కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్నగర్లో ఓ పిచ్చికుక్క సోమవారం స్క్వైరవిహారం చేసింది
పెనమలూరు(కృష్ణా జిల్లా): కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్నగర్లో ఓ పిచ్చికుక్క సోమవారం స్క్వైరవిహారం చేసింది. కనపడిన వారినందరినీ కరవడం ప్రారంభించింది. ఇప్పటికే ఆ కుక్క దాడిలో ఆరుగురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి.
గాయపడిన చిన్నారులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా గ్రామస్తులు ఆ పిచ్చికుక్కను కొట్టి చంపేశారు.