కోర్టు శ్రీకాకుళంలో.. సాక్షులు అమెరికాలో! | Court in Srikakulam witnesses in the United States | Sakshi
Sakshi News home page

కోర్టు శ్రీకాకుళంలో.. సాక్షులు అమెరికాలో!

Dec 29 2016 2:02 AM | Updated on Sep 2 2018 5:24 PM

సాక్షులు అమెరికాలో ఉన్నారు. కోర్టు శ్రీకాకుళంలో ఉంది. అయితేనేం..

రాష్ట్రంలోనే తొలిసారి ఆన్‌లైన్‌ విచారణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: సాక్షులు అమెరికాలో ఉన్నారు. కోర్టు శ్రీకాకుళంలో ఉంది. అయితేనేం.. సాంకేతిక పరిజ్ఞానం ఉరకలెత్తుతున్న ప్రస్తుత తరుణంలో విచారణ ప్రక్రియకు దూరాన్ని చెరిపేస్తూ ఆన్‌లైన్‌లో సాక్షుల విచారణ జరిపారు న్యాయమూర్తులు. ఇలా ఆన్‌లైన్‌లో విచారణ చేపట్టడం రాష్ట్రంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ ఘనత శ్రీకాకుళం కోర్టుకు దక్కింది. గృహ హింస చట్టం కింద నమోదైన కేసులో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి, ఫస్టుక్లాస్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ వై.శ్రీనివాసరావు బుధవారం విచారణ చేశారు.

ఈ కేసులో అమెరికాలో ఉన్న సాక్షులను ఆన్‌లైన్‌లో విచారించారు. సుప్రీంకోర్టు పలు కేసుల సందర్భాల్లో వెలువరించిన మార్గదర్శకాలను అనుసరించి ఇందులో విచారణ చేపట్టి రుజువులను నమోదు చేశారు.దీంతో కోర్టుకు సమయం ఆదాతోపాటు.. కక్షిదారులకు సమయం ఆదా, నగదు వ్యయం కూడా ఆదా అవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement