
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం ఉన్న 124 ఎయిర్పోర్ట్లను 5 రెట్లు పెంచుతామని ఏడాది వంద కోట్ల విమాన రాకపోకలను లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
ఉడాన్ పథకం ద్వారా 56 అన్రిజర్వ్డ్ ఎయిర్పోర్ట్లు, 31 అన్సర్వ్డ్ హెలిప్యాడ్ల అనుసంధానం చేపడతామని చెప్పారు. పౌరవిమానయాన రంగం కొత్తపుంతలు తొక్కేలా పలు చర్యలు చేపడతామన్నారు. ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణపై ఆర్థిక మంత్రి ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం.