ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లర్ల ఆట కట్టించడానికి పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది.
జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లర్ల ఆట కట్టించడానికి పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఈ చర్యలో భాగంగా కడప జిల్లాలోని బద్వేల్ సమీపంలోని నెల్లూరు రోడ్డులో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను,పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి అక్రమంగా తరలిస్తున్న14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.