తిరుమలలో మళ్లీ చెలరేగిన కార్చిచ్చు | Fire Rages continues in Seshachalam Forest | Sakshi
Sakshi News home page

తిరుమలలో మళ్లీ చెలరేగిన కార్చిచ్చు

Published Mon, Mar 31 2014 1:54 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Fire Rages continues in Seshachalam Forest

వందలాది ఎకరాల్లో అడవి బుగ్గిపాలు


 సాక్షి, తిరుమల: తిరుపతి శేషాచల అడవుల్లో మళ్లీ కార్చిచ్చు చెలరేగింది. ఆదివారం శ్రీవారి మెట్టుకు సమీపంలోని నారాయణగిరి పర్వత శ్రేణుల్లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ అగ్నికి వందలాది ఎకరాల అడవి బుగ్గిపాలైంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైరింజన్లు మంటలు ఎగువ ప్రాంతంలోని జేఈవో క్యాంపు కార్యాలయం, ఇతర కాటేజీల వరకు మంటలు విస్తరించకుండా నిరోధించారు. ముందు జాగ్రత్తగా శ్రీవారిమెట్టు కాలిబాటలో వచ్చే భక్తులను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిపివేశారు. ఆ మార్గంలో ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాకే భక్తులను అనుమతించారు. అయితే గాలి వాలుతో మంటలు కింది భాగంలోని లోయ నుంచి కల్యాణి డ్యాం ఉండే అటవీ ప్రాంతంలోకి విస్తరించాయి. ఆ ప్రాంతంలో సాయంత్రం వరకు మంటలు రేగుతూనే ఉన్నాయి. దట్టమైన పొగ కూడా అలముకుంది. మంటలు అదుపుచేసే పనులను టీటీడీ సీవీఎస్‌వో ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement