
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఆ పార్టీ శ్రేణులు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో శుక్రవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్లో పేర్కొన్నారు. తమకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, థర్డ్ పార్టీ విచారణ జరపాలని కోరారు.
ఇక్కడ చదవండి
‘ఆపరేషన్ గరుడ వెనుక ఉన్నది చంద్రబాబే’
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment