
సాక్షి, చిత్తూరు: కుప్పంలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ ప్రాంతం సమీపంలోని పంటలను నాశనం చేశాయి. దీంతో అటవీ సమీపంలో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారలు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గజరాజుల నుంచి తమ పంటపొలాలను కాపాడాలని కోరుతున్నారు.