రామకుప్పం (చిత్తూరు) : అనుమతులు లేకుండా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తమిళనాడు నుంచి ఆదివారం ఉదయం 3.5 టన్నుల బియ్యాన్ని లారీలో తరలించేందుకు సిద్ధమవ్వగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులు పరారయ్యారు. అధికార పార్టీ నేతల అండతోనే ఈ తంతు కొనసాగుతుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.