operation seshachalam
-
మరో 54 మంది ఎర్రచందనం కూలీల అరెస్ట్
చిత్తూరు: మరో 54 మంది ఎర్రచందనం కూలీలను మంగళవారం చంద్రగిరి మండలం మాముండూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక ప్రణాళికతో ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డుకట్టవేయటం సవాల్ గా మారింది. ఈ రోజు అదుపులోకి తీసుకున్న స్మగ్లర్ల నుంచి కోటి విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం చేసుకుని, ఒక లారీని సీజ్ చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం తిరుపతి టాస్క్ఫోర్స్ ఆరునెలలుగా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకూ 735 మంది దొంగలను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఏకంగా 250 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసేందుకు ఎంతమందితో జాబితా సిద్ధం చేశారు?ఎంతమందిని అరెస్టు చేశారు అనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. పోలీసు వర్గాల సమాచారం మేరకు చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన 57 మంది బడా స్మగ్లర్లు ఉన్నారు. వీరితో పాటు కర్నాటక, తమిళనాడుకు చెందిన 29మంది స్మగ్లర్లతో మరో జాబితాను సిద్ధం చేసి ఆ రాష్ట్రాల పోలీసులకు అందజేశారు. దీంతో కర్నాటక, తమిళనాడులో కూడా వారి అరెస్టు కోసం అక్కడి పోలీసులు గాలించి అరెస్టు చేస్తున్నారు. -
ఆగని స్మగ్లింగ్!
ఓ వైపు పోలీసులు శేషాచలం కొండల్ని జల్లెడ పడుతున్నారు. మరో వైపు శేషాచలాన్ని చెరపట్టిన తమిళ స్మగ్లర్లు పోలీసుల కూంబింగ్కు బెదరడం లేదు. మీదారి మీదే...మా దారి మాదే అన్నట్లు...యథేచ్ఛగా స్మగ్లింగ్ సాగిస్తున్నారు. గతంలో పోలీసులను చూసి భయపడే తమిళ కూలీలు...ఇప్పుడు తిరగబడే స్థాయికి...కాదు...కాదు...అవసరమైతే చంపేందుకు తెగబడుతున్నారు. వారం రోజులుగా పోలీసులు స్మగర్ల కోసం గాలిస్తున్నారు. మూడురోజుల క్రితం ముగ్గుర్లు స్మగ్లర్లను చంపారు. అయినా శనివారం 236మంది స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడ్డారంటే ‘ఎర్ర’దొంగలు ఎంతకు తెగించారో ఇట్టే తెలుస్తోంది. పోలీసులు స్మగ్లర్లతో పాటు వారి వెనుక ఉన్న ‘అసలుదొంగ’లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సాక్షి, కడప: ఎర్రచందనం స్మగ్లింగ్ను ఆపడంలో పోలీసులు చిత్తశుద్ధి చూపడం లేదా? ఎంత కష్టపడినా స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారా? ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధుల అండతోనే ఎర్ర సంపద యథేచ్ఛగా ఎల్లలు దాటుతోందా? అంటే ఈప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వస్తోంది. వారం రోజులుగా చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతాన్ని ప్రత్యేక బృందాలు, టాస్క్ఫోర్స్ పోలీసులు జల్లెడ పడుతున్నాయి. అయినప్పటికీ స్మగ్లింగ్ ఆగడం లేదు. శనివారం కూడా రైల్వేకోడూరు నుంచి చెన్నైకి వెళుతున్న 236 మంది తమిళ కూలీలను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఇంత భారీ సంఖ్యలో కూలీలను అరెస్టు చేయడం ఇదే ప్రథమం. ఈ సంఘటన పోలీసులకు ఓ వైపు ఛాలెంజ్ విసురుతోంది. ‘ఆపరేషన్ శేషాచలం’ పేరుతో పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నా స్మగ్లర్లు ఇంత ధైర్యంగా ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారని ఆలోచనలో పడ్డారు. దీని వెనుక బడానేతలు, తమ శాఖకు చెందిన అధికారుల అండ లేకుండా ఇంతకు తెగించే అవకాశం లేదని కొందరు పోలీసు, అటవీ అధికారులు చర్చించుకుంటున్నారు. స్మగ్లర్లు కనిపించినా ఫైర్ చేయని పోలీసులు కూంబింగ్ నేపథ్యంలో ఓ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఐదురోజుల కిందట రాజంపేట-తిరుమల మధ్యలోని తూర్పు కొండల్లో కూంబింగ్ నిర్వహించారు. ఓ ఏఎస్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు గాలింపు చేపట్టాయి. ఓ పోలీసు అధికారి తెలిపిన సమాచారం మేరకు...50మంది స్మగ్లర్లు దుంగలను నరికి విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించారు. బిర్యానీ తిని, మద్యం సేవించారు. కొండపైన పోలీసులు...కింద స్మగ్లర్లు ఉన్నారు. అయినప్పటికీ కాల్పులు జరపలేదు. దీనికి కారణం కాల్పులు జరిపే అధికారం తనకు లేదని ఏఎస్ఐ చేతులెత్తేయడమే. పోనీ కొండ దిగి స్మగ్లర్ల అరెస్టుకు ప్రయత్నించారా? అంటే అదీ లేదు. తాము 20మంది మాత్రమే ఉన్నామని, స్మగ్లర్లు 50మంది ఉన్నారని, తమపైనే దాడులకు తెగబడి చంపే ప్రమాదముందనే భయంతో పోలీసులు వెనుదిరిగినట్లు సమాచారం. పోలీసుల వైఖరి ఇలాగే ఉంటే ఎన్నేళ్లయినా చందనం స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేయలేరని ఇట్టే తెలుస్తోంది. ఎంతమందిని అరెస్టు చేశారో వెల్లడించని పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల కోసం తిరుపతి టాస్క్ఫోర్స్ ఆరునెలలుగా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకూ 681మంది దొంగలను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మరో 250 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసేందుకు ఎంతమందితో జాబితా సిద్ధం చేశారు?ఎంతమందిని అరెస్టు చేశారు అనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. పోలీసు వర్గాల సమాచారం మేరకు చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన 57 మంది బడాస్మగ్లర్లు ఉన్నారు. వీరితో పాటు కర్నాటక, తమిళనాడుకు చెందిన 29మంది స్మగ్లర్లతో మరో జాబితాను సిద్ధం చేసి ఆ రాష్ట్రాల పోలీసులకు అందజేశారు. దీంతో కర్నాటక, తమిళనాడులో కూడా వారి అరెస్టు కోసం అక్కడి పోలీసులు గాలించి అరెస్టు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఎక్కడా అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు. దీనిపై కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్లతో పాటు అరెస్టు కాకుండా అజ్ఞాతంలో ఉన్న స్మగ్లర్లను కాపాడేందుకు రాయలసీమకు చెందిన ఓ టీడీపీ ఎంపీ దుకాణం తెరిచినట్టు తెలుస్తోంది. అందుకే పోలీసులు అరెస్టయిన వారి పేర్లు వెల్లడించడం లేదని తెలుస్తోంది. అలాగే టీడీపీ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లతో కూడా పేర్లు వెల్లడించడం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కూంబింగ్, అరెస్టుల పర్వం చిత్తశుద్ధితో జరగడం లేదని వారం రోజుల పనితీరు స్పష్టం చేస్తోంది. -
తిరుమలలో మళ్లీ చెలరేగిన కార్చిచ్చు
-
తిరుమలలో మళ్లీ చెలరేగిన కార్చిచ్చు
వందలాది ఎకరాల్లో అడవి బుగ్గిపాలు సాక్షి, తిరుమల: తిరుపతి శేషాచల అడవుల్లో మళ్లీ కార్చిచ్చు చెలరేగింది. ఆదివారం శ్రీవారి మెట్టుకు సమీపంలోని నారాయణగిరి పర్వత శ్రేణుల్లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ అగ్నికి వందలాది ఎకరాల అడవి బుగ్గిపాలైంది. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైరింజన్లు మంటలు ఎగువ ప్రాంతంలోని జేఈవో క్యాంపు కార్యాలయం, ఇతర కాటేజీల వరకు మంటలు విస్తరించకుండా నిరోధించారు. ముందు జాగ్రత్తగా శ్రీవారిమెట్టు కాలిబాటలో వచ్చే భక్తులను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిపివేశారు. ఆ మార్గంలో ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాకే భక్తులను అనుమతించారు. అయితే గాలి వాలుతో మంటలు కింది భాగంలోని లోయ నుంచి కల్యాణి డ్యాం ఉండే అటవీ ప్రాంతంలోకి విస్తరించాయి. ఆ ప్రాంతంలో సాయంత్రం వరకు మంటలు రేగుతూనే ఉన్నాయి. దట్టమైన పొగ కూడా అలముకుంది. మంటలు అదుపుచేసే పనులను టీటీడీ సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షించారు. -
శేషాచలంలో మళ్లీ దావానలం..
-
శేషాచలంలో మళ్లీ దావానలం..
సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో ఆరు రోజులుగా రగిలిన కార్చిచ్చును ఆర్పివేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ కార్చిచ్చు రాజుకుంది. శ్రీవారిమెట్టు కాలిబాట ఆరంభంలో రోడ్డు పక్కనే గుర్తుతెలియని వ్యక్తులు అడవికి నిప్పుపెట్టడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కంగుతిన్న టీటీడీ, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికప్పుడే అందుబాటులో ఉన్న మూడు ఫైరింజన్లను రంగంలోకి దించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. తిరుమల, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కూడా మరికొన్ని ఫైరింజన్లు తెప్పించారు. ఇరుకైన అటవీమార్గంలో ఫైరింజన్ల పైపులు వెళ్లేందుకు కొంత ఇబ్బంది పడినా ఎట్టకేలకు మంటలను అదుపు చేశాయి. సాయంత్రం వెలుతురు సరిగా లేని కారణంగా ఓ హెలికాప్టర్ అగ్నిప్రమాద ఘటన స్థలంపై ఏరియల్ సర్వే నిర్వహించినా.. సహాయక చర్యల్లో మాత్రం పాల్గొనలేకపోయింది. ఇదిలావుంటే.. శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగే అవకాశాలను గుర్తించి, నివారించేందుకు ప్రతి సంవత్సరం చేపట్టే ‘ఫైర్ ట్రేసింగ్ ఆపరేషన్స్’ టీటీడీ వారు ఈ ఏడాది చేపట్టకపోవటం వల్లే దావానలాలు వ్యాపిస్తున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరు రోజులుగా కార్చిచ్చులో బుగ్గయిన శేషాచలం శుక్రవారం మధ్యాహ్నానికి పూర్తిగా చల్లబడింది. ఎయిర్ఫోర్స్కు చెందిన రెండు ఎంఐ17సీ-130 హెలికాప్టర్లు మంటలు చెలరేగిన కాకులకొండ, తుంబరు కోనల్లో మంటలు వచ్చిన ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో మొత్తం 2.5 లక్షల లీటర్ల నీటిని వెదజల్లాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు చివరిసారిగా హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఆపరేషన్ ముగిసిందని అధికారులు ప్రకటించారు. తిరుమల అడవులను ఆవరించిన దావానలాన్ని భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) విజయవంతంగా ఆర్పివేసిందని రక్షణ శాఖ కూడా బెంగళూరులో ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో.. రెండు రోజులుగా కాకులకొండ, తుంబురుకోనలో మంటలు ఆర్పే చర్యల్లో పాల్గొన్న 150 మంది సైనిక సిబ్బంది, అరక్కోణం, విశాఖపట్నంకు చెందిన 40 మంది నావికాదళం, చెన్నైలోని రాజస్థాన్ 25వ బెటాలియన్కు చెందిన 100 మంది అగ్నిమాపక సిబ్బంది వెనుతిరిగేందుకు సిద్ధమయ్యారు. కానీ.. సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు నడిచివచ్చే కాలిబాట మార్గమైన శ్రీవారిమెట్టు వద్ద అడవికి నిప్పు అంటుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే సైనిక, నౌకాదళం, అగ్నిమాపక సిబ్బందిని అక్కడికి పంపించారు.. వారు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో మంటలను ఆర్పివేశారు. ఈ సిబ్బంది మొత్తాన్నీ, ఆపరేషన్ శేషాచలాన్నీ మరో రోజు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. -
" 'అలా' చేసినందుకే... కొండల్లో అగ్నికీలలు"