు నటనలోనూ సత్తా చూపిస్తూ అగ్ర హీరోల సరసన అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకెళుతోంది. తాజాగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రంలో సాయి ధరమ్ తేజ్తో రెండోసారి జత కట్టింది. (గతంలో వీరిద్దరూ 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాలో నటించారు). సుబ్రమణ్యం ఫర్ సేల్ ..ఆడియో ఈ నెల 23న శిల్పకళా వేదికలో విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ఆడియో విడుదల కానుంది. ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం సమకూర్చారు. కాగా చిరంజీవి నటించిన సినిమాలోని ఓ హిట్ సాంగ్ను ...సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రంలో రీమిక్స్ చేసినట్లు తెలుస్తోంది. -
డైమండ్ రాణి
నగరంలో అత్యాధునికంగా తీర్చిదిద్దిన వజ్రాల దుకాణాన్ని నటి రెజీనా కసాండ్రా ఆదివారం ప్రారంభించారు. వజ్రాభరణాలను ధరించి కొద్దిసేపు సందడి చేశారు. లబ్బీపేట : భారత దేశంలో ప్రముఖ వజ్రాభరణాల బ్రాండ్ కీర్తిలాల్స్ వారు నగరంలోని తమ షోరూంను అతిపెద్ద వజ్రాల నిలయంగా పునరుద్ధరించారు. అత్యాధునికంగా తీర్చిదిద్దిన మహాత్మాగాంధీ రోడ్డులోని షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ హీరోయిన్, కీర్తిలాల్స్ కస్టమర్ రెజీనా కసాండ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీర్తిలాల్స్ బిజినెస్ డెరైక్టర్ సూరజ్ శాంతకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు వజ్రాభరణాల్లో విస్తృతశ్రేణిని డిమాండ్ చేస్తున్నాయన్నారు. సరికొత్త డిజైన్లతో అందరికీ వజ్రాభరణాలు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సంప్రదాయ రీతులను అభిమానించే వారితో పాటు అందరినీ ఆకట్టుకునేలా ప్రత్యేక శ్రేణి వజ్రాభరణాలను కొత్త షోరూంలో ప్రదర్శిస్తున్నామన్నారు. భారతీయ కళాత్మక అభిరుచులకు అద్దంపడుతూ చక్కని వజ్రాభరణాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని వివరించారు. గనుల నుంచి నేరుగా వజ్రాలను తీసుకు రావడం, వజ్రాల కటింగ్ కర్మాగారాలు, అత్యాధునిక డిజైన్ స్టూడియోలు, ఉత్పత్తి కేంద్రాల వరకు ఒకే కప్పుకింద సమకూర్చుకుని ప్రపంచ వజ్రాభరణాల సారథ్య వర్తకుల్లో ఒకరిగా కీర్తిలాల్స్ నిలిచిందని తెలిపారు. సీనీ హీరోయిన్ రెజినా కసాండ్రా మాట్లాడు తూ కీర్తిలాల్స్లోని విభిన్న రకాల వజ్రాభరణా లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. కీర్తిలాల్స్ జనరల్ మేనేజర్ జి. మధుసూదన్, రిటైల్ అండ్ సేల్స్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎం. రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
ధరమ్ తేజ్తో జతకడుతున్న రెజీనా
-
బిల్లా-రంగా ఏం చేశారు?
రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న ఓ ఇద్దరు యువకుల జీవితాలు ఓ సంఘటన వల్ల ఎలా మలుపు తిరిగాయనే కథాంశంతో తమిళంతో తెరకెక్కిన చిత్రం ‘కేడీ బిల్లా-కిలాడీ రంగా’. ఈ చిత్రాన్ని అదే పేరుతో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. విమల్, శివకార్తీకేయన్, రెజీనా, బింధుమాధవి ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. ‘‘ ‘గోలీసోడా’, ‘మెరీనా’ లాంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన పాండిరాజ్ ఈ సినిమా కూడా చాలా బాగా తీశారు. యువన్శంకర్రాజా సంగీతం ఈ చిత్రానికి హైలైట్. త్వరలో అనువాద కార్యక్రమాలు మొదలుపెడతాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: విజయ్. -
మిస్ ఆచి మిసెస్ తూచి
ఆచితూచి తింటే ఆరోగ్యం బాగుండడమే కాకుండా... మహిళలకు తమ బరువు మీద కంట్రోల్ వస్తుంది. సన్నగా ఉండగలిగితే జీవితం చలాకీగా ఉంటుంది. తొందరగా కీళ్ల నొప్పులు, ఆరోగ్యసమస్యలు సతాయించవు. ఇంటి బడ్జెట్టును ఎంతో జాగ్రత్తగా చూసుకునే ఇల్లాలు... తన ఒంటి బడ్జెట్టును ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోకపోతే ఎలా?! మిస్లు, మిసెస్లు క్యాలుక్యులేట్ చేసుకోడానికి ఇక్కడో లెక్కుంది. దానికో కిక్కుంది. పద్దులు మేమిచ్చాం. పాళ్లు మీరు సరిచూసుకోండి. రెజీనా డైట్ ప్లాన్ మాణింగ్ గ్లాసుడు నీళ్లతో నా డైలీ డైట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మసాలా టీ లేక కాఫీ. {బేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోసె.. ఇలా ఏదో ఒకటి తీసుకుంటా. {బేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్య {yై ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు. మధ్యాహ్న భోజనంలో బీట్రూట్, క్యారెట్, కీరా ఉండేలా చూసుకుంటాను. కొంచెం రైస్, రోటీ తీసుకుంటా. నాకు పనీర్ అంటే ఇష్టం. నా శరీరానికి కావల్సిన ప్రొటీన్స్ పనీర్, పప్పుల ద్వారానే అందుతాయి. ఆయిలీ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు. అందుకని వేపుళ్లను అవాయిడ్ చేస్తాను. నూనె పదార్థాలకు దూరంగా ఉంటాను కాబట్టి, డైట్ పరంగా పెద్దగా నియామలు పాటించాల్సిన అవసరం లేకుండాపోతోంది. లంచ్కి, డిన్నర్కి మధ్య ఫ్రూట్స్, నట్స్ తింటుంటాను. డిన్నర్ లైట్గా తీసుకుంటాను. రంజితకు ముప్పై ఏళ్లుంటాయి. ఇద్దరు పిల్లల తల్లి. గృహిణి. రోజంతా క్షణం తీరికలేని పని. రెండు పూటల హెవీ మీల్స్, సాయంకాలం స్నాక్స్, రాత్రి పడుకునే ముందు పాలు... ఇన్ని తీసుకుంటున్నా నీరసంగానే ఉంటోంది. పత్రికల్లో, టీవీల్లో వచ్చే ఆరోగ్యం సూత్రాలను చదువుతుంది, చూస్తుంది, వింటుంది. ఆ లెక్క ప్రకారమే దాదాపుగా తన డైట్ని ప్లాన్ చేసుకుంటున్నా తనకెందుకనో సూట్ అవడం లేదు. లోపం ఎక్కడుందో తెలియడం లేదు. అసలు తన శ్రమకు ఎలాంటి అహారం తీసుకోవాలో అర్థంకావడం లేదు. అవంతిక వయసు నలభై. ఏజీ ఆఫీస్లో వర్క్ చేస్తుంది. తనదీ అదే సమస్య. ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం రైస్తో లంచ్, రాత్రికి డిన్నర్లో చపాతి. ఈవినింగ్ స్నాక్స్లో స్ప్రౌట్స్ తీసుకుంటోంది. వినడానికి హెల్దీ డైట్లాగే ఉన్నా అవంతికకేమీ తేడా కనిపించడం లేదు. ఎనర్జిటిక్గా ఉన్నట్టు ఫీలవడం లేదు. ఉరుకుల పరుగుల తన లైఫ్ స్టయిల్కి ఈ డైట్ సూట్ అవుతుందో లేదో అర్థకావడం లేదు. రోజుకి ఎన్ని కేలరీలు తీసుకోవాలి? ఎన్ని కేలరీలు బర్న్ చేయాలో.. తెలుసుకోవడానికి ఇంటర్నెట్ని వడపోస్తోంది. వీళ్లిద్దరి సమస్య ఇలా ఉంటే టీనేజ్ గర్ల్ రశ్మి సమస్య వేరు. పద్దెనిమిదేళ్ల పిల్ల. ఇంజనీరింగ్ చదువుతోంది. మంచి హైట్. దానికి తగ్గ వెయిట్ను మెయిన్టైన్ చేయాలని తపన. ఉదయం పాలు.. మధ్యాహ్నం రెండు రోటీలు.. రాత్రి ఉడికించిన కూరగాయలతో కడుపునింపేసుకుంటుంది. దానికి తగ్గట్లే వర్కవుట్లు. సన్నగా తోటకూర కాడలా .. ప్రాణమంతా కళ్లల్లో నింపుకొని కనపడుతోంది. రశ్మిని చూసినప్పుడల్లా వాళ్లమ్మ మనసు తరుక్కుపోతోంది. ఇంటర్ వరకు ఆరోగ్యంగా కళకళలాడుతూ ఉన్న పిల్ల ఒక్క యేడాదిలో వడలిపోయింది. పట్టుకుచ్చులా ఉండే జుట్టు గరికలా మారింది. పాలిపోయి కళావిహీనమైంది. ఈ డైట్ ఏంటో.. ఆ ఎక్సర్సెజైస్ ఏంటో ఆమెకు అంతుచిక్కడం లేదు. వ్యత్యాసం.. నిజానికి ఈ ముగ్గురు స్త్రీల వయస్సు, చేస్తున్న పనుల తీరు వేరువేరు అయినా సమస్య ఒకటే. ఎన్ని కేలరీనిచ్చే ఆహారం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనే! అయితే తీసుకునే ఆహారంలో మహిళలకు, పురుషులకు కొంత వ్యత్యాసం ఉంటుంది అన్న విషయం గమనించాలి. ఆ రకంగానే ఆహారాన్ని తీసుకోవాలి. బాడీ మాస్ ఇండెక్స్ ముందుగా ఎత్తుకు తగ్గ బరువు ఉన్నామా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అంటే శరీరంలో కండపాళ్లు సరిపడా ఉన్నాయా లేదా చూసుకోవడం. ఇదే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ). ఆరోగ్యంగా ఉన్న వాళ్ల బీఎమ్ఐ విలువ 19 నుంచి 23 మధ్య ఉంటుంది. 23 నుంచి 25 మధ్య ఉంటే ఉండాల్సిన దానికన్న బరువు ఎక్కువున్నట్టు లెక్క. 25 పై మాటే అంటే లావుగా ఉన్నట్టే అని నిర్ధారించుకోవాల్సిందే! 30 కంటే ఎక్కువుంటే అధిక బరువు అని అర్థం. ఈ బీఎమ్ఐ లెక్కించడానికి సులభమైన సూత్రమొకటి ఉంది. ఉదాహరణకు మీ ఎత్తు అయిదు అడుగుల ఎనిమిది అంగుళాలు అనుకుందాం.. అంటే 172 సెంటిమీటర్లన్న మాట. మీ బరువు 65 కిలోలు అనుకుందాం. అప్పుడు 65కిలోలు డివెడైడ్బై 1.72 ఇంటూ 1.72 కాలిక్యులేట్ చేస్తే మీ బీఎమ్ఐ వచ్చేస్తుంది. ఎవరు.. ఎన్ని కేలరీలు.. తీసుకోవాలి? బీఎమ్ఐ లెక్క చూసుకున్నాక ఆహారం విషయం ప్లాన్ చేసుకోవాలి. ఎవరి శారీరక శ్రమను అనుసరించి వాళ్లు డైట్చార్ట్ను ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ డైటరీ రిఫరెన్స్ ఒక పట్టికను తయారు చేసింది. దాని ప్రకారం.. బట్టలుతకడం, గిన్నెలు కడగడం, ఇల్లు ఊడ్వడం, వంటచేయడం వంటి ఇంటి పని చేస్తున్న స్త్రీలు రెండువేల నుంచి రెండువేల రెండువందల కేలరీల ఆహారం తీసుకుంటూ ఉంటే వాళ్ల బరువు పెరగడంకానీ, తగ్గడం కానీ ఉండదు. ఒకే బరువు మెయిన్టైన్ అవుతూ ఉంటుంది. ఈ మోస్తరు పని ఉన్నవాళ్లే ఒక కిలో బరువు తగ్గాలి అనుకుంటే రోజుకి పన్నెండువందల కేలరీలు మాత్రమే తీసుకుంటే తొమ్మిది రోజుల్లో ఒక కిలో బరువు తగ్గుతారు. అంటే వీళ్లు రెగ్యులర్గా తీసుకునే ఆహారంలో వెయ్యి కేలరీలు తగ్గించాలన్నమాట. ఇలాకాకుండా వేగంగా బరువు తగ్గాలని అతి తక్కువ కేలరీలు తీసుకుంటుంటే అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్టే. ఎంత వేగంగా బరువు తగ్గుతారో అంతే వేగంగా మళ్లీ బరువు పెరుగుతారు. కాబట్టి నిదానంగా బరువు తగ్గడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం. మీరు రోజుకు ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ పట్టికను చూడండి.. పలు రకాల పదార్థాల్లోని క్యాలరీలు (సుమారుగా)... -
గ్లామర్కు ఓకే
ప్రేమ నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. కొందరి విషయాన్ని బాహాటంగా చెప్పినా మరికొందరు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుంటారు. నటి రెజినా మాత్రం నేనిప్పుడు ప్రేమిస్తున్నాను అంటున్నారు. ఈ డేరింగ్ బ్యూటీ సంగతేమిటో చూద్దామా. కోలీవుడ్లో కండనాళ్ ముదల్ చిత్రంలో నటి లైలాకు చెల్లెలిగా 2005లో పరిచయం అయిన నటి రెజినా, ఆ తరువాత అళగియ అసూర, పంచామృతం, కేడి బిల్లా కిల్లాడి రంగా, నిర్ణయం, ఇటీవల విడుదలైన రాజతందిరం తదితర చిత్రాల్లో నాయకిగా నటించారు. ప్రస్తుతం టాలీవుడ్లోనూ హీరోయిన్గా రైజింగ్లో ఉన్న రెజినాతో చిన్న భేటీ.... ప్రశ్న:తమిళంలో సీజన్ చూసి నటిస్తున్నారే? జవాబు: చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు రావాలి, ఎడాపెడా నటించేయాలని నేను కోరుకోవడం లేదు. మరో విషయం ఏమిటంటే నేనిప్పటి వరకు తమిళంలో నటించింది ఆరు చిత్రాలే. దీంతో మళ్లీ తమిళంలో నటిస్తారు అన్న ప్రశ్న చాలామంది నుంచి వస్తోంది. కారణం నేను ఎంచుకుంటున్న చిత్రాల పాత్రలు అలాంటివి. ప్రస్తుతం స్టూడియో గ్రీన్ సంస్థలో చేస్తున్నాను. అలాగే తెలుగులో సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే చిత్రం చేస్తున్నాను. ప్రశ్న: మూస పాత్రలు అని బోర్గా ఫీలైన సందర్భాలున్నాయా? జవాబు: కేడి బిల్లా కిల్లాడి రంగా తరువాత తమిళంలో అలాంటి అవకాశాలే రావడంతో అంగీకరించలేదు. తమిళ ఆడియన్స్ హోమ్లీ పాత్రలనే ఇష్టపడతారు. ఇప్పుడు అలాంటి పాత్రలు వరిస్తున్నాయి. ప్రశ్న: సైకలాజి చదివారట. నటిగా మీకది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? జవాబు: చాలా హెల్ప్ అవుతోంది. రకరకాల మనస్తత్వాల మనుషుల మయం సినిమా రంగం. వారి ఆలోచనలు, ఆచరణలు భిన్నంగా ఉంటాయి. అలాంటి వారిని అర్థం చేసుకుని ప్రవర్తించడానికి నేను చదివిన సైకాలజీ చాలా ఉపయోగపడుతుంది. ప్రశ్న: కమర్షియల్ చిత్రాలే మీ లక్ష్యమా? జవాబు: అలాగని ఏమీ లేదు. ఫ్యామిలీ కథా చిత్రాల్లోనూ నటిస్తాను. అదే సమయంలో కమర్షియల్ కథలతో రూపొందే మాస్ చిత్రాలు చేస్తాను. ప్రశ్న: మరి గ్లామర్ విషయం ఏమిటి? జవాబు: కథ హద్దులు మీరని గ్లామర్కు నేను ఓకే. సినిమాకు గ్లామర్ కూడా అవసరం అని నా అభిప్రాయం. పరిమితులు దాటని వరకు గ్లామర్గా నటించడానికి అభ్యంతరం లేదు. ప్రశ్న: టాలీవుడ్లో మీకో నిక్నేమ్ ఉందట? జవాబు: అవును. అక్కడి అభిమానులు ముద్దుగా మెగా హీరోయిన్ అని పిలుస్తుంటారు. అలాంటి అభిమానుల ఆదరణ చివరి వరకు ఉండాలని ఆశిస్తున్నాను. ప్రశ్న: మీలో గాయని కూడా ఉన్నారట? జవాబు: సంప్రదాయబద్ధంగా శిక్షణ పొందకపోయినా కొంచెం బాగానే పాడగలను. మీకో విషయం తెలుసా రాజతందితరం చిత్రంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగులోనూ చెప్పాలని ఉన్నా బిజీ కారణంగా అది సాధ్యం కావడం లేదు. ప్రశ్న: చివరి ప్రశ్న టాలీవుడ్ హీరో ఒకరితో ప్రేమలో పడ్డారట? జవాబు: ఇప్పటి వరకు నాపై ఎలాంటి గ్యాసిప్స్ రాలేదు. అలాంటిది ప్రశ్న ఎలా అడిగారో తెలియదు. నిజానికి నేని ప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదు. -
తలుపు కొట్టి మరీ చెబుతా!
‘‘క్రిస్మస్ పండుగను అమితంగా ప్రేమించేవారిలో నేను ముందుంటా’’ అంటున్నారు అందాల తార రెజీనా. క్రిస్మస్ వస్తే... ఈ బ్యూటీ ఆనందానికి పట్టపగ్గాలుండవట! వారం రోజుల ముందే ఆమె ఇంట్లో వేడుకలు మొదలైపోతాయట. ‘‘ప్రపంచంలో ఎక్కడున్నా సరే... క్రిస్మస్కు వారం రోజుల ముందే చెన్నయ్ చేరతా. ముందు ఇల్లంతా అలంకరిస్తాం. అంతా కలిసి ఆరాధనలో పాల్గొంటాం. టపాసులు కాలుస్తాం. ప్రతిరోజూ చర్చికెళ్లి చేసే ప్రార్థనలు సరేసరి. మిడ్నైట్ ఒకటిన్నర సమయంలో పక్కింటివాళ్ల తలుపు కొట్టి మరీ వాళ్లకు శుభాకాంక్షలు చెబుతాను. వాళ్లు తిట్టుకున్నా నేను మాత్రం చెప్పడం మానను. వాళ్లకు కూడా అది అలవాటైపోయింది. ఏడాదిలో నాకు అత్యంత ఇష్టమైన రోజు క్రిస్మస్సే’’ అని చెప్పారు రెజీనా. -
సేల్ మొదలైంది..!
‘పిల్లా నువ్వు లేని జీవితం’తో హిట్ జంటగా పేరు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్, రెజీనాలతో హరీశ్శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ఈ చిత్రం షూటింగ్ గురువారం హైదరాబాద్లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శ్యామ్ప్రసాద్రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, హీరో అల్లు అర్జున్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాయిధరమ్తేజ్ని పూర్తి కమర్షియల్గా చూపించనున్నానని హరీశ్శంకర్ అన్నారు. హరీశ్ సినిమాకు ముందు, తరువాత అనుకునేలా ఈ సినిమా ఉంటుందని సాయిధరమ్తేజ్ అభిప్రాయపడ్డారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ హైదరాబాద్లో, ఏప్రిల్ నుంచి అమెరికాలో జరిపే షెడ్యూల్స్తో షూటింగ్ పూర్తవుతుందనీ, వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామనీ ‘దిల్’ రాజు తెలిపారు. ఈ చిత్రానికి కథనం: రమేశ్రెడ్డి, సతీశ్ వేగేశ్న, సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: సి.రాంప్రసాద్, కూర్పు: గౌతంరాజు, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. -
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రం మొదలైంది
-
హద్దులు దాటడానికి వెనకాడను!
‘‘సినిమాలో హీరోకి పెదవి ముద్దు ఇచ్చామా? చిట్టి, పొట్టి దుస్తులేసుకున్నామా? అన్నది ముఖ్యం కాదు. సన్నివేశానికి అనుగుణంగానే అవి చేశామా? లేదా అన్నదే ముఖ్యం’’ అంటున్నారు రెజీనా. ఎస్ఎమ్ఎస్, రొటీన్ లవ్స్టోరీ తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. సాయిధరమ్ తేజ్ సరసన ఆమె నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రం ఈ నెల 14న విడుదల కానున్న సందర్భంగా రెజీనాతో చిట్చాట్. ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో మీదెలాంటి పాత్ర? ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నిటికన్నా భిన్నంగా ఉంటుంది. సమస్యల్లో ఉండే అమ్మాయిగా నటించాను. అందుకని ఎప్పుడూ సీరియస్గా ఉంటా. ప్రేమిస్తున్నానంటూ హీరో వెంటపడ్డా సినిమా చివరి వరకూ ప్రేమను అంగీకరించను. సీరియస్ కారెక్టర్ అంటున్నారు.. మీ నిజజీవితానికి ఎంతవరకూ దగ్గరగా ఉంటుంది? కొంత కూడా దగ్గరగా ఉండదు. ఎందుకంటే, నేనంత సీరియస్ అమ్మాయిని కాదు. అలాగని వసపిట్టనూ కాదు. కావల్సినంత వరకు మాట్లాడతాను. నా పనేంటో నేనేంటో అన్నట్లుగా ఉంటాను. ఈ సినిమాలోలాగా నిజజీవితంలో కూడా అబ్బాయిలు మీ వెంటపడేవారేమో? నావైపు కన్నెత్తి చూసేవాళ్లు కాదు. ఎందుకంటే, నేనంటే భయం. నాకు ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం ఎక్కువ. నా ధైర్యం గురించి తెలిసి, నాతో మామూలుగా మాట్లాడటానికి కూడా భయపడేవాళ్లు. సో.. అమ్మాయిలందరూ మీలా ధైర్యంగా ఉండాలంటారు... నాలా ఉండమని చెప్పే స్థాయిలో లేను కానీ, కచ్చితంగా ధైర్యంగా ఉండాలి. అప్పుడే సమాజంలో నెగ్గుకు రాగలుగుతారు. ఓకే... సాయిధరమ్ గురించి చెప్పండి? నిరాడంబరంగా ఉంటాడు. కష్టపడి పని చేసే మనసత్త్వం. మెగా కుటుంబం నుంచి వస్తున్న హీరో కాబట్టి అతని పై అంచనాలుంటాయి. సాయి పడుతున్న కష్టం చూస్తుంటే మంచి స్థానానికి చేరుకుంటాడనిపిస్తోంది. మళ్లీ సాయిధరమ్తోనే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రం చేస్తున్నారు.. కారణం ఏంటి? నాకైతే కథ, పాత్ర నచ్చి ఒప్పుకున్నాను. పైగా, పెద్ద బేనర్లో అవకాశం అంటే చిన్న విషయం కాదు. మళ్లీ మా జంటనే తీసుకున్నారంటే.. బహుశా ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో మా కెమిస్ట్రీ నచ్చి ఉంటుందేమో. ఇటీవల విడుదలైన ‘రంగ్ రసియా’ చిత్రంలో నందనాసేన్ నగ్నంగా నటించారు. ఆ తరహా పాత్రలొస్తే...? నేను ఆర్టిస్ట్నండి. అందుకే సన్నివేశం డిమాండ్ మేరకు గత చిత్రాల్లో లిప్ లాక్ సీన్ చేశాను. భవిష్యత్తులో పెదవి ముద్దు సన్నివేశాల పరంగా ట్రెండ్ సృష్టిస్తానేమో (నవ్వుతూ). ఆ సంగతలా ఉంచితే.. ‘రంగ్ రసియా’ గురించి విన్నాను. కళాత్మకంగా తీశారట. అలాంటి సినిమాకి అవకాశం వస్తే.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. నేను చేసిన ఎస్ఎమ్ఎస్, రొటీన్ లవ్స్టోరీ చూసి... ‘రెజీనా మన పక్కింటమ్మాయిలా ఉంది’ అన్నారు. నాలో వేరే కోణం ఉందని నిరూపించడానికి ఆ తర్వాత గ్లామరస్ రోల్స్ చేశాను. దాంతో రెజీనా ఈ పాత్రలకూ పనికొస్తుందనే అభిప్రాయానికి వచ్చారు. నాలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించే పాత్రలైతే, హద్దులు దాటడానికి వెనకాడను. బన్నీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా... బన్నీ (అల్లు అర్జున్), నేను కలిసి ఓ యాడ్లో నటించాం. దానికోసం ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి, మర్నాడు ఉదయం నాలుగు గంటల వరకు షూటింగ్ చేశాం. అప్పుడు బన్నీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. -
జస్ట్ ఫర్ చేంజ్
అది సామాజిక స్పృహకు నిదర్శనం. పేద విద్యార్థులకు భరోసా కల్పించేందుకు సెలిబ్రిటీలు వచ్చి వివిధ రకాల రుచులను ఆస్వాదించారు. జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి ‘ప్రాజెక్ట్ 511’ సంస్థ నిర్వహించిన ఫుడ్ ఫర్ చేంజ్లో సెలిబ్రిటీలు హల్చల్ చేశారు. విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ఈ బ్లాక్ టై డిన్నర్కు ఎంట్రీ టికెట్ రూ.4 వేలు చెల్లించి మరీ తమ ఔదార్యాన్ని చాటారు. నోవాటెల్, ఐటీసీ, ఆవాస, రాడిసన్, మారియట్ హోటళ్ల చెఫ్లు తయారు చేసిన 16 రకాల వంటకాలను టేస్ట్ చేశారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఏషియన్ వంటకాలను టేస్ట్ చేసేందుకు ఆసక్తి చూపారు. ఈ విందులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నటీమణులు సమంత, మంచు లక్ష్మి, రెజీనా, అమల, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
‘పవర్’ ట్రిపుల్ ప్లాటినం వేడుక
-
ప్రేమ పెళ్లి వల్ల...
ఓ పెద్దింటి కుర్రాడు, ఓ పేదింటి అమ్మాయి ప్రేమించుకుంటారు. వీరి పెళ్లికి పెద్దలు సమ్మతించకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయి, పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో రూపొందిన ఓ తమిళ చిత్రం తెలుగులో ‘నిర్ణయం’ పేరుతో విడుదల కానుంది. రాణా విక్రమ్, రెజీనా జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎ.వై.ఎస్. చౌదరి సమర్పణలో కె. జ్యోత్స్నరాణి, యం. లక్ష్మీ, సురేఖ తెలుగులోకి అనువదించారు. సెల్వగణేశ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత అశోక్కుమార్ ఆవిష్కరించి, దర్శకుడు సాగర్కి ఇచ్చారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘మంచి కథాంశంతో రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. రెజీనా అందచందాలు, అభినయం ఓ హైలైట్. బేబి వేదిక పోషించిన పాత్ర కీలకంగా నిలుస్తుంది. మంచి పాటలు కుదిరాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. -
బెజవాడలో ‘బి న్యూ’
రెండు స్మార్ట్ మొబైల్ స్టోర్లు ప్రారంభం ప్రారంభోత్సవంలో ‘పవర్’ ఫేమ్ రెజీనా హల్చల్ విజయవాడ : మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక మోడల్స్తో కూడిన మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా నగరంలో రెండు ‘బి న్యూ’ స్మార్ట్ మొబైల్ స్టోర్లను శుక్రవారం ప్రారంభించారు. బెంజిసర్కిల్ సమీపంలోని మహాత్మాగాంధీరోడ్డులో, ఏలూరురోడ్డులోని రామ మందిరం ఎదురుగా ఏర్పాటుచేసిన ఈ స్టోర్స్ను ‘పవర్’ సినిమా ఫేమ్ రెజీనా కసాండ్రా లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బి న్యూ స్టోర్స్లో షాపింగ్ సరికొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. ముఖ్యంగా యువత అత్యాధునిక టెక్నాలజీ కలిగిన స్మార్ట్ ఫోన్లపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. వారి అభిరుచులకు అనుగుణంగా మొబైల్స్ అందించేందుకు స్టోర్స్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. బి న్యూ స్టోర్స్ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి మాట్లాడుతూ తాము నెల్లూరులో నాలుగు మొబైల్ షాపులను రెండు దశాబ్దాలుగా నిర్వహించడంతో పాటు మూడేళ్లుగా సోనీ, మైక్రోమ్యాక్స్, కార్బన్, ఇంటెక్స్, హెచ్టీసీ వంటి మల్టీ నేషనల్ కంపెనీలకు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. నేడు ఆంధ్రప్రదేశ్లో బి న్యూ పేరుతో మొబైల్ స్టోర్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నగరంలో రెండు స్టోర్లు ప్రారంభించామని, వాటిలో రూ.600 నుంచి రూ.60 వేల విలువ కలిగిన ఫోన్ల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. సరికొత్త మోడల్ ఫోన్లు కొనుగోలు చేసినప్పుడు కస్టమర్లకు కంపెనీకి చెందిన డిమాన్స్ట్రేటర్ దాని పనితీరును వివరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. రెజీనా సందడి బి న్యూ స్టోర్స్ ప్రారంభోత్సవానికి వచ్చిన రెజీనా నగరంలో హల్చల్ చేశారు. ఆమెను చూసేందుకు షోరూమ్ల వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు, యువకులు చేరుకోవడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఆమె అభిమానులకు అభివాదం చేయడంతో యువకులు కేరింతలు కొట్టారు. -
రవితేజ 'పవర్' సక్సస్ మీట్
-
కీలకమైన మలుపు
ఓ గొప్పింటి అబ్బాయి, ఓ పేదింటి అమ్మాయి ప్రేమలో పడతారు. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించరు. దాంతో ఇద్దరూ ఇల్లు వదిలి, ఊరు వదిలి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వీరి జీవితాలు ఓ కీలకమైన మలుపు తిరుగుతుంది. అదేంటో తెరపై చూడాలంటున్నారు దర్శకుడు శరవణన్. రాణా విక్రమ్, రెజీనా జంటగా తమిళంలో రూపొందిన చిత్రాన్ని ‘నిర్ణయం’ పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. ఎ.వై.ఎస్. చౌదరి సమర్పణలో కె.జోత్న్సారాణి, ఎం.లక్ష్మీ సురేఖ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్ ఇదని, సెల్వ గణేశ్ చక్కటి మెలోడీ పాటలిచ్చారని, బేబి వేదిక కీలకపాత్ర పోషించిందని, త్వరలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు: మహేశ్ అల్లు. -
పవర్ మూవీ పోస్టర్స్
-
సినిమా రివ్యూ: పవర్
బలుపు చిత్ర విజయం తర్వాత ’మాస్ మహారాజ’ రవితేజ తదుపరి చిత్రం పవర్. గతంలో డాన్ శ్రీను, మిస్టర్ ఫర్ఫెక్ట్, బలుపు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాబీ (కే ఎస్ రవీంద్ర) పవర్ చిత్రంతో దర్శకుడి అవతారం ఎత్తారు. హన్సిక, రెజీనాలతో కలిసి రవితేజ, బాబీలు పవర్ చూపించారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అవినీతి పోలీస్ ఆఫీసరైన బలదేవ్ సహాయ్(రవితేజ) ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తుంటాడు. హోంమంత్రి జయవర్ధనే (ముఖేశ్ రుషి) సోదరుడు గంగూలీ భాయ్(సంపత్)ని తప్పించే క్రమంలో బలదేవ్ సహాయ్ చనిపోతాడు. ఓ కారణం కోసం తిరుపతి (రవితేజ)ను బలదేవ్ సహాయ్ పాత్రలో జయవర్ధనే ప్రవేశపెడుతాడు. అయితే హోంమంత్రికి బలదేవ్ సహాయ్ ఎదురుతిరుగుతాడు. హోంమంత్రికి బలదేవ్ ఎందుకు ఎదురు తిరుగుతాడు? బలదేవ్ సహాయ్ పాత్రలో ప్రవేశించిన తిరుపతి ఏలాంటి గందరగోళం సృష్టించాడు? అవినీతి పోలీస్ ఆఫీసర్గా బలదేవ్ సహాయ్ మారాడానికి కారణాలేంటి? ఎందుకు తిరుపతిని బలదేవ్ సహాయ్ నటించమని కోరుతాడు? ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న బలదేవ్ సహాయ్ సఫలమయ్యారా? బలదేవ్ లక్ష్యానికి ఇద్దరు హీరోయిన్లు ఏవిధంగా సహాయపడ్డారు అనే ప్రశ్నలకు సమాధనమే ‘పవర్’ బలదేవ్ సహాయ్, తిరుపతి పాత్రల్లో రవితేజ కనిపించారు. బలదేవ్ పాత్రద్వారా యాక్షన్ను, తిరుపతి పాత్ర ద్వారా ఎంటర్టైన్మెంట్ను అందించడంలో రవితేజ తన మార్కును పండించారు. గతంలో విక్రమార్కుడు, బలుపు ఇతర చిత్రాల ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి. కేవలం రవితేజను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పాత్రలకు ఆయన పూర్తి న్యాయం చేకూర్చాడు. తన ఇమేజ్కు సరిపోయే పాత్రలతో రవితేజ మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. నిరుపమ పాత్రలో హన్సిక, వైష్ణవిగా (రెజీనా)లు నటించారు. తొలిభాగంలో హన్సిక, రెండవ భాగంలో రెజీనా తమ గ్లామర్తో ఆలరించారు. కథకు తోడ్పాటు నందించే పాత్రలో హన్సిక కనిపించగా, కథను ముందుకు తీసుకెళ్లే పనిని రెజీనా చేశారు. అయితే ఈ సినిమా ద్వారా ఇద్దరు హీరోయినక్లు అంత గొప్పగా పేరు తెచ్చే పాత్రలేమి దక్కలేదు. ఆణిముత్యం పాత్రలో బ్రహ్మనందం మరోసారి తనదైన శైలిలో నవ్వులు విరబోయించారు. ఆణిముత్యం పాత్ర కథలో ప్రధాన భాగమవ్వడమే కాకుండా ఈ చిత్రానికి అదనపు బలాన్ని ఇచ్చింది. ఆణిముత్యం పాత్రతో తెలుగు చిత్రాలకు తన అవసరం ఎంత ఉందో అనే అంశాన్ని మరోసారి బ్రహ్మనందం ప్రూవ్ చేసుకున్నారు. ఇటీ వల కాలంలో తనదైన మార్కు కామెడీతో పలు విజయాల్లో పాలుపంచుకుంటున్న సప్తగిరి అవకాశం లభించిన ప్రతిసారి మెరుపులు మెరిపించారు. నిడివి తక్కవైనా సప్తగిరి తన హాస్యంతో ప్రభావం చూపడంలో సఫలమయ్యారు. విలన్లుగా సంపత్, ముఖేశ్ రుషిలు ఫర్వాలేదనిపించగా, పోలీస్ ఆఫిసర్లుగా అజయ్, బ్రహ్మజీ, సుబ్బరాజులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. అతిధి పాత్రకే ప్రకాశ్రాజ్ పరిమితమయ్యారు. టెక్నికల్ రొటిన్ కథకు మోహన కృష్ణ, కే చక్రవర్తితో కలిసి కోన వెంకట్ అందించిన మాటలు అక్కడక్కడా బుల్లెట్లా పేలాయి. రవితేజ ఎనర్జీకి, కథకు తగినట్టుగా మాటలతో కోన ఆకట్టుకున్నారు. జయనన్ విన్సెంట్తో కలిసి ఆర్థర్ విల్సన్ ఫోటోగ్రఫి బాగుంది. రవితేజను మరింత గ్లామర్గా చూపించారు. చిత్ర ఆరంభంలో వచ్చే యాక్షన్, చేజింగ్ ఎపిసోడ్స్ టాలీవుడ్ రే ంజ్కు మించి ఉన్నాయి. మ్యూజిక్ తమన్ అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రవితేజ పాడిన నౌటంకి పాట వినడానికే కాకుండా తెరపై చూడటానికి కూడా బాగుంది. ఇతర పాటలు కూడా ఆకట్టుకున్నాయి. అయితే తమన్ అందించిన సంగీతంలో కొత్తదనమేమి కనిపించలేదు. రెగ్యులర్ బాణీలే మళ్లీ మళ్లీ వింటున్నామా అనే సందేహం కలుగుతుంది. దర్శకత్వం: రచయితగా గుర్తింపు పొంది.. దర్శకుడిగా మారిన బాబీ.. తన తొలి చిత్రంలో సాహసానికి ఒడిగట్టకుండా రెగ్యులర్ సక్సెస్ ఫార్ములాను నమ్ముకుని పవర్ తెరకెక్కించారు. రవితేజ ఇమేజ్, ఎనర్జీని చక్కగా వాడుకోవడంలో బాబీ సక్సెస్ అయ్యారు. అయితే పాత చింతకాయనే కథనే మళ్లీ సరికొత్త ప్యాకేజీలో కొత్త రుచిని అందించారని చెప్పవచ్చు. విక్రమార్కుడులో ఉండే ఆత్మను, బలుపులో ఉండే ఎంటర్ టైన్మెంట్ను మిక్స్ చేసి పవర్గా కొత్త ప్రొడక్ట్ను రూపొందించారు. అయితే ప్రస్తుత కాలంలో సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని.. రొటిన్ కథను చక్కటి స్క్రీన్ప్లే, వినోదం అనే పట్టాలకెక్కించి తన ఎలాంటి రిస్క్ లేకుండా గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేశారు. ప్రేక్షకుడిని తప్పదారి పట్టించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా... బలదేవ్ పాత్రను ఆరంభంలోనే ముగించడం, హస్పిటల్లో ఎపిసోడ్లో హోంమంత్రి తల్లికి సంబంధించిన సీన్, ఇంటర్వెల్ ట్విస్, చివర్లో బ్రహ్మీ పాట కొత్తగా అనిపించడమే కాకుండా దర్శకుడి ప్రతిభకు అద్దపట్టాయి. అయితే క్లైమాక్స్ను చూస్తే బలుపు తరహా ఇంకా మూస ధోరణినే నమ్ముకున్నారనిపిస్తుంది. ఓవరాల్గా అనేక ప్రతికూల అంశాలున్నా... ప్రేక్షకుడిని సంతృప్తి పరిచే సానుకూల అంశాలు డామినేట్ చేశాయని చెప్పవచ్చు. బీ,సీ సెంటర్లతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరించడం, త్వరలో వచ్చే భారీ చిత్రాల పోటిని ఎదురిస్తే తప్ప భారీ విజయం చిక్కకపోవచ్చు. --రాజబాబు అనుముల (ఇంగ్లీష్ రివ్యూ) -
'రెజీనా' నిర్ణయం మూవీ స్టిల్స్, పోస్టర్స్
-
పవర్ మూవీ న్యూ రిలీజ్ పోస్టర్స్
-
మాస్ అంటే... బస్సు పాసు కాదు!
‘‘మాస్ అంటే బస్సు పాసు కాదుబే... ఎవడు పడితే వాడు వాడేసుకోనికి. అది మన బలుపుని బట్టి, బాడీ లాంగ్వేజిని బట్టి, జనం పిలుచుకునే పిలుపు’’... ‘పవర్’ సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ ఇది. ఈ ఒక్క డైలాగ్తోనే ఈ చిత్రంలో రవితేజ పాత్రచిత్రణ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునంటున్నారు దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ). ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయని ఆయన చెబుతున్నారు. ‘బలుపు’ చిత్రానికి రచయితగా పని చేసిన బాబీలోని ప్రతిభను గుర్తించి రవితేజ ‘పవర్’ డెరైక్షన్ చాన్స్ ఇచ్చారు. ఇందులో రవితేజ సరసన హన్సిక, రెజీనా నటించారు. రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాక్లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని, ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇటీవల విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. సంగీత దర్శకుడు తమన్ కెరీర్లోనే ఇదొక మంచి ఆల్బమ్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించే పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంస, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె.జి. కృష్ణ.