విభజన వ్యతిరేకతను ఢిల్లీకి చాటేందుకు ఈనెల 17న ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన మహా ధర్నాలో పాల్గొనేందుకు గుంటూరు నుంచి రాత్రి 8 గంటలకు
లక్ష్మీపురం(గుంటూరు), న్యూస్లైన్: విభజన వ్యతిరేకతను ఢిల్లీకి చాటేందుకు ఈనెల 17న ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన మహా ధర్నాలో పాల్గొనేందుకు గుంటూరు నుంచి రాత్రి 8 గంటలకు ప్రత్యేక రైలు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది. ఈ రైలుకు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పచ్చ జెండా ఊపారు. ఈ ప్రత్యేక రైలు రెండు నెంబరు ప్లాట్ఫారం నుంచి బయలుదేరగా రైలులో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున సమైక్యవాదులు బయలుదేరి వెళ్ళారు. ఈ ప్రత్యేక రైలు వెళుతుందని తెలుసుకున్న సమైక్యవాదులు పెద్ద ఎత్తున రైల్వే ప్రాంగణానికి చేరుకుని జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.