tribes
-
గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం
ఆధునిక ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న గిరిజన తెగ ‘గడబ’ ఇప్పుడిప్పుడే తన రూపు మార్చుకుంటోంది. అయితే, వీరి అరుదైన సంస్కృతి అంతరించిపోకుండా కాపాడుకుంటోంది. ప్రాచీన కాలం నుంచి ఈ తెగ గోదావరి పరివాహక ప్రాంతానికి దాపుగా ఉంటోంది. ‘గ’ అంటే గొప్పతనం అని, ‘డ’ అంటే నీటికి సూచిక అని అర్థం. ‘గడ’ అంటే గొప్పదైనా నీరు అని, గోదావరి అనే పేరు ఉంది. ఒరియాలో ‘గడబ’ అంటే సహనం గలవాడు అని అర్థం. గడబ తెగలు ఒరిస్సా వింద్య పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. మధ్యప్రదేశ్లోనూ ఈ తెగ ఉంది. ఈ తెగను భాష గుటబ్! వీరిలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులూ ఉన్నారు. మన రాష్ట్రంలో గడబలు విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రముఖంగా కనిపిస్తారు. అటవీ ఉత్పత్తులే ఆధారంగా!వీరు గడ్డి, మట్టి, కలపను ఉపయోగించి ఇండ్లను నిర్మించుకుంటారు. ఈ గుడెసెలు త్రికోణాకారంలోనూ, మరికొన్నింటికి కింది భాగం గుండ్రంగా ఉండి పైకప్పు కోన్ ఆకారంలో ఉంటుంది. మహిళలు కుట్టని రెండు వస్త్రాల ముక్కలను ధరిస్తారు. అలాగే, రెండు వలయాలుగా ఉండే నెక్పీస్ను ధరిస్తారు. వీటిలో అల్యూమినియమ్, వెండి లోహం ప్రధానమైంది. తృణధాన్యాలు, వరి పండిస్తారు. అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడే వీరంతా సహజ పద్ధతుల్లో తయారుచేసుకున్న సారాయి, కల్లు పానీయాలను సేవిస్తారు. థింసా నృత్యంమహిళలు అర్థచంద్రాకారంలో నిలబడి, ఒకరి మీద ఒకరు చేతులు వేసి, ఒక వైపుకు లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నృత్యం చేస్తారు. వీరు నృత్యం చేస్తున్నప్పుడు పురుషులు సంగీతవాయిద్యాలను వాయిస్తారు. ఈ థింసా నృత్యం ఆధునిక ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సులువైన జీవనంఇంటిపేర్లను బట్టి వావివరసలను లెక్కించుకుంటారు. మేనబావ, మేనమరదలు వరసలు గలవారు వీరిలో ఎక్కువగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి వద్దని అమ్మాయి అనుకుంటే కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించి వారి సమక్షంలో ఓలి ఖర్చు పెట్టుకుంటే చాలు విడిపోవచ్చు. అబ్బాయి కూడా ఇదే పద్ధతి పాటిస్తాడు.అన్నీ చిన్న కుటుంబాలే!గడబలో ఎక్కువగా చిన్నకుటుంబాలే. వీరికి ఇటెకుల, కొత్త అమావాస్య, తొలకరి, కులదేవత పండగలు ప్రధానమైనవి. వీరిని గడ్బా అని మధ్య ప్రదేశ్లో, గడబాస్ అని ఆంధ్రప్రదేశ్లో పేరుంది.(చదవండి: నా నుదుటి రాతలోనే నృత్యం ఉంది..!) -
‘ఆరుద్ర’ను చూస్తే అనువైన వరుడు..
గిరిజనులకు తల్లీ తండ్రి ప్రకృతే. కొరత లేకుండా ధాన్యాన్ని పస్తులు ఉంచకుండా పంటల్ని పుష్కలంగా ఇవ్వడమే కాదు తమకు అనువైన తోడును కూడా ప్రకృతి మాతే తీసుకువస్తుందన్నది ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకం పెళ్లీడుకు వచ్చిన పడతుల్లో కోటి ఆశలను విరబూయిస్తుంది. ఆ ఆశలే ఇంటింటా సంబరమవుతాయి.పంట సాగు నుండి కన్నెపిల్లల పరిణయాల వరకు అంతా ప్రకృతి చెప్పిన విధంగానే నడుచుకుంటారు గిరిజనులు. అంతటి ప్రాధాన్యత కల్గిన వాటిల్లో ‘తీజ్’ పండుగ ముఖ్యమైనది."నాకు అరవై ఏళ్లు. మా చిన్నప్పుడు కూడా తీజ్ పండుగ చేసుకున్నాం. తీజ్ పెరిగిన తీరును చూసి మా అమ్మానాన్నలు, తండా పెద్దలు నాకు పెళ్లి చేశారు. ఇదే ఆనవాయితీ మా పిల్లలు కూడా చేస్తున్నారు0." – భూక్యా వీరమ్మ గన్యాతండ, మహబూబాబాద్తీజ్ అంటే..పెళ్లీడుకు వచ్చిన గిరిజన (లంబాడ) అమ్మాయిలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. గోధుమ నారునే కాదు ఈ కాలాన కనిపించే ఆరుద్ర పురుగులనూ తీజ్ అంటారు. ఎర్రగా అందంగా ఉండే ఆరుద్ర పురుగులను దేవుడు తమకోసం పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు మనసులో కోరుకున్న కోరిక ఫలిస్తుందని వీరి నమ్మకం.ఇంటింటి ఆశీస్సులు..పెళ్లీడుకు వచ్చిన యువతులు తమకు కావాల్సిన వరుడి కోసం చేసే ఈ పండగకు ముందు గా తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. యువతులందరు ఇంటింటికి వెళ్లి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, వారు కానుకగా ఇచ్చే విరాళం తీసుకోవడంతో తండా అంతా సందడిగా మారుతుంది. ఇలా సేకరించిన విరాళం (ధాన్యం) తో తమకు కావాల్సిన గోధుమలు, శనగలు, ఇతర సామాన్లు కొనుగోలు చేస్తారు.గోధుమ మొలకలు..తీజ్ పండుగలో ముఖ్యమైనది తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్ళి దుస్సేరు తీగలు తెచ్చి, బుట్టలను అల్లి, తమ ఆరాధ్య దైవం తుల్జా భవాని, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి, పుట్టమట్టిని తెస్తారు. మేకల ఎరువును కలిపి తండా నాయక్ చేతిలో ఉంచిన బుట్టలో ΄ోస్తారు. అప్పటికే నానబెట్టి ఉంచిన గోధుమలను అందులో వేస్తారు. శనగలకు రేగుముళ్లుతీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనగలకు యువతులు రేగుముళ్లు గుచ్చుతారు. ఈ ప్రక్రియను బావ వరుసయ్యే వారు పడతుల మనస్సు చెదిరేలా వారిని కదిలిస్తూ ఉంటారు.నియమ నిష్టలతో..తండాలోని యువతులందరు తమ బుట్టలను ఒకేచోట పెడతారు. ఈ తొమ్మిది రోజులు పెట్టిన బుట్టలకు నీళ్లు ΄ోస్తూ, వాటి చుట్టూ తిరుగుతూ గిరిజన నృత్యాలు, పాటలు పాడుతూ గడుపుతారు.ఏడవ రోజు ఢమోళీ.. ఏడవరోజు జరిగే ఢమోళీ చుర్మోను మేరామా భవానీకి నివేదిస్తారు. వెండితో చేసిన విగ్రహం, రూపాయి బిళ్ల అమ్మవారి ముందు పెట్టి మేక΄ోతులు బలి ఇచ్చే తంతును‘ఆకాడో’ అంటారు.దేవతల ప్రతిరూపాలకు..ఎనిమిదవ రోజు మట్టితో ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సాంప్రదాయాల ప్రకారం పెండ్లి చేస్తారు. ఆడపిల్లలు పెళ్లి కూతురుగా, మగ పిల్లలు పెళ్లికొడుకుగా ఊహించుకుంటూ ఈ తంతులో పాల్గొంటారు. పెళ్లి తర్వాత తమ కుటుంబ సభ్యులను విడిచి పెడుతున్నట్లు ఊహించుకుని ఏడ్వడం, వారిని కుటుంబ సభ్యులు ఓదార్చడంతో ఈ తంతును నిర్వహిస్తారు.తొమ్మిదవ రోజు నిమజ్జనం..డప్పు చప్పుళ్లు, నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను అందజేస్తారు. యువతులు ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ పూజాఫలంగా పెరిగిన తీజ్ను అన్నదమ్ముళ్లకు ఇచ్చి.. వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తర్వాత యువతీ, యువకులు బుట్టలను పట్టుకొని ఊరేగింపుగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. – ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్, ఫొటోలు: మురళీ కృష్ణ -
అడవి బిడ్డల ఆనందం
సాక్షి, అమరావతి: అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన తెగలు ప్రగతి బాటలో పురోగమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాల జారీ, దేశంలో తొలిసారిగా ఏజన్సీ రైతులకు రైతు భరోసా లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు గిరిజనాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, అటవీ సంపదతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసింది. అడవితో ముడిపడిన గిరిజనుల జీవితం అక్కడి నుంచే అభివృద్ధి చెందేలా బాటలు వేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం, పోడు భూముల సాగును ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తోంది. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నేతృత్వంలో ఇ.రవీంద్రబాబు, జి.చిన్నబాబు, నాగరాజు చిక్కాల రూపొందించిన నివేదికను గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు జె.వెంకట మురళి ఆవిష్కరించారు. గిరిజన యువత, కళాకారులు, నాయకులు, అధికారులతో సహా పలువురిని భాగస్వాములను చేశారు. ఆర్వోఎఫ్ఆర్, పీసా, 1 ఆఫ్ 70 చట్టాలు, గిరిజన జీవనోపాధి, సంప్రదాయ కళారూపాలు, అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించడంతోపాటు గిరిజనులకు సంబంధించిన పలు పుస్తకాలను అధ్యయనం చేశారు.సాగు.. నైపుణ్యాభివృద్ధి.. మార్కెటింగ్పాడేరు, రంపచోడవరం, సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16 గ్రామాల్లో అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించారు. సాగు, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ ద్వారా గిరిజనులకు మరింత మేలు చేయవచ్చని నివేదిక సూచించింది. పంటల సాగులో మెళకువలతోపాటు నైపుణ్యాభివృద్ధి చర్యల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొంది. నల్ల మిరియాలు, మిర్చి, కొండ చీపుర్లు లాంటి అటవీ ఉత్పత్తులు, సాగును ప్రోత్సహించడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించవచ్చని సూచించింది. ప్రధానంగా అత్యంత బలహీన గిరిజన సమూహాలైన (పీవీటీజీ) మూక దొర, భగత, కొండ దొర, సవర, కొండ రెడ్డి తెగల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆదాయం లభించేలా కొండ చీపుర్లు, గడ్డి పెంపకం, మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణ, అవగాహన కల్పించాలని నిర్దేశించింది. కాఫీ తోటల్లో అంతర పంటలుగా నల్ల మిరియాల సాగును ప్రోత్సహించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచవచ్చు. దీంతోపాటు మిర్చి రకాల సాగుపై అవగాహన పెంచడం, అధిక దిగుబడులు సాధించేలా పరిజ్ఞానాన్ని అందించడం, మంచి ధర దక్కేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడం ద్వారా గిరిజనులకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధ్యయనంలో పేర్కొంది.అడవి బిడ్డలకు అండగా సీఎం జగన్⇒ గిరిజనులకు ముఖ్యమంత్రి జగన్ కొండంత అండగా నిలిచారు. నవరత్నాల సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భూమిపై హక్కులు కల్పించి సాగుకు ఊతమిచ్చారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో గిరిజన కుటుంబాలకు ఏకంగా 3.22 లక్షల ఎకరాలను అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం పట్టాలు అందించడం దేశంలోనే రికార్డు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి దివంగత వైఎస్సార్ శ్రీకారం చుట్టగా సీఎం జగన్ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలతోపాటు డీకేటీ పట్టాలు పంపిణీ చేసి ఆ భూములను సాగులోకి తెచ్చేందుకు ఉపాధి హామీతో చేయూతనందించారు. ⇒ దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 3,40,043 మంది గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు సమకూర్చారు. అల్లూరి జిల్లాలో 2,58,021 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 2,46,139 మంది గిరిజన రైతులకు అన్ని విధాలా అండంగా నిలిచారు. కాఫీ తోటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పెట్టుబడి సాయం, రుణాలు, యంత్రాలు లాంటివి అందించారు. అంతర పంటగా మిరియాల సాగుకు అవసరమైన పరికరాలు అందించారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర దక్కేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా జీసీసీ చెల్లిస్తోంది. శ్రీశైలం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనుల ద్వారా సేకరిస్తున్న తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి ‘గిరిజన్‘ బ్రాండ్తో మార్కెటింగ్ చేస్తున్నారు. గిరిజన రైతులకు వ్యవసాయం, కాఫీ సాగుకు జీసీసీ రుణాలు అందచేస్తోంది. -
ప్రకృతి ఒడిలో పల్లవించే సంగీతం
వాయిద్యాలు వారికి సరిగమలు తెలియవు. శృతి లయలు అసలే తెలీదు. కానీ శ్రవణానందంగా పాడగలరు. శ్రోతలను రంజింపజేయగలరు. తకిట తథిమి అనే సప్తపదులు నేర్చుకోలేదు. కానీ లయ బద్ధంగా అడుగులు వేయగలరు. సంప్రదాయ నృత్యరీతుల్లో ఎన్ని మార్పులొచ్చినా... తరతరాలుగా అలవాటైన పద విన్యాసాలనే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ప్రకృతిని పరవశింపజేస్తున్నారు. ఇందుకోసం వినియోగించే వాయిద్య పరికరాలు కూడా వారు సొంతంగా తయారు చేసుకున్నవే. ఇంతగొప్ప నైపుణ్యం గలిగిన వీరు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో జీవిస్తున్నారు. పురాతనంగా వస్తున్న సంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తూప్రకృతి ప్రసాదించిన అడవితల్లి ఒడిలో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి జీవనం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. బుట్టాయగూడెం: దట్టమైన అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా కొండ కోనల నడుమ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న కొండరెడ్డి గిరిజనుల జీవనశైలి విచిత్రంగా ఉంటుంది. సంస్కృతీ, సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. వీరికి బయటి ప్రపంచంతో పనిలేదు. అటవీ ప్రాంతమే వారికి ఆలవాలం. చుట్టూ కొండకోనలు వాగు వంకలతో అలరారే గిరి పల్లెల్లో ప్రకృతి నేరి్పన సంగీతం, నాట్యంతోనే జీవితాన్ని ఆనందంగా మలచుకుంటున్నారు.గిరిజనుల్లోనే కోయ తెగకు చెందిన వారు ‘రేరేలయ్య.. రేల... రేరేలా... రేలా..’ అంటూ పాడుకుంటే... కొండరెడ్లు ‘జొన్నకూడు.. జొన్న విల్లు.. జొన్నకూలితే.. పోతేనత్త’ అంటూ కొత్త పంటలు వచ్చిన సమయంలో పసుపు పచ్చ పండగ, మామిడి పండగ, చింత పండగ, భూదేవి పండగల్లో పాడుకుంటారు. అలాగే పెళ్లిళ్ల సమయంలో కొండరెడ్లు ‘కళ్లేడమ్మ.. కళ్లేడమ్మ.. గోగుల పిల్లకు.. కెచ్చెల పిల్లోడు’ అంటూ పెళ్లికి సంబంధించిన పాటలు పాడుతూ లయ బద్ధంగా డోలు వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఇప్పటికీ గిరిపల్లెల్లో పండుగలు, శుభ కార్యాల్లో ఆదివాసీ గిరిజన సంప్రదాయ డోలు, కొమ్ముల నృత్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. సొంతంగా వాయిద్య పరికరాల తయారీ కొండరెడ్డి గిరిజనులు వాయిద్య పరికరా లు సొంతంగా తయారు చేసుకుంటారు. అడవిలో లభించే ఉస్కటేకు, వేగెసా చెట్ల తో డప్పుల నమూనాలను తయారు చేసి వాటికి మేక చర్మాలను అతికించి వాయి ద్య పరికరాలను తయారు చేసుకుంటారు. అలాగే అడ్డతీగ గిల్లలతో గుత్తులు కట్టి డప్పు వాయిద్యాల నడుమ ఆ గిల్లలు ఊపుతూ చక్కటి తాళంతో మహిళలు నృత్యం చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా గ్రామాల్లో పండగ సమయాల్లో నృత్యాలు చేస్తారు. బాట పండగ, పప్పు పండగ, మామిడి పండగ నాడు వీరి ఆటపాటలతో కొండలు ప్రతిధ్వనిస్తుంటాయి. పోడు వ్యవసాయమే జీవనాధారం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో సుమారు 11వేల మంది కొండరెడ్డి గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకునే వీరు పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కొండ దిగి బయట ప్రపంచం వైపు రారు. ఆయా గ్రామాల్లో అందరూ కలిసి కట్టుగా ఉంటూ అన్ని శుభకార్యాలను వారి సంప్రదాయంలో ఎంతో వైభవంగా చేసుకుంటారు. పూర్వికుల నుంచి వస్తున్న సంప్రదాయం మా పూర్వీకుల నుంచి గ్రామాల్లో శుభకార్యాలకు డోలు కొయ్య నృత్యాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్నే మేం కొనసాగిస్తున్నాం. సమాజంలోని మార్పుల వల్ల ఎన్ని కొత్త రకాల వాయిద్యాలు వచ్చినా మా డోలు కొయ్యి వాయిద్యమే మాకు వినసొంపుగా ఉంటుంది. అందులోనే మాకు సంతోషం ఉంటుంది. మాకు ప్రకృతి నేరి్పన సంగీతమిది. – బొల్లి విశ్వనాథరెడ్డి ఆ నృత్యాల్లో అందరం మైమరచిపోతాం మా గిరిజన గ్రామాల్లో ఏటా వేసవిలో బాట పండగ, పప్పు పండగ, మామిడి పండగతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో మేం తయారు చేసుకొన్న వాయిద్య పరికరాలు వాయిస్తూ లయబద్ధంగా నృత్యాలు చేస్తాం. ఆ సమయంలో చిన్నాపెద్ద తేడా ఉండదు. అందరూ కలసి సంతోషంగా ఆనందంగా నృత్యాలు చేస్తాం. ఇది మా పూర్వికుల నుంచి వస్తున్న ఆచారం. – గోగుల గంగరాజు రెడ్డి -
ఆదిలాబాద్ లో ఆదివాసీల అరెస్ట్
-
నేతలకు మేం ఓట్లప్పుడే గుర్తుకు వస్తాం: గిరిజనులు
-
చీమల చట్నీ-గోంగూర, తింటారు నోరూర! తేడా వస్తే చీమల చికిత్స కూడా!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గల్లీలో ఉండే చిన్న హోటల్లోనే పొద్దున ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా ఇంకా ఎన్నో వెరైటీ టిఫిన్లు దొరుకుతాయి. ఇక మధ్యాహ్నం అన్నం, రెండు మూడు రకాల కూరలు, పప్పు, చారు, పెరుగు ఇవన్నీ లేనిదే ముద్ద దిగదు. ఇక ఏ స్టార్ హోటల్కి వెళ్లినా ఏ దేశపు వంటకాలైనా ఆర్డర్చేస్తే చాలు టేబుల్పై హాజరు... ఇవీ మైదాన ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు. కానీ అడవుల్లో జీవించే ఆదివాసీలు ఏం తింటారు? సీజన్లో దొరికే గోంగూర, చింతపండు, మిరపకాయలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆహార సేకరణ కష్టంగా మారిన సమయంలో ఎర్రచీమలతో పచ్చడి నూరుకుని కూడా తింటుంటారు. అయితే మారిన పరిస్థితుల్లో విద్య, ఉద్యోగాల కోసం అడవుల నుంచి బయటపడుతున్న వారి ఆహారపు అలవాట్లలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు చోటు చేసుకుంటోంది. వలస ఆదివాసీలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలు రెండు దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలకు ఆశ్రయం ఇస్తున్నాయి. వలస ఆదివాసీల్లో అనేక తెగలు ఉండగా, వీరిలో 90 శాతం మంది రోడ్డు, నీళ్లు, విద్యుత్ సౌకర్యం లేకుండా అటవీ ప్రాంత పల్లెల్లోనే ఉంటున్నారు. పోడు సాగు చేసుకోవడం, ఇంటి ఆవరణలోనే తినే ఆహార పదార్థాలను పండించుకోవడం వీరి జీవనశైలి. గోంగూర.. పండుగే.. వానాకాలంలో మొలకెత్తే గోంగూర ఆగస్టులో తినేందుకు అనువుగా ఎదుగుతాయి. ఆ సమయంలో ఆదివాసీలు గోంగూర పండుగ చేసుకుంటారు. చింతకాయలు అందుబాటులోకి వచ్చే వరకు గోంగూరే వీరి ప్రధాన ఆహారం. వానాకాలం ముగిసేలోగా అందుబాటులో ఉన్న గోంగూర ఎండబెట్టుకుని వేసవి వరకు వాడుకుంటారు. ఎండాకాలంలో చింతకాయలు రాగానే పచ్చడి చేసుకుంటారు. గోంగూరతో పాటు పచ్చకూర (చెంచలి), బొద్దుకూర, నాగళి, టిక్కల్ అనే ఆకుకూరలు, కొన్ని రకాలైన దుంపలను కూడా వండుకుంటారు. కారం కావాలంటే.. మొదట్లో అటవీ ఫలసాయం తప్ప వ్యవసాయం తెలియని ఆదివాసీలను కారం రుచి మైమరపించింది. గోంగూర, చింతకాయ పచ్చడికి అవసరమైన మిరపకాయలు అపురూపమైన ఆహారంగా మారింది. దీంతో మిరపకాయల కోసమే ఎత్తయిన కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ.. వాగులు, వంకలు దాటుతూ రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి గోదావరి తీరానికి చేరుకునేవారు. ప్రారంభంలో భద్రాద్రి ఏజెన్సీలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటను దొంగిలించుకెళ్లేవారట. ఆ తర్వాత ఇక్కడ పనిచేసి, కూలీగా మిర్చి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇక పోడు సాగు కోసం ఆదివాసీలు అడవిని నరికేటప్పుడు ఇప్ప, మద్ది, తునికి, చింత, పాల చెట్లు తారసపడితే ముట్టుకోరు. ఇక ఇప్ప చెట్టునయితే దైవంతో సమానంగా కొలుస్తారు. చీమలు... ఆహారంగానే కాదు.. వైద్యానికి కూడా ఆకు రాలే కాలం మొదలైన తర్వాత వసంతం వచ్చే వరకు ఆదివాసీలకు ఆహార సేకరణ కష్టంగా మారుతుంది. ఈ సమయంలో చీమలను ఆహారంగా తీసుకుంటారు. సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఎర్రచీమలను వాటి గుడ్లను సేకరిస్తారు. అనంతరం ఉప్పు, కారం, టమాటా కలిసి రోట్లో వేసి రుబ్బుతారు. ఇలా తయారు చేసిన చట్నీని బస్తరియాగా పిలుస్తారు. ఈ పచ్చడిని వారు ఇష్టంగా తింటారు. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫామిక్ యాసిడ్ ఉండడమేకాక ప్రొటీన్, కాల్షియం సమృద్ధిగా ఉండి జ్వరం, జలుబు, దగ్గు, కంటి సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు. అలాగే ఒంట్లో నలతగా ఉన్నా, తలనొప్పి, జ్వరంగా అనిపించినా చీమల చికిత్సకే మొగ్గు చూపుతారు. చెవులు, ముక్కుల ద్వారా చీమలు శరీరంలోకి వెళ్లకుండా ముఖాన్ని వస్త్రంతో కప్పేసుకుని చీమల గూడును ఒంటిపై జల్లుకుంటారు. వందల కొద్ది చీమలు శరీరాన్ని కుడుతుండగా.. మంట పుట్టి క్షణాల్లో ఒళ్లంతా చెమటలు వస్తాయి. రెండు, మూడు నిమిషాలు ఉన్న తర్వాత చీమలు తీసేస్తారు. తద్వారా ఒంట్లో ఉన్న విష పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లి ఉపశమనం కలుగుతుందని వారి నమ్మకం. కాగా, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలనే పండించి ఆహారంగా తీసుకునేవీరు క్రమంగా బియ్యానికి అలవాటు అవుతున్నారు. వ్యవసాయంలో ఎరువులు సైతం ఉపయోగిస్తున్నారు. గతంలో ఆవు పాలు తీసుకోని వీరు.. ఇప్పుడిప్పుడే పాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ గిరిజన పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు నెమ్మదిగా మైదాన ప్రాంత ఆహారపు అలవాట్లు చేసుకుంటున్నారు. చీమల చట్నీకి జీఐ ట్యాగ్.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఆదివాసీలు తమ ఆహారంలో చీమల చట్నీకి తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఎర్రచీమలతో తయారు చేసే ఈ పచ్చడి ఔషధపరంగానూ ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు. చీమల చట్నీకి జీఐ టాగ్ సైతం లభించడం గమనార్హం. జొన్నలు, సజ్జలు తింటే తొందరగా ఆకలి వేయదు ఇంతకు ముందు జొన్నలు, సజ్జలు తినేవాళ్లం. పొద్దున తిని అడవికి వెళితే రాత్రి వరకు ఆకలి అనేది ఉండకపోయేది. కానీ బియ్యంతో చేసిన అన్నం అయితే రోజుకు రెండుసార్లు తినాల్సి వస్తోంది. ఇది తప్పితే బియ్యంతో చేసిన అన్నం బాగుంది. – మామిడి అరవయ్య (కూలీ, రెడ్డిగూడెం ఎస్టీ కాలనీ, పాల్వంచ మండలం) -
కామారెడ్డిలో ఫారెస్ట్ అధికారులను నిర్బంధించిన తండావాసులు
-
కట్నం ఉండదు.. ఉత్కృష్టమైన సంస్కృతికి వారసులు, వారధులు
వారే వారసులు.. అనాది జీవన విధానానికి, అపురూప సంస్కృతికి, అరుదైన సంప్రదాయాలకు శాశ్వత చిరునామా వారు. వారు వారధులు కూడా.. నిన్నటి తరం వదిలిపెట్టిన వన సంపదను రేపటి తరానికి అందించే బాధ్యతను మోస్తున్నారు. పచ్చటి కొండకోనలను వేల ఏళ్లుగా రక్షిస్తూ, బతుకులను అడవి తల్లి సంరక్షణకు అర్పిస్తూ ఆదివాసీలు అందరికీ మేలు చేస్తున్నారు. అడవి ఇంకా బతికి ఉందంటే అదంతా వారి పుణ్యమే. అందుకే ఓ చల్లటి గాలి వీచినా, వెచ్చటి చినుకు పడినా మొదటి కృతజ్ఞత వారికే దక్కాలి. నేడు ఆదివాసీ దినోత్సవం. ఆహారం నుంచి ఆహార్యం వరకు అన్నింటా విభిన్నంగా కనిపించే వారి జీ‘వన’శైలి ఎప్పటికీ ప్రత్యేకమే. ఎల్ఎన్ పేట: కళ్లు తెరిస్తే పచ్చటి అడవి. తలెత్తి చూస్తే కొండ శిఖరం. అడుగు మోపితే ఆకుల తివాచీలు. ఆదివాసీల జీవనం ఎంత విశిష్టమో అంతే విభిన్నం కూడా. ఉద్యోగాలు వచ్చి కొందరు వనం వదలి వచ్చేసినా ఇంకా ఆ అడవి ఒడిలో ఎందరో బతుకుతున్నారు. కొండపోడు చేసుకుంటూ అడవి తల్లికి కాపు కాస్తున్నారు. వారి కట్టు, బొట్టు పరిశీలిస్తే అనాది సంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయనడానికి సాక్ష్యం లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో.. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్ ప్లాన్ మండలాలు ఉన్నాయి. మన్యం జిల్లాగా విడిపోయిన తర్వాత సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, భామిని ఈ నాలుగు మండలాలు మన్యం జిల్లాకు వెళ్లగా.. మిగిలిన 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో 74వేల గిరిజన కుటుంబాలు, సుమారు రెండు లక్షల మంది జనాభా ఉన్నారు. 301 గిరిజన గ్రామ పంచాయతీల్లో 103 షెడ్యుల్ గ్రామాలు కాగా, 1282 నాన్ షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. పోడు పంటలే ప్రధానం గిరిజనులకు పోడు పంటలే జీవనాధారం. జొన్నలు, సజ్జలు, రాగులు, గంటెలు, కంది, అరటి, బొప్పాయి, జీడి, సీతాఫలం, పైనాపిల్, పనస, పసుపు, అల్లం, కొండ చీపుర్లు, ఆగాకర, కర్రపెండ్లం, చీమ మిరప, జునుములు వంటి అనేక పంటలు పండిస్తారు. ఉదయాన్నే పనిచేసుకునేందుకు కుటుంబమంతా పోడు వద్దకు చేరుకుని సాయంత్రానికి ఇంటికి వస్తారు. రసాయన ఎరువులు, పురుగుల మందులు లేని పంటలు పండిస్తారు. ఐకమత్యమే బలం.. గిరిజనుల్లో ఎన్ని మూఢ నమ్మకాలు ఉన్నా.. అంతా కలిసికట్టుగా బతకడమే వారి బలం. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అంతా ఒక చోట కు చేరి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, కార్యక్రమం చేయాలన్నా అందరూ తలో కొంత సాయం చేసుకుంటారు. ఒకరు మాట ఇచ్చారంటే ఊరంతా ఆ మాటకు కట్టుబడి ఉంటారు. కట్నం ఉండదు గిరిజనుల ఇంట పెళ్లి జరిగితే కట్నం అనే మాట ఉండదు. కట్నం ఎందుకు తీసుకోవటం లేదని ఎవరైనా వారిని ప్రశ్నిస్తే.. ‘ఆడపిల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి డబ్బులు ఇస్తారు. అప్పు కోసం వారు ఎన్నో బాధలు పడాలి. అలాంటి డబ్బు తీసుకోక పోవటమే మంచిది’ అంటారు. అయితే సారె సామాన్లు మాత్రం స్వీకరిస్తారు. జిల్లాల విభజన తర్వాత.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత శ్రీకాకుళంలో ఉన్న సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాలోకి వెళ్లింది. ఐటీడీఏను ఉమ్మడిగా కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఇటు శ్రీకాకుళం, అటు మన్యం జిల్లా పార్వతీపురంతో కలిసి సీతంపేట ఐటీడీఏ కొనసాగుతోంది. మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించుకోవటం ఇదే మొదటిసారి. ఈ పండగను ఘనంగా నిర్వహించేందుకు అటు అధికారులు, ఇటు గిరిజన సంఘాల నాయ కులు ఏర్పాట్లు చేస్తున్నారు. (క్లిక్: కార్పొరేట్లకు ఆదివాసీలను బలిపెడతారా?) మరింత ప్రోత్సాహం ఇవ్వాలి.. గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం ఇవ్వాలి. ఇంకా అనేక మంది గిరిజనులు అమాయకంగానే జీవిస్తున్నారు. పోడు భూమికి పట్టాలు ఇచ్చి పూర్తి హక్కు కల్పించాలి. పోడు పంటలు పండించే గిరిజన రైతులను గుర్తించి అంతరించి పోతున్న పంటల సాగును ప్రోత్సహించాలి. – పడాల భూదేవి, చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం అధ్యక్షురాలు, శ్రీకాకుళం -
కార్పొరేట్లకు ఆదివాసీలను బలిపెడతారా?
‘జల్, జంగిల్, జమీన్ ఔర్ ఇజ్జత్’ కోసం పోరాడే ఆదివాసీ ప్రజలను ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరిట అంతం చేస్తూనే ఆ తెగ బిడ్డనే రాష్ట్రపతిని చేయడం ఓ కళ! ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలనలో దళితులు, ఆదివాసీలు తీవ్రమైన దాడులకు గురవుతున్నారు. వారి హక్కులు హరించివేయబడుతున్నాయి. రాజ్యాంగం 5వ షెడ్యూల్లోని భూమిని వినియోగించుకునేందుకు గిరిజనుల అంగీకారం కావాలన్న క్లాజును తొలగించారు. గనులపై ఉన్న గిరిజన హక్కులను కాలరాశారు. షెడ్యూల్డు కులాల, తెగల సబ్ ప్లాన్ నిధులు భారీకోతలకు గురవుతున్నాయి. ఆటవీ సంరక్షణ చట్టం –1980 ప్రకారం రూపొందించబడిన ప్రస్తుత అటవీ సంరక్షణ నియమాలను సవరించడానికి... ‘అటవీ సంరక్షణ నియమాలు– 2022’ పేరుతో కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2022 జూన్ 28న నోటిఫికేషను విడుదల చేసింది. 2004, 2014, 2017లలో సవరణల తర్వాత రూపొందించిన అటవీ సంరక్షణ నియమాలను ఈ కొత్త సవరణలు మార్పు చేస్తాయి. రియల్ ఎస్టేట్ చేపట్టే భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు, ప్రాజెక్టులు, చెట్ల నరికివేత, ఇతర అభివృద్ధి పనులకు నిబంధనల్ని సడలించారు. అడవుల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనులు, ఇతరుల అనుమతి అవసరం లేకుండా... భూముల కేటాయింపు జరగనున్నది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ ఇకపై ఇష్టానుసారంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఆదివాసీలకు నష్టపరిహారం చెల్లించే విధానం రియల్ మాఫియాకు అనుకూలంగా కేంద్రం మార్చింది. ఉదాహరణకు 5 నుంచి 40 హెక్టార్ల అటవీ భూములపై స్క్రీనింగ్ కమిటీ 60 రోజుల్లో కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నోటిఫై చేసిన కొత్త నిబంధనావళిపై పర్యావరణ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూ కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందని ఆదివాసీ లు ఆరోపిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం 2003–06లో పేర్కొన్న నిబంధనావళి స్థానంలో కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందనీ, ఇది అత్యంత ప్రమాదకరమైన విధానమనీ ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2006 అటవీ హక్కులు చట్టం ప్రకారం మౌలిక వసతులు, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కట్టడం చేపట్టాలన్నా, ఇతర పనులు చేపట్టలన్నా... అక్కడ నివసించే అడవి బిడ్డల అనుమతి, అంగీకారం తప్పనిసరి. అటవీ భూముల్ని ప్రభుత్వాలు ఏకపక్షంగా వేరే అవసరాలకు వాడటానికి వీల్లేదు. ప్రస్తుత చట్ట సవరణల వల్ల... ఏదైనా ప్రయివేటు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వగానే, ఇకపై ప్రయివేటు డెవలపర్స్ భూముల్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్వాసితులు, బాధితులకు నష్టపరిహారం అందజేస్తుంది. ఇదంతా అయిన తర్వాత బాధితుల పునరావాసం, వారి అటవీ హక్కుల పరిరక్షణ జరిగిందా? లేదా? అన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆదివాసీలు, గిరిజనుల అంగీకారంతో సంబంధం లేకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. (క్లిక్: ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనా?) కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ‘అటవీ సంరక్షణ నియమావళి 2022’ ఉపసంహరించాలి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహ రించుకోవాలి. ఆదివాసీ ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఆదివాసీ అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. (క్లిక్: రక్తక్షేత్రం వెలుగులో దళిత ఉద్యమ ప్రజ్వలనం) - వూకె రామకృష్ణ దొర ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ (ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం) -
సీత్ల పండుగ; ఆటా, పాటా సంబురం
గిరిజనులైన లంబాడీలు (బంజారాలు) ఎంతో పవిత్రతో జరుపుకునే మొదటి పండుగ సీత్ల పండుగ. ఆ రోజు సీత్లా భవానీని పూజిస్తారు. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా భవానీ కాపాడుతుందని బంజారాల నమ్మకం. తండాలో ఉన్న పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వంటివి పెరగాలనీ, దూడలకు పాలు సరిపోను ఉండాలనీ, గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలనీ, అటవీ సంపద తరగకూడదనీ, సీత్ల తల్లికి మొక్కులు తీర్చు కుంటారు. వివిధ తండాల్లో ఆయా తండాల పెద్ద మనుషు లంతా కలిసి ఆషాఢమాసంలో ఒక మంగళవారాన్ని ఎంచుకొని సీత్ల పండుగను జరుపుతారు. ఇలా ప్రతి సంవత్సరం మంగళవారం రోజు మాత్రమే జరపడం ఆనవాయితీగా వస్తోంది. తండాల సరిహద్దుల్లోని పొలి మేరల కూడలి వద్ద సీత్ల భవానీని ప్రతిష్టిస్తారు. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు, మేకలతో; మహిళలు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అమ్మవారు ఉన్న ప్రదేశానికి వెళ్తారు. ఈ క్రమంలో అందరూ కలిసి పాటలు పాడుతారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు మేకలను బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. ఓ బంజారా పెద్ద మనిషిని పూజారిగా ఉంచి ఆయన చేతుల మీదుగా దేవత పూజా కార్యక్రమం నిర్వహిం చడం బంజారాల ఆచారం. పూజా కార్యక్రమం అంతా గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. – నరేష్ జాటోత్, నల్లగొండ -
సంచారుల కేరాఫ్ అడ్రస్.. మిత్తల్ పటేల్
అవి చేద్దాం ఇవి చేద్దాం అని జీవితంలో ఎన్నో కలలు కంటుంటాం కానీ, అన్నీ నిజం కావు. కొంతమంది కలలు ఒకరకంగా ఉంటే వారి డెస్టినీ మాత్రం మరోలా ఉంటుంది. కొన్నిసార్లు కల చెదిరినప్పటికీ డెస్టినీ చూపిన మార్గంలో మరెంతోమంది కలలను నిజం చేసే అవకాశం లభిస్తుంది. ఇలా లభించిన అవకాశంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది మిత్తల్ పటేల్. చిరునామా లేని వేలమందికి గుర్తింపు కార్డులతోపాటు, ఒక అడ్రెస్ను ఏర్పాటు చేసి, జనజీవన స్రవంతిలో కలుపుతోంది. గుజరాత్లోని సంఖల్పూర్లోని ఓ రైతు కుటుంబంలో పుట్టింది మిత్తల్ పటేల్. చిన్నప్పటి నుంచిఐఏఎస్ అధికారి కావాలనేది ఆమె కల. బీఎస్సీ అయ్యాక ఐఏఎస్ కోచింగ్ కోసం అహ్మదాబాద్ వెళ్లింది. ఒకపక్క ఐఏఎస్కు సన్నద్ధమవుతూనే గుజరాత్ విద్యాపీఠ్లో జర్నలిజం కోర్సులో చేరింది. ఇక్కడే ఆమె జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. రెండు నెలల ఫెలోషిప్లో భాగంగా బార్డోలి గ్రామానికి వెళ్లింది మిత్తల్. అక్కడ ఓ సంచార తెగను చూసింది. ఈ తెగకు చెందిన వాళ్లలో కొందరు ఏవో చిన్నపాటి గుడ్డపీలికలు మాత్రమే ధరించడం, మరికొందరు అదీ లేకుండా అలాగే ఒకచోటనుంచి మరో చోటుకి వలస వెళ్తుండడం వల్ల రోజుల తరబడి తిండిలేక బక్కచిక్కిన శరీరాలను చూసి ఆమె చలించిపోయింది. పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది మిత్తల్కు. వీరికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. రెండేళ్ల పాటు సంచార జాతుల గురించి పూర్తిగా తెలుసుకుని వారి కనీస అవసరాలు తీర్చి, వారికో గుర్తింపు ఇవ్వాలని పూనుకుంది. వీరి గురించి ఎంతోమంది అధికారులకు విన్నవించింది. వారికి సాయం చేయడానికి ఏ సీనియర్ అధికారీ ముందుకు రాలేదు. ప్రభుత్వ అధికారులే ఏం చేయలేనప్పుడు .. నేను ఆఫీసర్ను అయితే మాత్రం ఏం లాభం అనుకుంది. అప్పటిదాకా ఐఏఎస్ పరీక్షకు సిద్ధమైన మిత్తల్ ప్రిపరేషన్ను పక్కన పెట్టింది. విచారత సంస్థాన్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరిగే సంచార జాతులు ఒక్క గుజరాత్లోనే 40 రకాలు ఉన్నారు. ముఫ్పై నుంచి నలభై లక్షల వరకు జనాభా ఉండే ఈ సంచారులకు ఆధార్ కార్డు, ఓటరు కార్డు, జనన ధ్రువీకరణ, చిరునామా సంబంధిత పత్రాలు ఏవీలేవని గుర్తించింది. వీరికి కనీస అవసరాలు కల్పించడానికి పూర్తిస్థాయిలో పనిచేయాలనుకుంది. భర్త ప్రోత్సహించడంతో 2015 విచారత కమ్యునిటీ పేరిట ఎన్జీవోను ప్రాంభించింది. సంచార జాతులను వెతకడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరికి సంబంధించిన పెళ్లిళ్లు, ఇతర విందు వినోద కార్యక్రమాల వద్దకు వెళ్లి వారి గురించి వివరాలు అడిగేది. ఈమె ఎవరో ఏమిటో తెలియక మొదట్లో తిరస్కరించినప్పటికీ తరువాత ఆమెను నమ్మి తమ వివరాలు చెప్పేవారు. వాళ్లు నివసించే ప్రాంతంలో టెంట్ వేసుకుని మరీ వారి స్థితిగతులను అధ్యయనం చేసేది. ఈ క్రమంలోనే పద్నాలుగు వందల కుటుంబాలకు పక్కా ఇళ్లను సమకూర్చింది. విచారత ఆధ్వర్యంలో మూడు హాస్టల్స్ను నిర్మించింది. వీటిలో వందలమంది సంచారుల పిల్లలు చదువుకుంటున్నారు. ఐడెంటిటీతో అందర్ని కదిలించింది గుజరాత్ ఎలక్షన్ కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరి చుట్టూ తిరిగి సంచారులకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని వినతి పత్రం సమర్పించింది. చివరికి 2010లో తొంబై వేలమంది సంచారులకు రాష్ట్రప్రభుత్వం ఐడెంటిటీ కార్డులు జారీ చేసింది. ఇదే సమయంలో విచారత సంస్థాన్ ‘అమె పన్ చియే’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా సంచారులకు ఐడెంటిటీ కార్డులు అందించారు. అప్పట్లో ఈ కార్యక్రమం అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను ఆకర్షించింది. దీంతో ఆ తరువాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల్లో పార్టీలన్నీ సంచారులకు అనేక హామీలు ఇచ్చాయి. ఊరు, పేరు లేని సంచారులకు ఐడెంటిటీని కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మిత్తల్ని 2017లో ‘నారీ రత్న’ అవార్డు వరించింది. దాదాపు పదిహేనేళ్లుగా సంచారుల అభ్యున్నతికి పాటుపడుతోన్న మిత్తల్ ప్రస్తుతం రాజాస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లలోని సంచార, బంజార జాతుల అభివృద్ధే లక్ష్యంగా నిర్విరామంగా కృషిచేస్తోంది. చదవండి: అన్నాఖబాలే దుబా..: సేవలో.. ది బెస్ట్! -
మనందరి పూర్వీకుల పురిటిగడ్డ ఆఫ్రికా...
తెలుగు తల్లి.. భారత మాత.. మనకు తెలుసు. ఈ ‘ఆదిమ అమ్మ’ ఎవరు? ఎప్పుడూ వినలేదే.. అనే కదా మీ ఆశ్చర్యం..?! ‘ఆదిమ అమ్మ’ గురించి తెలుసుకోవాలంటే.. మనందరి పూర్వీకుల పురిటిగడ్డగా భావిస్తున్న ఆఫ్రికా వెళ్లాలి! ఇంకా చెప్పాలంటే దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నగరానికి దగ్గర్లో ఉన్న అతి పురాతన గుహల్లోకి వెళ్లాల్సిందే!! మనిషి బుద్ధిజీవి. అసలు మనిషి పుట్టుకకు ముందు సుదీర్ఘమైన పరిణామ క్రమం ఉంది. పురాతన కాలపు చరిత్రకు శాస్త్రీయ, సజీవ, సుసంపన్న, అమూల్య సాక్ష్యంగా నిలిచింది ఆఫ్రికా.. మరీ ముఖ్యంగా సౌతాఫ్రికా! 98 ఏళ్లుగా కొనసాగుతున్న తవ్వకాల్లో ఇందుకు గట్టి సాక్ష్యాలు దొరికాయి. అనేక ఆదిమ, ఆధునిక మానవ జాతులకు సంబంధించిన శిలాజాలను శాస్త్రవేత్తలు సేకరించి, విశ్లేషించారు. అందుకే ఈ గుహల సముదాయానికి ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్కైండ్’ అని పేరు వచ్చింది. ప్రపంచ మానవాళికి పురుడుపోసిన ఈ ‘క్రెడిల్’ను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఇటీవల జోహన్నెస్బర్గ్ వెళ్లిన సందర్భంగా అక్కడ నేను తెలుసుకున్న విశేషాలు... 25 లక్షల ఏళ్ల నాటి ‘మిసెస్ ప్లెస్’ జోబర్గ్(స్థానికంగా జోహన్నెస్బర్గ్ను అలా అంటారు)కు 45 కిలోమీటర్ల దూరంలో విస్తారమైన గడ్డి భూముల నడుమ ఆదిమానవులు లక్షలాది ఏళ్ల క్రితం నివసించిన గుహలున్నాయి. ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్కైండ్’గా ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ ప్రాంతం సుమారు 450 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అందులో దాదాపు 300 చారిత్రక గుహల సముదాయం ఉంది. కనీసం 15 గుహల్లో మానవాళి పుట్టుక ఇక్కడే అని ధ్రువీకరించే కీలక శిలాజాలు లభించాయి, ఇంకా లభిస్తున్నాయి. అటువంటి సుసంపన్న శిలాజ గనుల్లో అతి ముఖ్యమైనది ‘స్టెర్క్ఫాంటీన్’ గుహ. కుటుంబ సభ్యులు, సహ పర్యాటకులతో కలసి ఎంతో ఉత్సుకతతో ఈ గుహలోకి అడుగుపెట్టాను. లక్షల ఏళ్ల క్రితం అక్కడ జీవించి, అదే మట్టిలో కలిసిపోయిన మానవ జాతుల విశేషాల గురించి గైడ్ ఉద్వేగంగా చెబుతుండగా.. అదే గుహలో 1947లో ‘పాలియో ఆంత్రపాలజిస్టు’లు డా. రాబర్ట్ బ్రూమ్, డా. జాన్ టి. రాబిన్సన్లు కనుగొన్న పురాతన మహిళ ‘మిసెస్ ప్లెస్’ కపాలం నమూనాను చేతుల్లోకి తీసుకున్నాను. 25 లక్షల సంవత్సరాల క్రితం ఆమె జీవించిందట. డోలమైట్తో కలగలిసిన సున్నపు రాతి నిల్వలున్న గుహ అది. అక్కడి మట్టిని తాకి.. చిన్న సున్నపు రాతి ముక్కను తీసుకున్నాను. గుహ అడుగున కొద్దిపాటి నీటి మడుగు ఉంది. సుదీర్ఘ మానవ చరిత్రను మౌనంగా వీక్షిస్తున్న ఆ చల్లని నీటిని చేతి వేళ్లతో తాకాను. ఉన్నట్టుండి.. మా చేతుల్లో ఉన్న టార్చ్లైట్లన్నిటినీ ఒక్క నిమిషం ఆర్పేయమని గైడ్ చెప్పింది. 60 గజాల లోతున చల్లని గుహంతా చిమ్మచీకట్లతో కూడిన నిశ్శబ్దం ఆవరించింది. మన అందరి కుటుంబ వృక్షం వేరు మూలాలను తడుముతున్నట్లు ఆ క్షణంలో.. నా మనసంతా మాటల్లో చెప్పలేని ఉద్వేగంతో నిండిపోయింది! షీ ఈజ్ అజ్! మనుషులంటే పురుషుడేనా? మహిళ కాదా? తెల్లజాతీయుల నుంచి దారుణమైన జాతి వివక్షను ఎదుర్కొన్న మనమే ఇలా పప్పులో కాలేస్తే ఎలా? అని మరపెంగ్ సమచార కేంద్రం నిర్వాహకులు ఆలస్యంగా నాలుక కరచుకొని ఆనక దిద్దుబాటు చేశారు. ఆసియావాసుల పోలికలతో చామన ఛాయలో ఉన్న ఆధునిక మహిళ ముఖచిత్రాన్ని సైతం రెండేళ్ల క్రితం జోడించి ఈ ప్రపంచ వారసత్వ మ్యూజియానికి పరిపూర్ణత చేకూర్చారు. అంతేకాదు మనం ఏ దేశవాసులమైనా ప్రపంచ ప్రజలందరి పూర్వీకులూ బంధువులేనన్న భావనతో ‘ఆమే మనం (షీ ఈజ్ అజ్)’ అని కూడా ప్రకటించారు! ఇదీ దక్షిణాఫ్రికాలోని ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్కైండ్’లో మెరిసిన మన ‘ఆదిమ అమ్మ’ కథ!! ∙∙ శాస్త్ర సాంకేతిక పురోగతి వెలుగులో అనేకానేక సంక్లిష్టతలను అధిగమిస్తున్నప్పటికీ పురాతన చారిత్రక విషయాల్లో ఊహకు అందని చీకటి అంకాలెన్నో ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ కారణంగానే సాధ్యమైనంత వరకు ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్కైండ్’ దృష్టికోణం నుంచే ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిలాజాల పుట్ట దక్షిణాఫ్రికాలోని జోబర్గ్ సమీపంలో హాటెంగ్, నార్త్వెస్ట్ రాష్ట్రాల సరిహద్దుల్లో 47 వేల హెక్టార్ల విస్తీర్ణంలో రమణీయ కొండ కోనల మధ్య విస్తరించిన అందమైన గడ్డి భూముల్లో సుమారు 300 వరకు పురాతన గుహలున్నాయి. వీటిలో పన్నెండు గుహల్లో ఎన్నో ఆది, ఆధునిక మానవ జాతుల ఉనికిని బలంగా ఎలుగెత్తి చాటే శిలాజాలు లభించాయి. 1924లో ‘టాంగ్ చైల్డ్’, మొదలుకొని మిసెస్ ప్లెస్, ‘హోమో నలెడి’ వరకూ.. గత 98 ఏళ్లుగా ఈ గనుల్లో లభించిన అనేక శిలాజాలే ఇందుకు నిదర్శనాలు. యునెస్కో 1999లో ‘ప్రపంచ వారసత్వ స్థలం’గా గుర్తించడంతో.. విశ్వ పర్యాటకులకు ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్కైండ్’ ఆకర్షణగా నిలిచింది. మరో 9 వారసత్వ స్థలాలు కూడా సౌతాఫ్రికాలో ఉన్నాయి. చెట్టుదిగి నడవటమే గొప్ప మలుపు సుమారు 2,600 కోట్ల ఏళ్లకు పూర్వం (నియో ఆర్చియన్ యుగంలో) ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్కైండ్’ ప్రాంతం సముద్రపు నీటిలో మునిగి ఉండేది. కాలక్రమంలో సున్నపు రాళ్లు–డోలమైట్తో కలగలిసిన గుహలు రూపుదిద్దుకున్నాయి. అటువంటి వందలాది అతిపురాతన గుహలు జోబర్గ్ పరిసర ప్రాంతంలో ఉన్నాయి. వాతావరణ మార్పుల మూలంగా క్రమంగా సముద్రం వెనక్కి తగ్గటంతో.. తదనంతర కాలంలో చింపాంజీలు, ఏప్(వాలిడులు)లకు, ఆది మానవులకు, జంతుజాలానికి భూమి ఆలవాలమయింది. మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా ఆదిమానవులు అడవిలో చెట్ల మీద నుంచి నేల మీదకు దిగి, రెండు కాళ్లపై నిలబడి పచ్చిక బయళ్లున్న ప్రాంతాల్లోకి నడిచారు. మానవ పరిణామ చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం ఇది! అయితే, ఏప్ల నుంచి మనిషి ఎలా విడిపోయాడనేదానికి ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. శీతోష్ణ పరిస్థితుల రీత్యా ఆఫ్రికా గడ్డపైనే ఈ పరిణామం చోటు చేసుకుందని చెబుతారు. ఆ విధంగా అనేక ఆదిమ జాతులతో పాటు కాలక్రమంలో దాదాపు 2 లక్షల ఏళ్ల నాడు ఆలోచనా శక్తి కలిగిన ఆధునిక మానవజాతి (హోమోసెపియన్) ఆవిర్భవించింది. మొదటి శిలాజ ఆవిష్కరణ మానవాళి చరిత్రలో దక్షిణాఫ్రికా ప్రాధాన్యాన్ని లోకానికి చాటిన మొదటి శిలాజ ఆవిష్కరణ ‘టాంగ్ చైల్డ్’. ఇది ‘ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికనస్’ జాతి శిశువుకు చెందిన కపాల శిలాజం. 1924 అక్టోబర్లో దక్షిణాఫ్రికాలోని నార్త్ వెస్ట్ ప్రావిన్స్లోని టౌంగ్లో దీన్ని క్వారీ కార్మికులు గుర్తించారు. జోహన్నెస్బర్గ్లోని విట్వాటర్స్రాండ్ విశ్వవిద్యాలయ శరీర నిర్మాణ శాస్త్రవేత్త ప్రొ. రేమండ్ డార్ట్ దీని విశిష్టతను గుర్తించి ‘నేచర్’లో వ్యాసం రాశారు. దీనికి ‘ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికనస్’ లేదా ‘ఆఫ్రికా దక్షిణ కోతి‘ అని పేరు పెట్టినప్పటికీ, శిలాజం తాలూకు శిశువుకు మనిషి లక్షణాలున్నాయని ఆయన గుర్తించారు. మానవ పరిణామాన్ని మలుపు తిప్పిన శిలాజాలు లభించిన మరికొన్ని ప్రపంచ వారసత్వ స్థలాల గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఇండోనేషియా జావాలోని సంగిరన్ ఎర్లీ మాన్ సైట్, చైనాలోని జౌకౌడియన్, ఇథియోపియాలోని లోయర్ వాలీ ఆఫ్ ద అవష్, లోయర్ వ్యాలీ ఆఫ్ ఓమోతోపాటు.. టాంజానియాలోని ఓల్డ్వాయ్ జార్జ్, ఎర్లీ హోమినిడ్ ఫుట్ప్రింట్స్ (లెటోలి). వీటిలో 36 లక్షల ఏళ్ల నాటి పురాతన మానవుల శిలాజాలు లభించటం విశేషం. ‘తెలివి’కి 2 లక్షల ఏళ్లు! మానవ పరిణామ చర్రితను స్థూలంగా ‘హోమోసెపియన్’ జాతికి ముందు.. తర్వాత.. అని విభజిస్తే అర్థం చేసుకోవటం సులభం. ఈ జాతీయులకు అంతకు పూర్వీకులైన ‘ఆస్ట్రాలోపిథెసిన్’ల కంటే పెద్ద మెదడు ఉంది. రాతి పనిముట్లను రూపొందించే శారీరక సామర్థ్యంతో పాటు.. మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న మొదటి మానవ జాతి ఇది. ‘హోమోసెపియన్’ జాతీయులు సుమారు 23 లక్షల సంవత్సరాల క్రితం తొలుత ఆఫ్రికాలో జీవించారు. ఇందులో అనేక ఉప జాతులున్నాయి. మొదటిది.. హోమోహబిలిస్. వీరు 19 లక్షల సంవత్సరాల క్రితం జీవించారు. వీళ్ల వారసులే ‘హోమోఎర్గాస్టర్’లు. దాదాపు 17 లక్షల సంవత్సరాల క్రితం జీవించారట. ఆధునిక సాధనాల ఉపయోగం, వంట, వెచ్చదనం కోసం అగ్నిని ఉపయోగించుకునే సామర్థ్యం వీరికుంది. ఈ సామర్థ్యమే వీరి వారసులు ఆఫ్రికాను వదలి చల్లని ప్రదేశాలకు వలస వెళ్లేలా చేసిందట. ఆ కొన్నాళ్లకే ‘హోమోఎరెక్టస్’ ఉద్భవించింది. హోమోసేపియన్ జాతీయులు అభివృద్ధి చెందే కొద్దీ, నైపుణ్యాలను అందిపుచ్చుకునే కొద్దీ వారి మెదడు కూడా వికసించింది. ఆ క్రమంలోనే సుమారు 2 లక్షల సంవత్సరాల క్రితం తొలి ఆధునిక మానవులైన ‘హోమోసేపియన్లు’ ఆఫ్రికాలో ఉద్భవించారు. లాటిన్లో హోమో అంటే ‘మానవులు‘, సేపియన్స్ అంటే ‘తెలివైన’అని అర్థం. క్రీ.శ. 1758లో కార్ల్ లిన్నేయస్ ఈ పదబంధాన్ని తొలిసారి వాడారు. ఇథియోపియాతోపాటు దక్షిణాఫ్రికాలో హొమో సేపియన్ జాతి శిలాజాలు కొన్ని బయటపడ్డాయి. ఈ క్రమంలోనే కనీసం 70 వేల సంవత్సరాల నుంచే మనుషులు అలంకరణ, కళాకృతుల తయారీ వంటి ఆధునిక పోకడలను సైతం అలవర్చుకున్నారు. హోమో సేపియన్లు కాలక్రమంలో ఆఫ్రికా నుంచి భూగోళం మీదున్న అన్ని భూభాగాలకూ విస్తరించారంటున్నారు పరిశోధకులు. నిజంగా మానవాళి పురిటి గడ్డేనా?∙ 1920–30లలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన శిలాజాల చారిత్రక ప్రాముఖ్యతను చాలా మంది శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఆఫ్రికా వెలుపల ఉన్నవారు, తొలుత కొట్టిపారేశారు. 1912లో ఇంగ్లండ్లోని ససెక్స్లో బయటపడిన ‘పిల్ట్డౌన్ మ్యాన్‘ అనే మానవ కపాల శిలాజంపైనే వారి దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమైంది. దీన్ని ‘ఎయోంత్రోపస్ డాసోని’ జాతిగా వర్గీకరించారు. ఈ పుర్రెను చార్లెస్ డాసన్ కనుగొన్నందున ఆయన పేరునూ దీనికి జోడించారు. ఐరోపాలో వెలుగుచూసిన సుదూర మానవ పూర్వీకుడుగా ‘పిల్ట్డౌన్ మ్యాన్’ ను అభివర్ణించారు. కోతిలాంటి దవడను, ఆధునిక మానవు (హోమోసేపియ¯Œ )ల మాదిరిగా పెద్ద మెదడు కలిగిన జీవిగా చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలో శిలాజాల ప్రాధాన్యాన్ని తెలియజెబుతూ ప్రొ. రేమండ్ డార్ట్, డా. రాబర్ట్ బ్రూమ్ చేసిన విశ్లేషణలపై పాశ్చాత్య శాస్త్రవేత్తలు వివాదానికి దిగారు. వీరిద్దరూ దక్షిణాఫ్రికాలో కనుగొన్న ‘ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికనస్’ శిలాజాల మెదడు పరిమాణం చిన్నగా ఉండటం విమర్శకులకు అనుకూలించింది. అయితే, దశాబ్దాలు గడచిన తర్వాత, నిజం నిలకడ మీద బయటపడింది. ‘పిల్ట్డౌన్ మ్యాన్’ శిలాజం నకిలీదని చివరికి 1953లో శాస్త్రీయ పరిశోధనల్లో బట్టబయలైంది. మానవ పుర్రెకు ఒరాంగుటాన్ జంతువు దవడ (దంతాలను అరగదీసి మనిషివిగా చిన్నగా కనిపించేలా చేశారు)తో కలిపి పాతిపెట్టి.. సహజమైన శిలాజంగా నమ్మించే ప్రయత్నం చేశారని తేలింది. పిల్ట్డౌన్ బూటకం చాలామంది శాస్త్రవేత్తలను 40 ఏళ్లకు పైగా తప్పుదోవ పట్టించింది. దక్షిణాఫ్రికా శిలాజాల చారిత్రక ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించడం ఆ మేరకు ఆలస్యమైనా.. శాస్త్రీయంగా రూఢి అయ్యింది. ఈ బూటకపు శిలాజం సృష్టికర్తలెవరో నేటికీ కచ్చితంగా తెలియరాలేదు. దక్షిణాఫ్రికాలో ‘ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికనస్’ జాతికి చెందిన అనేక శిలాజాల ఆవిష్కరణలు ఆ తర్వాత కూడా వెలుగులోకి వస్తుండటం, పిల్ట్డౌన్ స్కామ్ బహిర్గతం కావటంతో.. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ‘మానవజాతి పురిటి గడ్డ’ ఆఫ్రికా అని ఎట్టకేలకు అంగీకరించారు. దక్షిణాఫ్రికా శిలాజ వారసత్వం ప్రాముఖ్యతను గుర్తించిన మొదటి తరం ఆంగ్ల శాస్త్రవేత్తల్లో సర్ విల్ఫ్రెడ్ లీ గ్రాస్ క్లార్క్ ఒకరు. ∙∙ ఈ పూర్వరంగంలో పురాతన నాగరికతలు 10,000 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్నాయి. లిపి ఆవిర్భవించిన తర్వాత మానవ వికాసం మనకు తెలిసిన చరిత్రే. మానవ జనాభా 2000 ఏళ్ల క్రితం 20 కోట్లు ఉండేది. 790 కోట్లకు పెరిగింది. భూగోళంపైన, కొండ శిఖరాల నుంచి దీవుల వరకు, మట్టి కనిపించే ప్రతి చోటుకూ మనం విస్తరించాం. ధ్వని కన్నా వేగంగా భూగోళం ఆ దరి నుంచి ఈ దరికి ప్రయాణించగలుగుతున్నాం. కానీ, పుడమి పర్యావరణాన్ని మనం కలుషితం చేస్తున్నాం.. ప్రకృతిసిద్ధమైన జంతుజాలం ఆవాసాలను నాశనం చేస్తున్నాం.. అత్యాధునిక రూపాల్లో యుద్ధాలకు తెగబడుతున్నాం.. సుదీర్ఘ పరిణామ క్రమంలో అందివచ్చిన గొప్ప తెలివి తేటలు మనల్ని దీర్ఘకాలం జీవించనిస్తాయా? లేక గంపగుత్తగా దుంపనాశనం చేస్తాయా? పుట్టింటికి పునరాహ్వానం! యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్కైండ్’కు సంబంధించిన అధికారిక మ్యూజియం కమ్ సమాచార కేంద్రం పేరు ‘మరపెంగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్’. మేం చూసిన ‘స్టెర్క్ఫాంటీన్’ గుహకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. 29 మిలియన్ డాలర్ల ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 2005 డిసెంబర్ 7న ప్రారంభమైన ‘మరపెంగ్’.. మానవ పరాణామ విజ్ఞానశాస్త్ర గని అని చెప్పొచ్చు. పర్యాటకులను, మానవ పరిణామ శాస్త్ర అధ్యయనకారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే రీతిలో విశేషాలేన్నిటినో ఇక్కడ పొందికగా ఆవిష్కరించారు. మరపెంగ్ అంటే.. స్థానిక ‘సెస్త్వానా’ భాషలో ‘పుట్టింటికి పునరాహ్వానం’ అని అర్థం. ‘వెల్కమ్ హోమ్.. ఎక్స్ప్లోర్ యువర్ హ్యూమన్ హెరిటేజ్’ అంటూ తెల్లని పతాకం మనల్ని లోపలికి ఆహ్వానిస్తుంటుంది. విశ్వం, భూమి, జీవుల పుట్టుక.. తదనంతర పరిణామక్రమంలో ఆది మానవుల పుట్టుక, నిప్పు వాడుక/ నియంత్రణ, రాతి పరికరాల వాడటం.. ఆధునిక మానవుల పుట్టుక, జీవన వికాసాలకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ‘మరపెంగ్’లోని భూగర్భ మ్యూజియం అత్యద్భుతంగా పర్యాటకుల కళ్లకు కడుతోంది. ఆదిమ, ఆధునిక మానవ జాతులకు ప్రతీకలుగా రూపొందించిన కొన్ని విగ్రహాలను, సజీవ వ్యక్తులను తలపించేలా చారిత్రక ఔచిత్యంతో రూపకల్పన చేసిన ముఖచిత్రాలను ప్రదర్శించారు. కోతిని పోలిన నలుపు/చామన ఛాయ ఆదిమానవుల దగ్గర నుంచి జర్మనీ మూలాలున్న నియాండర్తల్ తెల్ల జాతీయుడి ముఖచిత్రం వరకు ఇందులో ఉన్నాయి. అయితే, వాటిలో చాలా వరకు పురుషుల ముఖ చిత్రాలే! భూగర్భ వ్యోమగాములు! అవును.. మీరు చదివింది నిజమే.. వ్యోమగాముల అవసరం రోదసిలోనే కాదు, ఒక్కోసారి భూగర్భంలోనూ ఉంటుంది. గుహలో అత్యంత క్లిష్టమైన స్థితిలో శిలాజాల అన్వేషణలో క్లిష్ట దశను అధిగమించడానికి అవసరమైంది. ఆ సాహస కార్యాన్ని ఆరుగురు మహిళా శాస్త్రవేత్తలు అద్భుతంగా నెరవేర్చి శభాష్ అనిపించుకున్నారు. ‘భూగర్భ వ్యోమగాముల’ను మేం ముద్దుగా పిలుచుకుంటున్న ఈ ఆరుగురు మహిళా శాస్త్రవేత్తలు లేకుండా మన దగ్గరి బంధువైన ఓ కొత్త జాతి ఆవిష్కరణ సాధ్యమయ్యేది కాదని ప్రధాన పరిశోధకుడు ప్రొ. లీ బెర్గర్ 2015 సెప్టెంబర్లో ప్రకటించారు. ఈ ఆదిమ జాతికి ‘హోమో నెలడి’ అని పేరుపెట్టారు. ఏడేళ్ల కిందట.. జోహన్నెస్బర్గ్ సమీపంలోని ‘క్రెడిల్ ఆఫ్ హ్యూమన్కైండ్’ గుహల సముదాయంలోని రైజింగ్ స్టార్ అనే గుహలో శిలాజాల కోసం అన్వేషణ ఉత్కంఠభరితంగా సాగుత్ను రోజులవి. 18 సెం.మీ. ఖాళీలోంచి.. ప్రొ. లీ బెర్గర్ బృందం గని లోపల తవ్వకాలు చేస్తుండగా. ఆది మానవుల శిలాజాలు కొన్ని దొరికాయి. అక్కడి నుంచి కిందికి చిన్న దారి కనిపించింది. ఆ లోపల 30 మీటర్ల కింద మరో చిన్న గది కనిపించింది. అందులో ఇంకా మానవ శిలాజాలు ఉన్నాయని ప్రత్యేక పరికరాల ద్వారా త్రీడీ స్కాన్ ద్వారా కనుగొన్నారు. అయితే, ఆ దారిలో రెండు బండరాళ్ల మధ్య కేవలం 18 సెంటీమీటర్ల (ఫుట్బాల్ కన్నా తక్కువ) ఖాళీ మాత్రమే ఉంది. మనిషి లోపలికి వెళ్లకుండా శిలాజాలను సేకరించలేం. అంత సన్నని దారిలోంచి లోపలికి వెళ్లటం ఎలా? అంత సన్నగా ఉండే మనుషులైతే లోపలికి వెళ్లగలరన్న ఆలోచనతో ప్రొ. లీ బెర్గర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. 18 సెం.మీ. కన్నా సన్నని శరీరం కలిగిన పురావస్తు తదితర శాస్త్రాల్లో పీజీ చదివి ఉండి, గుహల్లోకి దిగే అనుభవం ఉన్న వారెవరైనా సంప్రదించమని కోరారు. పది రోజుల్లో 60 దరఖాస్తులు వచ్చాయి. అందులో నుంచి అన్ని అర్హతలున్న 6గురు మహిళా శాస్త్రవేత్తలను ఎంపిక చేశారు. వారే.. ఈ భూగర్భ వ్యోమగాములు.. మెరీనా ఇలియట్ (కెనడా), బెక్కా పీక్సోటో (వాషింగ్టన్ డిసి), లిండ్సే హంటర్ (అయోవా), ఎలెన్ ఫ్యూరిగెల్ (ఆస్ట్రేలియా), హన్నా మోరిస్ (ఒహైయో), అలియా గుర్టోవ్ (విస్కాన్సిన్). 30 మీటర్ల దిగువ వరకు పాక్కుంటూ వెళ్లి శిలాజాలను వెలికితీయటమే ఈ మహిళా శాస్త్రవేత్తలు చేసిన సాహసం. దాదాపు 3 వారాల పాటు సాగిందీ అన్వేషణ. దాదాపు 15 మందికి చెందిన 1500 ఎముకలు లభించాయి. ఆఫ్రికాలో ఒకేచోట ఇన్ని మానవ శిలాజాలు దొరకటం ఓ రికార్డు. యూరేసియా కూడా ముఖ్య రంగస్థలమే! ఆఫ్రికాయే మానవుల పురిటిగడ్డ అనే వాదనతో విభేదించే వారూ లేకపోలేదు. వీరిలో హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ రైక్ ఒకరు. ‘హూ వియార్ అండ్ హౌ వియ్ గాట్ హియర్’ అనే పుస్తకాన్ని ఇటీవలే వెలువరించారు. ప్రాచీన మానవ డీఎన్ఏ విశ్లేషణకు తోడ్పడిన పదిమంది మార్గదర్శకులలో ఒకరిగా డేవిడ్ రైక్కు గుర్తింపుంది. మానవ సంబంధ ఆవిష్కారాలన్నీ ఆఫ్రికాలోనే సంభవించాయని, అక్కడి వారే మిగతా ప్రపంచమంతా విస్తరించారనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు డేవిడ్ రైక్ . మానవ పరిణామక్రమంలో పురాతన మానవ జాతి నియాండర్తల్స్ నివసించిన యూరేసియా (యూరప్, ఆసియాలు మొత్తం విస్తరించిన ప్రాంతం) కూడా ముఖ్య రంగస్థలమే అంటున్నారాయన. ‘మానవులు అంతర్గతంగా మిశ్రమ పూర్వీకుల నుంచి ఉద్భవించారు. ఏ జనసమూహం కూడా స్వచ్ఛమైనది కాదు. భిన్నమైన సమూహాల కలయిక మానవ స్వభావపు సాధారణ లక్షణం. గతం నుంచి మనం నేర్చుకోవాలి.. మరింత కనెక్ట్ అవ్వాలి’ అంటున్నారు ప్రొ. డేవిడ్ రైక్. -పంతంగి రాంబాబు , సాక్షి ప్రత్యేక ప్రతినిధి, (జోహన్నెస్బర్గ్ నుంచి) -
కొమురంభీం జిల్లా దిందా లో పోరుబాట పట్టీన గిరిజనులు
-
అమెజాన్ ఇండియా కారీగర్ మేళా
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాజాగా ట్రైబ్స్ ఇండియా సంస్థతో కలిసి కారీగర్ మేళాను ప్రారంభించింది. ఈ ఒప్పందం ప్రకారం సంప్రదాయ గిరిజన ఉత్పత్తులు, భారతీయ హస్తకళల ఉత్పత్తుల కోసం అమెజాన్ తమ పోర్టల్లో ప్రత్యేక విభాగాన్ని కేటాయించింది. బిద్రి, ఇక్కత్, పటచిత్ర తదితర సుమారు 1.2 లక్షల పైచిలుకు ఉత్పత్తులు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమం కింద ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 12 దాకా రెండు వారాల పాటు కారీగర్ విక్రేతలకు సెల్లింగ్ ఆన్ అమెజాన్ (ఎస్వోఏ) ఫీజు నుంచి 100 శాతం మినహాయింపు లభిస్తుంది. దేశీ చేనేతకారులు, చేతి వృత్తుల కళాకారులు ఈ–కామర్స్ ద్వారా మరింత వృద్ధిలోకి వచ్చేందుకు తోడ్పడేలా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలిసి పనిచేయడం కొనసాగిస్తామని అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. -
Hatsoff Doctors వాగులు దాటారు, కొండలు ఎక్కారు
పాలక్కాడ్: కరోనా కష్టకాలంలో డాక్టర్లలతో పాటు వైద్య సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. తాజాగా కొండకోనల్లో నివసించే ట్రైబల్స్ని కాపాడేందుకు కేరళ వైద్యులు చేసిన ప్రయత్నానికి దేశ ప్రజానీకం హ్యట్సాప్ అంటోంది. వారి శ్రమకు దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తోంది. మారుమూల గ్రామం కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ. ఎన్నో గిరిజన తెగలు ఆ అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. సరైన రహాదారి, కనీస సౌకర్యాలు లేకపోయినా అడవి తల్లినే నమ్మకుని జీవిస్తున్నారు. అయితే ఇటీవల అట్టపడి టౌన్కి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మురుగుల గ్రామస్తులు కరోనాతో బాధపడుతున్నట్టు స్థానిక వైద్యులకు సమాచారం అందింది. శ్రమించిన వైద్యులు మురుగులలో కరోన ఆనవాళ్లు ఉన్నట్టు తెలియగానే స్థానిక వైద్యులు సుకన్య, సునిల్ వాసు, శైజిలతో పాటు ఇతర వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాహనంలో కొంత దూరం వెళ్లగానే వారికి భవానిపూల నది ఎదురైంది. అక్కడి ఉంచి వాహనంలో పోవడం సాధ్యం కాకపోవడంతో నదిలోనే నడుములోతు నీళ్లలో డాక్టర్ల బృందం ప్రయాణం మొదలైంది. నది దాటిన తర్వాత 8 కిలోమీటర్ల దూరం కొండ అంచున ప్రయాణిస్తూ మురుగుల గ్రామం చేరుకున్నారు. 7గురికి పాజిటివ్ మురుగులలో వందమందికి పైగా కురుంభ, ఇరుల, ముదుగర్ తెగకు చెందిన జనాభా ఉండగా 30 మందిలో కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. వారికి యాంటిజెన్ టెస్టులు అక్కడికక్కడే నిర్వహించగా ఏడుగురికి కరోనా పాజిటివ్గా తేలింది. వెంటనే వారందరినీ ఆస్పత్రికి తరలించారు. అభినందనలు వైద్యులు సకాలంలో స్పందించి ఆ మారుమూల అటవీ గ్రామానికి చేరుకోక పోయి ఉండి ఉంటే ... అరుదైన తెగకు చెందిన ప్రజలు కరోనా బారిన పడి ఉండేవారు. తమ విధుల పట్ల వైద్యులు చూపిన అంకిత భావానికి దేశ నలుమూలల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. -
ఆపాదమస్తకం.. రామనామం
సాక్షి, భద్రాచలం: ‘ఓ రామ.. శ్రీరామ.. నీ నామమెంతో రుచిరా’అంటూ వేనోళ్ల కీర్తించాడు భక్త రామదాసు. కానీ ఆ గ్రామంలోని అందరూ వయో, లింగ భేదం లేకుండా ఆపాదమస్తకం రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకుని తమ దేహాన్నే దేవాలయం గా మార్చుకున్నారు. మనసును, దేహాన్ని శ్రీరామమయంగా మలుచుకున్నారు. అపర రామదాసుల్లా శ్రీరాముడిని నిత్యం కీర్తిస్తుంటారు. ఛత్తీస్గఢ్లోని రాయగఢ్ జిల్లా సారంగడ్ తాలూకాలో నందేలి అటవీ ప్రాంతంలో ‘శ్రీరామనామి’తెగ వారు జీవిస్తుంటారు. వారి సంస్కృతి సంప్రదాయాలు చాలా వినూత్నంగా ఉంటాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు శిరస్సు నుంచి పాదం వరకు శ్రీరామ నామాలను పచ్చబొట్టుతో పొడిపించుకుంటారు. శ్రీరాముడిని ఆవహించుకున్నట్లు భక్తిభావంతో ప్రతిరోజూ శ్రీరామ నామాన్ని జపిస్తుంటారు. ఈ తెగలోని వారు మాంసాహారం, ధూమపానం, మద్యపానం సేవించకుండా నియమ నిష్టలతో రాముడిని పూజిస్తుంటారు. తమ పనులు, ఇళ్లలో శుభకార్యాలు జరిగినా శ్రీరామనామంతోనే ప్రారంభిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. దేహాన్నే ఆలయంగా మార్చుకుని.. 19వ శతాబ్దంలో నాటి సామాజిక పరిస్థితుల వల్లే ‘శ్రీరామనామి’తెగ ఆవిర్భవించినట్లు ప్రచారంలో ఉంది. అప్పటి ఉన్నత తెగల వారు దేవాలయాల్లోకి కింది వర్గాల వారిని అనుమతించకపోయేవారు. దీంతో 1890వ దశకంలో పరశురామ్ అనే వ్యక్తి తన నుదిటిపై శ్రీరామ నామాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్నాడని ప్రచారంలో ఉంది. ఆయనే ‘శ్రీరామనామి సమాజ్’కు ఆద్యుడు అని చెబుతుంటారు. అప్పటి నుంచి ఆ తెగకు చెందిన వారు శ్రీరామనామాన్ని చెరిగిపోని ముద్రగా భక్తి భావంతో ఉంచుకొని తమ దేహాన్నే దేవాలయంగా మలుచుకొని శ్రీరాముడిని కొలుస్తున్నట్లు చెబుతారు. ఒంటిపైనే కాకుండా వస్త్రాలను, నెమలి ఈకలతో చేసిన శిరస్త్రానంపై కూడా శ్రీరామ నామమే ఉంటుంది. ఏటా మూడ్రోజులు భజన రామనామి తెగ ఆధ్వర్యంలో ఏటా అక్కడ డిసెంబర్, జనవరిలో మూడు రోజుల పాటు భజన మేళా నిర్వహిస్తారు. అక్కడి తెగ వారి సంస్కృతీ సంప్రదాయాలకు విలువిచ్చి ఆ రాష్ట్రంలో ప్రభుత్వ నేతలు ఈ మేళాకు హాజరవుతారు. జాతరకు పెద్ద సంఖ్యలో తెగకు చెందిన వారు హాజరుకావడంతో పాటు ఆ తెగకు చెందిన యువతీ యువకులకు పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. -
గిరి సీమల్లో భోగి సందడి
సాక్షి, ఆసిఫాబాద్: కనుల విందు చేసే గుస్సాడీల కోలాహలం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆదివారం ఉమ్మడి జిల్లాలో అనేక ఆదివాసీ గ్రామాల్లో భోగి పండుగలను నిర్వహించుకున్నారు. దీపావళి పర్వదినాన్ని పురష్కరించుకుని గిరి సీమలు దండారీలకు ముస్తాబయ్యాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న దండారీ ఉత్సవాలకు గుస్సాడీలకు కావాల్సిన పరికరాలకు పూజలు నిర్వహించారు. వారం రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవంలో ఊరుఊరంతా పాల్గొంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1386 గిరిజన గ్రామాలుండగా.. 1208 గ్రామాల్లో దండారీ ఉత్సవాలు కొనసాగుతాయి. కెరమెరి మండంలోని సాకడ(బి)లో ఏత్మాసార్ పేన్కు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆ నైవేద్యాన్ని ఆరగించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటి నుంచి దండారీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. చదవండి: విజయశాంతి ప్రకటన.. కాంగ్రెస్లో కలకలం -
గిరిజనులు నా సొంత కుటుంబ సభ్యులు
సాక్షి, అమరావతి: గిరిజనులను తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి అడుగులు ముందుకు వేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గిరిజనుల ఆదాయం పెంచేందుకు, వారిని రైతులుగా చేసి మంచి జరిగేలా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఏళ్ల నాటి గిరిపుత్రుల కలలను నెరవేరుస్తూ గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్లో బటన్ నొక్కి ప్రారంభించారు. పలువురు గిరిజన మహిళలకు స్వయంగా క్యాంపు కార్యాలయంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందజేశారు. మొత్తం 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3.12 లక్షల ఎకరాలపై హక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాల, ఐటీడీఏ పరిధిలో వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు, విజయనగరం జిల్లా కురుపాంలో ఏర్పాటు చేయనున్న గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్లో బటన్ నొక్కి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం వివరాలు ఇలా ఉన్నాయి. గిరిజనుల మేలు కోసమే.. రాష్ట్రంలో దాదాపు 6 శాతం ఉన్న గిరిజనులకు మంచి చేయాలని, వారి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రయత్నం చేస్తున్నాం. నాడు నాన్నగారి హయాంలో ఆ తపన చూశాం. మళ్లీ ఇవాళ దాదాపు 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3.12 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమం నెల రోజులు కొనసాగుతుంది. హక్కుల పత్రాల పంపిణీ, దాంతో పాటు రైతు భరోసా సొమ్ము ఇస్తాం. గిరిజనులను రైతులుగా చేసి, వారికి మంచి జరిగేలా చేయాలన్నదే మా లక్ష్యం. మాట నిలబెట్టుకున్నాం ఎన్నికల ప్రణాళికను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తామని చెప్పాం. అందులో చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తానని చెప్పాను. ఆ మాట ప్రకారం పేద గిరిజనులందరికీ కనీసం 2 ఎకరాల భూమి ఇవ్వాలన్న తాపత్రయంతో, ఆ అక్క చెల్లెమ్మలకు ఇవాల్టి నుంచి పత్రాలు ఇస్తున్నాం. పట్టాలు పొందిన అక్క చెల్లెమ్మలకు భూమి అభివృద్ధి మాత్రమే కాకుండా, నీటి సదుపాయం, తోటల పెంపకానికి సహాయం చేస్తున్నాం. గిరిజనుల ఆదాయం పెంచడంతో పాటు, అడవుల్లో మరింత పచ్చదనం పెరిగేలా చర్యలు చేపడుతున్నాం. ఆ దిశలో కలెక్టర్లు, అటవీ అధికారులతో కలిసి పని చేస్తారు. ఎస్సీ, ఎస్టీలకు న్యాయం నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం ఇస్తూ అండగా నిలిచాం. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి, ఆ మేరకు చట్టం చేశాం. గిరిజనులకు మరింత మేలు చేసే విధంగా గిరిజన సలహా మండలి కూడా ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వ హయాంలో గిరిజనుల పట్ల చాలా వివక్ష కొనసాగింది. వారికి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. చివరకు సలహా మండలి కూడా ఏర్పాటు చేయలేదు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ఆలోచన చేయలేదు. ప్రస్తుతం గిరిజనులు నా సొంత కుటుంబం అనుకుని అడుగులు ముందుకు వేస్తున్నాను. గతంలో గిరిజనులకు వైద్యం అందక చనిపోయేవారు. నేను పాదయాత్రలో స్వయంగా చూశాను. ఆ పరిస్థితులను మారుస్తూ పలు చర్యలు చేపడుతున్నాం. పాడేరులో దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల నిర్మాణ పనులు మొదలు పెడుతున్నాం. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల పనులు కూడా ఇవాళే మొదలు పెడుతున్నాం. 5 ఐటీడీఏల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులు కూడా ఇవాళే మొదలు పెడుతున్నాం. ఆ ఆస్పత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందనున్నాయి. గిరిజన ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు, కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో సేవలందించడమే లక్ష్యం. ఎన్నో కార్యక్రమాలతో అండగా.. అమ్మ కడుపులో బిడ్డ పెరగడం మొదలైనప్పటి నుంచి అవ్వా తాతల వరకు అందరికీ మేలు చేసే పనులు చేస్తున్నాం. గర్భిణులు మొదలు పిల్లలకు ఆరేళ్లు వచ్చే వరకు పోషణ పథకంలో పౌష్టికాహారం అందజేస్తున్నాం. 5 లక్షల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నాం. 500 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్పు చేశాం. అనేక పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు మేలు చేస్తున్నాం. నాడు–నేడులో పాఠ«శాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఇంగ్లిష్ మీడియమ్తో పేద కుటుంబాల పిల్లలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. చేతి రాతతో పాటు, తల రాత కూడా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం. స్వచ్ఛమైన మనసున్న గిరిజనులకు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. క్యాంపు కార్యాలయంలో ప్రదర్శించిన రంపచోడవరం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, పాడేరు వైద్య కళాశాల నమూనాలను సీఎం జగన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, మంత్రులు బొత్స, బాలినేని, సురేష్, సీఎస్ నీలం సాహ్ని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీరు గిరిజన పక్షపాతి కొండల్లో జీవిస్తూ, అటవీ భూములు సాగు చేస్తున్న వారిపై గతంలో కేసులు పెట్టారు. ఇవాళ మీరు అడవి బిడ్డలకు అండగా నిలుస్తూ, ఆ భూములపై హక్కు కల్పిస్తూ, పట్టాలు ఇస్తున్నారు. ఆ విధంగా మీరు గిరిజన పక్షపాతిగా నిల్చారు. నాడు మహానేత వైఎస్సార్ 55,513 మందికి 1,30,679 ఎకరాల ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలిచ్చారు. ఆ తర్వాత మా గురించి ఎవరూ పట్టించుకోలేదు. మీరు వచ్చాకే మాకు నమ్మకం ఏర్పడింది. అందుకే మేమంతా మీ వెంట నడిచాం. ఇప్పుడు మీరు అడగకుండానే మాకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు. ఉపాధి, విద్య, వైద్యంతో పాటు మరెన్నో కార్యక్రమాలతో మాకు అండగా నిలిచారు. మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటాం. – పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
మేమున్నామని.. మీకేం కాదని
పాలకొండ రూరల్/సీతంపేట: వైద్యం లేక అల్లాడిపోతున్న గిరిజన ప్రాంతాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ఊపిరి అందించారు. అపర సంజీవనిగా పేరుగాంచిన 108, 104 సేవలను ఏజెన్సీలో విస్తృతం చేస్తూ నిర్ణయం తీసుకు న్నారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు నియోజకవర్గాలైన పాలకొండ, పాతపట్నం, పలాస, టెక్కలి, నరసన్నపేట పరిధిలో 24 గంటలు వైద్య సేవలను అందించే 27 పీహెచ్సీలున్నాయి. అలాగే ఆరోగ్య ఉప కేంద్రాలు 151, ఏరియా ఆస్పత్రులు 2, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3 ఉన్నాయి. వీటికి సంబంధించి ఐటీడీఏ ప్రత్యేక అంబులెన్స్లు 11 అందుబాటులో ఉన్నాయి. గత టీడీపీ హయాంలో ఏజెన్సీ మండలాల్లో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందేవి. దీనికి తోడు అప్పట్లో 108, 104 వాహనాలకు డీజిల్ లేక అవి మూలనపడ్డాయి. సిబ్బందికి అరకొర జీతాలతో వారూ ది గాలుగా ఉండేవారు. దీన్ని గుర్తించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పరిస్థితులను సమూలంగా మా ర్చివేసింది. ముఖ్యంగా ఏజెన్సీ సబ్ప్లాన్ పరిధిలో మెరుగైన వైద్య సేవలకు శ్రీకా రం చుట్టింది. ఏజెన్సీలో మెరుగైన వైద్య సేవలు ఐటీడీఏ సబ్ప్లాన్ పరిధిలో ఉన్న గిరిజన గ్రామాలకు మెరుగైన వైద్య సేవలందించడ మే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగా సీతంపేట, పాలకొండ మండల కేంద్రాల్లో అ త్యాధునిక హంగులతో ప్రత్యేక ఆస్పత్రుల నిర్మాణాలకు సంబంధించి నిధులు సమకూర్చేందుకు పచ్చజెండా ఊపింది. తాజాగా 104, 108 వాహనాలను కూడా సమకూర్చింది. 2011 నుంచి ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో తిరుగుతున్న వాహనాలు 5 లక్షల కిలోమీటర్లు దాటి ప్రయాణాలు కొనసాగించటంతో నిబంధనల మేరకు ఆ వాహనాలు జీర్ణించుకుపోయాయి. ఈ క్రమంలో జిల్లా పరిధిలో ఏజెన్సీ గ్రామాలను కలుపుకుని ఉన్న సమీప మండలాలైన పాలకొండ, మందస, పాతపట్నం, కొత్తూరు, సీతంపేట, మెళియాపుట్టి, ఎల్.ఎన్ పేట, సావరకోట, హిరమండలం మండలాలకు ప్రత్యేకంగా సరికొత్త వాహనాలను తొలివిడతలోనే అందించారు. వీటికి తోడు మరో 15 ఫీడర్ అంబులెన్స్లు గిరిగ్రామాల్లో చక్కర్లు కొడుతూ సేవలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ కోవలో భామిని, వీరఘట్టం మండలాలకు త్వరలో నూతన వాహనాలు సమకూరనున్నాయి. అత్యాధునిక వైద్య సేవలు నూతన అంబులెన్స్లో ప్రభుత్వం అధునాతన వైద్య సేవలకు సంబంధించిన పరికరాలను అమర్చింది. పల్స్ఆక్సీ మీటర్, ఫోల్టబుల్ స్ట్రెక్చర్స్, ట్రాన్స్పోర్టు వెంటిలేటర్, సాక్షన్ ఆపరేటర్, మల్టీ పారామీటర్, కెమెరా, మొబైల్ డేటా టెర్మినల్(ఎండీటీ) ప్రతి పౌరునికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్ట్స్ నమోదు వంటి సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 20 నిమిషాల్లోనే 108 వాహనం రానుంది. ప్రతి అంబులెన్స్ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(ఈఆర్సీ)కి అనుసంధానం చేశారు. మొబై ల్ మెడికల్ యూనిట్లలో ఒక వైద్యాధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్ఎం ఆశ కార్యకర్త ఉంటారు. సాధారణ సమస్యలతోపాటు ప్రస్తుతం కరో నా వైరస్ బారిన పడుతున్న వారికి సేవలందించటంలో కూడా 108 తోడ్పడుతుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 30 వాహనాల్లో 20 వాహనాలు కోవిడ్ బాధితుల సేవలకు కేటాయించారు. రెట్టించిన ఉత్సాహంతో.. ఇక సిబ్బంది విషయానికి వస్తే 108, 104 వాహన పైలెట్స్కు రూ.18 వేల నుంచి రూ.28 వేలు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కు(ఈఎంటీలు) గతంలో రూ.12 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం వారి సర్వీసును బట్టి రూ.20వేలు నుంచి రూ.30 వేలకు జీతాలు పెంచారు. జీతాల పెంపు పై 108, 104 వాహన సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెట్టించిన ఉత్సాహంతో విధులు చేపడుతుండటం విశేషం. ఉత్సాహంగా పనిచేస్తాం ముఖ్యమంత్రి 108, 104 వాహన సేవలకు కొత్త ఊపిరి అందించారు. గతంలో కనీసం డీజిల్ లేక నెలల తరబడి వాహనాలు మూలనపడ్డాయి. దీంతో అనేక మందికి ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైంది. ఆక్సిజన్ సిలెండర్లు కూడా ఉండేవి కావు. నేడు ఆధునాతన వాహనాలతోపాట ఆధునిక వైద్య పరికరాలు అందించారు. ప్రజా ఆరోగ్యంపై ప్రభు త్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అలాగే సిబ్బంది జీతాలు పెంచారు. రెట్టించిన ఉత్సాహంతో సేవలు అందిస్తాం. – డి.ముకుందరావు, పైలెట్, పాలకొండ. సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది పాదయాత్రగా వచ్చినప్పుడు జగనన్నకి మా సమస్యలు విన్నవించుకున్నాం. ఆయన అధికారంలోకి రాగానే మాకు జీతాలు పెంచి మాలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఏజెన్సీలో గత కొద్ది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాం. కనీస వసతులు లేని వాహనాలతో ఇబ్బందులు పడేవారం. ఇప్పుడు వాహనాలు అత్యాధునికం. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలం చేరుకోగలం. బాధితులను మరింత తక్కువ సమయంలో ఆస్పత్రికి చేర్చగలుగుతున్నాం. ప్రజల్లో మళ్లీ 104, 108 సేవలపై సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది. – గిరి గణపతి, ఈఎంటీ, పాలకొండ -
కరోనా మృతదేహం కోసం కిడ్నాప్
క్వీటో: అమెజాన్ తెగకు చెందిన గిరిజనులు కిడ్నాప్ చేసిన ఆరుగురు వ్యక్తులను విడుదల చేసినట్లు ఈక్వెడార్ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. కరోనా వైరస్తో మృతి చెందిన తమ నాయకుడి మృతదేహాన్ని తమకే ఇవ్వాలనే డిమాండ్తో ఆరుగురు వ్యక్తులను గిరిజనులు కిడ్నాప్ చేశారు. ఇద్దరు పోలీసు అధికారులతో పాటు ఇద్దరు సైనికులు, సాధారణ పౌరులను పెరువియన్ సరిహద్దుకు సమీపంలోని కుమయ్ గ్రామ గిరిజన ప్రజలు గురువారం బంధించారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్ నిలిపివేత: డబ్ల్యూహెచ్వో) అయితే ప్రభుత్వానికి, గిరిజన తెగ ప్రజలకు మధ్య జరిగిన చర్చల అనంతరం బంధించిన వారిని గిరిజనులు ఆదివారం విడుదల చేశారని ప్రభుత్వం పేర్కొంది. ‘ఆగ్నేయ ఈక్వెడార్లోని అమెజాన్ అడవిలో ఉన్న పాస్తాజా ప్రావిన్స్లో గిరిజనుల బంధీ నుంచి విడుదలైన పౌరులకు వైద్య పరీక్షలు నిర్వహించాము’ అని ఈక్వెడార్ అంతర్గత మంత్రి పౌలా రోమో ట్విటర్లో తెలిపారు. అదే విధంగా కిడ్నాప్ చేసిన బృందంలో సమారు 600 మంది గిరిజనుల ఉన్నారని పేర్కొన్నారు. (అగ్రరాజ్యంలో కరోనా తాండవం) ఇక బందీలైన పౌరులను విడిపించేందుకు పోలీసు కమాండర్ జనరల్ ప్యాట్రిసియో కారిల్లో చర్చలు జరిపారని చెప్పారు. ముందుగా గిరిజన నేతకు కారోనా సోకడంతో మరణించాడు. దీంతో ఆరోగ్యశాఖ నిబంధనలు మేరకు ఖననం చేశారు. కానీ గిరిజనులు తమ నేత పార్థివదేహం కోసం ఆరుగురు పౌరులను కిడ్నాప్ చేయడంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. బంధించిన వారిని వదిలిపెట్టిన అనంతరం గిరిజన నేత మృతదేహాన్ని కుమయ్ గ్రామానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
గిరిజన హక్కులను కాలరాసిన టీడీపీ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనాభివృద్ధిని గాలికొదిలేశారని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజనుల హక్కులు, రిజర్వేషన్లు గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు లేఖ రాసిన నేపథ్యంలో ఆమె శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో టీడీపీ తీరును దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో గిరిజనుల హక్కులను కాలరాసేలా నిర్ణయాలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. జీవో నంబర్ 3 వీగిపోవడానికి టీడీపీ తప్పిదమే కారణమన్నారు. ఐదేళ్ల పాలనలో గిరిజనుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు.. గిరిజనాభివృద్ధిపై లేఖ రాయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో గిరిజనులు తీవ్ర నిర్లక్ష్యానికి, అవమానాలకు గురయ్యారని, వారి హక్కులను కూడా హరించేలా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగిన ఐదేళ్ల కాలంలో చివరి ఆరు నెలల దాకా కూడా గిరిజనులకు మంత్రి పదవిని ఇవ్వకుండా అవమానించారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంత్రివర్గంలో గిరిజన మహిళకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. (అశోక్బాబుపై ఏపీఎన్జీవో ఫైర్..) గిరిజనులకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చారు.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గిరిజనాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకొనే గిరిజన సలహా మండలి(టీఏసీ)ని ఏర్పాటు చేయాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్ల తర్వాతగానీ టీఏసీని ఏర్పాటు చేయలేదని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతల హెచ్చరికలతో టీఏసీని ఏర్పాటు చేసిన టీడీపీ ప్రభుత్వం.. గిరిజన శాసనసభ్యులందరూ వైఎస్సార్సీపీకి చెందిన వారు ఉండటంతో వారి హక్కులను కాలరాసేలా, టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా టీఏసీలో సభ్యులుగా చేసిందని విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే టీఏసీని ఏర్పాటు చేసారని, ప్రభుత్వం ఏర్పాటయిన ఐదు నెలలకే టీఏసీ సమావేశం కూడా జరిగిందని వివరించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులను కూడా ఇచ్చిందని చెప్పారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల మనోభిప్రాయాలను గౌరవిస్తూ బాక్సైట్ అనుమతులను రద్దు చేసారని వెల్లడించారు. (మరో విప్లవానికి ఏపీ సర్కార్ నాంది) గిరిజనాభివృద్ధిని టీడీపీ పట్టించుకోలేదు.. గిరిజనుల విద్యాభివృద్ధిని, వారి ఆరోగ్య సమస్యలను గురించి టీడీపీ ప్రభుత్వం ఏ రోజు కూడా పట్టించుకోలేదని పుష్ప శ్రీవాణి విమర్శించారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత గిరిజనుల విద్యాభివృధ్దిలో భాగంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని, గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను, గిరిజన మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయడానికి ఆదేశాలను ఇచ్చారని ప్రస్తావించారు. అలాగే రాష్ట్రంలో ఏడు ఐటీడీఏలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించడానికి కూడా చర్యలను తీసుకుంటున్నారని వివరించారు. ఆ వర్గాలతో పాటు గిరిజనులకు కూడా అవకాశం.. మునుపెన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంత పంచాయతీల్లో 100 శాతం వార్డులను, జడ్పీటీసీ స్థానాలను గిరిజనులకు రిజర్వ్ చేశారని ప్రస్తావించారు. మైదాన ప్రాంతాల్లోనూ 100శాతం గిరిజన జనాభా కలిగిన తాండాలలో సర్పంచ్లు, వార్డు మెంబర్ల స్థానాలన్నింటినీ కూడా గిరిజనులకే కేటాయించారని గుర్తు చేశారు. 500కు పైబడి జనాభా కలిగిన 146 గ్రామాలను ప్రత్యేక గిరిజన పంచాయితీలుగా మార్చారని, రాష్ట్రంలో 4.76 లక్షల గిరిజన కుటుంబాల గృహావసరాలకు కూడా ఉచిత విద్యుత్తును ఇస్తున్నారని తెలిపారు. నామినేషన్ పనులు, పదవుల్లోనూ ఇస్తున్న 50 శాతం రిజర్వేషన్లలో భాగంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటుగా గిరిజనులకు కూడా సీఎం జగన్ అవకాశం కల్పించారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని స్పష్టం చేసారు. టీడీపీ తప్పిందంతోనే జీవో నంబర్ 3 రద్దు.. జీవో నంబర్ 3 సుప్రీం కోర్టు కొట్టి వేయడానికి కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదమే కారణమని పుష్ప శ్రీవాణి ఆరోపించారు. గతంలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 275 అమల్లో ఉండగా దాన్ని నిర్లక్ష్యం చేసి టీడీపీ ప్రభుత్వ హయాంలో జీవో నంబర్-3 ను తీసుకువచ్చారని, అయితే రాజ్యాగంలో విస్త్తృతమైన అధికారాలు కలిగిన 5(2) అధికరణం ప్రకారం కాకుండా పరిమితమైన అధికారాలు కలిగిన 5(1) అధికరణం ప్రకారంగా ఆ జీవోను తీసుకురావడంతో సుప్రీం కోర్టులో ఈ జీవో వీగిపోవడానికి ప్రధాన కారణమని వివరించారు. జీవో నంబర్ 3 అమల్లో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని దుయ్యబట్టారు. టీడీపీ గోబెల్స్ ప్రచారాలను గిరిజనులు నమ్మరు.. సుప్రీం కోర్టులో కేవలం రివ్యూ పిటిషన్ వేసి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. జీవో నంబర్ 3 పై న్యాయపరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో పాటుగా ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు టీచర్ ఉద్యోగాలలో 100 శాతం రిజర్వేషన్ వర్తించే విధంగా ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర గిరిజన సలహా మండలిలో కూడా ఈమేరకు తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందని కూడా గుర్తు చేశారు. తాము అధికారంలో ఉండగా గిరిజనులకు చేసిన ద్రోహాలను మరిచిపోయి సీఎం జగన్కు నీతులు చెబుతూ టీడీపీ అధినేత లేఖను రాయడం ఏమాత్రం సబబు కాదన్నారు. గిరిజనాభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ విషయంలో టీడీపీ చేసే గోబెల్స్ ప్రచారాలను గిరిజనులు ఎవరూ నమ్మరని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు -
అడవి బిడ్డే హక్కుదారు
సాక్షి, అమరావతి: అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ భూమి హక్కు పత్రాలు (పట్టాలు) మరోసారి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివాసీ దినోత్సవమైన ఆగస్టు 9వ తేదీన పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు 50 వేల ఎకరాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైఎస్సార్ అనంతరం 12 ఏళ్ల తరువాత గిరిజనులకు భూమి హక్కు పత్రాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ అడుగు ముందుకు వేశారు. పట్టాలు పొందడం ద్వారా గిరిజనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. గిరిజనుల కష్టాలను తెలుసుకుని... దివంగత వైఎస్సార్ రైతును రాజు చేయాలన్న ఆలోచనతో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులందరికీ భూమి హక్కు పత్రాలు ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన పాలకులు ఆదివాసీల గురించి పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తరువాత గిరిజనులు నమ్ముకున్న పోడు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన పాదయాత్రలో గిరిజనుల సమస్యను తెలుసుకున్న ఆయన అటవీ శాఖ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఆర్వోఎఫ్ఆర్ (రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) కింద పట్టాలివ్వాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 87,166 మంది గిరిజన రైతులు 1,64,616 ఎకరాలపై సాగు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై పరిశీలన కొనసాగుతోంది. ఆ భూమిలో ఎవరు వ్యవసాయం చేస్తుంటే వారి పేరుతోనే పట్టా ఇస్తారు. ఈ సర్వే ఇప్పటికే మొదలైంది. అడవి బిడ్డలకు ఇబ్బంది లేకుండా... పోడు వ్యవసాయం వల్ల అడవులు దెబ్బతింటున్నాయని అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. అయితే అడవితల్లినే నమ్ముకున్న గిరిజన రైతులకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలివ్వడం ద్వారా పోడు వ్యవసాయానికి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గిరిజనులు చేతుల్లో భూమి హక్కు పత్రాలుంటే అటవీ అధికారుల నుంచి ఇబ్బందులుండవు. ప్రభుత్వ సాయం పొందేందుకు అర్హత గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలివ్వడం ద్వారా ప్రభుత్వ నుంచి సాయం పొందేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులు కూడా రైతు భరోసా అందుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు కూడా తీసుకుంటున్నారు. గడువు పెంచాలని కేంద్రాన్ని కోరిన సీఎం ఇప్పటివరకు 2005 డిసెంబరు 13వతేదీ నాటికి ముందు నుంచి సాగు చేస్తున్నవారికే ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని, ఆ తరువాత సాగు చేపట్టిన వారికి పట్టాలిచ్చేందుకు వీలు లేదని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఈ నిబంధనను 2008 జనవరి 1వతేదీ వరకు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. వైఎస్సార్ హయాంలో 2.22 లక్షల ఎకరాలకుపైగా పంపిణీ దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2,22,383.02 ఎకరాల భూమిని గిరిజన రైతులకు పంపిణీ చేశారు. దీనిద్వారా మొత్తం 88,991 మంది గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరింది. వైఎస్సార్ వారికి హక్కు పత్రాలు ఇవ్వడంతో అటవీ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా గిరిజన రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారు. 15 మందితో కమిటీ సర్వే... ‘పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతుల దరఖాస్తులపై ప్రస్తుతం సర్వే జరుగుతోంది. 15 మందితో ఫారెస్ట్, రెవెన్యూ శాఖ నుంచి వీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ నుంచి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారితో కూడిన కమిటీ సర్వే చేస్తోంది. పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న గిరిజనులు ఎంత కాలం నుంచి భూమిలో వ్యవసాయం చేస్తున్నారనేది ప్రధానంగా పరిశీలిస్తారు. జూన్ 25 నాటికి తుది జాబితా తయారవుతుంది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీపై సోమవారం జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముందుకు వెళతాం’ – పి రంజిత్బాషా, డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ. చాలా సంతోషంగా ఉంది ‘దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతోమంది గిరిజన రైతులకు పట్టాలిచ్చారు. ఆయన అకాల మరణం తర్వాత పోడు సాగుదారుల గోడు విన్న నాథుడే లేడు. మళ్లీ సీఎం జగన్ చొరవతో పోడు భూములపై అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆదివాసీలకు అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు పంపిణి చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ – కాకి మధు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, బుట్టాయిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. వైఎస్సార్ తరువాత నిర్లక్ష్యం... ‘దివంగత వైఎస్సార్ గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించడంతో జీడి మామిడి మొక్కలు పెంచుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. ఏపీ ఫోరం ఫర్ ల్యాండ్ రైట్స్ తరఫున గత ప్రభుత్వంలో గిరిజన మంత్రిని అనేకసార్లు కలిసినా ప్రయోజనం లేదు. గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తున్న ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది’ – కర్రి అబ్బాయిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఫోరం ఫర్ ల్యాండ్ రైట్స్. కల నెరవేరుతోంది... ‘గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదీవాసీ దినోత్సవం సందర్భంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందచేయనుండటంతో గిరిజనుల సుదీర్ఘ కల నెరవేరనుంది. ఆ రోజు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు’ – పాలక రంజిత్కుమార్ , గిరిజన సంక్షేమ సంఘం, విద్యార్థి సంఘాల నాయకుడు, పార్వతీపురం ఇప్పుడు అందరికీ న్యాయం ‘అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషంంగా ఉంది. ఇప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో సాగు భూమి పట్టాలను పంపిణీ చేయలేదు. ఎన్నికలకు ముందు కొంతమందికి మాత్రమే పట్టాలు పంపిణీ చేశారు. తీరా సంబంధిత భూములను వారికి స్వాధీనం చేయలేదు’ – పాచిపెంట అప్పలనర్స, గిరిజన సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాడేరు, విశాఖ జిల్లా రైతు భరోసాతో ఆదుకున్నారు.. ‘రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు మావి. అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం. నిరుపేదలం కావడంతో పెట్టుబడి కోసం ఇబ్బందులు పడేవాళ్లం. ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా ద్వారా మాకు పెట్టుబడి సాయం అందించి ఆదుకున్నారు’ –కుంబి అప్పారావు, ఆర్ఒఎఫ్ఆర్ పట్టాదారు, రైతు భరోసా లబ్దిదారుడు,పనసలపాడు గ్రామం, ,పి.కోనవలస పంచాయతి, పాచిపెంట మండలం -
గిరిజనుల ప్రయోజనాలు కాపాడతాం
సాక్షి, అమరావతి: గిరిజనుల ప్రయోజనాలను కాపాడటంలో రాజీపడే సమస్యే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అడ్వొకేట్ జనరల్తో ముఖ్యమంత్రి ఆదివారం తన నివాసంలో సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టుల్లో ఎస్టీలకు నూరు శాతం రిజర్వేషన్లపై న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచన చేయాలని అడ్వొకేట్ జనరల్కు సూచించారు సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. ► గిరిజన ప్రాంతాల్లోని టీచర్ పోస్టుల్లో ఎస్టీలకు 100% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో 3ను జారీ చేశారు. ఈ జీవోను కొట్టేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ► జీవోను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో గిరిజన వర్గాల్లో ఆందోళన నెలకొందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. తమకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన గిరిజన వర్గాల్లో నెలకొందని తెలిపారు. ► ఈ అంశంపై ఇప్పటికే దృష్టిసారించిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్తో సమీక్షించి గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ► న్యాయస్థానం తీర్పును క్షుణ్నంగా అధ్యయనం చేసి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించాలని పేర్కొన్నారు. ► ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవో కాబట్టి తీర్పు ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఉంటుందని, తెలంగాణ ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుని ముందడుగు వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. -
అడవి బిడ్డలు ఆగమాగం
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలో అరకొర వసతుల మధ్య జీవిస్తున్న చెంచులకు లాక్డౌన్ వల్ల మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సాయం చాలా మందికి అందలేదు. కొంత మంది చెంచుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయినా తీసుకోలేని పరిస్థితి. మరికొందరు చెంచులకు అసలు ప్రభుత్వం నగదు సాయం అందజేసినట్లుగా కూడా తెలియకపోవడం గమనార్హం. లాక్డౌన్ ఉన్నందున వారిని అడవిలో నుంచి బయటికి రానివ్వడం లేదు. ప్రస్తుతం రేషన్ బియ్యం మాత్రమే తీసుకున్న చెంచులు, దాతలు అందజేస్తున్న నిత్యావసరాలతోనే జీవనం వెల్లదీస్తున్నారు. మరో పక్క వేసవి కాలం కావడంతో చెంచుపెంటల్లో వేసిన బోర్లు పూర్తిగా అడుగంటి పోయాయి. గ్రామీణ నీటిసరఫరా పథకం (ఆర్డబ్ల్యూఎస్) ద్వారా అధికారులు ఇప్పటివరకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసే వారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఆ సదుపాయం కూడా నిలిచిపోయింది. మరో పక్క వాగులు, నీటి చెలిమలు కూడా ఎండిపోయాయి. దీంతో నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో ఉన్న మల్లాపూర్, ఫర్హాబాద్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్ తదితర పెంటల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో ఉండి చదువుకుంటున్న పిల్లలంతా ఇప్పుడు ఇళ్లకు చేరుకున్నారు. నీటికొరత కారణంగా వ్యక్తిగత పరిశుభ్రత దూరమైంది. బట్టలు ఉతుక్కోవడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. సరుకులకోసం ఇక్కట్లు.. మన్ననూర్కు వచ్చి చెంచులు తమకు కావాల్సిన నిత్యావసరాలను తీసుకెళ్లేవారు. కానీ.. ప్రస్తుతం రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచి పోవడంతో చెంచు పెంటల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి. గిరిజన కార్పొరేషన్ ద్వారా కొన్ని సరుకులు మాత్రమే దొరుకుతున్నాయి. ఉపాధిహామీ వల్ల వచ్చిన కూలీతో కొంత జీవనం గడిచేది. ప్రస్తుతం ఉపాధి పనులు కూడా కొన్ని చెంచుపెంటల్లో జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మాత్రమే అందాయి. రూ.1,500 నగదు సాయం తమ ఖాతాల్లో జమ అయిందా.. లేదా అనే అవగాహన కూడా వారికి లేదు. చాలా మందికి బ్యాంకు ఖాతాలు కూడా లేవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ ఆర్థిక సాయం కూడా చెంచుల దరి చేరలేదు. నగదు సాయం ఇచ్చినట్లు తెలవదు.. పోయిన నెలలో రేషన్ బియ్యం మాత్రమే తీసుకున్నాం. ప్రభుత్వం నగదు సాయం ఇచ్చినట్లు మాకు తెలవదు. మన్ననూర్కు కూడా పోనిస్తలేరు. అధికారులు స్పందించి నగదు సాయం అందజేయాలి. – మహేశ్వరి, చెంచుమహిళ, భౌరాపూర్ ఇబ్బందులు లేకుండా చర్యలు.. లాక్డౌన్ వేళ చెంచులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రేషన్బియ్యం, నిత్యావసరాలు అందజేస్తున్నాం. తాగునీటికి సం బంధించి 17 హామ్లెట్లకు బోర్లు మంజూరయ్యా యి. త్వరలో బోర్లు వేయిస్తాం. కొంతమందికి రేషన్కార్డులు లేవని గుర్తించాం. అలాంటి వారికి కూడా రేషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఉపాధి హామీ పనులు అన్ని పెంటల్లో జరుగుతున్నాయి. ఒకవేళ ఏ పెంటల్లోనైనా జరగకపోతే వెంటనే పని కల్పించాలని ఆదేశిస్తాం. –అఖిలేశ్రెడ్డి, ఐటీడీఏ పీఓ, మన్ననూర్, నాగర్కర్నూల్ జిల్లా -
నెల వ్యవధిలో ఐదుగురు గిరిజనుల మృతి
కుక్కునూరు: ఏజెన్సీలోని కుక్కునూరు మండలం మారేడుబాక పంచాయతీ చుక్కలలొద్ది గ్రామంలో నెల రోజుల వ్యవధిలో ఐదుగురు గిరిజనులు అంతుచిక్కని వ్యాధులతో మృతిచెందడం కలకలం రేపుతోంది. మార్చిలో ఇద్దరు, ఈ నెలలో ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందారు. మండల కేంద్రమైన కుక్కునూరుకు 10 కి.మీ దూరంలోని అటవీ ప్రాంతంలో చుక్కలలొద్ది గ్రామం ఉంది. 11 ఏళ్ల క్రితం ఛత్తీస్గడ్ రాష్ట్రం నుంచి 20 గుత్తికోయ కుటుంబాలు ఆ గ్రామానికి వలస వచ్చి పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. గతనెల మూడో వారంలో మడకం మాడా (38), కొవ్వాసి సోమడ (35) అంతుచిక్కని వ్యాధులతో మృతి చెందారు. ఈనెల 18, 19 తేదీల్లో మడకం అడమయ్య (50), సోడే సోమ (32), కుడం గంగమ్మ (28) ఇదే విధంగా మృతి చెందడంతో గ్రా మంలో కలకలం రేగింది. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది సోమవారం చుక్కలలొద్ది గ్రామాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు. గిరిజనులు తాగుతున్న నీటి నమూనాలను ల్యాబ్ టెస్టింగ్కు పంపేందుకు సేకరించారు. ఈ విషయమై కుక్కునూరు పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ జెస్సీలివింగ్ ఫెయిత్ మాట్లాడుతూ కలుషిత నీరే గ్రామంలో మరణాలకు కారణమై ఉంటుందని తాము భావిస్తున్నట్టు తెలిపారు. అక్కడ నీటి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపుతున్నామన్నారు. -
గవర్నర్గా కాదు..సోదరిగా వచ్చా
సాక్షి, భూపాలపల్లి: ‘మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు గడిచింది. మొదటిసారిగా గిరిజన గ్రామం బోడగూడెంను సందర్శించ డం సంతోషం కలిగించింది. గవర్నర్గా కాకుండా ఓ సోదరిలా మీ ఊరికి వచ్చాను’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం గవర్నర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. కాటారం మండలం బోడగూడెంలో గిరిజనులతో మమేకమయ్యారు. తొలి సారి తమ గ్రామానికి వచ్చిన గవర్నర్కు గిరిజన సంప్రదాయ పద్దతుల్లో స్వాగతం పలికారు. గిరిజనులనుద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ.. అవకా శాలను అందిపుచ్చుకుని సమాజంలో ఉన్నతస్థాయికి చేరాలని సూచించారు. గ్రామంలోని కాల్నేని వనిత ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. గ్రామస్తులతో ముఖాముఖిలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము ఇప్పటికీ గుడిసెల్లోనే నివసిస్తున్నా మని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, వ్యవసాయానికి మూడె కరాలు భూమిని ప్రభుత్వం మంజూరు చేసే లా చూడాలని గవర్నర్ను గ్రామస్తులు కోరారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అంగన్వాడీ కేం ద్రంలో అందిస్తున్న పోషకాహరం గురించి ఆరాతీశారు. గిరిజన ఆదివాసీలు చూపించిన అభిమానం, ఆప్యాయత తనను కదిలించాయని తమిళిసై పేర్కొన్నారు. బోడగూడెం ప్రజలంతా రాజ్భవన్ కు రావాలన్నారు. అనంతరం గ్రామంలోని లక్ష్మీ దేవర ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. రైతులకు వరం.. కాళేశ్వరం రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్ప వరమని గవర్నర్ కొనియాడారు. దీనివల్ల సాగునీటితో పాటు రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంపు హౌస్, బ్యారేజీలను ఆమె సందర్శించారు. కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్హౌస్ను సందర్శించిన గవర్నర్కు.. 12 మోటార్లతో గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలించే విధానాన్ని ఇంజనీ ర్లు వివరించారు. పంప్హౌస్ నుంచి గ్రావిటీ కెనాల్లోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని చూసి అద్భుతమని ఆమె అభినందించారు. లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ బ్యారేజీ) సందర్శించారు. తర్వాత సరస్వతి బ్యారేజ్ను పరిశీలించి పెద్దపల్లి జిల్లా పర్యటనకు వెళ్లారు. ముక్తీశ్వర ఆలయంలో పూజలు జిల్లా సందర్శనలో భాగంగా కాళేశ్వరానికి వచ్చిన గవర్నర్ దంపతులు కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని దర్శించారు. ఆలయ సిబ్బంది గవర్నర్ దంపతులను పూర్ణకుంభంతో ఆహ్వానించారు. స్వామి ని దర్శించుకున్న గవర్నర్ దంపతు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
చల్చల్ గుర్రం.. తండాకో అశ్వం
కొన్ని సినిమాల్లో హీరోల పాత్ర గొప్పగా పండాలంటే.. కచ్చితంగా గుర్రాల సీన్ ఉండాల్సిందే. పాత కాలంలో ఏమో గానీ.. ఆ మధ్యన మగధీరతో మొదలైన గుర్రపు స్వారీల హవా బాహుబలితో శిఖరాగ్రానికి చేరింది. అసలు విషయానికి వస్తే.. సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ కావడానికి ఉపయోగపడే గుర్రాలు విశాఖ మన్యంలోని మారుమూల తండాల్లో దౌడు తీస్తున్నాయి. ఇక్కడి గిరిజనులకు రవాణా సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. నిజం చెప్పాలంటే ఇక్కడి గిరిజనుల జీవనంలో అశ్వాలు ఓ భాగమయ్యాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కొండకోనల్లో విసిరేసినట్టుండే తండాల్లోని గిరి పుత్రులకు గుర్రాలే అసలైన నేస్తాలు. రోడ్లు లేని గ్రామాలు, అరణ్యాల నడుమ సుదూరంగా ఉండే గూడేల్ని చేరుకునేందుకు.. వర్షాకాలంలో గెడ్డలు, వాగులు దాటేందుకు గుర్రాలే సిసలైన వాహనాలు. కనీసం ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని చోటనుంచి అటవీ ఉత్పత్తుల్ని బాహ్య ప్రపంచానికి తరలించాలన్నా.. నిత్యావసర సరుకుల్ని తండాలకు తెచ్చుకోవాలన్నా ఈ ప్రాంత గిరిజనులు అశ్వాల్నే ఆశ్రయిస్తున్నారు. గూడేల్లోని గిరిపుత్రులు మండల కేంద్రాలకు.. అరకు, పాడేరు నియోజకవర్గ కేంద్రాలకు కాలి నడకన వెళ్లాలంటే కనీసం 12 నుంచి 25 కిలోమీటర్ల మేర కొండలు ఎక్కి, దిగాల్సి ఉంటుంది. తండాకు ఓ గుర్రం ఉంటే చాలు.. గిరిజనులు ఏడాది పొడవునా పండించే రాజ్మా చిక్కుళ్లు, రాగులు, జొన్నలు, కాఫీ, మిరియాలు, కొండ చీపుర్లు తదితర ఉత్పత్తులను వారపు సంతల్లో అమ్ముకునేందుకు.. సంతలో కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులు, ఇతర సామగ్రిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు విశాఖ మన్యంలోని గూడేల ప్రజలు గుర్రాలపైనే వస్తారు. అత్యవసర సమయాల్లో వైద్యసేవల కోసం మండల కేంద్రాల్లోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు గుర్రాలనే వినియోగిస్తుంటారు. మారుమూల తండాలు, ఆవాస ప్రాంతాల్లో 10 నుంచి 15 కుటుంబాల వరకు నివసిస్తుంటాయి. వారిలో ఏ ఒక్క కుటుంబానికి గుర్రమున్నా అందరూ వినియోగించుకుంటారు. అంతా కలిసి దాన్ని పోషిస్తారు. వీటికి గడ్డి, ధాన్యం, దాణా, ఉలవలు ఆహారంగా పెడతారు. వాటిని ప్రాణ సమానంగా చూసుకుంటారు. మాడుగుల సంతలో.. మాడుగుల మండల కేంద్రంలోని వడ్డాది ప్రాంతంలో ప్రతి దసరా రోజున గుర్రాల సంత జరుగుతుంటుంది. ఒక్కో అశ్వం ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. నర్సీపట్నం సమీపంలోని కేడీ పేటలోనూ గుర్రాల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అధికారిక విధులూ నిర్వర్తిస్తాయ్ - ఇక్కడి గుర్రాలను అడపాదడపా అధికారిక విధులకు సైతం వినియోగిస్తుంటారు - ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ అధికారులను తరలించేందుకు గుర్రాలే కీలకం - అటవీ ప్రాంతంలో మావోలు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగిన సందర్భాల్లో మృతదేహాలను తరలించేందుకు సైతం గుర్రాలనే వాడుతుంటారు. వినియోగం ఎక్కడెక్కడంటే.. - జి.మాడుగుల మండలం కిల్లంకోట, లువ్వాసింగి - గెమ్మెలి పంచాయతీల పరిధిలోని తండాలు - చింతపల్లి మండలం బలపం పంచాయతీ - కోరుకొండ పంచాయతీ పరిధిలోని సుమారు 70 పల్లెలు - జీకే వీధి మండలం గాలికొండ, అమ్మవారి దారకొండ, జర్రెల, దుప్పిలవాడ, సప్పర్ల, ఎర్రచెరువుల - మొండిగెడ్డ, దారకొండ పంచాయతీల పరిధిలోని 150 తండాలు - పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలోని 45 నివాస ప్రాంతాలు - గిన్నెలకోట పంచాయతీలోని 18 నివాస ప్రాంతాలు - జామిగుడ పంచాయతీలోని 19 తండాలు - ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు పంచాయతీలోని 18 పల్లెలు - బుంగాపుట్టు పంచాయతీలోని 24 నివాస ప్రాంతాలు - రంగబయలు పంచాయతీలోని 22 తండాలు టీచర్కూ కొనిచ్చారు జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ పరిధిలోని సుర్లపాలెం ప్రాథమిక పాఠశాలలో చుట్టుపక్కల తండాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య 60 వరకు ఉంది. రోడ్డు మార్గం సరిగ్గా లేక.. ఉపాధ్యాయులు సక్రమంగా రాక విద్యార్థుల డ్రాప్ అవుట్స్ శాతం పెరిగింది. మూడు నెలల క్రితం ఇక్కడకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు గంపరాయి వెంకటరమణ ఇబ్బందులు పడుతూనే క్రమం తప్పకుండా స్కూలుకు వచ్చేవారు. దీంతో గిరిజనులంతా కలిసి ఆయనకు ఓ గుర్రాన్ని కొనిచ్చారు. ఆయన దానిపైనే వస్తూ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. గుర్రం లేకుంటే మాకు జీవనం లేదు మేం పండించిన పంటలను అమ్ముకునేందుకు చింతపల్లి దరి లంబసింగిలో ప్రతి గురువారం సంతకు వస్తుంటాం. గుర్రంపై బరువు వేసి.. మేం నడుచుకుంటూ వస్తాం. గుర్రం లేకుంటే మాకు జీవనమే లేదు. – గూడా బాబూరావు, చీడిమెట్ట గ్రామం, కిల్లంకోట పంచాయతీ, జి.మాడుగుల మండలం మా పిల్లలకు అవే నేస్తాలు మా గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే గుర్రాలే దిక్కు. అందుకే వాటిని మేం ప్రాణంగా చూసుకుంటాం. మా పిల్లలకు అవే నేస్తాలు.. మా గుర్రాన్ని మా పిల్లలు రాజు అని పిలవగానే పరుగెత్తుకు వస్తుంది. – ఎండ్రపల్లి సూరిబాబు, సుర్తిపల్లి, కిల్లంకోట పంచాయతీ, జి.మాడుగుల మండలం -
మొక్కుబడిగానే..!
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రితో పాటు చుట్టుపక్కల ఉన్న మరో మూడు జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల అభివృద్ధిపై చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన ఐటీడీఏ పాలకమండలి.. మొక్కుబడిగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 3 నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన పాలకమండలి సమావేశాన్ని 38 నెలల తరువాత నిర్వహించడమే ఇందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో భద్రాద్రి కలెక్టర్ రజత్కుమార్ శైనీ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇంతకాలం సమావేశాలు నిర్వహించకపోవడంతో ఇటీవల పదవీకాలం పూర్తయిన ఎంపీపీలు, జెడ్పీటీసీలకు గిరిజన సమస్యలపై గళం వినిపించే అవకాశం లేకుండా పోయింది. ఇక సమావేశ హాల్లో ఖాళీ లేదనే సాకుతో అధికారులు మీడియాను అనుమతించలేదు. గిరిజనుల సమస్యలను ప్రజాప్రతినిధులు లేవనెత్తే అంశాలు బహిర్గతం కావడం అధికారులకు ఇష్టం లేనందునే ఇలా వ్యవహరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోడు సమస్యే కీలకం.. పాలకమండలి సమావేశంలో పోడు భూముల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంటేశ్వరరావు ఈ విషయాన్ని లేవనెత్తారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందు క్రాస్రోడ్డు వద్ద పోడుభూముల విషయమై ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న గిరిజనులను అటవీ అధికారులు ఇబ్బంది పెడుతుంటే ఎమ్మెల్యేనైన తాను అక్కడికి వెళ్లానని, తాను మాట్లాడిన విషయాలను అటవీ అధికారులు రికార్డు చేసి ఎలా బహిర్గతం చేశారని ప్రశ్నించారు. అటవీ అధికారుల విధులను తాను ఆటంకపరిచానని చెప్పడం అవాస్తవమన్నారు. డీఎఫ్ఓ రాంబాబు కావాలనే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలున్న అనేకమంది గిరిజనులపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చెడుపేరు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారన్నారు. అటవీ ప్రాంతాల్లో రోడ్లు వేయకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. మావోయిస్టుల ఉద్యమం పెరగడానికి కూడా అటవీ అధికారుల వైఖరే కారణమని వనమా ఆరోపించారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పోడు కొట్టుకుని భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల జోలికి వెళ్లవద్దన్నారు. మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో వెంటనే సిబ్బందిని నియమించి, మౌలిక సదుపాయా లు కల్పించాలని కోరారు. సారపాక, మర్కోడులో కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేయాలని కోరారు. గుండాలలో ఏకలవ్య పాఠశాల మంజూరైతే ఇప్పటివరకు స్థలం కేటాయించలేదన్నారు. గతంలో పినపాకకు మంజూరైన ఏక లవ్య పాఠశాలకు స్థలం ఇవ్వకపోవడంతో ఆ పాఠశాల చింతూరుకు తరలిపోయిందన్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులంతా మద్దతు తెలిపారు. పోడు భూముల జోలికి అధికారులు వెళ్లవద్దని తీర్మానం చేశారు. అధికారులు ప్రణాళికతో ముందుకెళ్లాలి... మూడు సంవత్సరాల తర్వాత ఐటీడీఏ పాలకమండలి సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ చర్చకు వచ్చిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత సూచించారు. భద్రాచలం డివిజన్లోని మారుమూల ప్రాంత గిరిజనులైన కోయ, కొండరెడ్లు, నాయక్పోడ్ తెగకు చెందిన ఆదిమజాతి గిరిజనులు ఎక్కువగా పోడు వ్యవసాయంపై ఆధారపడతారని, వారి సమస్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను అటవీ అధికారులు వేధించడం సరికాదని, వారికి అన్యాయం జరగకుండా సహకరించాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీలు, ఎంపీపీలు విద్య, ఆరోగ్యం, గ్రామాల్లోని మౌలిక వసతుల విషయంలో క్షుణ్ణంగా తెలియజేశారని, వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. వాటి పరిష్కారానికి తాను కూడా కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ రెండేళ్లలో విద్యారంగంలో పలు మార్పులు వచ్చాయని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మరో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వాజేడు, వెంకటాపురం మండలాలకు చెందిన ఐదుగురు సీఆర్పీలను తీసుకోవడం లేదని చెప్పగా దీనిపై స్పందించిన కలెక్టర్ ఐదుగురు సోషల్, తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టుల వారీగా ఉన్నారని, జిల్లాలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు కొరత ఉందని, పాఠశాలల్లో 10 మంది ఉన్నా, 30 మంది ఉన్నా సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరం ఉండటంతో ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తున్నామని చెప్పారు. ఐటీడీఏ పరిధిలో 232 మంది టీచర్లు ఉన్నారని, 18 మందిని తీసుకోగా, మిగిలిన ఐదుగురికి కూడా అవకాశం కల్పిస్తామన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ ఉభయ జిల్లాల్లో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న 50 మంది సీఆర్పీలను రెగ్యులర్ చేయకపోవడం తో వారి పరిస్థితి దీనంగా ఉందన్నారు. భద్రాచలంలో ఒకటే డిగ్రీ కళాశాల ఉందని, మరో కళా శాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరా రు. ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ మాట్లాడుతూ ఇల్లెందులో ఉన్న 30 పడకల ఆస్పత్రి 60 కి.మీ.ల పరిధిలో పనిచేస్తున్నదని, అక్కడ గైనకాలజిస్టు నియామకానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుస్తాం.. ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలన్నదే తమ ధ్యేయమని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ చైర్మన్ రజత్కుమార్ శైనీ తెలిపారు. పరిపాలనను సులభతరం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడానికే ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిం దని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే భద్రాచలం ఐటీడీఏ ద్వారా గిరిజనుల సమగ్రాభివృద్ధికి విశిష్ట సేవలు అందచేస్తున్నట్లు తెలిపారు. భద్రాద్రి జిల్లాలో గిరిజనులు అధికంగా నివసిస్తున్నారని, వారి సమగ్రాభివృద్ధికి అంద రం ఒక టీం వర్క్గా పనిచేస్తే అభివృద్ధి సాధిం చగలమని చెప్పారు. నూతనంగా జిల్లా ఏర్పడడం, దాదాపు మూడున్నర సంవత్సరాల తరువాత ఐటీడీఏ పాలక మండలి సమావేశం నిర్వహిస్తున్నందున ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల వారీగా తెలియజేసిన సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్రాజు, ఆంగోతు బిందు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఐటీడీఏ పీఓ వి.పి.గౌతమ్, సబ్ కలెక్టర్ భవేష్మిశ్రా, జిల్లాలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఏమిటీ ‘పోడు’ పని
సాక్షి, నెట్వర్క్ : అడవి.. తనను నమ్ముకున్నోళ్లకు, అమ్ముకుంటున్నోళ్లకు మధ్య నలిగిపోతోంది. ఆక్రమణలు, దౌర్జన్యాల ఆటవిక చేష్టలకు చిక్కిశల్యమైపోతూ ‘అరణ్య‘రోదన చేస్తోంది. పలుకుబడిగల పెద్దలు, రాజకీయ ముసుగులోని స్థానిక నాయకులు, కబ్జాదారులు వనా లను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఆదివాసీ, గిరిజన తెగలకు అడవిపై జన్మతః ఓ ‘హక్కు’ ఉంటుంది. అలా వారికి సంక్రమించిన హక్కుల్లో ‘పోడు వ్యవసాయం’ ఒకటి. ఇప్పుడా హక్కుకు, అడవికి ముప్పొచ్చింది. వనజీవన విధానాన్ని నాశనం చేస్తూ, అడవిబిడ్డలను తరిమేస్తూ, అడవులను నరికేస్తూ, ఆక్రమించేస్తూ రకరకాల ముసుగుల్లో గిరిజనేతరులు పర్యావరణ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ‘పోడు’పేరుతో నడుస్తోన్న పాడు దందా.. చోటుచేసుకుంటున్న ఆటవిక దాడులు, అటవీ ఆక్రమణలు ఎందాకా వెళ్తాయనేది అంతుబట్టని విషయంగా మారింది. తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం 26.9 లక్షల హెక్టార్లు (24 శాతం). ప్రభుత్వం దీన్ని 33శాతానికి పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఓ పక్క ఇటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే.. మరోపక్క అటవీ భూముల ఆక్రమణ, చెట్ల నరికివేత వంటి విధ్వంసకర చర్యలతో పర్యావరణం తీవ్రంగా నష్టపోతోంది. అడవుల ఆక్రమణ, నరికివేత వంటి ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 10శాతానికే పరిమితమైందనేది ఒక అంచనా. దేశంలోనే వేగంగా అటవీ విస్తీర్ణం తరిగిపోతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ‘కాకులు దూరని కారడవి’అనేది పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకతప్పదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు, ఆదివాసీల పేరుతో గిరిజనేతరులు సాగిస్తున్న సంప్రదాయేతర పోడు సాగు, అడవుల నరికివేత వంటి పరిణామాలు ‘అడవులకు పట్టిన క్యాన్సర్’అని వారంటున్నారు. ‘పోడు’పేరుతో పాడు ఆక్రమణలు గిరిజనులు, ఆదివాసీల పోడు వ్యవసాయం ప్రత్యేకమైనది. అడవుల్లోని వాలు గల ప్రాంతాల్లో ఉండే చిన్నపాటి పొదలు, మొక్కల్ని నరికి సేద్యానికి అనువుగా మలుచుకుంటారు. ఈ విధానంలో దుక్కు దున్నరు. నాగలికి ఎడ్లను కట్టరు. ఒక చిన్నపాటి పుల్ల (దీనిని ‘కచల్’అంటారు)తో భూమిని లోతుకు పెళ్లగించి విత్తనాలు విత్తుతారు. వీరు సాగుచేసే పంటలు కూడా రాగులు, సజ్జలు, జొన్నలు ఇతర చిరుధాన్యాలే. ఈ పంటలకు పూర్తిగా పశువుల పెంటనే ఎరువుగా వినియోగిస్తారు. ఒకేచోట రెండు మూడు పంటల కంటే ఎక్కువ సాగు చేయరు. స్థిర వ్యవసాయం కంటే కూడా చాలా సహజ పద్ధతుల్లో సాగే ఈ పోడు వ్యవసాయం విధానాల వల్ల అడవులకు, పర్యావరణానికి కానీ పూచిక పుల్లంత హాని కూడా జరగదు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పోడు భూముల విస్తీర్ణం భారీగా ఉంది. ఈ భూములపై కన్నేసిన ఆయా జిల్లాల్లోని స్థానిక నాయకులు ఆదివాసీలను మచ్చిక చేసుకుని, వారిని బినామీలుగా మార్చుకుని పోడు భూముల్ని చెరబట్టారు. గిరిజనుల పేరుతో తామే సాగుచేయడం మొదలుపెట్టారు. అసలైన పోడు వ్యవసాయానికి అర్థం మార్చేస్తూ.. అడ్డొచ్చిన మొక్కల్ని, చెట్లను నరికేస్తూ.. అడవులను మైదానాలుగా మార్చేసి సేద్యం చేయడం మొదలుపెట్టారు. అటవీ అధికారులతో పాటు ప్రభుత్వమూ చూసీ చూడనట్టు వదిలేయడంతో అడవులు ఆగమైపోతున్నాయి. పోడు, ఇతర అటవీ భూముల తదాగాలు చెలరేగినా, ఘర్షణలు తలెత్తినా గిరిజనులను ముందుంచి ‘వివాదాస్పదం’చేయడం మొదలైంది. అందుకు తాజా ఉదాహరణలే మొన్న సిర్సాలా, కొత్తగూడెం ఉదంతాలు. ఎక్కడికక్కడ అడవులు హాంఫట్ ప్రస్తుతం పోడుతో పాటు అటవీ భూములు ఎంతెంత ఎక్కడ ఆక్రమణకు గురయ్యాయో కూడా అటవీ శాఖ వద్ద సరైన లెక్కలు లేని దుస్థితి. ఎడాపెడా అడవులను ఆక్రమించేస్తున్న వారిలో అన్ని పార్టీలకు చెందిన వారున్నారు. తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం 26,90,370 హెక్టార్లు కాగా, ఇందులో 2,94,693 హెక్టార్ల భూమి ఆక్రమణల చెరలో ఉంది. ఇది దాదాపు 11 శాతానికి సమానం. మొదట పోడు పట్టాలున్న ఆదివాసీలు, గిరిజనులను ముగ్గులోకి దించుతున్న ఆక్రమణదారులు.. వారిని ముందుంది అడవుల ఆక్రమణకు తెగబడుతున్నారు. ఆపై నెమ్మదిగా కొద్ది కొద్దిగా ఆక్రమణలను విస్తరించుకుంటూ పోతున్నారు. ఈ ఆక్రమణల పర్వం ప్రస్తుతం చేయి దాటిపోయిన స్థితికి చేరింది. అడవిపై హక్కెవరిది? 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్) కింద పోడు భూముల పట్టాలిచ్చింది కొందరికే. ఇప్పటికీ ఆయా జిల్లాల్లో వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ మూడు తరాలుగా (కనీసంగా 75 ఏళ్లు) అక్కడ నివాసం కలిగి ఉంటే.. వారికి సహజంగా అటవీ భూములపై హక్కులు కల్పించాల్సి ఉంది. కానీ, ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి–కొత్తగూడెం తదితర జిల్లాల్లో వందేళ్లకు పైబడి అడవుల్లో ఉంటున్న వారికీ పట్టాలు అందని పరిస్థితి ఉంది. అటవీ హక్కుల చట్టం కింద 2017 చివరి వరకు 11 లక్షల ఎకరాలకు హక్కులు కల్పించాలంటూ 1,86,534 దరఖాస్తులు అందాయి. వీటిలో 6,30,714 ఎకరాలకు 1,83,107 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. సామూహిక (కమ్యూనిటీ) కేటగిరీ కింద 4,70,605 ఎకరాలకు 3,427 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో వేల మంది ఇప్పటికీ అటవీ హక్కుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే.. రెండు కేటగిరీల కింద 82,572 దరఖాస్తులను తిరస్కరించగా, తమ వద్ద మాత్రం 9,743 దరఖాస్తులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని అటవీ, ఐటీడీఏ రికార్డులు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, అటవీ శాఖ.. హక్కు పత్రాలున్న తమ భూముల్ని స్వాధీనం చేసుకోవడానికి చూపిస్తున్న ఉత్సాహం గిరిజనేతరుల ఆక్రమణలపై మాత్రం కిమ్మనడం లేదనే ఆరోపణలున్నాయి. పోడు భూముల్లో కార్పొరేట్ సాగు భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల, కన్నాయిగూడెం, పాత కన్నాయిగూడెం గ్రామాల్లో వందల ఎకరాల పోడు భూములున్నాయి. ఇవన్నీ స్థానిక నాయకుల గుప్పిట్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాలకు సమీపంలో గల ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దొరమామిడి, పూచికపాడు, కన్నాపురం ప్రాంతాలకు చెందిన బడా గిరిజనేతర రైతులు ఈ పోడు భూముల్లో కార్పొరేట్ స్థాయిలో పంటల సాగు చేస్తున్నారు. అలాగే ఈ జిల్లాకు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో గొత్తికోయలు ఇక్కడకు వలస వచ్చి అటవీ భూముల్లో పోడు సాగు చేస్తున్నారు. ఒకటి రెండు పంటలు వేసిన అనంతరం ఆ భూముల్ని గిరిజనులు, గిరిజనేతరులకు అమ్మేస్తున్న దాఖలాలు ఉన్నాయి. భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో 90 వేల ఎకరాల అటవీ భూముల్లో అక్రమంగా పోడు వ్యవసాయం సాగుతుండటమే ఇందుకు నిదర్శనం. ఇక, మహబూబాబాద్ జిల్లాలో 4,096.95 హెక్టార్లలో అక్రమంగా పోడు సాగుతోంది. చాలామంది ఆదివాసీలు, గిరిజనులు ఆర్థిక ఇబ్బందులతో తమ అటవీ భూముల్ని భూస్వాములు, స్థానిక నాయకుల చేతుల్లో పెడుతున్నారు. ఇలా లక్షల ఎకరాలు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ ‘పోడు’చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో దాదాపు 10వేల ఎకరాల్లో అక్రమంగా పోడు సేద్యం సాగుతోంది. ఈ భూమిలో హక్కు పత్రాలున్నదెంత? లేనిదెంత? అనేది అధికారుల వద్దే లెక్కా పత్రం లేదు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన వ్యాపారి జనగం పాపారావు, పెద్దల్లాపురం గ్రామానికి చెందిన రామారావు వంద ఎకరాల చొప్పున, ఇదే గ్రామానికి చెందిన మాజీ మిలిటెంట్ రామ్చందర్ 70 ఎకరాల్లోనూ బినామీ పేర్లపై పోడు సాగు చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లో 30వేల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఈ డివిజన్లోని సార్సాలలో ఇటీవల అటవీశాఖ అధికారిణిపై దాడికి పాల్పడిన వారిలో పోచం అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఈయన 40 ఎకరాల వరకు అటవీ భూమిని కబ్జా చేసినట్టు తేలింది. గిరిజనుల పేరుతో ఈయనకు డివిజన్ వ్యాప్తంగా వందల ఎకరాలను బినామీ పేర్లతో కబ్జా చేసినట్టు ప్రచారం సాగుతోంది. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్కు చెందిన ఓ ప్రముఖుడు తనతో పాటు తన బంధువులు, తన కింద పని చేసే వారి పేర్లపై నెమళ్లగుట్ట, జబ్బోనిగూడెం అటవీ ప్రాంతంలోని 50 ఎకరాల్లో జామాయిల్ తోటలు పెంచుతున్నారు. ఇందులో ఈయన పేరిట 15 ఎకరాల వరకు రెవెన్యూ రికార్డుల్లో ఉండగా, మిగతా భూమి తన పెట్రోలు బంకులో పనిచేసే సిబ్బంది పేర్లపై ఉన్నట్టు సమాచారం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని గోగుపల్లి, పప్కాపురం, చిన్నబోయినపల్లి శివారు ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు అడవుల్లోని చెట్లను కొట్టించి, కూలీలతో వ్యవసాయం చేయిస్తున్నారు. చిన్నబోయినపల్లిలోని వందల ఎకరాల భూమి గిరిజనేతరుల చేతుల్లోనే ఉండగా.. ఈ వివాదం ప్రస్తుతం పెండింగ్లో ఉంది. అడవిలో ఆస్పత్రి ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆస్పత్రి భవనం. భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా గట్లమల్లారానికి చెందిన దుస్సా సమ్మయ్య ప్రైవేట్ వైద్యుడు,. అధికార పార్టీ నేతగానూ ప్రచారం చేసుకుంటాడు. తప్పుడు ధ్రువపత్రాలతో మొదట 5సెంట్ల భూమి కొనుగోలు చేసిన ఆయన మరో పది సెంట్ల వరకు పక్కనే ఉన్న అటవీ భూమిని ఆక్రమించి రెండంతస్తుల వైద్యశాలను నిర్మించారు. అనుమతుల ప్రక్రియ నిమిత్తం అటవీ అధికారి రూ.3 లక్షలు తీసుకున్న ఇక్కడ బహిరంగంగా చెప్పుకుంటారు. ప్రధాన రహదారి పక్కనే.. 70% అటవీ భూమిలో, 30% ప్రభుత్వ భూమిలో కనిపించే భవనం.. అటవీ భూముల ఆక్రమణకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. నిజానికి ఈ ప్రాంతంలో ‘170 యాక్ట్’అమల్లో ఉంది. అంటే, ఇక్కడ పట్టా భూమిలో వెంచర్ వేయడానికి కూడా వీల్లేదు. కానీ, రెండంతస్తుల భవనం కళ్లెదుటే కనిపిస్తున్నా.. పట్టించుకునే అటవీ, రెవెన్యూ అధికారులే లేరు. సర్కారు ఉద్యోగి ‘పాడు’దందా ఈ చిత్రంలో కనిపిస్తున్నది పోడు పేరుతో అక్రమంగా సాగు చేస్తున్న భూమి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలానికి చెందిన హాస్టల్ వార్డెన్ గుస్సా స్వామి.. మండలంలోని వివిధ ప్రాంతాల్లో 55 ఎకరాల్లో అక్రమంగా పోడుసాగు చేస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కానీ తీగలాగితే.. ఇది 300 ఎకరాలుగా తేలింది. ఈయన భార్య సర్పంచ్ కూడా. మొత్తానికి ఈయన పోడు దందాపై ప్రభుత్వానికి ఫిర్యాదు అందిన దరిమిలా సస్పెండ్ అయ్యారు. తిరిగి విధుల్లో కూడా చేరిపోయాడు. ఈ జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఖాసీం 18 ఎకరాల్లో అక్రమంగా పోడు సాగు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు అందిన మరుక్షణమే ఈయన కాంగ్రెస్ నుంచి అధికార పార్టీలోకి దూకేశారు. కేసు కాకుండా తప్పించుకున్నారు కానీ, పోడు భూమిని మాత్రం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. (ఫొటో20: కొత్తగూడెం మండలంలో గుస్సా స్వామి ఆధీనంలో అక్రమంగా సాగవుతున్న భూమి) గిరిజనేతరులే కొట్టిస్తున్నారు అటవీహక్కుల చట్టం కింద అక్రమంగా పట్టాలు పొందాలనే దురుద్దేశంతో గిరిజనేతరులు.. గొత్తికోయలతో అడవుల్ని కొట్టిస్తున్నారు. చెల్పాక అటవీ ప్రాంతంలో పలు పార్టీలకు చెందిన నాయకులు వందెకరాలకు పైగా అడవిని కొట్టించి పోడు వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అర్హులైన గిరిజనులకు న్యాయం చేయాలి. – తోలెం కిష్టయ్య, ముల్లకట్ట, ఏటూరు నాగారం -
టీడీపీ ప్రభుత్వం నిండా ముంచింది..
సాక్షి, రంపచోడవరం(తూర్పు గోదావరి): గత టీడీపీ ప్రభుత్వం తమను నిండా ముంచిందని పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పీఎంఆర్సీలో సోమవారం ఆదివాసీ డెవలప్మెంట్ రైట్స్ ఫోరం (ఏడీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో పది గ్రామాలకు చెందిన నిర్వాసితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారం గ్రామానికి చెందిన కె.వెంకట రమణ మాట్లాడుతూ నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణ విషయంలో టీడీపీ ప్రభుత్వ పాలకులు, అధికారులు మోసం చేశారని ఆరోపించారు. గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మూడు రకాల ఇళ్ల నమూనాలను కాగితాలపై చూపించారు. అయితే ఇళ్లను మాత్రం ఆ నమూనాల్లో నిర్మించడం లేదన్నారు. అధికారులకు నచ్చిన విధంగా కాంట్రాక్టర్ ఇళ్లు కట్టుకుంటూ వెళ్లారని, స్థల సేకరణ, ఇళ్ల నిర్మాణంలో నిర్వాసితుల ప్రమేయం లేకుండా చేయడం దారుణమని ఆయన విమర్శించారు. గ్రామసభల్లో అధికారులు చెప్పిన మాటలకు.. క్షేత్ర స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలకు పొంతన లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ (ఎఫ్ఆర్ఎల్) ముంపునకు గురికాని భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని సరుగుడు గ్రామంలో ముంపునకు గురికాని భూములకూ నష్టపరిహారం చెల్లించారని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎఫ్ఆర్ఎల్ పైభాగంలో ఉన్న ఐదు మండలాల్లో ముంపునకు గురికాని భూమి ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆ భూముల్లోకి వెళ్లి వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండదన్నారు. జీవనోపాధి కోల్పోయే రైతులను అదుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్అంఆర్ ప్యాకేజీ వర్తింప జేయాలన్నారు. పశ్చిమ గోదావరిలో కట్ ఆఫ్ డేట్కు సంబంధం లేకుండా ఖాళీ చేసిన గ్రామాల్లో ఒప్పంద పత్రాలు ఇచ్చారని తెలిపారు. ఇక్కడ కూడా అదే విధంగా ఒప్పంద పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్రహారానికి చెందిన అబ్బాయిరెడ్డి మాట్లాడుతూ నచ్చిన చోట ఇళ్లను నిర్మిస్తామని చెప్పిన అధికారులు.. అందరికీ ఒక్క చోటే ఇళ్ల నిర్మాణం చేశారన్నారు. దీంతో అందరికీ ఉపాధి ఉండే పరిస్ధితి లేదు. ఏనుగులగూడెం గ్రామానికి చెందిన కుంజం భద్రం మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యంతోనే నిర్వాసితులకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గోదావరిలో వరద నీరు ఆందోళన కలిగిస్తుందని ఇంటి వద్ద ఫొటోలు తీసుకునేందుకు రావాలని అధికారులు చెబుతున్నారు. నిర్వాసితులను మరోమారు మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. కాంట్రాక్టర్కు నష్టం జరగకుండా, బిల్లుల చెల్లింపు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ కొమరం పోశమ్మ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కర్రి అబ్బాయిరెడ్డి, మాజీ సర్పంచి కొమరం కన్నయ్యమ్మ, ఏడీఆర్ఎఫ్ సభ్యుడు జి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. -
మాట ఇస్తే.. మరచిపోడు
మాట ఇస్తే మరచిపోనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు గిరిజనులకు బాసటగా నిలిచేందుకు ముందడుగు వేశారు. అధికారం చేపట్టిన నెలన్నరలోపే అటవీహక్కుల పరిరక్షణ చట్టం పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా పశ్చిమ ఏజెన్సీలో హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, పశ్చిమ గోదావరి: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు తరతరాలుగా ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. ఆ భూములకు పట్టాలు ఉన్నా.. బ్యాంక్ రుణాలు పొందక వ్యవసాయ పనుల సీజన్లో ఆదివాసీలు అనేక అవస్థలు పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అటవీ హక్కుల పరిరక్షణ చట్టానికి పునరుజ్జీవం తీసుకొస్తామని, పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారమే.. ముఖ్యమంత్రి అయిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన సంక్షేమ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు చట్టానికి పునరుజ్జీవం తీసుకొచ్చేలా ఆ శాఖ ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. వెల్లువెత్తుతున్న ఆనందోత్సాహాలు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలతో ప్రతి ఆదివాసీ గిరిజనుడు మైదాన ప్రాంతంలో ఉన్న రైతులతో సమానంగా పూర్తి హక్కులు పొందబోతున్నారు. ఎంతో కాలంగా పట్టాలున్నా ప్రయోజనం లేకుండా పోయిందంటూ ఆదివాసీలు అనేకమార్లు ఆందోళనకు దిగారు. ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి ఔదార్యంతో తమకు న్యాయం జరుగబోతుందని, ఇక తమ కష్టాలు కడతేరినట్టేనని, ఆనందంగా వ్యవసాయం చేసుకుంటామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పోడు భూముల పరిస్థితిని పరిశీలిస్తే అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 23,058 ఎకరాలు ఉన్నాయి. అలాగే వీఎస్ఎస్, ఉమ్మడి భూములు సుమారు 61,000 ఎకరాలు ఉన్నాయి. వీటి పట్టాల కోసం 2005 తర్వాత 12,386 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వీటిని పరిశీలించిన ప్రభుత్వం మొత్తం 1932 మంది అర్హులని నిర్ణయించి వారికి 63,961 ఎకరాల భూములకు పట్టాలు పంపిణీ చేసింది. అయితే పట్టాలు పంచినా.. ఆ భూములపై ఎలాంటి హక్కులూ లేకుండా గిరిజనులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. సుమారు రెండువేల గిరిజన కుటుంబాలకు మేలు జరగనుంది. జగనన్నది మాట తప్పని నైజం వైఎస్ జగన్మోహన్రెడ్డిది మాట తప్పని నైజం. ఆయన మాట ఇస్తే మరచి పోడు. ఇప్పుడు అటవీహక్కుల చట్టానికి పునరుజ్జీవం కల్పించే దిశగా ఆయన అడుగులు వేయడం ఆనందంగా ఉంది. సుమారు రెండువేల కుటుంబాలకు మేలు జరగబోతుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు. – జువ్వల బాజీ, ఆదివాసీ హక్కుల కార్యకర్త, జీలుగుమిల్లి మండలం గిరిజన అభివృద్ధే లక్ష్యం గిరిజన అభివృద్దే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం. నాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అటవీ హక్కుల చట్టంలో లక్షలాది మందికి భూములు పంచి చరిత్ర సృష్టించారు. సీఎం జగన్మోహన్రెడ్డి మరొక అడుగు ముందుకు వేసి పోడు భూమి వ్యవసాయదారులకు హక్కులు, పథకాలు పొందేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆయన మాట ఇస్తే మరచిపోడు. గిరిజనుల అభివృద్దే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తుంది. – తెల్లం బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే -
జలియన్వాలా బాగ్కు వందేళ్లు
అమృత్సర్/న్యూఢిల్లీ: జలియన్వాలా బాగ్ మారణకాండ జరిగి నేటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ నరమేధంలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకున్నారు. వెంకయ్య నాయుడు జలియన్వాలా బాగ్ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అలాగే సిక్కు గురువులు పాడిన శ్లోకాలను ఆలకించారు. ఈ నరమేధం జ్ఞాపకార్థం వెంకయ్య నాయుడు స్మారక నాణెం, తపాలా బిళ్లను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్రం ఎంత విలువైనదో జలియన్వాలా బాగ్ దురంతం మనందరికీ గుర్తు చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. 1919 ఏప్రిల్ 13న సిక్కుల ముఖ్య పండుగ వైశాఖీ సందర్భంగా అమృత్సర్లోని జలియన్వాలా బాగ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ఇండియన్ సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో వేలాదిమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని మోదీ నివాళులు జలియన్వాలా బాగ్ దురంతంలో అమరులైన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఆ పోరాట వీరులు దేశం కోసం పనిచేయడానికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ‘జలియన్వాలా బాగ్ నరమేధం జరిగి నేటికి వందేళ్లు. ఈ సందర్భంగా ఆ ఘటనలో అమరులైన వారికి భారత్ నివాళులర్పిస్తోంది. వారి విలువైన ప్రాణ త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. దేశం కోసం మరింత కష్టపడి పనిచేయడానికి వారు స్ఫూర్తిగా నిలిచారు’అని మోదీ ట్వీట్ చేశారు. స్మారకం వద్ద రాహుల్ నివాళి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జలియన్వాలాబాగ్ స్మారకం వద్ద నివాళులర్పించారు. రాహుల్తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా అంజలి ఘటించారు. నాటి ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ‘స్వాతంత్య్రపు విలువ ఎప్పటికీ మర్చిపోలేనిది. ప్రాణత్యాగం చేసిన నాటి పోరాట వీరులకు అభివాదం చేస్తున్నాం’అని రాహుల్ సందర్శకుల పుస్తకంలో రాశారు. -
వామ్మో.. చిరుత
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): చిరుతపులులను దూరం నుంచి చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఏకంగా రైతుల వెంటపడి తరుముతుంటే.. ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీసిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా పరిసర అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. అదే తండాలో రెండునెలల వ్యవధిలో చిరుతపులి మూడుసార్లు స్థానికులకు భయం కల్పించింది. తాజాగా శనివారం రాత్రి తండాకు చెందిన నునావత్ రాములు, మాలోతు గన్యా వ్యవసాయ పొలాల వద్దకు కాపలాగా వెళ్లారు. తెల్లవారుతుండగా తండాకు వస్తున్న క్రమంలో దూరంగా పులి అరుపులు విన్న రైతులు అప్రమత్తమై తండావైపు పరుగులు తీశారు. చిరుతకు ఎక్కువ దూరంలో రైతులు ఉండడం వల్ల, తండాకు సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. చిరుతపులి సంచారంతో ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని అటవీ ప్రాంతంలో నివాసాలు ఉండే గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల్లో మూడో ఘటన గుంటపల్లి చెరువు అటవీ ప్రాంతంలో సరిగ్గా 57 రోజులక్రితం చిరుతపులి రెండు లేగదూడలపై దాడిచేసి హతమార్చింది. గ్రామ శివారులోని పశువుల కొట్టంలో ఉంచిన లేగదూడలను అటవీ ప్రాంతంలోకి లాక్కువెళ్లి హతమార్చింది. ఈ సంఘటన తండాలో భయాన్ని కలిగించింది. అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి చిరుతకోసం నామమాత్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మరో 15 రోజులకు అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడం రైతులకు కనిపించింది. వారు దూరం నుంచే గమ నించి తండాకు పరుగులు తీశారు. ఆ ఘటన నుంచి గిరిజనులు తేరుకోక ముందే 42 రోజుల కు మరోసారి తాజాగా చిరుతపులి రైతులను వెంబడించింది. గతంలో వీర్నపల్లి మం డలం కంచర్ల, రంగంపేట, మద్దిమల్ల, వీర్నపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులులు సంచరించి సుమారు 20 లేగదూడలను హతమార్చాయి. చిరుతలను బంధించాలి చిరుతపులులను బంధించి ప్రజలకు ప్రాణరక్షణ కల్పించాలి. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకొని జూపార్క్కు తరలించాలని గిరిజనులు వేడుకుంటున్నారు. ముఖ్యంగా చిరుతపులులు సంచరించే ప్రాంతంలో హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బోర్డులు ఉంటే తెలియని వారు అప్రమత్తమయ్యే అవకాశాలుంటాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పులుల నుంచి గిరిజనులు, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
‘ఐ విల్ ఓట్.. బికాస్ ఐ లవ్ నిర్మల్’ ప్రచార సెల్ఫి బోర్డు
సాక్షి, నిర్మల్: ఎప్పటిలాగే ఇప్పుడూ ఓటేసిండ్రు. కానీ.. ఈసారి గత రికార్డులు బద్దలు కొట్టేసిండ్రు. ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలుస్తారో.. మరో రెండు రోజుల తర్వాత తెలుస్తుంది. కానీ.. జిల్లాలో శుక్రవారం నమోదైన పోలింగ్ శాతంతో ఓటరన్న మా త్రం గెలిసిండు. అంతేకాదు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించిండు. జిల్లా అధికారు లు పడ్డ శ్రమకు తగ్గట్లుగా ఫలితం వచ్చింది. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో 80శాతానికిపైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. గత ఎన్నికల్లో 74శాతం మాత్రమే నమోదైంది. నాలుగున్నరేళ్ల తరువాత జరిగిన జిల్లా ఓటర్లు అధికారుల అంచనాలకు దగ్గరగా వచ్చారు. ఈ సారి 90శాతం ఓటింగ్ లక్ష్యంగా అధికారులు పనిచేశారు. ఈ క్రమంలో గత ఎన్నికలను మించి ఓటింగ్ శాతం నమోదైంది. స్వచ్ఛందంగా వచ్చి... పొద్దున 7గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఏ పార్టీ అభ్యర్థులు, నాయకులు చెబితేనో తాము రాలేదని.. తమ హక్కును వినియోగించుకునేందుకే వచ్చామని అధిక సంఖ్యలో ఓటర్లు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో ఓటర్ల తీరు మారినట్లు కనిపించింది. సామాజిక మాధ్యమాలు, మీడియా, అధికారులు చేసిన ప్రచారం ప్రభావం చూపించింది. అధిక శాతం ఓటర్లు స్వచ్ఛందంగానే వచ్చి ఓటు వేసి వెళ్లారు. ఈవీఎంలు మొరాయించినా.. క్యూ లైన్లు భారీగా ఉన్నా.. గంటల పాటు ఓపికతో నిల్చుని ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో పాటు దివ్యాం గ ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం గమనార్హం. ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలకు వారిని తీసుకురావడానికి ప్రత్యేకంగా వాహన సౌకర్యాన్ని, వీల్చైర్లను ఏర్పాటు చేసింది. కొంతమంది దివ్యాంగులు వీటిని ఉపయోగించుకున్నారు. చాలామంది స్వతహాగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి వెళ్లారు. పల్లెలు ఆదర్శం.. ప్రజాస్వామ్యం కలిపించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడంలో పల్లె ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. పట్టణ ప్రాంతాల కంటే జిల్లాలోని పల్లెలలోనే పోలింగ్ శాతం అధికంగా నమోదైంది. పలు గ్రామాల్లో 95శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. దాదాపు ప్రతీ గ్రామంలో 75శాతానికిపైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. పట్టణాల్లో మాత్రం చాలా పోలింగ్స్టేషన్లలో గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. కానీ చాలా పోలింగ్స్టేషన్లలో 70శాతంలోపు పోలింగ్ కావడం కనిపించింది. ఇక ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం, పెంబి, దస్తురాబాద్, ఖానాపూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, జన్నారం, సిరికొండ, నిర్మల్ నియోజకవర్గంలోని మామడ, దిలావర్పూర్, నర్సాపూర్(జి), ముథోల్ నియోజకవర్గంలోని కుభీర్, తానూర్ తదితర మండలాల్లో ఇబ్బందికమైన పరిస్థితులను దాటుకోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం వరకు వరసల్లో నిల్చుని ఓటు వేసి వెళ్లారు. లేచింది మహిళాలోకం.. స్త్రీ,పురుష జనాభా నిష్పత్తి అధికంగా గల జిల్లాగా పేరున్న నిర్మల్లో ఎన్నికల్లోనూ మహిళాలోకం ఓటెత్తింది. ఉదయం 7గంటల నుంచి సాయం త్రం 5గంటల వరకు జిల్లాలోని ఏ పోలింగ్ స్టేషన్ల్లో చూసిన మహిళ ఓటర్లే ఎక్కువగా కనిపించారు. ఓపికగా వచ్చి గంటల పాటు వేచి ఉండి మరీ మహిళామణులు ఓట్లు వేసి వెళ్లారు. నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం మహిళ ఓటర్లు 1,14,178 మంది ఉండగా 95,375మంది మహిళలు ఓట్లు వేశారు. అలాగే ముథోల్ నియోజకవర్గంలో మొత్తం 1,10,705మంది ఓటర్లు ఉండగా శుక్రవారం 94,027మంది ఓటర్లు వేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మొత్తం మహిళ ఓటర్లు 94,944 ఉండగా 79,836మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా మొత్తంలో 3,19,827 మహిళ ఓటర్లు ఉండగా, 2,69,238 మంది ఓటు వేశారు. జిల్లాలో భైంసా, నిర్మల్, ఖానాపూర్లో ప్రత్యేకంగా పూర్తిగా మహిళ సిబ్బందితో మోడల్ పోలింగ్ కేంద్రాలనూ ఏర్పాటు చేశారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధుల కోసం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. శ్రమకు తగ్గ ఫలితం... గత మూడు నెలలుగా జిల్లా అధికారులు చేసిన కృషికి తగ్గట్లుగా పోలింగ్ శాతం నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంతి, జిల్లా సహాయ ఎన్నికల అధికారి, జేసీ భాస్కర్రావుతో పాటు రిటర్నింగ్ అధికారులు, వివిధ స్థాయిల అధికారులు, సిబ్బంది నిర్విరామంగా శ్రమించారు. మూడు నెలలుగా ఓటర్ల నమోదు, పరిశీలన, జాబితాలను విడుదల, మళ్లీ ఓటర్ల నమోదుకు అవకాశం, వీటిపై అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. అలాగే ఈవీఎంలు, వీవీ ప్యా ట్లపై పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఓటర్లకు అవగాహన కల్పించారు. పల్లె ఓటర్లకు అర్థమయ్యేలా సాంస్కృతిక బృందాల ద్వారా కళాజాత కార్యక్రమాలనూ చేపట్టారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్, జేసీ, ఎస్పీ, వివిధ శాఖల ఉన్నతాధికారులందరూ పాల్గొని రన్ ఫర్ ఓట్, వాక్ ఫర్ ఓట్ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో ‘ఐ విల్ ఓట్.. బికాస్ ఐ లవ్ నిర్మల్’ అనే ప్రచార సెల్ఫీ బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కలెక్టర్ ప్రశాంతి, జేసీ భాస్కర్రావు ఈ సారి జిల్లాలో ఓటింగ్ శాతం 90కి పెంచాలన్న లక్ష్యంతో పనిచేశారు. వీరితో పాటు ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి కావడానికి ఎస్పీ శశిధర్రాజు ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ క్రమంలో సమష్టి కృషితో 80.52 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడంలో సఫలమయ్యారు. గల్లంతు కావడంతోనే... జిల్లాలో అధికారులు నిర్ణయించుకున్న 90శాతం లక్ష్యాన్ని చేరుకునే అవకాశం కూడా ఉండింది. కా నీ.. వందలాది ఓట్లు గల్లంతు కావడమే ఈ లక్ష్యా న్ని చేరుకోలేకపోవడానికి కారణమైంది. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ మూడు నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో ఓట్లు జాబితాల్లో నుంచి గల్లంతయ్యాయి. ఇందులో ప్రతీ ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు వేసే ఓటర్లవే ఉండటం గమనార్హం. 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల పేర్లే కనిపించకుండా పోయాయి. ప్రధానంగా పట్టణాలైన నిర్మల్, భైంసాలో వందల సంఖ్యలో ఓట్లు కనిపించలేదు. ఖానాపూర్ నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో కూడా గల్లంతయ్యాయి. ఆ యా చోట్ల సంబంధిత ఓటర్లు రెవెన్యూ అధికారు ల వద్దకు వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పో యింది. తమ వద్ద గత ఎన్నికల్లో ఇచ్చిన ఓటర్ కా ర్డు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో ఓటు లేకపోవడం ఏంటని చాలా మంది ప్రశ్నించారు. ఎలాగూ జాబితాలో ఉంటుంది కదా.. అన్న నమ్మకంతో పోలిం గ్ కేంద్రాలకు వెళ్తే ఓటు లేకపోవడం విస్మయం కలిగించిందని వారు వాపోయారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సైతం చర్చించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది లోపాలతోనే చాలా వరకు ఓట్లు గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. -
వలసబాటలో కొలాం గిరిజనులు
ఇంద్రవెల్లి(ఖానాపూర్): భారీ వర్షాలకు పంటలు నష్టపోయి.. ఆశించిన దిగుబడి రాక.. సొంత గ్రామంలో ఉపాధి అవకాశాలు కరువై కొలాం గిరిజన కుటుంబాలు వలస బాట పట్టాయి. మహారాష్ట్రలో కూలీ పనులు వెదుక్కుంటూ వెళ్లాయి. మండలంలోని సమాక గ్రామ పంచాయతీ పరిధి పాటగూడ(కే)లో 55 కొలాం గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సుమారు 300 మంది జనాభా ఉండగా.. 160 మంది ఓటర్లు ఉన్నారు. అందరూ చిన్న, సన్నకారు రైతులే.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ జూన్, జూలై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు రైతులు సాగు చేసిన పత్తి, జొన్న, సోయా ఇతర పంటలు నష్టపోయారు. మిగిలిన పంటలు ఎదుగుదల దశలో మళ్లీ వర్షాలు లేక నష్టం వాటిల్లింది. పెట్టుబడిలో సగం కూడా వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు స్వగ్రామంలో ఉపాధి అవకాశాలు లేక కొందరు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఉపాధి హామీ పథకం పనులు కల్పించాల్సిన అధికారులు గ్రామాన్ని సందర్శించడం లేదు. దీంతో 20 రోజుల క్రితం గ్రామానికి చెందిన ఆత్రం లేతు, కుంరం లేతు, ఆత్రం లక్షామ, టెంక సీతారాం, కొడప ముత్తు, కొడప రాము తమ పిల్లలను బంధువుల ఇళ్లలో వదిలి మహారాష్ట్రలోని నాందేడ్ గ్రామానికి వలస వెళ్లి కూలీ పనులు చేస్తున్నారు. కనిపించని ‘ఉపాధి’ పనులు.. కరువును నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించింది. నిరుపేద కుటుంబాలు, కూలీలకు 100 రోజల పని దినాలు కల్పించాలని ప్రకటించింది. ప్రస్తుతం 150 రోజులపాటు ఉపాధి పనులు కల్పించాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని పాటగూడ(కే) కొలాం గిరిజన గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి ఉపాధి పనులు కల్పించలేదు. మరికొన్ని కుటుంబాలు కూడా వలస వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయని గ్రామపెద్దలు తెలిపారు. అధికారులు దృష్టి సారించి గ్రామంలో ఉపాధి పనులు కల్పించాలని కోరుతున్నారు. -
గిరి వని..బొగ్గు గని మెచ్చేదెవరిని?
ఎటూ చూసినా పచ్చదనం.. స్వచ్ఛమైన ’గిరి’జనం. మలుపులు తిరుగుతూ గోదారమ్మ ప్రవాహం. చెంతనే చదువుల తల్లి సరస్వతి క్షేత్రం. మరోవైపు నల్లబంగారం. ఆదివాసీ ఉద్యమానికి కేంద్ర బిందువుగా.. బొగ్గుగని కార్మికుల శ్రమక్షేత్రంగా పేరొందిన ఆదిలాబాద్లో చలి గిలిగింతలు పెడుతున్నా.. రాజకీయం మాత్రం వాడివేడిగా సాగుతోంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో ఏడింటిని టీఆర్ఎస్ గెలుచుకోగా.. రెండుచోట్ల బీఎస్పీ విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక్క సీటుకే పరిమితమైంది. ఎన్నికల అనంతరం ఇతర పార్టీల నుంచి గెలుపొందిన ముగ్గురు సభ్యులూ గూలాబీ గూటికి చేరడంతో ప్రతిపక్షం తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ ఈసారి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆసిఫాబాద్: ‘ఆదివాసీ’ ఫైట్ గిరిజనుల పోరాట యోధుడు కొమురం భీమ్ జన్మించిన గడ్డ ఇది. నైజాం సర్కారులో జిల్లా కేంద్రంగా ఉండి గ్రామ పంచాయతీ స్థాయికి పడిపోయిన ఆసిఫాబాద్కు తెలంగాణ సర్కా ర్ పూర్వవైభవం తెచ్చింది. ఆదివా సీలు, నిరక్ష్యరాసులు ఎక్కు వున్న ఈ నియోజకవర్గంలో గిరిజనగూడెం పటేల్, రాయి సెంటర్ల మాటే వేదవాక్కు. ఇటీవలి ఆదివాసీ ఉద్యమంతో.. ఈ ప్రాంతంలో లంబాడా, ఆదివాసీల నడుమ దూరం పెరిగింది. ఈ ప్రభావం ప్రస్తుత ఎన్నికలపై పడనుంది. టీఆర్ఎస్ నుంచి కోవా లక్ష్మి, కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు పోటీపడుతున్నారు. వీరిద్దరూ ఆదివాసీలే. లంబాడా ఓట్లు ఎవరికి దక్కితే వారినే విజయం వరించనుంది. వివాదరహిత తీరుతో కోవా లక్ష్మికి ఓటర్లలో ఆదరణ కనిపిస్తోంది. ఆదివాసీ ఉద్యమంలో తటస్థ వైఖరి అవలంబించడం ఆమెకు సానుకూలాంశం. సక్కుకు వ్యక్తిగతంగా మంచి పేరున్నా.. ఆదివాసీలకు అనుకూలంగా ఉద్యమాన్ని నడిపారనే అపవాదు ఉంది. గొండ్రు తెగకు చెందిన టీజేఎస్ అభ్యర్థి కోట్నాక విజయ్కుమార్ ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించనున్నారు. బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల ప్రభావం లేదు.భూ పట్టాలు పంపిణీ చేస్తామనే హామీ ఇచ్చేవారికే మద్దతు ఇవ్వాలని గిరిజనేతరులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముథోల్: నలుగురి సవాల్ తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ముథోల్ నియోజకవర్గం తొలిసారి చతుర్ముఖ పోటీకి వేదికైంది. గడ్డిగారి విఠల్రెడ్డి (టీఆర్ఎస్), పవార్ రామారావుపటేల్(కాంగ్రెస్), డాక్టర్ పడకంటి రమాదేవి (బీజేపీ)తో పాటు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే భోంస్లే నారాయణరావు పటేల్ (ఎన్సీపీ) బరిలో ఉన్నారు. టీఆర్ఎస్పై సహజ అసంతృప్తి ఉన్నా.. తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డిపై కొంత సానుభూతి కూడా ఉంది. సౌమ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుంది. ఇక, రామారావుపటేల్ సేవా కార్యక్రమాలతో రాజకీయాల్లోకి వచ్చారు. టీఆర్ఎస్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి వేణుగోపాలచారి వర్గీయులు ఈయనకు మద్దతు పలుకుతున్నారు. చివరి క్షణం వరకు కాంగ్రెస్ టికెట్ ఆశించిన భోంస్లే నారాయణరావుపటేల్.. ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈయన రామారావు పటేల్కు వరసకు సోదరుడు. రెబల్గా భోంస్లే పటేల్ బరిలో దిగడంతో కాంగ్రెస్కు ఇబ్బందిగా మారింది. ఇది తనకు కలిసొస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో (2014) రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రమాదేవి నాలుగేళ్లుగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పటికే అగ్రనేతల ప్రచారంతో హల్చల్ చేస్తున్న బీజేపీ.. ఈసారి గెలుపు తనదేనన్న భావనతో ఉంది. భైంసా పట్టణంలోని మైనార్టీ ఓట్లు కీలకం కానున్నాయి. - నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తిస్థాయిలో నిర్మించకపోవడం - గోదావరి చెంతనే ఉన్నా ఇక్కడింకా చాలా గ్రామాలకు సాగు, తాగునీరు అందకపోవడం.. వంటివి ప్రభావం చూపే అంశాలు. న్యాయం చేయరూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా సన్నకారు రైతులకు అంతగా మేలు చేకూరలేదు. సమగ్ర సర్వేతో చాలామంది రైతులు తమ వ్యవసాయ భూమిని కోల్పోయారు. అటువంటి వారందరికీ న్యాయం చేయాలి.’ – దుర్గం తిరుపతి, రైతు, వాంకిడి ఆర్థికంగా నిలబడ్డా.. గత ప్రభుత్వాలతో పోలిస్తే టీఆర్ఎస్ పాలన బాగుంది. నాకు స్వయం ఉపాధి కోసం రూ.50 వేలు బీసీ కార్పొరేషన్ ద్వారా అందించారు. దీంతో సొంతంగా ఆర్థికాభివృద్ధి సాధించాను. – తిరుపతి గోలేటి, రెబ్బన విద్య, వైద్యం కావాలి నిర్మల్ నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే రాజకీయ కేంద్రం. అయితే, ఉన్నత విద్యావకాశాలు, కార్పొరేట్ స్థాయి వైద్యసేవల కోసం ఇప్పటికీ పక్క జిల్లాలకు వెళ్లాల్సిందే. యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను ఎంతకీ నెరవేర్చడం లేదు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నా.. స్థానికంగా యువతకు ఉపాధి కల్పించాలి. ఇప్పటికీ గ్రామాల్లో యువత గల్ఫ్బాట పడుతూనే ఉంది. – నంగె శ్రీనివాస్, నిర్మల్ అందరిదీ అదే ‘హామీ’ ఆదిలాబాద్లోని 15 వార్డులకు, నియోజకవర్గంలోని మూడు మండలాలకు వెళ్లే మార్గంలో గల రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఏళ్లుగా కోరుతున్నాం. కానీ.. సమస్య తీరడం లేదు. రోజూ రైలు వచ్చే సమయంలో అరగంట పాటు వేచి చూడాల్సి వస్తోంది. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడుతున్నాం. ఈసారి ఎన్నికల్లోనూ పార్టీలు ఓవర్ బ్రిడ్జి కట్టిస్తామని హామీనిస్తున్నాయి. ఎవరూ చేస్తారన్న నమ్మకం లేదు. – గంగన్న, ఆదిలాబాద్ మంచిర్యాల: ముగ్గురు మొనగాళ్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద పట్టణం. గోదావరి సమీపాన.. బొగ్గు గని నిక్షేపాలతో అలరారే మంచిర్యాల బరిలో ముగ్గురు హేమాహేమీలు తలపడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు (టీఆర్ఎస్), ప్రేమ్సాగర్రావు (కాంగ్రెస్), రఘునాథరావు (బీజేపీ).. ముగ్గురిదీ ఒకే సామాజిక వర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో దివాకర్రావుకు కొంత ఇబ్బందికరం.. ద్వితీయశ్రేణి నేతల వైఖరీ ఆ పార్టీని కొంత వరకు ఇబ్బంది పెట్టే అంశం. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ అరవింద్రెడ్డి చేరికతో టీఆర్ఎస్ బలం పెరిగింది. సంపన్నుడైన ప్రేమ్సాగర్రావు కొన్నాళ్లుగా నియోజకవర్గంలోనే తిష్టవేయడంతో స్థానికంగా ఉండరనే ముద్రను చెరిపేసుకున్నారు. ఉద్యోగ, నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తి తనకు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఆ పార్టీ ఎవరి ఓట్లకు దెబ్బకొడుతుందో తెలియని పరిస్థితి ఉంది. - నియోజకవర్గంలో మూడో వంతు ఉన్న మం చిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలే అభ్యర్థుల జయాపజయాలను నిర్దేశించనున్నాయి - సింగరేణి కార్మికుల ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల క్రమబద్ధీకరణ, కారుణ్య నియామకాల హామీ ప్రధాన ప్రచారాస్త్రం. ‘స్థానిక’ అంశాలే నిర్ణయాత్మకం - ఏడాదిన్నరగా ఏజెన్సీ ప్రాంతంలో ‘మా రాజ్యం మా పాలన’ నినాదంతో ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. ఆదిలాబాద్, బోథ్, సిర్పూరు, ఆసిఫాబాద్, ఖానాపూర్ స్థానాల్లో వీరి ఓట్లే కీలకం. ఆదిలాబాద్, సిర్పూరు మినహా మూడూ ఎస్టీ రిజర్వుడు సీట్లే. ఆదివాసీ ఉద్యమ నేతలైన సోయం బాపూరావు, ఆత్రం సక్కు (కాంగ్రెస్).. బోథ్, ఆసిఫాబాద్ నుంచి బరిలో ఉన్నారు. ఆదివాసీలు వీరిపై సానుకూలంగా ఉన్నారనే చెప్పవచ్చు. మిగతా మూడుచోట్లా ఆదివాసీల ప్రభావం తీవ్రంగానే ఉంది - మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లిలో సింగరేణి కార్మిక కుటుంబాలతో పాటు రిటైర్డ్ కార్మికులదే గెలుపోటముల్లో కీలకపాత్ర - పల్లెల్లో సాగునీటి సమస్య, మంచిర్యాలలో గూడెం ఎత్తిపోతలకు నీరివ్వకపోవడం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కాదని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం రైతుల్లో కొంత అసంతృప్తికి కారణమైంది - స్థానిక ప్రజాప్రతినిధుల నాలుగేళ్ల వ్యవహారశైలి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. నిర్మల్: నువ్వా?నేనా? నిర్మల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి (టీఆర్ఎస్), మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి (కాంగ్రెస్) నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నారు. మధ్యలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సువర్ణారెడ్డి పుంజుకుంటున్నారు. ఉద్యోగ, నిరుద్యోగ వర్గాల నుంచి వ్యక్తమవుతోన్న ప్రభావం టీఆర్ఎస్కు ఇబ్బందిగా మారింది. రైతుబంధు, రైతుబీమా, షాదీ ముబారక్లాంటి సంక్షేమ పథకాలు, తాను చేసిన పనులు, దేవాలయాల జీర్ణోద్ధరణ, జిల్లా ఏర్పాటు గట్టెక్కిస్తాయని ఇంద్రకరణ్ నమ్మకంతో ఉన్నారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్తో పాటు 20 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరడం కొంత ఇబ్బందికరం. కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి.. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని, పథకాల అమల్లో లోపాలను ఎత్తిచూపుతూ ప్రచారం చేస్తున్నారు. మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపే ఉన్నాయన్న ధీమాతో ముందుకు వెళ్తున్నారు. బీజేపీ ఓటు బ్యాంక్ పెరగడంపైనే ఆ పార్టీ అభ్యర్థి సువర్ణ ఆశలు పెట్టుకున్నారు. రాహుల్గాంధీ, కేసీఆర్ సభలకు దీటుగా ఆదివారం అమిత్ షా సభ సక్సెస్ కావడంతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. ఎన్నికల్లో కింది అంశాలు ప్రభావం చూపనున్నాయి.. - నిజామాబాద్–ఆర్మూరు రైల్వే లైన్ పనులు మొదలు కాకపోవడం ∙పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన.. ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరులో జాప్యం.. ఇవి ప్రచారాస్త్రాలు. ఖానాపూర్ (ఎస్టీ): ఇద్దరూ బరాబర్ ఖానాపూర్లో రేఖానాయక్ (టీఆర్ఎస్), రాథోడ్ రమేష్ (కాంగ్రెస్) మధ్య పోటీ కొనసాగుతోంది. కొన్ని స్థానిక సమస్యలు పరిష్కారం కాకపోవడం గులాబీ అభ్యర్థికి ఇబ్బందిగా మారాయి. ముందస్తుగా అభ్య ర్థిని ప్రకటిం చడం ప్రచారంలో టీఆర్ఎస్కు కలిసొచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ పేరు చివరి వరకు తేలకపోవడంతో ఆయన ప్రచా రంలో వెనుకబడ్డారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ హరినాయక్ బీఎస్పీ నుంచి బరిలో నిలవడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకులో చీలిక రానుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం టీఆర్ఎస్కు కలిసి రానుంది. రాథోడ్ రమేష్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కావడంతో స్థానికంగా ఆయనకు పట్టుంది. ఈ రెండు పార్టీలూ లంబాడా అభ్యర్థులకు అవకాశమిస్తే బీజేపీ ఆదివాసీల నుంచి సట్ల అశోక్ను బరిలో ఉంచింది. ఆదివాసీలతో పాటు సంప్రదాయ ఓటుబ్యాంక్ కలిసి వస్తుందని ఆశ పెట్టుకుంది. మహాకూటమిలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న టీజేఎస్.. తట్రా భీంరావును పోటీలో నిలిపింది. - అటవీ భూములకు యాజమాన్య హక్కులు ప్రధాన డిమాండ్ - గూడెం, తండాలకు రోడ్డు, రవాణా సౌకర్యం కల్పించడం.. ఖానాపూర్లో డిగ్రీ కాలేజీ లేకపోవడం వంటివి ఇక్కడి ప్రచారాస్త్రాలు. ఆదిలాబాద్: ముగ్గురి ముచ్చట ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో త్రిముఖ పోరు నెలకొంది. ముగ్గు రూ ముగ్గురే అన్నట్లు ప్రచారం సాగుతుండడంతో గెలుపెవరిని వరిస్తుందనేది ఆసక్తి కలిగిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగిన రామన్నకు గ్రామ గ్రామాన మంచి సంబంధాలున్నాయి. ప్రభుత్వ పథకాలు, పింఛన్లు కలిసి వచ్చే అంశాలు. ద్వితీయ శ్రేణి నేతలపై అవినీతి ఆరోపణలు కొంత ఇబ్బం ది పెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గండ్రత్ సుజాత ఆయన సామాజిక వర్గమే కావడంతో ఆ ఓటుబ్యాంకుకు గండిపడనుందని అంచనా. కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి సహకరిస్తున్నా.. భార్గవ దేశ్పాండే వర్గం తటస్థంగా ఉండడం సుజాతకు సానుకూలాంశం. గత ఎన్నికల్లో ఇక్కడ ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ ఈసారీ అదే దూకుడు కొనసాగిస్తున్నారు. ఆయనపై సానుభూతి కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో పెద్దసంఖ్యలో ఉన్న మైనార్టీలే ఆదిలా’బాద్షా’ ఎవరో తేల్చనున్నారు. - 15 వార్డులు, మూడు మండలాలను కలిపే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రాధాన్యం వహిస్తోంది. - సీసీఐ కంపెనీని పునరుద్ధరించాలనే డిమాండ్ - విమానాశ్రయం నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితం కావడంపై అసంతృప్తి బోథ్ (ఎస్టీ): బిగ్ ఫైట్ ఉమ్మడి ఆదిలాబాద్లో గిరిజన తెగల మధ్య నెలకొన్న వివాదం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన బోథ్పై ప్రభావం చూపనుంది. రాథోడ్ బాపూరావు (టీఆర్ఎస్), మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరా వు (కాంగ్రెస్), మాడావి రాజు (బీ జేపీ)తో పాటు కాంగ్రెస్ రెబల్గా అనిల్ జాదవ్ పోటీలో ఉన్నారు. ప్రభుత్వంపై ఉండే సహజ అసంతృప్తికి తోడు స్థానికేతరుడనే ముద్ర రాథోడ్ బాపూరావుపై ప్రభావం చూపుతోంది. ఆదివాసీ ఉద్యమం, టీఆర్ఎస్పై అసంతృప్తి కాంగ్రెస్ అభ్యర్థి సోయం బాపూరావుకు కలిసొచ్చే అంశాలు. కాంగ్రెస్ రెబల్గా బరిలో ఉన్న అనిల్జాదవ్ లంబాడీ కావడటం అదే సామాజిక వర్గానికి చెందిన టీఆర్ఎస్ అభ్యర్థికి ఇబ్బందిగా మారింది. ఈయన కాంగ్రెస్ ఓట్లనూ చీల్చే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి మాడావి రాజు స్థానికుడు కాకున్నా.. నియోజకవర్గంలో ఆదివాసీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ బరిలో ఉన్న అభ్యర్థులంతా రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో ఓట్ల చీలిక ఎవరికి కలిసొస్తుందో అంతుబట్టడం లేదు. - సాగునీరు, వైద్య సౌకర్యాల కల్పన - కుంప్టి వాగుపై మినీ ప్రాజెక్టు పనులు చేపట్టకపోవడం.. ఇవి ప్రాధాన్యం వహించే అంశాలు. సిర్పూర్: ‘పేపర్’ పవర్ ఇదో మినీ భారత్. సిర్పూరు పేపర్ మిల్లు ప్రభావంతో దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వలస వచ్చారు. మహారాష్ట్ర సంస్కృతి, వేషభాషలు ఎక్కువగా కనిపించే ఈ సెగ్మెంట్లో వలస ఓటర్లే కీలకం. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప ఇక్కడి నుంచి గెలిచారు. ఆపై టీఆర్ఎస్లో చేరిన ఆయన తాజా ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్లో వైద్య వృత్తి వదిలి ఏడాదిగా ప్రజలతో మమేకమైన మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు డాక్టర్ హరీశ్బాబు.. కోనప్పకు గట్టిపోటీ ఇస్తున్నారు. తన తండ్రి పాల్వాయిపై ఉన్న అభిమానం ఆయనకు కలిసొచ్చే అంశం. హరీశ్ వైపు మొగ్గు కనిపిస్తున్నా.. కోనప్ప రాజకీయ వ్యూహాలను మార్చడంలో దిట్ట. అభ్యర్థుల స్థానికత కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్టీ–టీఆర్ఎస్ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ, బీఎస్పీల పోటీ నామమాత్రమే. - వైఎస్ హయాంలో తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్ పేరిట కాళేశ్వరం తరలించడం ఎన్నికల అస్త్రంగా మారింది. - కాగజ్నగర్లో ప్రత్యక్షంగా పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి కల్పించే సిర్పూర్ పేపర్ మిల్లు రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలకే మూత పడింది. ఈ మిల్లు కార్మికులు గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. - రైతుబంధు పథకంపై సానుకూలత ఉన్నా.. అటవీ, రెవెన్యూ వివాదాలతో 20 వేల మంది రైతులకు పాస్ పుస్తకాలు అందలేదు. చెన్నూరు (ఎస్సీ): రసవత్తర పోరు సింగరేణి థర్మల్ ప్లాంటుతో రాష్ట్రానికి కాంతులందిస్తున్నా.. నియోజకవర్గ అభివృద్ధి దీపం కింద చీకటిలానే ఉంది. కార్మి కోద్యమంలో కీలకపాత్ర పోషిం చే చెన్నూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. ముందస్తు నగారా మోగిన కొన్నాళ్లకే పతాక శీర్షికలకెక్కిన ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ – మహాకూటమి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుంది. బాల్క సుమన్ (టీఆర్ఎస్) కు.. వెంకటేష్ నేత (కాంగ్రెస్) తీవ్ర పోటీనిస్తున్నారు. మహా కూటమి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి బోడ జనార్ధన్ బరిలో దిగడంతో కాంగ్రెస్కు.. మాదిగ వర్గానికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు టికెట్ నిరాకరించడం టీఆర్ఎస్కు ఇబ్బందిగా మారింది. అదే వర్గానికి చెందిన కార్యకర్త గట్టయ్య ఆత్మాహుతి చేసుకోవడంతో ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం కనిపిస్తోంది. నల్లాల ఓదెలు కూడా ప్రచారానికి దూరంగా ఉండడం, మాదిగ సామాజికవర్గం నుంచి పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆ వర్గం ఓట్లే గెలుపోటముల్ని నిర్దేశించనున్నాయి. నేతకాని వర్గం ఓటర్లు గణనీయంగా ఉండడం కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలించే అంశం. సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి, చెన్నూరు, కోటపల్లిలో ప్రభావం చూపే జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్లో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. - మందమర్రిలో సింగరేణి భూముల్లో నివసిస్తున్న వారి ఇళ్ల క్రమబద్ధీకరణ.. - 3 వేల మందికి ఉపాధి కల్పించే తోళ్ల పరిశ్రమ ఇంకా ప్రారంభం కాకపోవడం - నేతకాని, మాల, మాదిగ.. ఈ వర్గాల మొగ్గును బట్టే ఫలితం ఉండే అవకాశం. బెల్లంపల్లి (ఎస్సీ): ఎవరి నోరు ‘తీపి’! నేల నల్ల బంగారం. రాజకీయ చైతన్యం ఘనం.. విప్లవ భావజాలమూ ఎక్కువే. 2014లో టీఆర్ఎస్కు పట్టం కట్టిన ఇక్క డి ఓటర్లు ఈసారెలాంటి తీర్పునిస్తారనేది ఉత్కంఠ కలిగిస్తోం ది. ప్రజాకూటమి పురుడుపోసుకోవడం తరువాయి సీట్ల సర్దుబాటులో అనేక మలుపులు తిరిగిన బెల్లంపల్లి రాజకీయం బీఎస్పీ అభ్యర్థిగా మాజీ మం త్రి గడ్డం వినోద్ రాకతో సమీకరణలు మారిపోయాయి. తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (టీఆర్ఎస్)పై కొంత అసంతృప్తి ఉన్నా.. ప్రజాకూటమి పొత్తులో సీపీఐ (గుండా మల్లేశ్)కి ఈ సీటు ఇవ్వడం చిన్నయ్యకు ఊరట కలిగించే అం శం. అయితే, వినోద్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో చిన్నయ్యకు గట్టిపోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా వినోద్కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. పోటీ టీఆర్ఎస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్యనే ఉండే పరిస్థితి.. - సింగరేణి భూముల లీజులు రద్దు, స్థలాల క్రమబద్ధీకరణ హామీ ఈ ఎన్నికల్లో కీలకం - ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైన్పై అసంతృప్తి - మంజూరైన ’టెస్లా’ మెడికల్ కాలేజీని పునరుద్ధరించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఓటెయ్యాలని ‘చెప్పు’కుంటూ.. ఓట్లడగడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. తాను మాత్రం ఇలాగే ఓటెయ్యాలని అభ్యర్థిస్తానంటూ పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ ప్రజల పార్టీ అభ్యర్థి ఆకుల వివేక్ సోమవారం ఇలా కొంతసేపు చెప్పులు కుట్టారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి కాళ్లు పట్టుడు..హార్మోనియం కొట్టుడు ‘కనిపిస్తే పాపం.. కాళ్లు పట్టుడే’ అన్నట్టుంది జనగామ స్వతంత్ర అభ్యర్థి మెరుగు శ్రీనివాస్గౌడ్ ప్రచారం తీరు. వృద్ధుల కాళ్లు మొక్కుతూ తన హార్మోనియం గుర్తుకు ఓటెయ్యాలంటూ ఈయన అభ్యర్థిస్తున్న తీరు చూసి అందరూ ఔరా అనుకుంటున్నారు. – కొమురవెల్లి (సిద్దిపేట) సన్ని‘వేషా’నికి తగినట్టు.. ప్రచారంలో పదనిసలు తారస్థాయికి చేరుతున్నాయి. ఆయా సన్నివేశాలకు తగ్గట్టు అభ్యర్థులు వేషమేస్తున్నారు. సోమవారం బచ్చన్నపేట మండలంలో జనగామ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య బోనమెత్తి ప్రచారం నిర్వహించారు. – బచ్చన్నపేట -
‘పోడు’ చుట్టూ ప్రచారం
సాక్షి,కారేపల్లి: ఇక్కడ పోడే ప్రధాన సమస్య. అసెంబ్లీ ఎన్నికల వేళ, అభ్యర్థుల ప్రచారం పోడు చుట్టే తిరుగుతోంది. మా పార్టీకి ఓటు వేసి, నన్ను గెలిపిస్తే.. ఫారెస్టోళ్లను పోడు జోలికి రాకుండా చూస్తా.. పోడుదారులకు అండగా నిలబడతా.. గతంలో పోడు పోకుండా కాపాడింది నేనే.. నాకే మీరు ఓటు వేయాలి. లేదంటే మీకు పోడు దక్కకుండా పోతుంది. అంటూ కారేపల్లి మండలంలో వివిధ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ‘పోడునే’ ప్రచారాస్త్రంగా సంధిస్తున్నారు. కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చీమలపాడు, రేలకాయలపల్లి, బాజుమల్లాయిగూడెం, మాణిక్కారం, కోమట్లగూడెం, సింగరేణి, సీతారాంపురం, ఉసిరికాయలపల్లి, తొడితలగూడెం, టేకులగూడెం గ్రామాలున్నాయి.ఈ పంచాయతీల పరిధిలో 1,680 మంది గిరిజన రైతులు 7,080 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. వీరిలో 1,326 మంది రైతులకు 5,310 ఎకరాలకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అటవీ హక్కు పత్రాలు అందజేశారు. గిరిజన పోడుదారులకు హక్కు కల్పించారు. అప్పటి నుంచి బ్యాంకు రుణాలతోపాటు, రైతు పరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇంకా 354 మంది గిరిజన పోడుదారులకు 1,770 ఎకరాల్లో హక్కు పత్రాలు అందజేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ గిరిజన పోడుదారులకు సర్వేల పేరుతో ఇటు ఫారెస్ట్, అటు రెవెన్యూ అధికారులు మభ్య పెడుతుండటం, ఈ క్రమంలోనే ఫారెస్ట్ అధికారులు పోడుదారులపై దాడులకు పాల్పడి పోడు లాక్కునే ప్రయత్నాలు చేయటం, అందుకు పోడుదారులు ప్రతిఘటించటం, వారిపై కేసులు నమోదు కావటం పరిపాటిగా మారింది. తాత ముత్తాతల నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న మాపై హరితహారం పేరుతో ఫారెస్టోళ్లను ప్రభుత్వమే ఉసిగొల్పుతోందని ఇక్కడి గిరిజన పోడుదారులు ఆరోపిస్తూ.. ఉద్యమాలు చేపట్టిన ఘటనలు లేకపోలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే సమస్య.. వైరా నియోజకవర్గంలో కారేపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు, కొణిజర్ల మండలాల్లో పోడుదారులు ఎక్కువగా ఉన్నారు. పోడుదారుల ఓట్లకు గాలం వేసేందుకు వివిధ పార్టీల నుంచి బరిలో దిగిన అభ్యర్థులు పోడును ప్రచార అస్త్రంగా మార్చుకున్నారు. కారేపల్లి మండలం ఏజెన్సీ కావటంతో ఎక్కువ శాతం గిరిజనులు తాండాలలో, గూడేలలో నివాసం ఉంటూ పోడు వ్యవసాయంతో జీవిస్తున్నారు. వీరి ఓట్లే.. గెలుపుకు కీలకం కానున్నాయి. సింగరేణి రెవెన్యూ మినహా.. మిగిలిన 10 రెవెన్యూ గ్రామాలు ఏజెన్సీలో ఉండటంతో ఇటు గిరిజన, గిరిజనేతర పోడుదారులు పోడుకోసం పోరాటం చేస్తున్నారు. 2005 కంటే ముందు నుంచి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉండగా.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయక పోగా, పోడును లాక్కోవాలని కుటిల యత్నం చేస్తోందని గిరిజన సంఘం నాయకులు వాపోతున్నారు. ఇదేక్రమంలో టీఆర్ఎస్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్లాల్కు ప్రభుత్వ పరమైన విధానాలతో.. పోడుదారుల నుంచి చిక్కొచ్చి పడగా, ప్రచారంలో నిలదీతలు, మా పోడు సంగతేంటని ప్రశ్నించటాలు జరుగుతున్న సంగతి విధితమే. టీఆర్ఎస్ ప్రభుత్వం పోడుదారులకు అండగా నిలుస్తుందని, అటవీ హక్కు పత్రాలు ఇప్పిస్తామని, పోడు జోలికి ప్రభుత్వం రాదని.. మదన్లాల్ నచ్చచెప్పిన ఘటనలూ ఉన్నాయి. ఇదిలా ఉండగా బీఎల్ఎఫ్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి భూక్యా వీరభద్రం.. పోడుదారులకు అండగా నిలబడి పోరాడింది మా పార్టీ అని, అసెంబ్లీలో పోడుదారుల గళం విప్పాలంటే, సీపీఎంకు ఓటు వేయాలని, లేదంటే పోడును పాలక ప్రభుత్వాలు లాగేసుకుంటాయని పేర్కొం టూనే, పోడుదారుల వెంట మేము అంటూ.. ప్రచార అస్త్రాలను సంధిస్తున్నారు. ఇక మహాకూటమి అభ్యర్థి విజయాబాయి సైతం.. సీపీఐను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో అటవీ హక్కు పత్రాలు వచ్చేలా చూస్తామని, పోడుదారులను అన్ని విధాల ఆదుకుంటామని పేర్కొనటం.. స్థానికంగా ఆశక్తిని రేకెత్తిస్తోంది. ఇక కాంగ్రెస్ తిరుగుబాటు (స్వతంత్ర) అభ్యర్థి రాములునాయక్ మొదటి నుంచి పోడుదారులకు అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా పోడుదారుల ఓట్లే కీలకంగా మారటం.. అభ్యర్థులు పోడునే ప్రచార అస్త్రంగా ఎంచుకోవడం చర్చనీంశమైంది. -
బిర్సా స్ఫూర్తితో ముందుకు..
ఆదివాసీ పోరాటాల వారసత్వానికి ప్రతీకగా ఆవిర్భవించిన యోధుడు బిర్సాముండా. ఆదివాసీలపై జరుగుతున్న అణచివేతను చిన్నతనం నుంచీ చూసిన బిర్సాముండా అగ్రవర్ణాల దోపిడీపై గళం విప్పాడు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై సమరశంఖం పూరించాడు. ఆదివాసీల ప్రాథమిక హక్కుల కోసం, జల్, జంగ్, జమీన్ కోసం విల్లంబులు అందుకుని పోరుబాటపట్టాడు. ఆంగ్లేయుల రాకతో విచ్ఛిన్నమైన ఆదివాసీ రాజ్యాలను చూసి తట్టుకోలేకపోయిన బిర్సాముండా నల్లదొరలతోపాటు, తెల్ల దొరలపైనా ఆయుధాలు ఎక్కుపెట్టాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో బిహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో సాగిన ‘మిలినేరియన్’ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. బిర్సాను దొంగచాటుగా బంధించిన తెల్లదొరలు 1900 జూన్ 9న రాంచీ జైలులో హతమార్చారు. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో బిర్సాముండా పోరాటం ఒక ప్రధాన ఘట్టం. నేటి పాలకవర్గ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా ఆదివాసీ సమాజాన్ని అంతం చేస్తోంది. పరి శ్రమలు, ప్రాజెక్ట్ల పేరు మీదు లక్షలాది ఆదివాసీ కుటుంబాలవారు నిర్వాసితులయ్యారు. దేశం లోని 570 గిరిజన తెగలలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ లెక్కల ప్రకా రం 75వరకు తెగలు అత్యంత వెనుకబడి ఉన్నాయి. వీటిలో 19 తెగల ఆదివాసీ జనాభా వెయ్యికంటే తక్కువ. ఈ తెగలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో అగ్రకులాలను ఎస్టీ జాబితాలో కలపాలని ప్రభుత్వం యత్నిస్తోంది. ఇప్పటికే లంబా డీలు ఆదివాసీల రిజర్వేషన్లను దోచుకున్నారు. ఇందుకు దళారీ పాలకవర్గ విధానాలే కారణం. ఈ నేపథ్యంలో బిర్సాముండా పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుని, ఆదివాసీలను చైతన్యపరిచి, వారి ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత మేధావులు, విద్యావంతులపై ఉంది. (నేడు బిర్సాముండా జయంతి) – ఊకే రామకృష్ణ దొర, ఆదివాసీ రచయితల సంఘం -
నీళ్లివ్వనప్పుడు ఓట్లెందుకు వేయాలి’
హవేళిఘణాపూర్ (మెదక్): ‘తాగేందుకు నీళ్లివ్వనప్పుడు.. ఓట్లెందుకు వేయాలి.. గుక్కెడు నీటి కోసం పొలాల్లో బోర్ల వెంట తిరుగుతూ అల్లాడిపోతున్నాం.. అయినా మా బాధలు పాలకులకు పట్టావా’అంటూ గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం మెదక్జిల్లా హవేళిఘణాపూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ తండాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం ముగించుకొని మెదక్ వైపు వెళ్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి వాహనాలకు గిరిజనులు అడ్డుతగిలారు. రోడ్డుకు అడ్డంగా ఖాళీ బిందెలను ఉంచి తండావాసులు నిరసన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తమ తండాను పట్టించుకున్న నాథుడు లేడని వారు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రం తండాలు, గిరిజనులు గుర్తుకు వస్తారని, గెలిచాక మాత్రం పాలకులు తమ తండాలవైపు కన్నెత్తి కూడా చూడరని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రోడ్డుకు అడ్డంగా ఉన్న ఖాళీ బిందెలు, బకెట్లను తీసివేయాలంటూ కొందరు టీఆర్ఎస్ నాయకులు గిరిజనులతో వాగ్వాదానికి దిగారు. గిరిజనులు ఎంతకూ ఖాళీ బిందెలను తీయకపోవడంతో టీఆర్ఎస్ నాయకులే బిందెలను పక్కకు తీసుకెళ్లారు. అనంతరం గిరిజనులను సముదాయించి రెండు రోజుల్లో నీళ్లు వచ్చేలా చేస్తామని హామీనిచ్చారు. -
గిరిజనుల అంబాసిడర్గా మేరీ కోమ్
న్యూఢిల్లీ: ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ బాక్సర్ అయిన మేరీ కోమ్ భారత గిరిజనులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఆమెను ప్రచారకర్తగా నియమించింది. ఆమె గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్టార్ మహిళా బాక్సర్ మేరీ మాట్లాడుతూ ‘షెడ్యూల్డు తెగలకు బ్రాండ్ అంబాసిడర్ కావడం చాలా సంతోషంగా ఉంది.మణిపూర్కు చెందిన నేను గిరిజనుల వృద్ధి, వికాసానికి నా వంతు సహకారం అందజేస్తాను. వాళ్లంతా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’ అని చెప్పింది. ఇందులో భాగంగా గిరిజనులు, చేతివృత్తుల వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. -
సూర్యుడికో నీటి చుక్క
జార్ఖండ్ రాజధాని రాంచీలో మంచి వేసవిలో ‘మాండా ఉత్సవం’ జరుగుతుంది. ఇది గిరిజన పండుగ. గిరిజనులు చేసుకునే పండుగ. ఎండాకాలం వస్తే రాంచీ భగభగమని మండిపోతుంది. చుట్టు పక్కల అడవుల్లో కుంటలు, చెలమలు ఆవిరైపోతాయి. హతియ, రుక్కా, కంకె వంటి డ్యాముల్లో నీళ్లు అడుగంటుతాయి. అడవుల్లో ఉండే జీవులకే కాదు గిరిజనులకు కూడా ఇది కష్ట సమయం. అందుకే ఏప్రిల్ నెలలో వీరు మాండా ఉత్సవం జరుపుకుంటారు. రాంచీ చుట్టుపక్కల నూరు కిలోమీటర్ల పరిధిలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఎక్కడిక్కడ ఊళ్లలో శివుడి దేవాలయాలు గిరిజనులతో కిటకిటలాడతాయి. శివుడి నెత్తిన గంగమ్మ ఉంటుంది. కనుక శివుణ్ణి నమ్ముకుంటే మంచి ఎండల్లో నాలుగు వానలు పడి నీళ్లు వస్తాయని వీళ్లు ఉత్సవం చేస్తారు. సూర్యుడికి వందనం సమర్పిస్తు కలశ ప్రదర్శన చేస్తారు. ఆ నీళ్లను శివుడికి అర్పిస్తారు. ఈ క్రతువును ఆడవాళ్లు నిర్వహిస్తారు. ఉషాదేవి మాట సూర్యుడు, గంగమ్మ మాట శివుడు విన్నప్పుడు ఈ స్త్రీ భక్తుల మాట సదరు దేవుళ్లు వినకుండా ఉంటారా? ఎండల్లో నాలుగు వానలు కురిపించకపోతారా? -
ఆదివాసీల భవితకు భరోసా
సందర్భం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ అధికారుల సమావేశంలో ఎవరు చెబితే ఆదివాసీలపై దాడి చేశారని నిలదీయటం, ఆ సందర్భంగా నర్మగర్భంగా చెప్పిన మాటలు ఆదివాసీ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాయి. గిరిజన స్త్రీలను, పసిపిల్లలను చెట్టుకు కట్టేసి లాఠీలతో చితక బాదుతున్న ఆటవిక సంఘ టన నన్ను కలవరపెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి అడవుల్లో జలగలంచ గొత్తి కోయలకు చెందిన 30 మందిపై 300 మంది ఫారెస్టు సిబ్బంది చుట్టుముట్టి గొడ్డును బాదినట్టు బాదిన ఘటన అది. పోస్కో, వేదాంత కార్పొరేట్ కంపెనీలకు అడవిని అప్ప గించటం కోసం గ్రీన్హంట్ పేరుతోనో.. పులుల సంర క్షణ పేరుతోనో మాడ్ జాతులను వేటాడుతున్న వేళ కోయ, గోండు, గొత్తికోయలు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో తెలంగాణ అడవుల్లోకి వచ్చి నిమ్మల పడ్డారు. ప్రాంతం వేరైనా అడవి ఒక్కటే. జంగల్ వాళ్లది, జమీన్, జల్ వాళ్లదే. వాళ్ల అడవిలో వాళ్లను వది లేయటమే న్యాయం. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజనుడు ఏజెన్సీలో 10 ఎకరాల లోపు భూమి సాగు చేసుకోవచ్చు. ఫారెస్టు అధికారులు చట్టాన్ని అతిక్రమించి గుడిసెలు పీకేసి, జీవనవిధ్వంసం చేసి నిర్వాసితులను చేయటం పార్లమెంటును దునుమా డటమే. ఈ అమానవీయ సంఘటనను అసెంబ్లీలో ప్రస్తావించాలని నిర్ణయించుకున్నా. కానీ ముందుగానే సీఎం కేసీఆర్ మానవత్వం చూపించారు. గొత్తికోయ లపై దాడిని తీవ్రంగా గర్హించారు. దాడులకు దిగిన ఫారెస్ట్ అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. ఇది తొలి తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలకు దక్కిన భరోసా. అడవిపై అప్పటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ముండాలు, భిల్లులు, గోండులు, కోయలు, గొత్తికో యలు, కొండ రెడ్లు తిరుగుబాట్లు చేశారు. ఆ మాట కొస్తే క్రీపూ 431–404 పాల్పెనెసియన్ యుద్ధ కాలం నుంచి భూమిపై అధికారాలు, హక్కులు సంపాదించే క్రమంలో ఆదివాసీల భూములు ఆక్రమణకు గురి అవు తున్నాయి. భూములను, హక్కులను తిరిగి కాపాడు కునే క్రమంలో ఆదివాసీలు అప్పటి నుంచే పోరాట పంథాను ఎంచుకున్నారు. వాళ్ల ప్రతి పోరాటంలో భూ సమస్య ఉంది. ఆ భూముల్లో వాళ్ల బతుకు ఉంది. గిరి జన తిరుగుబాట్లను పాలకులు ఎప్పటికప్పుడు అణిచి వేస్తూనే ఉన్నారు. ఆదివాసీ పోరాటాలవల్లే 1917లో, 1959లో ఆదివాసీ భూ పరిరక్షణ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాన్ని తుంగలో కలిపినప్పుడే గోదావ రిలోయ ప్రతిఘటనా పోరాటాలు, దండ కారణ్య ఉద్య మాలు పుట్టుకొచ్చాయి. ఆపై ప్రభుత్వం 1/70 చట్టం, పీసా (పంచాయతీరాజ్ విస్తరణ) చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది. ఉమ్మడి ఏపీలోని శ్రీకా కుళం నుంచి మహబూబ్నగర్ దాకా 31,845 చదరపు కిలో మీటర్ల వరకు గిరిజన ఉపప్రణాళిక ప్రాంతం విస్త రించి ఉంది. అయితే దాదాపు 845 గిరిజన గూడేలను, పెంటలను 5వ షెడ్యూల్లో చేర్చనందునే భూ పరి రక్షణ చట్టాలు ఉన్నా అమలు కావటం లేదు. రిజర్వు టైగర్ ప్రాజెక్టుల్లో పులికి, ఆటవికులకు మధ్య సంఘర్షణ జరుగుతోందని అటవీ సంరక్షణ అధికారులు చెప్తున్నారు. వారిని అడవి నుంచి బయటికి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆదివాసీ కూడా అటవీ ఆవరణ వ్యవస్థలో ఒక అంతస్థే. అడవి జంతువుకు, ఆదివాసీకి మధ్య ఒక స్పష్టమైన జీవన సర్దుబాటు ఉంది. ఆదివాసీలు సాయంత్రం ఐదు గంటల లోపే పనులు ముగించుకొని రాత్రి 7 గంటల లోపు వండుకొని తిని పడుకుంటారు. ఆ వేళకే అడవి జంతువులు బయటికి వస్తాయి. సూర్యోదయం వరకు యథేచ్ఛగా సంచరిస్తాయి. సూర్యోదయం తరువాత మళ్లీ ఆదివాసీ జీవన గమనం మొదలవుతుంది. ప్రకృతే వారికి ఆవిధంగా సర్దుబాటు చేసింది. ఇక్కడ పులికి ఆదివాసీకి బలమైన బంధుత్వం ఉంది. ఆదివాసీ పులిని బావ(పులిబావ) అని సంబోధిస్తాడు. ఆదిమ జాతుల్లో బావే ఆత్మీయుడు. పులి గాండ్రిస్తే కాలం కలిసి వస్తుం దని, చెట్టు ఫలిస్తుందని ఆదివాసీల నమ్మకం. ఎప్పటికీ వాటి క్షేమాన్నే కోరుకునే ఆదివాసీలతో పులి ఎక్కడ సంఘర్షణ పడుతుందో అటవీ శాఖ పెద్దలకే తెలియాలి. గ్లోబలైజేషన్లో భాగంగానే ఆధిపత్య దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల మీద కన్నేశాయి. విస్తా రమైన ఖనిజ సంపదను తవ్వి పట్టుకుపోవటానికి కార్పోరేట్ శక్తులు యుక్తులు, కుయుక్తులతో వల విసు రుతున్నాయి. ప్రకృతిని వడిపెట్టి ధ్వంసం చేసి డాలర్లు పిండుకునే తరహా అభివృద్ధి, దాని విస్తరణ వన జీవుల ప్రాణాలను తోడేస్తోంది. ఈ విలయం ఆగాలి. అపు రూప మానవ తెగలను అడవిలోనే బతకనివ్వాలే. ఇటీ వల సీఎం కేసీఆర్ అటవీ అధికారుల సమావేశంలో ఎవరు చెప్తే ఆదివాసీలపై దాడి చేశారని నిలదీయటం, ఆ సందర్భంగా చెప్పిన మాటలు ఆదివాసీ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాయి. వాళ్ల అడవిలో వాళ్లే ఉంటారనే సంకేతాలు వెలువడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేక సబ్ ప్లాన్తో 2017–18 బడ్జెట్లో రూ. 6,112 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో 60 శాతం నిధులు ఇప్పటికే ఖర్చు చేసింది. గిరిజన యువతీ యువకుల్లో నైపుణ్యం వెలికితీసి వారిని తీర్చి దిద్దటం కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం జాకారంలో 500 ఎకరాలలో గిరి జన వర్సిటీని నెలకొల్పబోతోంది. గిరిజన సంస్కృతి, సాహిత్యాన్ని పాఠ్యాంశంగా చేయటంతో పాటు వాటిపై విస్తృతమైన పరిశోధనలు జరుగనున్నాయి. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే మొబైల్ : 94403 80141 -
పోడు భూముల వివాదం
భూపాలపల్లి: జిల్లాలోని వెంకటాపురం మండలం బోధపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామ శివారులోని పోడు భూములలో మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులను స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. పోడు భూములలో మొక్కలు నాటేందుకు వీళ్లేదని.. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. -
ఆడజన్మకు ఎన్ని శాపాలో..?
► తండాల్లో కొనసాగుతున్న భ్రూణ హత్యలు ► పేదరికంతో శిశువులను అమ్ముకుంటున్న గిరిజనులు మంచాల: ఓ వైపు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ... తమదైన ముద్ర వేస్తున్నారు. పురుషులకు దీటుగా ఏమాత్రం తీసిపోకుండా విద్య, వైద్యం వంటి ఉన్నత రంగాల్లో ముందుంటున్నారు. అయినా ఆడపిల్లల పట్ల వివక్ష మాత్రం తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల సంరక్షణ విషయంలో అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుంది. అయినా నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట ఆడపిల్లలు భ్రూణ హత్యలు, శిశు విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. మాతా–శిశు సంక్షేమ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా మార్పు మాత్రం ఆశించిన్నంతగా రావడం లేదు. అందుకు నిదర్శనం మంచాల మండలంలోని లోయపల్లి అనుబంధ గ్రామాలైన ఆంబోత్ తండా, సత్తి తండా, గిరిజన తండాలు. మంచాల మండలం పూర్తిగా వెనుకబడి ప్రాంతం. గిరిజన తండాలు కూడా అధికంగా ఉన్నాయి. మంచాల మండల వ్యాప్తంగా తొమ్మిదేళ్ల కాలంలో ఐదు కేసులు నమోదు కాగా, కేవలం ఒక ఆంబోత్ తండాలో మాత్రం శిశు విక్రయాలకు సంబంధించి ఏడు కేసులు నమోదయ్యాయి. అనేక మంది ఆడ పిల్లలను శిశు విహార్కు తరలించడం జరిగింది. ప్రధానంగా మంచాల మండలంలో గిరిజన గ్రామాల్లోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయి. చెన్నారెడ్డి గూడ గ్రామంలో రెండు, బోడకొండ గ్రామంలో రెండు, ఎల్లమ్మ తండా, బండలేమూర్ గ్రామంలో ఒకటి చొప్పున జరిగాయి. ఆంబోత్ తండాలో.... మంచాల మండలంలో లోయపల్లి అనుబంధ గ్రామం ఆంబోత్ తండా. ఈ తండాలో 1260 మంది జనాభా ఉంది. 258 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 240 కుటుంబాలు ఎస్టీ వర్గానికి చెందినవారు. మరో 18 బీసీ కుటుంబాలు ఉన్నాయి. ఈ తండాలోనే అధికంగా శిశు విక్రయాలు, భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. చాలామంది పేదరికం పేరుతో ఆడపిల్లలపై వివక్షతో సాకలేమని ఐసీడీయస్ అధికారులకు అప్పగిస్తున్నారు. 8) 2016 డిసెంబర్ 5న ( సూజాత–సేవ దంపతులు) మూడో సంతానం ఆడపిల్ల పుట్టిందని మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. తాజాగా సత్తి తండాలో వనిత– జవహర్ అనే దంపతులు ఇబ్రహీం పట్నంలో ఓ ప్రైవేట్ వైద్యశాల నిర్వాహకుల సహాయంతో మరో ఆడపిల్లను విక్రయించడం జరిగింది. ఇలా వెలుగుచూసిన కేసులు కొన్నే. అయితే గుట్టుచప్పుడు గాకుండా, వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. ఈ తండాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి మహిళలు ముందుకు రావడం లేదు. తండాలో 25 నుండి 30 మంది మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు. గిరిజన తండాల్లో ఆడ పిల్లలపై వివక్ష చూపిస్తున్నారు. ఐసీడీయస్ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించినా మార్పు రావడం లేదు. ఆడపిల్లలపై వివక్ష రూపు మాపాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి సృష్టికి మూలమైన ఆడపిల్లలు వివక్షతకు, భ్రూణ హత్యలు, శిశు విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆడపిల్లల విక్రయాలు 1) 2007 నవంబర్ నెలలో (లలిత– లక్కు దంపతులు) 2) 2008 జూలై 4న (రంగలి– తావు దంపతులు) 3) 2010మే 14న (బిచ్చి–బాలు దంపతులు) 4) 2015 మార్చి 10న (మాధవి– శంకర్ దంపతులు) 5) 2015 ఏప్రిల్ 6న (సంధ్య –లచ్చిరాం దంపతులు) 6) 2015 ఏప్రిల్ 13న (అనిత– రవి దంపతులు) 7) 2015 జూన్ 4న (సునీత– భాస్కర్ దంపతులు ) -
విషాహారం ప్రాణాలు తీసింది
జీలుగుమిల్లి (పోలవరం) : కూలి పనులు, చేపల వేటను జీవనాధారం చేసుకుని బతుకుతున్న గిరిజన కుటుంబంలో తాబేలు మాంసం తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ పెద్దతో పాటు ఆ ఇంటి ఇల్లాలిని అనంతలోకాలకు తీసుకుపోయి బిడ్డలను అనాథలుగా మిగిల్చింది. నిల్వ ఉన్న తాబేలు మాంసం వండుకుని తినడంతో ఇద్దరు మృత్యువాత పడగా మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురైన విషాద ఘటన జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. అంకన్నగూడెం గ్రామానికి చెందిన ఐదు కుటుంబాల గిరిజనులు శుక్రవారం అం తర్వేదిగూడెం గ్రామంలోని చెరువులో చేపల వేటకు వెళ్లారు. చేపలతో పాటు 14 తాబేళ్లు కూడా వలల్లో చిక్కాయి. తాబేలు మాంసాన్ని పది వాటాలుగా చేసుకుని పంచుకున్నారు. సోయం సత్యనారాయ ణ కుటుంబం తప్ప మిగిలిన వారంతా అదేరోజు వండుకుని తిన్నారు. అయితే సత్యనారాయణ కుటుంబం మాత్రం వా రి వాటా మాంసాన్ని ఉడకబెట్టి ఆగిలేసి నిల్వ ఉంచారు. శనివారం మధ్యాహ్నం నిల్వ చేసిన మాంసాన్ని తిన్నారు. మర లా సాయంత్రం స్థానికంగా దొరికే కల్లు తాగి తాబేలు మాంసంతో భోజనం చేశా రు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల తర్వాత సోయం సత్యనారాయణ (45)కు వాంతులు, విరేచనాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు 108లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొం దుతూ మృతిచెందాడు. సత్యనారాయణను తీసుకువెళ్లిన గంటలోనే అతని భార్య సోయం దుర్గమ్మ (40)కు వాంతులు, విరేచనాలు మొదలయ్యా యి. ఆమెను ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. వీరి కుమారుడు మధు, అతని స్నేహితుడు మయిబోయిన అర్జున్ కూడా ఇదే మాంసాన్ని తిని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదిలా ఉండగా రెండో పూట మాంసం తినని మృతుల బిడ్డలు మమత, మంగరాజు క్షేమంగా ఉన్నారు. ఇద్దరి మృతికి కారణంగా భావిస్తున్న తాబేలు మాంసాన్ని ఆదివారం వైద్యశాఖ అధికారి రంజిత్కుమార్ పరీక్షించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పి.బాలసురేష్ చెప్పారు. ఈ దుర్ఘటనతో అంకన్నగూడెంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
అడవి బిడ్డల ఎదురు చూపులు!
పట్టాలు పంపిణీ చేయాల్సిన మండలాలు: 8 ఎకరాలు: 8,871 కుటుంబాలు: 3,436 ►అటవీసాగు హక్కు పత్రాల పంపిణీకి గ్రహణం ► రెండో విడత పంపిణీ జరగని వైనం ►ఎదురు చూస్తున్న 3,500గిరిజన కుటుంబాలు అడవి బిడ్డలు అటవీసాగు హక్కు పత్రాల (పట్టాలు) కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. 2006వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కు చట్టాన్ని తెచ్చింది. 2005 డిసెంబర్ 13వ తేదీకి ముందు సాగులో ఉన్నవారికి పట్టాలివ్వాలని అధికారులు నిర్ణరుుంచారు. దీంతో జిల్లాలోని కొంతమంది గిరిజనులకు 2008లో హక్కు పత్రాలను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. రెండో విడత పంపిణీ గురించి కనీసం పట్టించుకోకపోవడంతో వేలాది గిరిజన కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుు. సీతంపేట: గిరిజనులకు పోడు వ్యవసాయమే జీవనాధారం. అరుుతే అటవీ అధికారులు ఒక్కోసారి వారి పనులకు అడ్డుతగులుతుండేవారు. దీంతో సాగు హక్కు పట్టాలివ్వాలని ఉద్యమించడంతో దిగివచ్చిన పాలకులు అటవీ హక్కు చట్టాన్ని చేసింది. అరుుతే ఈ చట్టానికి జిల్లా అధికారులు తూట్లు పొడిచారనే విమర్శలు వస్తున్నారుు. కేవలం 2008లో కొద్దిమంది గిరిజనులకు హక్కు పత్రాలను ఇచ్చి..మిగిలిన వారిని పట్టించుకోవడం మానేశారు. రెండో విడతలోనైనా అందుతాయని ఎదురు చూస్తే నిరాశే మిగిలింది. దీంతో వేలాది గిరిజన కుటుంబాలు ఆందోళన చెందుతున్నారుు. పక్క జిల్లాల్లో పంపిణీ విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, పార్వతీపురం పరిధిలోని గిరిజనులకు సాగు హక్కు పత్రాలను అక్కడి అధికారులు రెండోవిడతలో పంపిణీ చేశారు. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. ఈ విషయం తెలిసి ఎప్పుడు పంపిణీ జరుగుతుందోనని గిరిపుత్రులు ఎదురు చూస్తున్నారు. ప్రతీ సోమవారం సీతంపేట ఐటీడీఏలో జరిగే గిరిజన దర్బార్కు వచ్చి సాగు హక్కు పట్టాలు ఇవ్వడం లేదంటూ అధికారులకు వినతులు అందిస్తూనే ఉన్నారు. అధికారుల సర్వే ప్రకారం 3,436 కుటుంబాలకు పంపిణీ చేయాల్సి ఉంది. వీరంతా భామిని, కొత్తూరు, పాలకొండ, పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి, మందస, పాతపట్నం మండలాల్లో ఉన్నారు. గత ఏడాది గిరిజనోత్సవాలకు వచ్చిన గిరిజనశాఖ మంత్రి చేతుల మీదుగా కొంతమంది పట్టాలు ఇవ్వడానికి ఐటీడీఏ యంత్రాం గం ఏర్పాట్లు చేసినప్పటికీ అటవీ శాఖ అధికారులతో సమన్వయం లేకపోవడంతో అప్పట్లో సాధ్యం కాలేదు. 8 వేల ఎకరాలపైనే... పాలకొండ, టెక్కలి రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 3,436 గిరిజన కుటుంబాలకు సంబంధించి 8,881.74 ఎకరాల్లో పట్టాలు ఇవ్వడానికి నిర్ణరుుంచారు. ఈ మేరకు గతంలోనే గ్రామస్థారుులో అటవీహక్కుల కమిటీ, డివిజన్, జిల్లా స్థారుు కమిటీలు తీర్మానం సైతం చేశారుు. కమిటీల తీర్మానం చేసినప్పటికీ అటవీశాఖ మాత్రం అంగీకరించలేదు. దీంతో ఈ ప్రక్రియ నిలిచిపోరుుంది. పరిస్థితి ఇలా.. పాలకొండ డివిజన్లోని సీతంపేట మండలంలో 1420 కుటుంబాలకు సంబంధించి 4164.39 ఎకరాలకు, భామినిలో 463 కుటుంబాలకు గాను 1501.98, కొత్తూరులో 145 కుటుంబాలకు 322.86, పాలకొండలో 19 కుటుంబాలకు 56.8, పాతపట్నంలో 332 కుటుంబాలకు 465.69, వీరఘట్టంలో 162 కుటుంబాలకు 596.3, హిరమండలంలో 202 కుటుంబాలకు గాను 659.64, మెళియాపుట్టిలో 580 కుటుంబాలకు 896.18, మందసలో 113 కుటుంబాలకు 218.72 ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రయోజనం.. గిరిజనులకు సాగుహక్కు పత్రాలు ఇస్తే భూమిపై పూర్తి హక్కులు కలుగుతారుు. అలాగే పంట రుణాలను బ్యాంకర్లు ఇస్తారు. అటవీ ఫలసాయాలపై పూర్తి హక్కులు గిరిజనులకు ఉంటారుు. పట్టాల పంపిణీ చాలా ముఖ్యం గిరిజనులకు అటవీ సాగు హక్కు పట్టాల పంపిణీ చాలా ముఖ్యమైంది. పాడేరులో చాలా ఎక్కువ పట్టాలు పంపిణీ చేశాం. ఇక్కడ ఎంతమందికి పట్టాలు ఇవ్వాలి, ఎందుకు పంపిణీలో జాప్యం జరిగిందనే విషయమై పరిశీలించాల్సి ఉంది. జిల్లా కలెక్టర్తో చర్చించి పంపిణీకి చర్యలు తీసుకుంటాం.- ఎల్.శివశంకర్, ఐటీడీఏ పీవో ఆధారాలు చూపకపోవడం వల్లే.. గిరిజనులు తగిన ఆధారాలు చూపిస్తే పట్టాలు ఇస్తాం. అరుుతే ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నామనే ఆధారాలేవీ మాకు చూపించలేదు. పోడు పట్టాలకు సంబంధించిన గిరిజనులు సరైన ఆధారాలు చూపించకపోవడంతో సాగుహక్కు పట్టాల పంపిణీలో జాప్యం జరుగుతుంది. - జి.జగదీశ్వరరావు, ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రభుత్వ వైఫల్యమే గిరిజనులకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు గిరిజనులకు పట్టాలు పంపిణీ జరిగింది. ఇప్పుడు పంపిణీకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు తప్పితే పంపిణీకి మాత్రం చర్యల్లేవు. - విశ్వాసరారుు కళావతి, పాలకొండ ఎమ్మెల్యే లిఖిత పూర్వకంగా ఇవ్వాలి గిరిజనులకు సాగు హక్కు పత్రాలు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వడం లేదో లిఖితపూర్వకంగా చెప్పాలని అడుగుతున్నాం. దీనిలో అటవీశాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. పట్టాలు ఇవ్వాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా గిరిజనులు అన్యాయానికి గురౌతున్నారు. - బి.సంజీవరావు,ఎస్టీ సబ్ప్లాన్ నిధుల సాధన సమితి అధ్యక్షుడు -
గిరిజనుల అభివృద్ధికి రూ.28.72 కోట్లు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్.షణ్మోహన్, డిప్యూటీ డైరెక్టర్ పి.మల్లిఖార్జున రెడ్డిలు తెలిపారు. బుధవారం ఐటీడీఏలోని పీవో ఛాంబర్లో వారు విలేఖరులతో మాట్లాడుతూ గడచిన రెండేళ్ళలో 28 కోట్ల 72 లక్షల రూపాయలతో వివిధ అభివద్ధి సంక్షేమ çపధకాల అమలుకు కృషి చేశామన్నారు. ముఖ్యంగా గిరిజన విధ్యార్ధులకు ఉన్నతమైన విధ్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో 25 ఆశ్రమ పాఠశాలలు, 11 కాలేజి హాస్టల్స్, 6 గురుకుల పాఠశాలలు, జీపీఎస్ పాఠశాలలు 60 ఉన్నాయని తెలిపారు. వీటిలో సుమారు 8వేల 6వందల మంది గిరిజన విధ్యార్ధులు విధ్యను అభ్యసిస్తున్నారన్నారు. అలాగే 875 మంది సిబ్బంది, 629 మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. విధ్యార్ధులకు మౌళిక సదుపాయాలు కల్పించే విధంగా కషి చేస్తున్నామన్నారు. పన్నెండున్నర కోట్ల రూపాయలతో 14 నూతన భవనాలు నిర్మించినట్లు తెలిపారు. అదేవిధంగా బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు సమీపంలో 3 కోట్ల 35 లక్షల రూపాయలతో ఐటీట కళాశాల నిర్మాణం జరుగుతుందన్నారు. 75 లక్షలతో వసతి గృహాల మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా 56 లక్షల 82 వేల రూపాయలతో బాలకల వసతి గృహాలకు కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే వసతి గృహాలు, పాఠశాలలలో లో వోలే్టజ్ సమస్య తలెత్తకుండా ప్రతీ పాఠశాలలోనే ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే గత ఏడాది నుంచి 26 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి వాటిలో దశ్యశ్రావణ పాఠ్యాంశ భోధన జరిగేలా కషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వసతి గృహాలకు జీసీసీ ద్వారా నాణ్యమైన సరుకులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2వేల 231 మంది విధ్యార్ధులకు 3 కోట్ల11 లక్షల 3వేల రూపాయలతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్లు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్టీఆర్ విధ్యాజ్యోతి స్కాలర్షిప్ కింద 9,10వ తరగతి విధ్యార్ధులకు 78 లక్షల 28 వేలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా గిరిపుత్రిక పధకం ద్వారా 85 జంటలకు 44 లక్షల రూపాయలు ప్రోత్సాహంగా ఇచ్చామన్నారు. అదేవిధంగా 50 యూనిట్లు తక్కువగా విధ్యుత్ను వినియోగించుకునే 7143 ఇళ్ళకు సుమారు 68 లక్షల 21 వేల వరకూ బిల్లులు చెల్లించినట్లు వారు తెలిపారు. అదేవిధంగా ట్రైకర్ ద్వారా ఆసక్తి ఉన్న వారు వారు కోరిన యూనిట్లకు ధరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హులైన వారికి రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు. ఐటీడీఏ ద్వారా అందిస్తున్న సేవలను అందిపుచ్చుకొని గిరిజనులు అభివృద్ది చెందాలని వారు కోరారు. -
గిరిజనుల అభివృద్ధికి రూ.28.72 కోట్లు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్.షణ్మోహన్, డిప్యూటీ డైరెక్టర్ పి.మల్లిఖార్జున రెడ్డిలు తెలిపారు. బుధవారం ఐటీడీఏలోని పీవో ఛాంబర్లో వారు విలేఖరులతో మాట్లాడుతూ గడచిన రెండేళ్ళలో 28 కోట్ల 72 లక్షల రూపాయలతో వివిధ అభివద్ధి సంక్షేమ çపధకాల అమలుకు కృషి చేశామన్నారు. ముఖ్యంగా గిరిజన విధ్యార్ధులకు ఉన్నతమైన విధ్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో 25 ఆశ్రమ పాఠశాలలు, 11 కాలేజి హాస్టల్స్, 6 గురుకుల పాఠశాలలు, జీపీఎస్ పాఠశాలలు 60 ఉన్నాయని తెలిపారు. వీటిలో సుమారు 8వేల 6వందల మంది గిరిజన విధ్యార్ధులు విధ్యను అభ్యసిస్తున్నారన్నారు. అలాగే 875 మంది సిబ్బంది, 629 మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. విధ్యార్ధులకు మౌళిక సదుపాయాలు కల్పించే విధంగా కషి చేస్తున్నామన్నారు. పన్నెండున్నర కోట్ల రూపాయలతో 14 నూతన భవనాలు నిర్మించినట్లు తెలిపారు. అదేవిధంగా బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు సమీపంలో 3 కోట్ల 35 లక్షల రూపాయలతో ఐటీట కళాశాల నిర్మాణం జరుగుతుందన్నారు. 75 లక్షలతో వసతి గృహాల మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా 56 లక్షల 82 వేల రూపాయలతో బాలకల వసతి గృహాలకు కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే వసతి గృహాలు, పాఠశాలలలో లో వోలే్టజ్ సమస్య తలెత్తకుండా ప్రతీ పాఠశాలలోనే ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే గత ఏడాది నుంచి 26 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి వాటిలో దశ్యశ్రావణ పాఠ్యాంశ భోధన జరిగేలా కషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వసతి గృహాలకు జీసీసీ ద్వారా నాణ్యమైన సరుకులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2వేల 231 మంది విధ్యార్ధులకు 3 కోట్ల11 లక్షల 3వేల రూపాయలతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్లు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్టీఆర్ విధ్యాజ్యోతి స్కాలర్షిప్ కింద 9,10వ తరగతి విధ్యార్ధులకు 78 లక్షల 28 వేలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అదేవిధంగా గిరిపుత్రిక పధకం ద్వారా 85 జంటలకు 44 లక్షల రూపాయలు ప్రోత్సాహంగా ఇచ్చామన్నారు. అదేవిధంగా 50 యూనిట్లు తక్కువగా విధ్యుత్ను వినియోగించుకునే 7143 ఇళ్ళకు సుమారు 68 లక్షల 21 వేల వరకూ బిల్లులు చెల్లించినట్లు వారు తెలిపారు. అదేవిధంగా ట్రైకర్ ద్వారా ఆసక్తి ఉన్న వారు వారు కోరిన యూనిట్లకు ధరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హులైన వారికి రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు. ఐటీడీఏ ద్వారా అందిస్తున్న సేవలను అందిపుచ్చుకొని గిరిజనులు అభివృద్ది చెందాలని వారు కోరారు. -
ఏజెన్సీలో చట్టాలు ఎవరికోసం?
–ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు. బుట్టాయగూడెం: ఏజెన్సీల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక చట్టాలు గిరిజనుల కోసమా.? లేక గిరిజనేతరుల కోసమా? అని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం ఆయన స్ధానిక విలేఖరులతో మాట్లాడుతూ ఆదివాసీలైన గిరిజనులు హక్కులను కాపాడేందుకు ప్రత్యేకమైన చట్టాలను ఏర్పాటు చేస్తే అవి సక్రమంగా అమలు కాకపోవడం వల్ల గిరిజనులు అనేక అవస్ధలు పడే పరిస్ధితి నెలకొందన్నారు. ఏజెన్సీలోని చట్టాలను తుంగలో తొక్కి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూసేకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే గిరిజనులు ఎన్నో ఏళ్ళుగా సాగుచేసుకుంటున్న భూములను సైతం 1(బి)ల్లో మారిపోతున్నాయని గిరిజనులు గగ్గోలు పెడుతున్నారన్నారు. 1/70 చట్టానికి విరుధ్ధంగా 1(బి)లో పేర్లు ఎలా మారిపోతున్నాయో అర్ధం కావడంలేదన్నారు. అలాగే భూసేకరణకు సంబంధించి లోపాలు తలెత్తినట్లు తమ దష్టికి వస్తున్నాయన్నారు. పక్కా రికార్డులు లేని భూములను భూసేకరణ చేస్తే దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయని గిరిజన సంఘాలు గగ్గోలు పెడుతున్నా కొంతమంది వ్యక్తులు అధికారులను మభ్యపెట్టే ఫ్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. -
గిరిజనులను రక్షిస్తున్నారా? భక్షిస్తున్నారా?
బుట్టాయగూడెం : పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులను రెవెన్యూ, పోలీసు అధికారులు రక్షిస్తున్నారా? భక్షిస్తున్నారా? అని ఆయా శాఖల అధికారులను హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. శనివారం మండలంలోని కేఆర్ పురం ఐటీడీఏ వద్ద గిరిజన ఎల్టీఆర్ పోడు భూములు, పునరావాస ప్యాకేజీ సమస్యలపై బహిరంగ విచారణ ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు భూసమస్యలపై గోడును రిటైర్డ్ జడ్జి వద్ద మొరపెట్టుకున్నారు. 20 సంవత్సరాలుగా భూములు సాగు చేసుకుంటున్నామని, ఆ భూములకు సంబంధించి తమకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వడంతో పాటు తమ పేర్లు 1(బి) లో కూడా ఉన్నాయంటూ వాటికి సంబంధించిన రికార్డులను ఆయనకు చూపించారు. అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండానే తమ పేర్లు 1(బి)లో లేకుండా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారంటూ వాపోయారు. ఈ సందర్భంగా రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ గిరిజనుల కష్టాలను వింటుంటే చెప్పలేని బాధ కలుగుతుందన్నారు. ఆదివాసీలైన గిరిజనులను కాపాడేందుకు ఏర్పాటు చేసిన చట్టాలు ఇక్కడ అమలు కావడంలేదని స్పష్టమవుతుందన్నారు. గిరిజనులను కాపాడాల్సిన అధికారులే గిరిజనేతరులకు అండగా ఉంటూ వారి హక్కులను కాలరాస్తున్నట్టు తెలుస్తుందని చెప్పారు. చట్టాలను కాలరాసే ఏ అధికారైనా వారిపై కేసులు పెట్టవచ్చన్నారు. ఏ గిరిజన ప్రాంతంలో లేని సమస్యలు ఈ ప్రాంతంలోనే ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు నీతి, నిజాయితీతో ఉంటే సమస్యలు ఏర్పడేవే కావన్నారు. వారిలా లంచాలకు ఎగబడి అక్రమాలకు పాల్పడడం వల్లే ఈ సమస్యలు ఏర్పడుతున్నట్టు అర్థమవుతుందన్నారు. ఇక్కడి గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై గవర్నర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. రెడ్డిగణపవరంలో కూడా గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అక్కడ కూడా గిరిజనులు తమ బాధలను చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పల్లా త్రినా«థరావు, గిరిజన సంఘం నాయకులు తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు ఏ.రవి, ఎ.ఫ్రాన్సిస్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు కాకి మధు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి
– లంబాడీ హక్కుల పోరాట సమితి నేతల డిమాండ్ జంగారెడ్డిగూడెం : గిరిజనులకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో లంబాడీ హక్కుల పోరాట సమతి సమావేశం జరిగింది. డివిజన్ అధ్యక్షుడు భూక్యా ధనునాయక్ అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్న గిరిజనులకు మంత్రివర్గంలో చోటులేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి మంత్రివర్గంలో గిరిజనులకు చోటు కల్పించడంతో పాటు నామినేటెడ్ పోస్టులు గిరిజనులకు కేటాయించాలని కోరారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా నాగేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ అక్టోబర్ 2న పుట్టపర్తిలో గిరిజనుల ఐక్యత బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 500 మంది జనాభా ఉన్న తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించడం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ పదవి గిరిజనులకే ఇవ్వాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కష్ణా జిల్లాలో సీట్లు కేటాయించాలనే అంశాలపై తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సభకు సంబంధించి కరపత్రాన్ని నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు, లంబాడీలు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. గొగ్గులోతు మోహనరావు నాయక్, డీకే నాయక్, డి.నాగేశ్వరరావు నాయక్, జె.వెంకటేశ్వరరావు నాయక్ పాల్గొన్నారు. -
తీరొక్క జిల్లా
ఒక్కో జిల్లాది ఒక్కో విశిష్టత భిన్న సంస్కృతుల భూపాలపల్లి వ్యవసాయంలో కీలకంగా వరంగల్ నగర జిల్లాగా హన్మకొండ గిరిజన జిల్లా మహబూబాబాద్ సాక్షిప్రతినిధి, వరంగల్ : కాకతీయుల రాజధానిగా వరంగల్కు గొప్ప చారిత్రక వైభవం ఉంది. వందల ఏళ్లపాటు పాలించిన నైజాం రాజుల హయాంలోనూ వరంగల్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పరిపాలన పరంగా హైదరాబాద్ తర్వాత వరంగల్కు ప్రాధాన్యత ఉండేది. నిజాం పాలకుల హయాంలో వరంగల్ ప్రాంతీయ కేంద్రం(సుబేదార్)గా ఉంది. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వరంగల్ జిల్లా ప్రాంతీయ పరిపాలన కేంద్రంగా కొనసాగింది. పలు ప్రభుత్వ శాఖలకు ఉత్తర తెలంగాణ కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాల పునర్విభజనతో వరంగల్ జిల్లా నాలుగు జిల్లాలుగా మారుతోంది. వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ పేర్లతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. అభ్యంతరాల ప్రక్రియ అనంతరం జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముగియనుంది. ఏ జిల్లాలో ఏ మండలం ఉండాలనే విషయంలో కొన్ని మార్పులు ఉంటాయేగానీ... నాలుగు జిల్లాలు ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడబోయే నాలుగు జిల్లాల్లో ఒక్కోటి ఒక్కో విశిష్టతను కలిగి ఉన్నాయి. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా గుర్తింపు పొందేలా ఈ జిల్లాల స్వరూపం ఉండనుంది. వరంగల్ జిల్లా –వరంగల్ జిల్లాలో వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, గీసుగొండ, సంగెం, ఆత్మకూరు, పరకాల, శాయంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాలు ఉండనున్నాయి. నగర, గ్రామీణ ప్రజలు సమాన సంఖ్యలో ఉండే జిల్లాగా వరంగల్ ఉండనుంది. గ్రామీణ ప్రజలు ఎక్కువగా ఆధారపడే వ్యవసాయరంగానికి వరంగల్ కీలకంగా మారనుంది. ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ వరంగల్ జిల్లాలోనే ఉండనుంది. రాష్ట్రంలోని ఏకైక ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాకతీయ వైద్య కళాశాల, వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన కేంద్రం, వ్యవసాయ విద్యా సంస్థలు, పశుసంవర్థక పరిశోధన సంస్థలు, పశుసంవర్థక కాలేజీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నీ వరంగల్లోనే ఉంటున్నాయి. ప్రఖ్యాత భద్రకాళి ఆలయం, ఖిలా వరంగల్, ప్రకృతిసిద్ధంగా పర్యాటక ప్రాంతంగా ఉండే పాకాల చెరువు వరంగల్ జల్లాలోనే ఉండనున్నాయి. హన్మకొండ జిల్లా – హన్మకొండ జిల్లాలో హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, వేలేరు(కొత్తది), స్టేషన్ఘన్పూర్, చిల్పూరు(కొత్తది), జఫర్గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇలందకుంట(కొత్తది) మండలాలు ఉంటాయని ముసాయిదాలో పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత నగర జనాభా ఎక్కువగా ఉండే జల్లాగా హన్మకొండ ఉండనుంది. గ్రేటర్ వరంగల్లోని సగభాగం, హుజూరాబాద్, జమ్మికుంటలో నగర జనాభా ఎక్కువ. జాతీయ సాంకేతిక సంస్థ(నిట్), కాకతీయ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఇక్కడే ఉన్నాయి. వేయి స్తంభాల గుడి, పద్మాక్షి ఆలయం, పాలకుర్తిలోని సోమేశ్వరలక్ష్మీనర్సింహ ఆలయం హన్మకొండ జిల్లాలోనే ఉండనున్నాయి. భూపాలపల్లి జిల్లా – తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరిట ఏర్పాటవుతున్న భూపాలపల్లి జిల్లాకు ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, దట్టమైన అడవులు, జలవనరులు, నీటి వసతితో సాగే వ్యవసాయం, గిరిజన ప్రాంతం, ఆదివాసీలు అన్ని ఈ జిల్లాలోనే ఉంటాయి. సింగరేణి కాలరీస్ కొత్తగా చేపడుతున్న బొగ్గు గనులు ఈ జిల్లాలోనే ఉన్నాయి. కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ జిల్లాలోనే ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర, కాళేశ్వరం, రామప్ప, మల్లూరు వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు భూపాలపల్లి జిల్లాలోనే ఉంటున్నాయి. భూపాలపల్లి జిల్లాలోనే గోదావరి నదీ తీరం ఎక్కువగా ఉండనుంది. భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు దేవాదుల, త్వరలో నిర్మాణం మొదలయ్యే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లాలోనే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలోనే పర్యాటక కేంద్రాలు ఎక్కువగా ఉన్న జిల్లాగా భూపాలపల్లి ఉండనుంది. లక్నవరం, మేడారం, రామప్ప, తాడ్వాయి అడవులు, గోదావరి తీరం వంటి ఎన్నో పర్యాటక కేంద్రాలు ఈ జిల్లాలో ఉన్నాయి. భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కాటారం, మల్హర్రావు, మహాముత్తారం, మహదేవపూర్ మండలాలతో జయశంకర్(భూపాలపల్లి) జిల్లా ఏర్పడనుంది. –గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో మహబూబాబాద్ జిల్లా ఏర్పడుతోంది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, కొత్తగూడ, తొర్రూరు, గార్ల, బయ్యారం మండలాలు ఉండనున్నాయి. రాష్ట్రంలోనే గిరిజన జనాభా ఎక్కువగా ఉండే జిల్లాలో మహబూబాబాద్ మొదటి రెండు స్థానాల్లోనే నిలిచే అవకాశం ఉంది. ఇనుము, గ్రానైట్ ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మహబూబాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన జిల్లాగానూ ఇదే ఉండనుంది. -
పనులను అడ్డుకున్న గిరిజనులు
చలకుర్తి(పెద్దవూర): చలకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని కుంకుడుచెట్టు తండాలో అటవీశాఖ అధికారులు చేపడుతున్న కందకాల పనులను మంగళవారం గిరిజన రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సర్వే నంబర్ 301లో 405.39 ఎకరాలు, 490లో 12 ఎకరాలు, 491లో 20 ఎకరాలు, 492లో 18 ఎకరాల భూములను భూములు లేని నిరుపేద గిరిజనులకు గతంలో ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసిందన్నారు. ఈ భూములు సాగుకు అనుకూలంగా లేకపోవడంతో అలాగేవదిలేశామన్నారు. ఈ భూముల్లో కంపచెట్లు పెరగడంతో అటవీశాఖ అధికారులు తమవే నంటూచుట్టూ జేసీబీలతో కందకాలు తీయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అడ్డుకోవడంతో చేసేది లేక అటవీ అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీరాములు, సైదా, చంద్రకళ, సోమ్లా, చందు, వాలియా, రెడ్యా, బాలు, అరుణ తదితరులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ కార్యాలయం ముట్టడి
పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజన సంఘాలు, గిరిజనులు సోమవారం ముట్టడించారు. మండలంలోని బోడిపంట మీద కలర్ గ్రానైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ ధర్నాకు దిగారు. ధర్నా విషయం తెలిసి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్వల్ప తోపులాట జరిగింది. -
ఉద్యమ ఆశయాలు కార్యరూపం దాల్చాలి
తెలంగాణ పోరాటంలో గిరిజనుల పాత్ర ప్రశంసనీయం: కోదండరాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాధనకు బలిదానమైన మొదటి వ్యక్తి భూక్యా అనే గిరిజనుడని, ప్రత్యేక రాష్ట్రం కోసం గిరిజనులు ఎంతో పోరాడారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. గిరిజనులకు అడవులపై ఉన్న హక్కులు, వారికి స్వపరిపాలనాధికారం కలిగిన పంచాయతీలను ఏర్పాటు చేయడం కోసం తనతో పాటు ఉద్యమ సహచరులు చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఆనాటి ఉద్యమ ఆశయాలు ఇప్పుడిప్పుడే ఆచరణాత్మక ఫలితాలు ఇస్తున్నాయని.. అవి ఇంకా కార్యరూపం దాల్చాలన్నారు. గురువారం మాసాబ్ట్యాంక్లోని సంక్షేమభవన్లో గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కోదండరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలను సాధించిన 79 మంది ఎస్టీ విద్యార్థులకు కొమురం భీమ్ అవార్డులను, వారి టీచర్లకు సేవాలాల్ పురస్కారాలను ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందజేశారు. -
గిరిజన యువత కోసం వైటీసీలు
హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిరుద్యోగులకు పలు అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ సంచాలకురాలు డాక్టర్ ఎం పద్మ తెలిపారు. మంగళవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సెంటర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం తూర్పుగోదావరి రాజమహేంద్రవరంలో వైటీసీని ప్రారంభిస్తారని ఆమె చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 గిరిజన సంక్షేమ హాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా మారుస్తున్నట్టు చెప్పారు. పదోతరగతిలో మంచి ఫలితాలు సాధించిన గిరిజన సంక్షేమ హాస్టళ్ల బాల బాలికలకు టాబ్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వీటిని సీఎం చంద్రబాబు బుధవారం రాజమహేంద్రవరంలో ఇస్తారన్నారు. పదికి పది పాయింట్లు వచ్చిన వారు కూడా ఒకరు ఉన్నారని తెలిపారు. -
సంచార తెగలను ఆదుకోవాలి: లక్ష్మన్
హైదరాబాద్: వివక్షకు తావులేని సమాజం తెలంగాణలో ఉండాలని, దీనికోసం చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత కే.లక్ష్మన్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దాదాపు 87 సంచార జాతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. వీరిలో 94 శాతం ప్రజలు పేదరికం దిగువ ఉన్నారని, ఈ తెగల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని లక్ష్మన్ తెలిపారు. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. వీరి అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. సంచార జాతుల అభివృద్ధి కోసం 5 కోట్ల ఫండ్ కెటాయించినట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. -
గిరిజన బంధు
-
పోలీసులపై గిరిజనుల దాడి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. జిల్లలోని మెలియాపుట్టి మండలం సవర పోలూరులోని నాటు సారా స్ధావరాలపై ఈ దాడులు చేపట్టారు. తనిఖీలకు వెళ్లిన ఎక్సైజ్ పోలీసులపై గిరిజనులు దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
స్టేషన్ ఎదుట గిరిజనుల ఆందోళన
చిత్తూరు: చిత్తూరు జిల్లా పెద్దమండెం పోలీస్స్టేషన్ ఎదుట గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు. వివరాలు.. ఈ నెల 20వ తేదీన మండలంలోని బండకిందతాండకు చెందిన రవినాయక్ పై నాటుసారా అమ్ముతున్నాడని పోలీసులు కేసు పెట్టారు. ఈ విషయమై పోలీసులు రవినాయక్ ను స్టేషన్ పిలవగా కొడతారేమోననే భయంతో రవి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి రవినాయక్ను వేధిస్తున్నారని గిరిజనులు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. -
పోలీస్స్టేషన్ ముట్టడి, ఉద్రిక్తత
కొయ్యూరు: తమ మీద బనాయించిన అక్రమకేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యూరు మండలం దిప్పకాయలపాడు పంచాయతి పరిధిలోని గిరిజన గూడాలకు చెందిన గిరిజనులందరూ కలిసి శుక్రవారం పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ మీద ఉన్న కేసులను కొట్టేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్స్టేషన్ను ముట్టడించాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
'మా భూములు మాకిచ్చి కదలండి'
అశ్వారావుపేట: మా భూములను మాకు అప్పగించి ఇక్కడి నుంచి కదలండంటూ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు ఫారెస్టు, పోలీసుల వాహనాలను అడ్డుకున్నారు. ఈ గ్రామంలో సుమారు 100 ఎకరాల భూమి గిరిజనుల ఆధీనంలో ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ భూమలల్లో సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు అధికారులు వచ్చి ఇవి ప్రభుత్వ భూములని మొక్కలు నాటడం ఎంతవరకు సబబు అని వాపోయారు. మొక్కలు నాటే కార్యక్రమాలు ఆపేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గిరిజనులు అధికారులను కోరారు. దీంతో ఇరు పక్షాల మద్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కొంత మంది గిరిజనులు వాహనాలకు అడ్డుగా బైఠాయించారు. మరికొంత మంది ఆందోళనతో రహదారిపై రాకపోకలు స్తంభించాయి. -
అశ్వారావుపేటలో ఉద్రిక్తత
అశ్వారావుపేట: అటవీ శాఖ పరిధిలోని టేకు ప్లాంటేషన్ నరికివేసేందుకు గిరిజనలు యత్నించారు. దీంతో అటవీ అధికారులకు గిరిజనలకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం అశ్వారావు పేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని రామన్న గూడెం గిరిజనలు తమకు చెందిన లంకపల్లి భూముల్లో అటవీ అధికారుల టేకు ప్లాంటేషన్ చేశారని, వాటిని నరికివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అటవీ అధికారులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. -
పురుగు మందుతో బావిలోకి దూకిన గిరిజనులు..
వరంగల్ జిల్లాలో ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, భూపాలపల్లి, రేగొండ, తాడ్వాయి, గూడూరు, ఖానాపురం, మహబూబాబాద్ మండలాల్లో గిరిజనులు 40 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నారు. గూడూరు మండలం బొద్దుగొండ శివారు ఎర్రకుంట తండా, కొంగరగిద్ద గిరిజన రైతులు సాగుకోసం ఏనాడో తవ్వుకున్న బావుల పూడ్చివేతకు ఈ నెల 16న అటవీ శాఖ అధికారులు ప్రయత్నించారు. బుల్డోజర్తో చేరుకున్న 60 మంది అటవీ సిబ్బందిని గిరిజ నులు అడ్డుకున్నారు. వర్షాభావం కారణంగా అప్పులు చేసి బావులను 3 నెలల కిందట పూడిక తీయించామని గిరిజనులు వాపోతోంటే.. అధికారులు మాత్రం అవి అట వీ భూమిలో తవ్విన బావులని, వాటిని మూసేస్తామని భీష్మించారు. చివరికి గిరిజనులు పలువురు ఆత్మహత్య చేసుకుంటామంటూ పురుగు మందు డబ్బాలు పట్టుకుని, బావిలోకి దూకటంతో అధికారులు వెనుదిరిగారు. వరంగల్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ శివారు ఎర్రకుంట తండాలో పూడ్చివేతను ఆపకపోతే పురుగు మందు తాగి చస్తామని బావిలో దూకిన గిరిజనులు -
‘అరణ్య’ రోదన!
జీవనాధారమైన అడవి నుంచి ఆదివాసీల గెంటివేత పోడు చేసుకుని బతుకుతున్న గిరిజనులపై సర్కారు కేసులు అవి అటవీ భూములని.. వాటిలో పోడు చేయొద్దని హుకుం బలవంతంగా లాక్కుని మొక్కలు నాటే యత్నం రేషన్ కార్డులు రద్దు.. నిత్యావసరాల పంపిణీ నిలిపివేత మరో దారిలేక గిరిజనులు వలస పోతారనే వ్యూహం వరంగల్లో పోడు బావులను మూసేసే యత్నం కవ్వాల్ టైగర్ రిజర్వు పేరుతో గూడేలకే ఎసరు పోడు లేక.. రేషన్ రాక గిరిపుత్రుల ఆకలికేకలు ఎక్కడికి పోవాలి.. ఎలా బతకాలంటూ ఆవేదన గిరిపుత్రులను వారి జీవనాధారమైన అడవి తల్లి నుంచి దూరం చేస్తున్నారు. పోడు కొట్టుకుని సాగు చేసుకునే అడవి బిడ్డల పొట్టకొడుతున్నారు. అటవీ భూములను ఆక్రమిస్తున్నారంటూ ఆదివాసీలపైనే కేసులు పెడుతున్నారు. తరతరాలుగా వారు సాగుచేసుకుంటున్న భూమిని లాగేసు కుంటున్నారు. ఎలాగైనా అడవి నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా వారి రేషన్ కార్డులను, ఆధార్ కార్డులనూ రద్దు చేస్తున్నారు. అటు పోడు సాగూ లేక.. ఇటు రేషన్ సరుకులూ అందక ఆకలితో అలమటిస్తున్నారు. పుట్టిన గడ్డ నుంచే తమను గెంటేస్తే ఎక్కడికెళ్లి బతకాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పోడు తప్ప మరే పనీ తెలియని తాము బతికేదెలాగన్న వారి ఆవేదన అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. అధికారుల తీరుతో.. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో వేలాది మంది గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. సాక్షి నెట్వర్క్ అటవీ డివిజన్ల పరిధిలో పోడు కొట్టుకుని వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి.. అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రాలు అందించారు.2005 డిసెంబర్ 31 నాటికి పోడు చేస్తున్న భూములకు ఈ పత్రాలను అందించారు. అయితే.. అనంతర ప్రభుత్వాలు ఈ పత్రాల జారీని విస్మరించాయి. దశాబ్దాల పాటు పోడు చేసుకుంటున్న చాలా మంది గిరిజనులకు హక్కు పత్రాలు అందలేదు. ఆ తర్వాతి కాలంలోనూ చాలా గిరిజన కుటుంబాలు తమ జీవనాధారం కోసం అర ఎకరా, ఎకరా పోడు కొట్టుకుని బతుకులు వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం వారికి హక్కు పత్రాలు ఇవ్వకపోగా.. అటవీ భూములను ఆక్రమిస్తున్నారంటూ వారిపై కేసులు నమోదు చేస్తోంది. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ గిరి జనులకు, గొత్తి కోయలకు రేషన్ కార్డులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయాన్నీ నిలిపివేస్తున్నారు. దీంతో అటు పోడు చేసుకుని కుటుంబ పోషణకు ఏమైనా తెచ్చుకోవడానికి భూమీ లేక.. ఇటు ఇంట్లో రేషన్ కార్డుపై బియ్యం, నిత్యావసర సరుకులూ అందక.. చాలా రోజులుగా గిరిజనుల కుటుంబాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. భూముల్లో సాగు చేసుకోనివ్వకుండా.. ప్రభుత్వ సదుపాయాలను నిలిపివేయటం ద్వారా.. గిరిజనులను ఏకంగా వారి నివాస ప్రాంతాల నుంచే పంపించేయాలనేది అధికారుల వ్యూహంగా చెప్తున్నారు. ఈ పరిస్థితులపై గిరిజన సంఘాలు ఆందోళనబాట పడుతున్నాయి. వారికి అనేక రాజకీయపక్షాలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. గిరిజనులపై కేసులు.. కార్డుల రద్దులు... ఖమ్మం అటవీ డివిజన్లో రిజర్వ్ ఫారెస్ట్ విస్తీర్ణం 1,51,350 హెక్టార్లు ఉంది. వీటిలో 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం 8,561 మంది గిరిజనులకు 13,921 హెక్టార్లకు హక్కులు కల్పించారు. ఇవికాక ప్రస్తుతం సుమారు 8,000 ఎకరాల అటవీ భూమిలో పోడు సాగు చేస్తున్నారని చెప్తున్న అధికారులు.. ఆ భూములను స్వాధీనం చేసుకుని, వాటిలో మొక్కలు నాటేందుకు ఉద్యుక్తులయ్యారు. పోడు వ్యవసా యం చేస్తున్న గొత్తి కోయలకు రేషన్కార్డులు, ఆధార్, ఓటరు కార్డులు రద్దు చేశారు. కొత్తగూడెం మండలం పెనగడప పంచాయతీ చండ్రుపట్లలో 200 మంది గొత్తి కోయలకు ఇలా గుర్తింపు కార్డులన్నీ రద్దుచేశారు. భద్రాచలం నార్త్ డివిజన్ పరిధిలో పోడు కొట్టిన 226 మంది గిరిజనులపై అధికారులు కేసులు నమోదు చేశారు. -
దరి చేరని వెలుగు!
మారని గిరిజనుల బతుకులు మూలనపడిన ప్రాసెసింగ్ యూనిట్లు తెరుచుకోని శీతల గిడ్డంగి కోట్లాది రూపాయలు వృథా నిర్లక్ష్యపు చీకట్లలో ‘వెలుగు’ పథకాలు సీతంపేట : గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన పథకాలు నిర్లక్ష్యపు చీకట్లలో మగ్గిపోతున్నాయి. లబ్ధిదారుల జీవితాలనూ మసకబార్చేస్తున్నాయి. ఈ పథకాల అమలు కోసం ఏర్పాటు చేసిన యంత్రాలు, నిర్మించిన భవనాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో టీపీఎంయూ (ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్) పరిధిలోని ఏడు మండలాల్లో గిరిజనుల అభ్యున్నతికి చేపట్టిని వెలుగు పథకాలు మూలన పడుతున్నాయి. సీతంపేట, భామిని, కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి, పాతపట్నం, మందస మండలాల్లో చేపట్టిన వెలుగు పథకాలు నిలిచిపోయాయి. ఏజెన్సీలో అమలవుతున్న పథకాల పరిశీలనకు ఉన్నతాధికారులు, ప్రముఖులు వచ్చినపుడు మాత్రమే హడావుడిగా మసిపూసి మారెడు కాయ చేసి చూపిస్తున్నారు. మార్కెటింగ్ పథకాల పరిస్థితి దారుణం గిరిజనుల ద్వారా మార్కెటింగ్ కేంద్రాలను నడిపి వారికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఐదు చోట్ల పసుపు, చింతపండు, జీడి ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ట్రైకార్ పథకం ద్వారా రూ.8.80 లక్షలు వెచ్చించారు. అయితే ‘వెలుగు’ నుంచి సైరె న ప్రోత్సాహం లేకపోవడంతో గిరిజన మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం లేక ప్రాసెసింగ్ యూనిట్లు మూత పడ్డాయి. ప్రస్తుతం ఒక్క యూనిట్ కూడా పనిచేయని పరిస్థితి ఉంది. రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన కందిపప్పు యూనిట్, ధాన్యం కొనుగోలు కేంద్రాలదీ అదే దుస్థితి. దిష్టిబొమ్మలా కోల్డ్ స్టోరేజి గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు చెడిపోకుండా ధర వచ్చే వరకు నిల్వ ఉంచేందుకు వీలుగా సీతంపేటలో కోటి రూపాయలు వెచ్చించి నిర్మించిన కోల్డ్ స్టోరే జి పూర్తిగా నిరుపయోగంగా మారింది. రెండేళ్లుగా ఒక్క అటవీ ఉత్పత్తిని కూడా గిరిజనులు దీనిలో నిల్వ చేసిన దాఖలాలు లేవు. దీన్ని కూడా ‘వెలుగు’ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. అటవీ ఉత్పత్తులను తక్కువ ధరకు వ్యాపారులకు అమ్మేయకుండా.. తగిన ధర వచ్చే వరకు ఈ కోల్డ్స్టోరేజీలో వాటిని నిల్వ చేసుకోవచ్చని గిరిజనులకు అవగాహన కల్పించడంలోనూ అధికారులు విఫలం కావడంతో కోల్డ్ స్టోరేజి ఏర్పాటు లక్ష్యం నెరవేరకుండాపోయింది. బాలబడులదీ అదే దుస్థితి ఐదేళ్లలోపు చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యనందించాలనే ఉద్దేశంతో ఐటీడీఏ పరిధిలో ‘వెలుగు’ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసిన బాల బడులు నిర్వహణ కూడా సక్రమంగా సాగడంలేదు. గతంలో ఆటబొమ్మల సరఫరా పేరుతో భారీగా నిధులు దుర్వినియోగం చేశారు. కొత్తూ రు, భామిని, సీతంపేట మండలాల్లో ఏర్పాటు చేసిన 110 బాలబడుల్లో దాదాపు సగం అంతంతమాత్రంగా పని చేస్తున్నాయి. ఈ అంశాలను ఐకేపీ ఏపీడీ సావిత్రి వద్ద ప్రస్తావించగా సీజన్ ఆరంభమైతే యూనిట్లు ప్రారంభిస్తామన్నారు. కోల్డ్ స్టోరేజీని జీసీసీకి అప్పగించామన్నారు. -
గిరిజనుల విడుదలకు పోలీస్స్టేషన్ ముట్టడి
ఎమ్మెల్యే ఈశ్వరి ఆధ్వర్యంలో ఆందోళన పోలీసుస్టేషన్ ఎదుట బాధిత కుటుంబసభ్యుల బైఠాయింపు పాడేరు రూరల్ (జి.మాడుగుల): జి.మాడుగుల మండలం గుదలంవీధి ఆశ్రమంలో ఇటీవల మావోయిస్టుల దాడికి సంబంధించి ఆరుగురు గిరిజనులను తక్షణం విడుదల చేయాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. శనివారం ఆమె ఆధ్వర్యంలో గిరిజనులు, వారి కుటుంబసభ్యులు జి.మాడుగుల పోలీసుస్టేషన్ను ముట్టడించారు. బాధితులు స్టేషన్ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నాలుగురోజుల క్రితం కొఠారి వెంకటరాజు, కొర్రా చిట్టిబాబు, కొఠారి లక్ష్మయ్య, సీదరి అప్పలరాజును, శనివారం ఉదయం గొల్లోరి కృష్ణంరాజు, డేవిడ్ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. తమ కుమారుడ్ని అన్యాయంగా పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లారని గొల్లోరి కృష్ణంరాజు తండ్రి చిన్నయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. తమవారి జాడ రేపటిలోగా తెలియజేయాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ గిరిజనులను తక్షణమే విడుదల చేయనిపక్షంలో ఏజెన్సీ వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసుల అదుపులో ఉన్న గిరిజనుల కుటుంబాలు ఆవేదన అంతా ఇంతా కాదన్నారు.మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంట్ర ఏ ఆధారం లేకుండా అమాయక గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారని, ఇలాంటి సందర్భాల్లో వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. గిరిజనులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ చెప్పిన మేరకు ఆరుగురు గిరిజనులను ఆదివారం సాయంత్రంలోగా విడుదల చేయకపోతే సోమవారం నుంచి స్థానిక స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట బాధిత కుటుంబాలతో కలిసి ఆందోళన చేస్తామని ఆమె స్పష్టం చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ శేఖరంతో ఆమె మాట్లాడారు. విచారణ అనంతరం ఆదివారం సాయంత్రం లోగా విడుదల చేస్తామని సీఐ తెలిపారు. ఆందోళనలో పాడేరు జెడ్పీటీసీ పోలుపర్తి నూకరత్నం, బీరం సర్పంచ్ కృష్ణమూర్తి, ఎంపీటీసీ కొటారి చిన్నమ్మి, అనర్బ గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఆదివాసీల ఆశాకిరణం తుకారాం ఐఏఎస్
‘దట్టమైన అడవులు గల ఆదిలాబాద్ జిల్లాలో అత్యం త వెనుకబడిన ఆదిమ జాతికి చెందిన గోండుల్లో మడవి తుకారాంను ఐఏఎస్గా చూడటం గర్వంగా ఉంది’ అనేవారు ప్రపంచ ప్రఖ్యాత మానవ పరిణామశాస్త్ర వేత్త హైమండార్ఫ్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని లక్సెట్టిపేట ఏజెన్సీ గూడెంలో మడవి బాబూరావ్, మాన్కుబాయి దంపతులకు మూడో సంతానంగా 1941 మే 4న జన్మించాడు తుకారాం. తండ్రి చిరుద్యోగం చేస్తూ, తన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తపన పడేవారు. ఆ తపనే తుకారాంను గోండుల్లో తొలి ఐఏఎస్ అధికారిని చేసింది. పేదరికంలో మగ్గుతూనే ఎంఏ వరకు చదువు కున్నారు. మాతృభాష గోండితో పాటు మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో పట్టు సాధించాడు. దేశంలో గిరిజన జాతులు, భాషా సంస్కృతుల అధ్యయనం కోసం నైజాం కాలంలో రెండోసారి వచ్చిన హైమండార్ఫ్ వద్ద గోండి భాషలో అనువాదకుడిగా పని చేశారు. హైమండార్ఫ్ లండన్ వెళ్లిన తర్వాత ఆయన స్ఫూర్తితో గ్రూప్-1 అధికారిగా ఎన్నికైన తుకారాం మొదట కాకినాడ ఆర్డీ వోగా విధుల్లో చేరారు. 1981 ఏప్రిల్ 21న ఇంద్రవెల్లిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎందరో ఆదివాసులు మృతి చెందినప్పుడు ఉట్నూరు ఐటీడీఏ సహాయ అధి కారిగా ఉన్న తుకారాం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. ఆదివాసీల సమస్యల పరిష్కారాలకు ఏర్పా టైన రాయ్ సెంటర్లకు తోడ్పడ్డారు. కరీంనగర్లో డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్గా, హైదరాబాద్లో గిరిజన సంస్కృతీ పరిశోధన శిక్షణా సంస్థలో ఇన్చార్జి డెరైక్ట ర్గా, మహబూబ్నగర్లో డీఆర్డీవోగా సేవలందించిన తుకా రాం అనంతరం ఐఏఎస్గా పదోన్నతి పొందారు. తొలుత నిజా మాబాద్ జిల్లా కలెక్టరుగా, తర్వాత రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్గా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సంస్థ కమిషనర్గా, ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998 నవంబర్ 29న ఆయన అస్వస్థతతో తనువు చాలించారు. ప్రతియేటా తుకా రాం వర్ధంతి రోజున గోండు ఆదివాసులు ఆనవాయితీగా నివాళు లర్పిస్తారు. తుకారాం చూపిన బాటలో నడవటమే నేటి ఆదివాసీ యువత ఆయనకు అర్పించే నిజమైన నివాళి. (నేడు తుకారాం గోండ్ 16వ వర్ధంతి) గుమ్మడి లక్ష్మీనారాయణ నర్సంపేట, వరంగల్ -
దీని దుంప తెగ
వేలేరుపాడు: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల గిరిజనుల సంసృతీ సంప్రదాయాలతో పాటు నాగరికత, ఆహారపు అలవాట్లకు ముప్పు ఏర్పడనుంది. అడవిలో లభించే కందమూలాలు, దుంపలు, వివిధ రకాల పండ్ల వంటివి తుడిచిపెట్టుకుపోనున్నాయి. అడవితో వారికున్న అనుబంధం, సీజనల్ వారీగా వారికి లభించే సహజసిద్ధ ఆహారం ఇక మీదట వారికి దూరం కానుంది. ఇష్టమైన చేపలవేట, బొంగు చికెన్ వంటి వాటికి కూడా గిరిజనులు నోచుకోకుండా పోతున్నారు. వెదురు బియ్యం.. బొంగు చికెన్కు ‘ముంపు’ అడవిలో దొరికే వెదురు బియ్యం గిరిజనులకు ఎంతో బలవర్ధకమైన ఆహారం. వెదురు ముదురు పిడియాలకు మాత్రమే బియ్యం వస్తాయి. పూతరూపంలో వచ్చి, గింజలు బయటికి వస్తాయి. వీటిని దంచుకొని అన్నం వండుకొని తింటారు. ఈ అన్నం తింటే సంతానం ప్రాప్తిస్తుందని గిరిజనులు చెబుతున్నారు. అంతేకాక వెదురు పిడియంతో బొంగుచికెన్ కూడా తయారుచేసుకొని తింటారు. ఏదైనా మాంసాన్ని పచ్చివెదురు పిడియం( గొట్టం)లో నింపుతారు. దానిని మంటలో వేసి కాలుస్తారు. వేడి వల్ల పిడియంలో మాంసం ఉడుకుతుంది. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే వెదురు కొమ్ముల కూర కూడా తింటారు. ఇక చేపలవేట లేనట్టేనా...? చేపల వేటకు గిరిజనులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కడ చేపలున్నా ఊరంతా చిన్నాపెద్ద తేడాలేకుండా అక్కడికి చేరుకొని వేట ప్రారంభిస్తారు. వారు సొంతంగా వెదురుబద్దలతో తయారు చేసిన వలలను వేటకు వాడతారు. ఎక్కువగా గ్రామాల్లో కుంటలు, చెరువులు, గోదావరి మడుగుల్లో చేపల వేట సాగిస్తారు. ఎన్ని చేపలు దొరికినా సరే అందరూ సమంగా పంచుకుంటారు. బొద్దుకూర ఇక బందేనా..! అడవిలో దొరికే బొద్దుకూర తీగ, పొట్టను కూరచేసుకొని తింటారు. బొద్దుకూర తియ్యగా ఉంటుంది. అడవి పొట్ట మనం తినే మొక్కజొన్నను పోలి వుంటుంది. దీనిని ముందుగా ఒలిచి ఉడకబెట్టి, ఆ తర్వాత కూర వండుకొని తింటారు. ఇది కూడా చాలా బలమైన ఆహారంగా గిరిజనులు చెబుతున్నారు. కందమూలాలూ కనుమరుగు అటవీ ప్రాంతంలో లభ్యమయ్యే ట్యాగ, అడవి కంద, పంది దుంపలంటే గిరిజనులకు చాలా ఇష్టం. కూరగాయలన్నింటిలో ఉండే పోషకాలు ఈ దుంపల్లోనే ఉంటాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో గిరిజనులు దుంపల అన్వేషణలో మునిగిపోతారు. ఇవి దట్టమైన అటవీ ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి. ఉడకబెట్టుకొనిగానీ, కాల్చుకొని గానీ తింటే ఆ మజాయే వేరని గిరిజనులు అంటున్నారు. ఇవి ఉదయం ఒక్కసారి తింటే ఆ రోజంతా అసలు ఆకలే కాదని, శరీరమంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుందని పేర్కొంటున్నారు. తాటి, జీలుగు కల్లు తాగలేమా..? గిరిజనులు పూర్వం నుంచి తాటి వృక్షాలు పెంచడం ఆనవాయితీ. వారు సాగు చేసుకునే భూముల గట్లవెంట వీటిని పెంచుతారు. వీటి ద్వారా వచ్చే కల్లును ఇష్టంగా తాగుతారు. ఆడ, మగ, పిల్లాజెల్లా తేడా లేకుండా అంతా ఒకచోట చేరి కల్లును ఆస్వాదిస్తారు.అడవిలో దొరికే జీలుగు కల్లును కూడా ఇష్టపడతారు. కల్లు సీజన్లో ఆహారం కన్నా దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. -
మన్యంలో సెగ
కొయ్యూరు: వచ్చే నెల మొదటివారంలో మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభం కానున్నాయనే సమాచారం మన్యంలో అలజడి రేపుతోంది. ఇటీవల వీరవరం ఘటనలో డివిజన్కమిటీ(డీసీ) శరత్ను కోల్పోవడాన్ని జీర్ణించుకోలేని మావోయిస్టులు ఏం చేస్తారోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తప్పులు చేసిన వారిని గుర్తించామని, వారందరికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించడంతో మరింత భయపడుతున్నారు. వీరవరం సంఘటన తర్వాత కొందరు గిరిజనులు చింతపల్లిలో ఆందోళన చేసి ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రధమశ్రేణీ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్కు వినతిపత్రం కూడా అందజేశారు. మూడు రోజుల కిందట హైదరాబాద్లో పౌరహక్కుల సంఘం నేత వరవరరావు ఇంటి ఎదుట ఆందోళన చేశారు. సాధారణంగా వారోత్సవాలు విధ్వంసాలకు చిరునామాగా మారుతాయి. పోలీసులు లేదా రాజకీయ నేతలపై మావోయిస్టులు గురిపెడతారు. చిన్న స్వ్కాడ్లు లేదా యాక్షన్ బృందాలను రంగంలోకి దించుతారు. వారితోనే నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే విధంగా చేస్తారు. 2000లో ఆదిలాబాద్జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్లో నరేశ్, శ్యామ్,అది అనబడే ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లో మరణించారు. దీంతో అప్పట్లో పీఎల్జీఏను ఏర్పాటు చేశారు. దళాల స్థానంలో ఏరియా కమిటీలను ఏర్పాటు చేశారు. వ్యూహాలను పూర్తిగా మార్చారు. శత్రువును దెబ్బతీయడం మొదలుపెట్టారు. 2001లో నిర్వహించిన మొదటి పీఎల్జీఏ వారోత్సవాల్లో మావోయిస్టులు కొయ్యూరు,గూడెంకొత్తవీధిలో లెక్కలేనన్ని విధ్వంసాలు చేశారు. అప్పటి నుంచి ప్రతీ పీఎల్జీఏ వారోత్సవాలకు మావోయిస్టులు విధ్వంసం చేయడం రివాజుగా మారింది.వ ారోత్సవాలు ముగిసేంతవరకు పోలీసులు మన్యాన్ని జల్లెడపడతారు. రాజకీయ నేతలు లేదా మావోయిస్టుల హిట్ జాభితాలో ఉన్నవారెవరు కూడా సొంత గ్రామాల్లో ఉండే అవకాశం ఉండదు. ఈ సారి పీఎల్జీఏ వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. మావోయిస్టులు ఈసారి చెలరేగే అవకాశలు కనిపిస్తున్నాయి. దీనిపై నిఘా వర్గాలు ముందుగానే అనుమానించి అప్రమత్తం చేస్తున్నాయి.వీరవరం సంఘటన తరువాత పోలీసులు మావోయిస్టుల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. పోలీసుల ముసుగులోనే గిరిజనులు మావోయిస్టులను చంపారని మావోయిస్టులు ఆరోపిస్తుంటే మావోయిస్టులపై నమ్మకాన్ని కోల్పోయిన గిరిజనం తిరుగుబాటు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు మావోయిస్టులపై అభ్యుదయ గిరిజన యువత పేరిట కరపత్రాలను అన్ని మండలాల్లోను అంటించారు. -
తండాలు తరలుతున్న సమయం
దశాబ్దాలుగా తరలుతున్న వలస బాటకు నారాయణఖేడ్ ప్రాంతంలో ప్రస్తుతం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సొంత ప్రాంతంలో ఉపాధి కరువై ప్రతీ సంవత్సరం నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి వలస వెళ్ళడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి తోడు ప్రస్తుత ఏడాది ఖరీఫ్ సీజన్లో కరువు విలయతాండవం చేయడంతో వలసలు పెరగనున్నట్లు తెలుస్తోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 175 తండాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఖరీఫ్లో వ్యవసాయ పనులు చేసిన గిరిజనులు ప్రస్తుతం పనులను ముగించుకున్నారు. ఉపాధిహామీ పథకం ఉన్నా ఉపయోగకరంగా లేదంటున్న గిరిజనులు వలసలే శరణ్యమని వలసబాట పడుతున్నారు. నియోజకవర్గంలో 2లక్షలకు పైగా జనాభా ఉంది. ఇందులో దాదాపు10 వేలకు పైగా జనాభా వలస వెళ్ళి ఇతర చోట్ల నివాసం ఉంటున్నారు. కాగా నియోజకవర్గంలోని గిరిజనులు, ఇతరులు కలిపి సుమారు 40వేల మంది వరకు వలస బాట పట్టనున్నట్లు సమాచారం. చెరకు ఫ్యాక్టరీలకు వలసలు: ఖేడ్ నియోజకవర్గం నుంచి సుమారు 75 శాతం మంది గిరిజనులు డిసెంబర్ వరకు వలసలకు వెళ్తున్నారు. అప్పటి నుంచి వచ్చే ఏప్రిల్, మే వరకు చక్కెర కర్మాగారాల్లోనే వివిధ కూలీ పనులను చేస్తుంటారు. జిల్లాలోని కొత్తూరు, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, మెట్పల్లి, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని మాగి, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లోని షుగర్ ఫ్యాక్టరీలకు వెళ్ళి చెరకు నరికే పని చేస్తుంటారు. అల్లీకేడ్, మన్నక్కెళ్ళి తదితర ప్రాంతాలకు వలసవెళ్తారు. ఉపాధిహామీ పథకంలో 100 రోజులు పని కల్పిస్తామని ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు పేరుకే మిగులుతున్నాయని గిరిజన కూలీలు వాపోతున్నారు. కేవలం 30, 40 రోజులు మాత్రమే పనులు కల్పిస్తున్నారని, అందులోనూ కూలీ బిల్లులు తక్కువగా వస్తుండడం, బిల్లుల జాప్యం కారణంగా పథకం సక్రమంగా కొనసాగడం లేదని వారు పేర్కొంటున్నారు. చెరకు నరికేందుకు వెళ్లే కూలీలకు టన్నుకు రూ.400ల నుంచి రూ.500ల వరకు ఇస్తున్నారు. బీమా లేదు - భద్రత కానరాదు వలసవెళ్ళిన గిరిజనుల బతుకులకు బీమా లేదు., భద్రత కరువు. వలసవెళ్ళిన ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని జీవిస్తున్న వీరు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. చెరకు నరికే క్రమంలో పాముకాట్లకు గురై పలువురు మరణించిన సంఘటనలు ఉన్నాయి. నాలుగేళ్ళక్రితం నిజామాబాద్ జిల్లాలో తిరుగు ప్రయాణంలో చెరకు బండ్లను రైలు ఢీకొన్న ఘటనలో ఓ కుటుంబంలోని ముగ్గురు మరణించారు. పదేళ్ళ క్రితం చాప్టా(కె) పంచాయతీ పరిధిలోని అకలై తండాలో గిరిజనులందరూ వలస పోగా ఇళ్ళవద్ద ఉన్న వృద్ధులు, పిల్లలు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారు. అందులో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. బోసిపోతున్న తండాలు.. నారాయణఖేడ్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మండలమైన మనూరు మండలంలో వలసల జోరు ఊపందుకుంది. గత వారం రోజులుగా ఏ గ్రామం, తండాలో చూసినా మూటా ముల్లె సర్దుకుంటున్న దృశ్యాలే అగుపిస్తున్నాయి. గ్రామాలు, తండాల్లోని అనేక గడపలు ఇప్పటికే తాళాలు వేసి ముళ్ళ కంచెలు పెట్టి ఉంచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మండలం నుంచి కర్ణాటక, మహారాష్ట్రతో పాటు, తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ప్రాంతాల్లో గల చెరకు కర్మాగారాలు ఉన్న చోటకు వందల సంఖ్యలో తరలుతున్నారు. పెద్దశంకరంపేట, కలేర్ మండలం తదితర తండాల్లోని విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. దీంతో తండాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కంగ్టి మండలంలో మాత్రం ఈ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. అన్ని గిరిజన తండాల నుంచి కేవలం 40 నుంచి 50 మంది నిరుపేద ప్రజలే వలస వెళుతున్నారు. సర్కార్ సరైన గిట్టుబాటు వేతనంతో స్థానికంగా ఉపాధి పనులు కలిపించి ఈ వలసలకు చెక్ చెప్పాలని ఖేడ్ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
వెదురుచూపు
చట్టం అమలయ్యే రోజు కోసం అడవిబిడ్డలు నిరీక్షిస్తున్నారు. రెండేళ్ల క్రితం చేసిన ఈ చట్టం ప్రకారం వెదురులాంటి కలపేతర జాతులను, చిన్న తరహా అటవీ ఉత్పత్తులను గిరిజనులు గ్రామసభలో తీర్మానం ద్వారా రవాణా చేసి విక్రయించుకోవచ్చు. అయితే అటవీ అధికారులు గిరిజనులకు కనీసం అవగాహన కలిగించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ చట్టాన్ని అమలు చేస్తే వనసంరక్షణ సమితుల వారు, బినామీలు కుమ్మక్కై అడవిని కొల్లగొడతారని వారంటున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :కేంద్ర మంత్రి జైరాం రమేష్ 2012లో అటవీ చట్టాన్ని తీసుకువచ్చి వెదురును కలపేతర చిన్న తరహా అటవీ ఉత్పత్తుల జాబితాలో చేర్చారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా మంధాలేఖ్లో వీఎస్ఎస్ సభ్యులు వెదురును మార్కెట్ చేయడం ద్వారా గ్రామం అభివృద్ధి సాధించడం ప్రామాణికంగా జైరాం రమేష్ ఆరు రాష్ట్రాల్లో అమలు చేయాలని భావించి ఆంధ్రప్రదేశ్కు కూడా వర్తింపచేశారు. అంతవరకు వెదురు నరకడం, విక్రయాలపై అటవీశాఖకు మాత్రమే అధికారం ఉండేది. ఈ చట్టం అమలులోకి వచ్చాక వెదురును కలపేతర చిన్న తరహా అటవీ ఉత్పత్తుల్లో చేర్చడంతో గిరిజనుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వెదురు ఎక్కువగా లభించే ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వెదురును చిన్న తరహా అటవీ ఉత్పత్తిగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అటవీ హక్కుల చట్టం ద్వారా వెదురును చిన్న తరహా అటవీ ఉత్పత్తిగా సేకరించుకోవచ్చని ఆదేశాలు జారీచేసింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే అటవీ ప్రాంతంతో పాటు మైదాన ప్రాంతంలో 620 వనసంరక్షణ సమితులు ఉన్నాయి. ఒక్క ఏజెన్సీలోనే ఉన్న 450 వనసంరక్షణ సమితులలో 350 వీఎస్ఎస్ల్లో వెదురు పుష్కలంగా ఉంది. ఒక్కో వీఎస్ఎస్ పరిధిలో 1125 ఎకరాల భూమి ఉంది. ఈ లెక్కల ప్రకారం తూర్పు మన్యంలో 3,93,750 ఎకరాలున్నాయి. పశ్చిమగోదావరి, విశాఖ మన్యంలో దాదాపు నాలుగు లక్షల ఎకరాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లక్షన్నర ఎకరాలుంటాయని అటవీశాఖాధికారుల అంచనా. ఒక్కో జిల్లాల్లో 300కు తక్కువ కాకుండా వనసంరక్షణ సమితులున్నాయి. వెదురు ఎదిగి సిద్ధంగా ఉన్నా.. ఆ జిల్లాల్లోని వీఎస్ఎస్లలో ఉన్న గిరిజనులు 2000లో అమలు చేసిన జాయింట్ ఫారెస్టు, కమ్యూనిటీ ఫారెస్టు మేనేజ్మెంట్ ద్వారా వెదురు మొక్కలు నాటారు. ఆ జిల్లాల్లో వెదురు ఎదిగి, ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉంది. చట్టం ప్రకారం వెదురు సేకరించుకుని విక్రయించుకుందామంటే అటవీశాఖాధికారులు అడ్డుపడుతున్నారని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. గతంలో అటవీ శాఖ వీఎస్ఎస్ల లో లభించిన వెదురును మార్కెట్ చేయడం ద్వారా వచ్చిన సొమ్మును 50 శాతం వీఎస్ఎస్ ఖాతాల్లో జమచేసేది. ఇప్పుడు మొత్తం వెదురును వీఎస్ఎస్ సభ్యులే మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటును చట్టం కల్పించింది. కానీ అధికారులు మాత్రం వీఎస్ఎస్ సభ్యులకు వెదురు సేకరణ, విక్రయాలపై అవగాహన కల్పించడంపై ఆసక్తి చూపడం లేదు. వీఎస్ఎస్ పరిధిలో 100 ఎకరాల్లో వెదురు ఉంటే 50 ఎకరాల్లో వెదురు సేకరించి తరువాత అదే ప్రాంతంలో తిరిగి వెదురు పెంచే చర్యలు తీసుకుని తరువాత మిగిలిన ప్రాంతంలో వెదురు సేకరించుకోవాలి. వెదురు లభ్యమయ్యే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల మన్యంలో ఉన్న ఒక్కో వీఎస్ఎస్ ఏటా వెదురుతో రూ.20 లక్షలు ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది. మన్యవాసులకు ఈ చట్టం అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా అమలు చేయాలి.. అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు ప్రయోజనం కలుగుతుందని భావించాం. వెదురును కలపేతర అటవీ ఉత్పత్తిగా గుర్తించినప్పుడు గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారని అనుకున్నాం. చట్టం అమలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండేళ్లవుతున్నా నేటికీ గిరిజనులు వెదురును సేకరించుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా చట్టాన్ని అమలు చేసి గిరిజనుల ఆర్థిక స్వావలంబనకు కృషి చేయాలి. - కోరా మోహన్, ఏపీ ఫోరం ఫర్ ల్యాండ్ రైట్స్ సభ్యుడు, రాజు క్యాంప్, వై.రామవరం మండలం -
తీజ్ ఆన్పడిఓచ్..
కాలం మారుతున్నా.. అనాదిగా వస్తున్న తమ ఆచార వ్యవహారాలను మాత్రం గిరిజనులు వీడడం లేదు. సంప్రదాయ పండగలు, జాతరలు, ఉత్సవాలు నిర్వహిస్తూ తమ సంసృ్కతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. అలాంటి ఉత్సవాల్లో తీజ్ (మొలకల) పండగ ఒకటి. శ్రావణమాసంతో ప్రారంభమయ్యే తీజ్ ఉత్సవాలు ఇప్పటికే తండాల్లో మొదలయ్యాయి. పండగ జరిగే తొమ్మిది రోజులు తండాల్లోని గిరిజన యువతులు ఆడిపాడతారు. గురువారం చందంపేట మండలం తెల్దేవర్పల్లిలో కూడా తీజ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పండగ విశేషాలు, విశిష్టతలను గుర్తు చేసుకుందాం. తీజ్ పండగొచ్చింది(ఆన్పడిఓచ్).. తండాల్లో సంబరాలు నింపింది. లంబాడీలు ఘనంగా నిర్వహించే పండగల్లో తీజ్ ఒకటి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండగకు బతకుదెరువ ు కోసం, ఇతర పనుల కోసం, ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారు కూడా తమ స్వస్థలాలకు వస్తారు. పంటలు బాగా పండాలని, పెళ్లికాని యువతులకు వివాహాలు జరగాలని, మంచి భర్తలు దొరకాలని గిరిజన కుటుం బాలు తమ ఇష్టదైవమైన మేరమ్మను కొలుస్తూ ప్రతిఏటా శ్రావణమాసంలో తీజ్ జరుపుకుంటారు. కాలక్రమంలో సమాజంలో, గిరిజనుల్లో మార్పులు చోటు చేసుకున్నా తీజ్ విషయంలో మాత్రం వారు ఆనాటి సంప్రదాయాన్నే పాటిస్తుండటం విశేషం. ప్రధానంగా పెళ్లీడుకొచ్చిన యువతులకు ఈ పండగ ప్రత్యేకం. మంచి జరుగుతుందని.. గిరిజనుల ఆరాధ్యదైవమైన శీతల భవానీలు(ఏడుగురు దేవతలు) మేరమ్మతల్లి, తుల్జాభవానీ, ద్వాళంగర్ అమ్మవారు, పెద్దమ్మతల్లి, ముత్యాలమ్మతల్లి, ఎల్లమ్మ తల్లి దేవతలను తలుచుకుంటూ ఈ తీజ్ పండగను నిర్వహిస్తుంటారు. దీంతో తండాకు ఎలాంటి కీడు రాదని, మంచి జరుగుతుందని గిరిజనుల నమ్మకం. అదే విధంగా పెళ్లి కాని యువతులు మాత్రమే ఈ పండగను నిర్వహించడం వల్ల వారికి మంచి గుణగణాలు కల్గిన భర్తలు దొరుకుతారనేది వారి విశ్వాసం. వర్షాలు కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని కూడా నమ్ముతారు. తీజ్ పండగకు వారి ఆర్థిక స్థోమతను బట్టి గిరిజన యువతులకు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అంతేగాక ఇంటి ఆడపడుచులు ఇళ్లకు రావడంతో తండాల్లో సందడి నెలకొంటుంది. ప్రత్యేక పూజలు ప్రతిరోజు యువతులు స్నానమాచరించి ఆగరబత్తులతో తీజ్ బుట్టలకు మూడు సార్లు పూజలు చేస్తారు. అంతేగాక ప్రతిరోజు వారివారి బుట్టలలో నీళ్లు పోసి, కొబ్బరికాయలు కొట్టిమొక్కులు చెల్లిస్తారు. ఇలా ఎమిదవరోజు డంబోలి పండగను నిర్వహిస్తారు. ఆ రోజున ప్రతి ఇంటి నుంచి పూజారి బియ్యం, బెల్లం సేకరించి తీజ్ బుట్టలు ఏర్పాటు చేసిన చోట అన్నింటినీ కలిపి పాయసం తయారుచేస్తాడు. అంతేగాక తండా నుంచి గొర్రె పొట్టేళ్లను ఒకేచోట కోసి ప్రతి ఇంటికి ఆ మాంసాన్ని భాగాలుగా చేసి పంపిస్తారు. పాయసాన్ని ముద్దలుగా చేసి ప్రతి ఇంటికి అంద జేస్తారు. 9వ రోజు సాయంత్రం పందిరిపై నుంచి బుట్టలను తీసి కింద ఉంచి వాటి చుట్టూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతారు. అదేవిధంగా తండాకు చెందిన పురుషులు తీజ్ బుట్టల వద్ద వరుసగా కూర్చుంటారు. అనంతరం యువతులు పెరిగిన గోధుమ గడ్డిని తెంచి పురుషుల తలలు, చెవులలో పెడతారు. అనంతరం ఆ బుట్టలను చెరువులో నిమజ్జనం చేసి అక్కడే సోదరుని వరుసయ్యే పురుషులు యువతుల కాళ్లను కడిగి వారిని ఇళ్లలో చేసుకొచ్చిన పంటలను(కేత్) తినిపించడం ఆనవాయితీ. పురుషులపై వేసిన ఆకులను ఇంటికి తీసుకెళ్లి దేవుని వద్ద భద్రపరుస్తారు. రోజూ వాటికి పూజలు చేస్తుంటారు. -
మావోయిస్టుల సమావేశాలకు వెళ్లొద్దు
గిరిజనులు, మీడియాకు ఓఎస్డీ దామోదర్ సూచన చింతపల్లి/గూడెంకొత్తవీధి: మన్యంలోని ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టుల సమావేశాలు, వారోత్సవాలకు ప్రజలు కానీ, మీడియా సిబ్బంది కానీ వెళ్లవద్దని నర్సీపట్నం ఓఎస్డీ దామోదర్ హెచ్చరించారు. భద్రతా బలగాలు భారీఎత్తున మోహరించాయని వెల్లడించారు. అలాగే మావోయిస్టుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులనో, వ్యాపారులనో ఎవరైనా డబ్బుల కోసం బెదిరిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో బుధవారం ఆయన చింతపల్లి, జీకేవీధి పోలీసుస్టేషన్లను తనిఖీ చేశారు. మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించేందుకు పోలీసు అధికారులు, భద్రతా బలగాలన్నీ అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించేందుకు గిరిజనులతో మమేకమవ్వాలని, వారోత్సవాలను తిప్పికొట్టాలని సూచించారు. నక్సల్ ప్రాబల్య ప్రాంతాలైన జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో మావోయిస్టుల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చింతపల్లి డీఎస్పీ అశోక్కుమార్ పోలీసు సిబ్బందికి సూచించారు. గిరిజనుల నమ్మకాన్ని కోల్పోయారు... మావోయిస్టులు గిరిజనుల నమ్మకాన్ని కోల్పోయారని ఓఎస్డీ దామోదర్ అన్నారు. చింతపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ మన్యంలో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. నూటికి నూరు శాతం మంది మావోయిస్టులను వ్యతిరేకించారని చెప్పారు. వారు నాణ్యమైన విద్య, వైద్యం, సరైన రహదారి సౌకర్యాలను కోరుకుంటున్నారని అన్నారు. ఈ సమస్యలు మావోయిస్టుల వల్ల పరిష్కారం కాకపోగా కొత్తవి ఉత్పన్నమవుతున్నాయని అర్థం చేసుకున్నారని చెప్పారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టుల సమావేశాలకు, స్తూపాల నిర్మాణానికి గిరిజనులు సహకరించడం లేదన్నారు. ఈ పర్యటనలో ఓఎస్డీ వెంట డీఎస్పీ అశోక్కుమార్తో పాటు జీకేవీధి, చింతపల్లి సీఐలు రాంబాబు, ప్రసాద్, ఎస్సైలు నర్సింహమూర్తి, తారకేశ్వరరావు ఉన్నారు. -
గర్జించిన గిరిజనులు
భద్రాచలం, కొత్తగూడెం డీఎఫ్ఓ కార్యాలయాల ఎదుట ధర్నా అటవీ అధికారుల దాడులకు వ్యతిరేకంగా గిరిజనులు గర్జించారు. భద్రాచలం, కొత్తగూడెం డీఎఫ్ఓ కార్యాలయాల ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. తాము పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాచలంలో వ్యవసాయ కార్మిక సంఘం, కొత్తగూడెంలో రైతు కూలీ సంఘం, సీపీఐ వేర్వేరుగా నిర్వహించిన ఈ కార్యక్రమాలలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన భద్రాచలంలో... భద్రాచలం టౌన్: పోడు భూములు సాగు చేసుకుంటు న్న గిరిజనులపై అటవీ అధికారుల దాడులకు వ్యతిరేకంగా, అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూమి సాగుదారులకు పట్టాలు ఇవ్వాలన్న డిమాండుతో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక డీఎఫ్వో కార్యాలయం ఎదుట శనివారం గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ... రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’గా తీర్చిదిద్దుతామంటూ ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, గిరిజనులపై అటవీ అధికారుల దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలివ్వాలని కోరారు. గిరిజనులపై దాడులను ఆపుతామంటూ డీఎఫ్వో స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు కదిలేది ధర్నా విరమించేది లేదని ప్రకటించారు. ధర్నా వద్దకు డీఎఫ్వో వచ్చి ఎమ్మెల్యే రాజయ్యతో మాట్లాడారు. అటవీ భూముల్లో చట్ట ప్రకారంగా ఉన్న వారిని కదిలించబోమని, గిరిజనులపట్ల అధికారులు దురుసుగా వ్యవహరించకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘‘గిరిజనులపై దాడులను ఆపకపోతే మరో మన్యం తిరుగుబాటు తప్పదు’’ అని, అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. ధర్నాలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.వెంకట్, జిల్లా నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, మర్లపాటి నాగేశ్వరరావు, గడ్డం స్వామి, వెంకటేశ్వర్లు, మాధవరావు, ఐవీ పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యాన కొత్తగూడెంలో... కొత్తగూడెం రూరల్: చండ్రుగొండ మండలంలోని పలు గ్రామాల్లో గత 12 సంవత్సరాలుగా పోడు సాగు చేస్తున్న గిరిజన రైతులపై అటవీ శాఖ అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా కొత్తగూడెం డీఎఫ్వో కార్యాలయం ఎదుట గిరిజనులు సీపీఐ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ.. పోడు చేసుకుని జీవిస్తున్న గిరిజనులను వారి భూముల్లోకి వెళ్లకుండా అటవీ అధికారులు అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. ‘‘వారికి పోడు భూములే జీవనాధారం. వాటినిలాక్కుంటే మిగిలేది ఆకలి చావులే’’ అని, ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీసీ, బీపీఎల్ వంటి ప్రైవేటు సంస్థలకు వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం... నిరుపేద గిరిజనుల జీవనోపాధికి పోడు భూములు ఇచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తోందని ప్రశ్నించారు. భూమి లేని వారికి మూడు ఎకరాలు ఇస్తామంటున్న పాలకులు.. గిరిజనుల పోడు భూములను లాక్కోవటంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు. పోడు సాగుదారులపై వేధింపులు ఆపకపోతే వారం రోజుల్లో డీఎఫ్వో కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం, డీఎఫ్వోకు నాయకులు వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో నాయకులు సలిగంటి శ్రీనివాస్, బండి విజయభాస్కర్, కంచర్ల జమలయ్య పాల్గొన్నారు. -
60 తండాలు ఇక పంచాయతీలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో కొత్తగా 60 పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. గిరిజన తండాలను పంచాయతీలు చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగం క్షేత్రస్థాయిలో తండాలవారీగా వివరాలు సేకరించింది. ఇం దులో తండా పరిధితో పాటు జనాభా, కుటుంబాల సంఖ్యను పరిగణలోకి తీసుకుని పంచాయతీలు చేపట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు పంచాయతీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 328 గిరిజన తండాలున్నాయి. వీటిలో ఐదువందల కంటే ఎక్కువ జనాభా ఉన్న తండాలు 60 ఉన్నాయి. ఇవి కాకుండా 268 తండాల్లో ఐదువందల కంటే తక్కువ జనాభా ఉన్నట్లు జిల్లా పంచాయతీ శాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. జనాభా ప్రాతిపదికన పంచాయతీలను ఏర్పాటు చేస్తే జిల్లాలో 60 పంచాయతీలు ఏర్పాటయ్యే అవకా శం ఉందని అధికారులు చెబుతున్నారు. సామాజిక పింఛన్ల పెంపుతో లబ్ధిదారులకు మరింత సాయం అందనుంది. జిల్లాలో 2,63,145 మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 1,30,496 మంది వృద్ధులున్నారు. అదేవిధంగా 31,757 మంది వితంతువులున్నారు. తాజా పెంపుతో వీరికి లబ్ధి చేకూరనుంది. వీరు కాకుండా వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు తీసుకునే పింఛన్లు సైతం పెరిగే అవకాశం ఉంది. నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో త్వరలో ఆరువందల కుటుంబాలకు 1,800 ఎకరాల భూమి పంపిణీ చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో 28,810 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరికి తెలంగాణ ఇంక్రిమెంట్తో పాటు కేంద్ర ప్రభుత్వ వేతనాలు అందనున్నాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1060 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. సర్కారు ప్రకటనతో వీరి ఉద్యోగాలు క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగంతో పాటు ఆర్థిక చేయూత ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలో 18 మంది అమర వీరులున్నట్లు యంత్రాంగం గుర్తించింది. తాజా ప్రకటనతో ఈ 18 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. -
అకాల వర్షం.. అపార నష్టం
ఖానాపూర్, న్యూస్లైన్ : మండలంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా రైతుల పంటలతో పాటు తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది. పస్పుల పంచాయతీ పరిధిలోని పుల్గంపాండ్రి, అర్చన్తండా, కొలాంగూడ, నాయకప్గూడ, పస్పుల, తులసీపేట తండా తదితర గ్రామాల్లో వర్షం నష్టం ఎక్కువగా జరిగింది. సుమారు 50 వరకు ఇళ్లు, 50 వరకు విద్యుత్ స్తంభాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పుల్గం పాండ్రి గ్రామానికి చెందిన పలువురికి గాయాలయ్యాయి. గ్రామంలోని పుల్గం పాండ్రి గ్రామంలోని ధన్సింగ్, రమేష్, బలిరాం, రాజేశ్వర్, కనిరాం, కోక్య, సతీశ్, సురేశ్, గణేశ్, చందర్, జవహార్లాల్, సుభాష్, కోకియా, దూదిరాం, గణేష్ తదితరలకు చెందిన నివాసాలతో పాటు పశువుల పాకలు ధ్వంసమయ్యాయి. వీటితో పాటు నివాసాల్లో ఉన్న పసుపు, వరి ధాన్యం, బియ్యం, తదితర నివాస సామగ్రికి భారీగా నష్టం వాటిల్లింది. వీటితో పాటు గ్రామంలోని సింగిల్ ఫేస్ విద్యుత్ లైన్తో పాటు వ్యవసాయ మోటార్లకు అందే విద్యుత్ లైన్లకు సంబంధించిన స్తంభాలు 50 వరకు పూర్తిగా ధ్వంసమై నేలకొరిగాయి. కాగా సంబంధిత అధికారులు యుద్ధప్రతిపాదికన సర్వే చేసి తమకు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. -
అటవీ ఉత్పత్తులతో ఉపాధి
కడెం, న్యూస్లైన్ : అడవి ఉత్పత్తులు గిరిజనులకు ఉపాధినిస్తున్నాయి. ఇప్పపువ్వు, తప్సి బంక, ఇప్ప పరక, తేనె తదితర ఫలాలను గిరిజనులు సేకరించి ఉపాధి పొందుతున్నారు. కాని వాటికి సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్లో ఇప్పపువ్వు విరబూస్తుంది. పల్లె ప్రజలు, కూలీలు ఇప్పపువ్వును పెద్ద ఎత్తున సేకరిస్తారు. ప్రస్తుతం గత కొద్దిరోజులుగా మండలంలోని బూత్కూరు, గొడిసెర్యాల, కుర్రగూడెం, దోస్తునగర్, ధర్మాజీపేట, సింగాపూరు, కల్లెడ, మద్దిపడగ, గోండుగూడెం, డ్యాంగూడెం గ్రామాల ప్రజలు తెల్లవారంగనే గంపలతో అడవులకు వెళ్లి ఇప్పపువ్వు సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన పువ్వును కడెంలోని జీసీసీ(గిరిజన సహకార సంస్థ)లో విక్రయిస్తారు. ఇక్కడ ప్రతీ ఆదివారం అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. ఇప్పపువ్వుకు కిలోధర రు.10 ఉంది. ఇలా ఒక్కొక్కరు 10 నుంచి 25 కిలోల దాకా పువ్వు తెచ్చి ఇక్కడ విక్రయిస్తారు. వెంటనే వారికి డబ్బులు చేతికందుతాయి. ఇలా గిరిజనులు ఇప్పపువ్వుతో ఉపాధి పొందుతున్నారు. గిట్టుబాటు ధర కరువు గిరిజనులు, గిరిజనేతరులు సేకరించిన అటవీ ఉత్పత్తులను ప్రభుత్వం నామమాత్రపు ధరకు మాత్రమే కొనుగోలు చేస్తోంది. తెలతెల్లవారంగా అడవికి వెళ్లి పువ్వు సేకరిస్తే సరైన ధర రావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో పువ్వుకు కేవలం రు.10 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రస్తుతం అన్నింటికీ ధరలు పెరిగాయి. ఇలాంటప్పుడు తామేలా బతికేదని గిరిజనులు వాపోతున్నారు. పెద్ద ఎత్తున కొనుగోళ్లు కడెంలోని జీసీసీ ద్వారా ఏటా ఏప్రిల్ మొదటి వారం నుంచి అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం జీసీసీకి ఎక్కువగా ఇప్పపువ్వు మాత్రమే వస్తుండటంతో దీన్నే కొంటున్నారు. ఇప్పటి వరకు 31 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గతే డాది 440 క్వింటాళ్లు కొనుగోలు చేయగా ఈ సారి 500 క్వింటాళ్లు కొనుగోలు లక్ష్యం ఉంది. ఆ దిశగా జీసీసీ సిబ్బంది కృషి చేస్తున్నారు. -
వనంలో వసంతమేదీ..!
* ఎనిమిది జిల్లాల్లో ఆదివాసీల ఓట్లే కీలకం * అయినా వారి అభివృద్ధిపై శీతకన్ను * వైఎస్ హయాంలో గిరిజన వికాసం * 2009లో 19 మంది ఎస్టీలకు టికెట్లిచ్చిన వైఎస్ రాష్ట్ర జనాభాలో తొమ్మిది శాతం ఉండి 8 జిల్లాల్లో నేతల తలరాతలను మార్చగల శక్తి ఉన్నప్పటికీ ఆదివాసీల జీవితాలు ఇంకా చీకట్లలోనే మగ్గిపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా వారి బతుకుల్లో మాత్రం వెలుగులు రావడం లేదు. ‘ఓట్ల’వేళ వారిని దగ్గర తీసుకున్నట్టు నటించే నాయకులు తర్వాత వారి గురించి క్షణకాలమైనా ఆలోచించడం లేదు. వైఎస్ హయాంలో వారి సంక్షేమానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఆ తర్వాతి వచ్చిన ప్రభుత్వాలు మళ్లీ వారిపై శీతకన్నేశాయి. గడ్డం రాజిరెడ్డి, నిజామాబాద్: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఐదో షెడ్యూల్ కింద 2005లో గిరిజన ప్రాంతాలను గుర్తించినా, రాజకీయంగా చట్టసభల్లో వారికి తగిన ప్రాధాన్యం లభించడం లేదు. ఎస్టీలకు రిజర్వు చేసిన ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ అసెంబ్లీ స్థానాలతోపాటు ముధోల్, నిర్మల్, సిర్పూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో ఆదివాసీ, గిరిజనుల ప్రభావం ఎక్కువ. వరంగల్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాలు ఎస్టీలకు కేటాయించినా వర్ధన్నపేట, భూపాలపల్లి, నర్సంపేటలోనూ వారే కీలకంగా మారారు. ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, వైరా, అశ్వరావుపేట, భద్రాచలం స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. సత్తుపల్లి, మధిర, ఖమ్మం, పాలేరులోనూ గిరిజనులు ప్రభావం చూపనున్నారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడలోనూ ఆదివాసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. జనాభాలో 9శాతం.. అభివృద్ధిలో నామమాత్రం 1971లో రాష్ట్ర జనాభాలో 13,24,368 మందితో 3.68 శాతంగా ఉన్న ఆదివాసీ, గిరిజనులు... 2011 నాటికి 59,18,073కు పెరిగా రు. రాష్ర్ట జనాభాతో పోలిస్తే ఇది 9 శాతం. 2005-06 బడ్జెట్లో గిరిజన సంక్షేమం కోసం రూ.309.63 కోట్లు, 2012-13 బడ్జెట్లో రూ.1552 కోట్లు కేటాయించినా గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదు. ఆదివాసీలపై వివక్షను రూపుమాపేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో 15మందికి, 2009లో 19మందికి పార్టీ టికెట్లు ఇచ్చి చట్టసభలకు పంపేందుకు కృషి చేశారు. తల రాతలు మార్చే శక్తిగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎనిమిది గిరిజన జిల్లాల్లో 31,485.34 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 5,968 గ్రామాల్లో ఆదివాసీ, గిరిజనులు విస్తరించి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా జనాభాలో 26.47 శాతం మంది గిరిజనులున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్లో 16.74, విశాఖపట్నంలో 14.55, వరంగల్లో 14.10, నల్లగొండలో 10.55, విజయనగరంలో 9.55, నిజామాబాద్లో 9 శాతం మంది ఆదివాసీ, గిరిజనులున్నారు. వీరి ఓట్లు కీలకం కానుండడంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు ప్రదక్షణలు చేస్తున్నారు. హామీలు గుప్పిస్తున్నారు. వైఎస్ హయాంలో.. - గిరిజనుల సంక్షేమం కోసం 2006 డిసెంబర్ 13న అటవీహక్కుల చట్టాన్ని ప్రకటించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 1 జనవరి 2007 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు. దానికి సరిగ్గా ఏడాది తర్వాత ప్రత్యేక చట్టం తెచ్చిన వైఎస్సార్ దీనికింద 11.27లక్షల ఎకరాలను గుర్తించారు. మొత్తంగా ఆయన హయాంలో 4.44 లక్షల ఎకరాలను 1.28లక్షల గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు పంపిణీ చేశారు. - దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన గ్రాంటుకు సమానంగా ఆర్థిక సహాయ పథకం కింద ఏటా రూ. 29 కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్గా కేటాయిస్తూ 2005 సెప్టెంబర్ 21న వైఎస్ జీవో విడుదల చేశారు. - రాష్ట్రంలోని కొండకోనలపైన, మారుమూల, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 2,351 గిరిజన ఆవాసాలను గుర్తించిన వైఎస్సార్ ఆటవీహక్కుల చట్టం, 2006 కింద త్వరితగతిన వాటిని అభివృద్ధి చేశారు. - ప్రభుత్వశాఖలు తమ ప్రణాళిక బడ్జెట్ నుంచి గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్పీ)కు అందజేస్తున్న 6 శాతం నిధులను 6.6 శాతానికి పెంచుతూ 2005 నవంబర్ 7న జీవోఎంఎస్ 17 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. - పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలను 2005-06 ఆర్థిక సంవత్సరంలో సవరించారు. ఈ మేరకు 2005 ఫిబ్రవరి 10న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ ఒక్క సంవత్సరమే 1,40,466 మంది విద్యార్థులు లబ్ధి చేకూరింది. జన తెలంగాణ వైఎస్ నమూనా ఆదర్శం వైఎస్ రాజశేఖరరెడ్డి అనుసరించి, ఆచరించిన అభివృద్ధి నమూనా తెలంగాణ నవ నిర్మాణానికి అవసరం. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో అన్ని వర్గాల వారి సంక్షేమానికి వైఎస్ కృషి చేశారు. మహిళలకు, యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు అన్ని విషయాల్లో అండగా నిలవాలి. పండించిన పంటకు సరైన ధర లభించేలా చూడాలి. సమర్థవంతంగా పాలనను అందించగలిగే విజన్ ఉన్న నాయకుడినే తెలంగాణ సమాజం ఎన్నుకోవాలి. కొన్ని మార్పులతో వైఎస్ నమూనాను అమలు చేస్తే రాష్ట్రం సగర్వంగా తలెత్తుకుని నిలబడగలుగుతుంది. - బి. అనూష, 8వ తరగతి, ఆదర్శ పాఠశాల, చిన్నకోడూరు, మెదక్ జిల్లా. వలసలు లేని పాలన రావాలి వలసలు లేని, రైతు ఆత్మహత్యలు లేని పాలన రావాలి. రైతుల పంటలను ప్రభుత్వమే గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలి. పేదలందరికీ భూమిని పంచాలి. ప్రతి పల్లెకు రక్షిత జలాలను అందించాలి. కామన్స్కూలు విధానాన్ని ప్రవేశపెట్టాలి. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించి సామాజిక తెలంగాణ సాధించాలి. యువత రాజకీయాల్లోకి ప్రవేశించి అవినీతి రహిత పాలన అందించాలి. తెలంగాణ అమరవీరుల పేరిట స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలి. ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాలి. - జంగం శ్రీశైలం, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా