కన్న తల్లిని హత్యచేసిన కసాయి కొడుకు | a son brutally killed his mother | Sakshi
Sakshi News home page

కన్న తల్లిని హత్యచేసిన కసాయి కొడుకు

Mar 22 2015 6:45 PM | Updated on Sep 2 2018 4:37 PM

విశాఖపట్నం సమీపంలోని గాజువాక ప్రాంతంలో ఆదివారం దారుణం జరిగింది.

విశాఖపట్నం: గాజువాకలో దారుణ హత్య జరిగింది. వివరాలు...జయలక్ష్మి(53) అనే మహిళను ఆమె కుమారుడు రాజశేఖర్  హత్య చేసి  మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు. ఈ నేపథ్యంలో తన తల్లి కనిపించడంలేదని రాజశేఖర్ అక్క తమ్ముడిపై అనుమానంతో మార్చి 20 వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రాజశేఖర్ శనివారం బంగారం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా డబ్బు కోసం జయలక్ష్మిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.  నిందితుడు రాజశేఖర్ నేవీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.  కాగా, ప్రేమ వ్యవహారం, ఆర్థిక లావాదేవీలే జయలక్ష్మి హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement