విశాఖ : ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విశాఖ జిల్లాలో అసమ్మతి సెగ రగులుతోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ నేత కన్నబాబు రాజు సోమవారం మధ్యాహ్నం ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని కన్నబాబు రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తామని చెప్పిన టీడీపీ అధ్యక్షుడు మాట తప్పారని, రాబోయే రోజుల్లో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు.
రెబల్గా బరిలోకి కన్నబాబు రాజు
Published Mon, Jun 15 2015 11:35 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement