విశాఖపట్నం జిల్లా సీలేరు రిజర్వాయర్లో గుర్తుతెలియని వ్యక్తి శవం ఆదివారం ఉదయం బయటపడింది.
విశాఖపట్నం(సీలేరు): విశాఖపట్నం జిల్లా సీలేరు రిజర్వాయర్లో గుర్తుతెలియని వ్యక్తి శవం ఆదివారం ఉదయం బయటపడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని ఎవరో కొట్టి చంపి రిజర్వాయర్లో పడేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడు లేదా ఎనిమిది రోజుల క్రితం హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతడు మృతిచెంది వారం రోజులు అవడంతో మృతదేహం కుళ్లిపోయి చెడువాసన వస్తుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.