సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తుండటంతో విద్యుత్ చార్జీలు తగ్గుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
అమరావతి: సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తుండటంతో విద్యుత్ చార్జీలు తగ్గుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై ఆయన శనివారం సమీక్షించారు. వచ్చే ఏడాది విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు. ఈ నెలాఖరున ఓర్వకల్లు విమానాశ్రయానికి శంకుస్థాపన జరుగుతుందని, జూలై నెల చివరకు విజయవాడ-ముంబయి, విజయవాడ-తిరుపతి, విజయవాడ-ఇండోర్ విమాన సర్వీసులు నడుస్తాయని వివరించారు. గ్యాస్ పైపు లైన్ల ఏర్పాటులో జాప్యంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు.