ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రూరల్ పోలీసులకు అమెరికాలోని అంతర్జాతీయ పోలీసు అధిపతుల సంఘం(ఐఏసీపీ) ప్రకటించిన హోంల్యాం డ్ సెక్యూరిటీ ప్రత్యేక గుర్తింపు అవార్డు లభించింది.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రూరల్ పోలీసులకు అమెరికాలోని అంతర్జాతీయ పోలీసు అధిపతుల సంఘం(ఐఏసీపీ) ప్రకటించిన హోంల్యాం డ్ సెక్యూరిటీ ప్రత్యేక గుర్తింపు అవార్డు లభించింది. దీనిని ఆ జిల్లా ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎ.వెంకటరావులు సంయుక్తంగా అందుకున్నారు. అమెరికాలో గతవారం జరిగిన కార్యక్రమంలో వీరికి దీనిని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరినీ డీజీపీ జేవీ రాముడు బుధవారం అభినందించారు. విశాఖ జిల్లాలో మావోయిస్టుల్ని సమర్థంగా నియంత్రించడం, గిరిజనులకు ఉపాధి కల్పించి సేవలందించినందుకు రూరల్ పోలీసులకు ఈ అవార్డు లభించింది.