
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పటిష్ట చర్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న ముందస్తు చర్యల వల్లే దేశంలో అతి తక్కువ కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని కొనియాడారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉండే ఏపీ ప్రజలకు పలు సూచనలు చేశారు.
కరోనా పరీక్షల వైద్య పరికరాల కోసం 10 లక్షలు
ఐసోలేషన్, క్వారెంటైన్ ల కోసం ఏర్పాటు చేసే తాత్కాలిక ఆసుపత్రుల నుంచి చుట్టుపక్కల ఇళ్లలోని వారికి ఎలాంటి అపాయం ఉండదు. అవి అనుమానితుల పరిశీలన కోసం ఏర్పాటు చేసినవి. రోగితో సన్నిహితంగా ఉంటే తప్ప దూరంగా ఉన్నవారికి గాలి ద్వారా కరోనా వ్యాపించదు. అపోహలు పెంచుకుని ఆటంకాలు సృష్టించొద్దు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 27, 2020
ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించిన ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘సీఎం జగన్ తీసుకున్న ముందస్తు చర్యల వలన దేశంలోనే అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులున్న రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలిచింది. గ్రామ వలంటీర్లకు పని విభజన చేసి ప్రతి వ్యక్తి హెల్త్ రికార్డును తయారు చేయడం అత్యంత క్లిష్టమైన కార్యక్రమం. దాని ఫలితాలు కనిపిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు. (ఏపీలో కరోనా కట్టడికి మూడంచెల వ్యవస్థ)
పొరుగు రాష్ట్రాలలో వున్న ఏపీ ప్రజలు ఏప్రియల్14 వరకు అక్కడే ఉండాలి. దీనికి సంబంధించి కేసీఆర్ గారితో జగన్ గారు మాట్లాడారు. అక్కడ వారికి ఏ కొరత రాకుండా చూసుకుంటామని హమీ ఇచ్చి కేసీఆర్ గారు పెద్ద మనసును చాటుకున్నారు. బయటి నుంచి పౌరులు వస్తే నియంత్రణ చర్యలు గతి తప్పే ప్రమాదం ఉంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 27, 2020
‘సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శంగా మారుతోంది. యుకే ప్రభుత్వ నేషనల్ హెల్త్ సర్వీస్(NHS) 2.80 లక్షల మంది వలంటీర్ల అవసరముందని ప్రకటించి అత్యవసర నియామకాలు చేపట్టింది. ఇంతకంటే ప్రశంస ఇంకా ఏం కావాలి మన వలంటీర్ వ్యవస్థకు’ అంటూ కరోనాపై ఆందోళన చెందాల్సిన పని లేదన విజయ సాయిరెడ్డి తెలిపారు.