మెప్మా సంఘటనను మరవకముందే మరో బాగోతం వెలుగు చూసింది. విద్యుత్ రాబడి కార్యాలయంలో పని చేస్తున్న సుమంత్ అనే కాంట్రాక్టు కార్మికుడు సుమారు పది లక్షలు స్వాహా చేశాడు .
ఎర్రగుంట్ల,న్యూస్లైన్: మెప్మా సంఘటనను మరవకముందే మరో బాగోతం వెలుగు చూసింది. విద్యుత్ రాబడి కార్యాలయంలో పని చేస్తున్న సుమంత్ అనే కాంట్రాక్టు కార్మికుడు సుమారు పది లక్షలు స్వాహా చేశాడు . పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరారయ్యాడు. ఎర్రగుంట్ల సబ్ స్టేషన్లోని ఈఆర్ఓ(ఎలక్ట్రికల్ రెవెన్యూ కార్యాలయం)లో వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లిస్తుంటారు. వినియోగదారులకు మాత్రం కట్టినట్లుగా బిల్లు ఇచ్చి ఆ డబ్బును సుమంత్ స్వాహా చేసేవాడు. ఈ విధంగా రూ. 10 లక్షలు స్వాహా చేశాడు. సకాలంలో బిల్లులు చెల్లించలేదని వినియోగదారుల కనెక్షన్లను విద్యుత్ సిబ్బంది కట్ చేయడంతో ఈ బాగోతం వెలుగు చూసింది.
తాము విద్యుత్ బిల్లులు చెల్లించినా తమ కనెక్షన్లు కట్ చేయడం ఏమిటని విద్యుత్ అధికారులను వినియోగదారులు నిలదీశారు. దీంతో అధికారులు విచారణ చేయగా రూ. 10 లక్షలు దుర్వినియోగం అయినట్లు తేల్చారు. ఇందులో రూ. 6 లక్షలను తిరిగి కట్టిన సుమంత్ మిగిలిన రూ. 4 లక్షలను చెల్లించలేక పరారయ్యాడు.దీంతో విద్యుత్ శాఖ ఏఓ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చే శారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. కాగా ఈ సంఘటనలో మరికొంత మంది ఉద్యోగుల హస్తం ఉండవచ్చని తెలుస్తోంది.