
హత్యకు గురైన భార్గవ్ (ఫైల్ ఫొటో)
సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో శనివారం అర్థరాత్రి దారుణం జరిగింది. పరసాల వీధికి చెందిన బీజేపీ కార్యకర్త భార్గవ్ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. భూవివాదాలే భార్గవ్ హత్యకు దారి తీసి ఉంటాయని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.