స్టేషన్ ఎదుట గిరిజనుల ఆందోళన | tribes dharna at police station | Sakshi
Sakshi News home page

స్టేషన్ ఎదుట గిరిజనుల ఆందోళన

Sep 30 2015 2:08 PM | Updated on Aug 21 2018 9:20 PM

చిత్తూరు జిల్లా పెద్దమండెం పోలీస్‌స్టేషన్ ఎదుట గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా పెద్దమండెం పోలీస్‌స్టేషన్ ఎదుట గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు. వివరాలు.. ఈ నెల 20వ తేదీన మండలంలోని బండకిందతాండకు చెందిన రవినాయక్‌ పై నాటుసారా అమ్ముతున్నాడని పోలీసులు కేసు పెట్టారు. ఈ విషయమై పోలీసులు రవినాయక్ ను స్టేషన్ పిలవగా కొడతారేమోననే భయంతో రవి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి రవినాయక్‌ను వేధిస్తున్నారని గిరిజనులు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement