సాక్షి, హైదరాబాద్: కర్నాటక నుంచి 100 మెగావాట్ల విద్యుత్ను ఆంద్రప్రదేశ్ కొనుగోలు చేసింది. జూలై 1 నుంచి ఈ విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఇంధన పొదుపు మిషన్ (ఎస్ఈసీఎం) సీఈవో చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ఆదాపై త్వరలో ప్రత్యేక సమావేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించే అవకాశం ఉందన్నారు.
ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వశాఖలు పాటించాల్సిన పొదుపు ప్రణాళికను సీఎం నిర్దేషించనున్నారు. అన్ని మునిసిపాలిటీలల్లో విద్యుత్ చర్యల్లో భాగంగా ఎల్ఈడీ లైట్లను అమర్చుకోవాలని రాష్ట్ర సీఎస్, ఎస్ఈసీఎం చైర్పర్సన్ ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు.
కర్నాటక నుంచి విద్యుత్ కోనుగోలు చేసిన ఏపీ
Published Sun, Jun 29 2014 11:32 PM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement