
'ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం'
హైదరాబాద్ : తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటామని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ర్యాలీగా గన్పార్క్ వద్దకు వచ్చి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను విలీనం చేస్తానని కేసీఆరే చెప్పారని కోమటిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. విలీనమా, పొత్తా అనేది కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంభించారని కోమటిరెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను విమర్శించటం సరికాదని ఆయన అన్నారు.